బీజేపీ నుంచి ఎన్ని కోట్ల రూపాయలు ముట్టాయి? | gudimetla ravi reddy take dig at sabbam hari | Sakshi
Sakshi News home page

బీజేపీ నుంచి ఎన్ని కోట్ల రూపాయలు ముట్టాయి?

Published Tue, May 6 2014 3:57 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

gudimetla ravi reddy take dig at sabbam hari

విశాఖపట్నం: ఎన్నికల పోలింగ్కు కొన్ని గంటల ముందు విలేకరుల సమావేశం పెట్టిన అనకాపల్లి ఎంపీ సబ్బం హరిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలని విశాఖపట్నం వైఎస్‌ఆర్‌ సీపీ అధికారి ప్రతినిధి గుడిమెట్ల రవిరెడ్డి డిమాండ్ చేశారు. సబ్బం హరి పచ్చి అవకాశవాదని విమర్శించారు.

బీజేపీ నుంచి సబ్బం హరికి ఎన్ని కోట్ల రూపాయలు ముట్టాయని ప్రశ్నించారు. సమైక్యవాదులంతా సబ్బం హరి తీరును ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనకు బీజేపీ మద్దతిచ్చిన విషయాన్ని మరిచారా అని ప్రశ్నించారు. ఎవరెన్ని కుయుక్తులు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకోలేరని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement