Sabbam Hari
-
Sabbam Hari: లాన్ వెనక మాస్టర్ ప్లాన్?.. ఎవరీ అప్పారావు...?
సాక్షి, విశాఖపట్నం: సబ్బు బిళ్ల.. కుక్క పిల్ల కాదేదీ కవితకనర్హం అన్నారు శ్రీశ్రీ. గెడ్డలు, పార్కు స్థలాలు.. కావేవీ ఇంటి నెంబర్లను కేటాయించేందుకు అనర్హం అన్నట్టు జీవీఎంసీ తయారైంది. పదేళ్లుగా మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి వెనక తూర్పున గల ఖాళీ స్థలంలో రెండు షెడ్లు ఉన్నట్టుగా పేర్కొని ఏకంగా ఇంటి నెంబర్లను కూడా జీవీఎంసీ కేటాయించింది. అప్పారావు పేరు మీద 355 గజాల స్థలానికి 50–1–40/18(3), 50–1–40/(4) ఇంటి నెంబర్లను ఇచ్చింది. ఈ స్థలం విలువ మార్కెట్లో రూ.5 కోట్ల పైమాటే ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ స్థలాన్ని విక్రయించేందుకు కొద్ది మంది రంగంలోకి దిగినట్టు సమాచారం. కేవలం ఇంటి నెంబర్లతో పాటు 1980 ప్రాంతంలో అగ్రిమెంటు చేసుకున్న కాగితాలతోనే ఈ స్థలాన్ని విక్రయించేందుకు పావులు కదులుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో అసలు ఖాళీ స్థలంలో షెడ్లు ఉన్నట్టుగా ఇంటి నెంబర్లు ఎలా ఇచ్చారు? ప్లాన్ అనుమతి తీసుకున్నారా? తీసుకుంటే అసలు ఇళ్లు ఎక్కడకు వెళ్లాయి? అనే వివరాల లోతుల్లోకి వెళితే అసలు వ్యవహారం బయటకు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సబ్బం హరి ఇంటి ప్లాన్లో కూడా అప్పారావుకు షెడ్డు ఉన్నట్లు చూపించారు. ఎవరీ అప్పారావు...? వాస్తవానికి సీతమ్మధారలోని సబ్బం హరి ఇంటి వెనకాల తూర్పు వైపున లాన్ ఉంది. దీనికి ఆనుకుని జీవీఎంసీ పార్కు ఉంది. ఇన్ని రోజులుగా ఈ లాన్ మొత్తం సబ్బం హరి ఇంటి ఆవరణ భాగమని అందరూ అనుకున్నారు. ఈ స్థలం కాస్తా ఎం.అప్పారావు పేరు మీద ఉంది. తాజాగా సబ్బం హరి తీసుకున్న రుణంపై ఆయన ఆస్తులను అటాచ్ చేసుకుంటామంటూ న్యాయవాది ద్వారా వచ్చిన ప్రకటనలోనూ సబ్బం హరి ఇంటికి తూర్పు భాగంలో ఉన్న స్థలం అప్పారావుకు చెందిన షెడ్లుగా పేర్కొన్నారు. అయితే, ఇంతకీ ఎవరీ అప్పారావు అంటే సబ్బం హరికి శిష్యుడుగా ఉండేవారని తెలుస్తోంది. తన స్థలాన్ని ఇన్ని రోజులుగా లాన్గా ఉపయోగించుకుంటున్నా అప్పారావు ఎందుకు మిన్నకుండిపోతున్నారు? అసలు షెడ్లు లేకపోయినప్పటికీ పదేళ్లకుపైగా ఎందుకు అప్పారావు ఇంటి పన్ను చెల్లిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలంటే మొదటగా జీవీఎంసీకి ప్లాన్ ఇచ్చి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జీవీఎంసీకి చెందిన పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది ఇవేవీ లేకుండానే అప్పట్లో ఇంటి నెంబర్లను ఇచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జీవీఎంసీ అధికారులు విచారణ చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రూ.5 కోట్ల స్థలంపై కన్ను...! ఇన్ని రోజులు ఇంటి లాన్గా ఉపయోగించుకుంటున్న స్థలం తమదేనని సబ్బం హరి కుటుంబీకులు భావిస్తున్నారు. సబ్బం హరి మరణం తర్వాత కూడా ఇదంతా తమ స్థలమేనని భ్రమలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, తాజాగా కోర్టు నుంచి అటాచ్మెంట్ వ్యవహారంలో తమ ఇంటి సరిహద్దుల్లో తూర్పువైపు అప్పారావు షెడ్లు ఉన్నట్టు చూపించారు. తీరా చూస్తే తూర్పు వైపునకు లాన్కు ఆనుకుని జీవీఎంసీ పార్కు మాత్రమే ఉంది. దీనితో అసలు వ్యవహారాన్ని కొద్ది మంది డాక్యుమెంట్లతో సహా వెలికితీసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రూ.5 కోట్లకుపైగా విలువ చేసే ఈ 355 గజాల స్థలాన్ని తక్కువ ధరకు తమ చేతుల్లోకి తీసుకునేందుకు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సబ్బం హరి కుటుంబీకుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఈ స్థలం వ్యవహారంపై మరింత లోతుల్లోకి వెళ్లి జీవీఎంసీ రికార్డులను పరిశీలిస్తే ఇన్ని రోజులుగా లాన్గా ఉపయోగించుకుంటూ అనుభవించిన సబ్బం హరి కుటుంబీకుల పాత్ర ఉందా? ఇంకా తెరవెనుక ఎవరైనా ఉన్నారా అనే విషయం తేలనుంది. -
సబ్బం హరి ఆస్తులు సీజ్!
సీతమ్మధార (విశాఖ ఉత్తర): మాజీ ఎంపీ, దివంగత టీడీపీ నాయకుడు సబ్బం హరి తీసుకున్న రుణాన్ని చెల్లించకపోవడంతో విశాఖ కో–ఆపరేటివ్ బ్యాంకు అధికారులు ఆయన ఆస్తులను సీజ్ చేసినట్లు సమాచారం. ఆస్తులు తనఖా పెట్టి తీసుకున్న రుణం, వడ్డీ, ఇతర ఖర్చులతో కలిపి రూ.9 కోట్లకు పైగా బకాయి ఉన్నట్లు సమాచారం. విశాఖ మద్దిలపాలెం ప్రాంతంలో ఉన్న డెక్కన్ క్రానికల్ భవనాన్ని కోటక్ మహీంద్ర బ్యాంకు 2014లో రూ.17.80 కోట్లకు వేలం వేయగా సబ్బం హరి వేలంలో దాన్ని దక్కించుకున్నారు. ఆ సమయంలో తన ఆస్తులను తనఖా పెట్టి విశాఖ కో–ఆపరేటివ్ బ్యాంకు నుంచి రూ.8.50 కోట్లు రుణం తీసుకున్నారు. వేలం నిబంధనల మేరకు నిర్వహించలేదంటూ డెక్కన్ క్రానికల్ యాజమాన్యం డెట్ రికవరీ అప్పిలేట్ అథారిటీలో కేసు వేసింది. అప్పిలేట్ అథారిటీ ఆ వేలాన్ని రద్దు చేసి, సబ్బం హరి డిపాజిట్ చేసిన రూ.17.80 కోట్లను వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై కోటక్ మహీంద్ర బ్యాంక్ అప్పీల్కు వెళ్లింది. ప్రస్తుతం ఈ కేసు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఉంది. విశాఖ కోఆపరేటివ్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించకపోవడంతో అధికారులు సబ్బం హరికి 2018లోనే నోటీసులు జారీ చేశారు. 60 రోజుల్లో రుణం చెల్లించని పక్షంలో సీతమ్మధారలోని 1,622 చదరపు గజాల స్థలంలోని నివాసంతోపాటు మాధవధార వుడా లేఅవుట్లోని 444.44 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న విష్ణు వైభవం గ్రూప్ హౌస్లోని అపార్ట్మెంట్, రుషికొండ దగ్గరలో ఉన్న 800 చదరపు గజాల స్థలాన్ని స్వాధీనం చేసుంటామని నోటీసుల్లో స్పష్టం చేశారు. దీనిపై ఆయన కోర్టుకు వెళ్లారు. కోర్టు ఉత్తర్వుల మేరకు బ్యాంకు అధికారులు మాధవధార విష్ణు వైభవంలోని అపార్ట్మెంట్ను సీజ్ చేసినట్లు సమాచారం. ఈ నెల 12న సీతమ్మధారలో ఉన్న నివాసాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు అందించినట్లు తెలిసింది. -
అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత
-
మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత
సాక్షి, విశాఖపట్నం: మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూశారు. 15 రోజులుగా కరోనాతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 15న ఆయన కరోనా బారిన పడ్డారు. మూడో రోజులపాటు సబ్బం హరి హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. అనంతరం వైద్యుల సలహామేరకు ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. కరోనాతో పాటుగా ఆయనకు పలు ఇన్ఫెక్షన్లు సోకడంతో పరిస్థితి విషమించింది. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు. చదవండి: ఏపీలో ఎల్లుండి నుంచి పాక్షిక కర్ఫ్యూ సూపర్వాస్మోల్ తాగి భర్తను భయపెట్టాలనుకుంది.. -
సబ్బం హరికి కరోనా.. పరిస్థితి విషమం
సాక్షి, విశాఖపట్నం: మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి కరోనా బారినపడ్డారు. మూడు రోజుల క్రితం పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్గా నిర్థారణైంది. వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉందని ఆస్పత్రి వైద్య వర్గాలు వెల్లడించాయి. పది రోజుల క్రితం ఆయనకు కోవిడ్ సోకడంతో వైద్యుల సూచనతో హోం ఐసోలేషన్లో ఉన్నారు. అయితే గత మూడు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
క్షమాపణ చెప్పిన కబ్జా సబ్బం
సాక్షి, విశాఖపట్నం: 24 గంటల్లో నేనేంటో చూపిస్తా... ఒక్కొక్కరి తాట తీస్తా... నేనంటే ఏమిటో అందరికీ తెలిసేలా చేస్తా.. తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మేయర్ సబ్బం హరి శనివారం ఉదయం.. అలా మొదలు పెట్టి నోటికొచ్చినట్టు పేట్రేగిపోయి అన్న మాటలివి... 24 గంటల తర్వాత ఆదివారం నాడు అదే సబ్బం హరి... నేను ఆ రోజు సహనం కోల్పోయి మాట్లాడాను. ఆవేశంలో అన్న మాటలకు మన్నించమని కోరుతున్నాను.. అని క్షమాపణ కోరారు. (ఎవరిపైనా కక్షలేదు) జీవీఎంసీకి చెందిన పార్కు స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాన్ని నిబంధనల మేరకు కూల్చివేసిన అధికారులతో పాటు ఏకంగా పాలకులపై కూడా సబ్బం హరి ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. తనకు తాను ఎక్కువ ఊహించుకు ని మీడియా ముందు రెచ్చిపోయారు. 24 గంటల్లో తానేంటో చూపిస్తానని సవాల్ వేశారు. కానీ అదే సబ్బం హరి మరుసటి రోజే.. ఎప్పటి మాదిరిగానే తనదైన శైలిలో నాలుగు గోడల మధ్య కుర్చీలో కూర్చుని అందరికీ క్షమాపణ చెప్పుకున్నారు. -
ఎవరిపైనా కక్షలేదు
గోపాలపట్నం (విశాఖ): మాజీ ఎంపీ సబ్బం హరి పార్కు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన ఇంటి ప్రహరీ తొలగింపు విషయంలో చట్టం తన పని తాను చేస్తుందని.. తమకు ఎవరిపైనా కక్ష లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్ఏడీ ఫ్లైఓవర్ పనులు పరిశీలించేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కబ్జా విషయమై స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు నోటీసులు జారీచేశారని వివరించారు. ఆయన నోటీసులు తీసుకునేందుకు తిరస్కరించడంతో గోడకు అంటించారని.. కానీ, ఆయన వాటిని తీసుకుని ఉంటే వివరణ ఇచ్చేందుకు అవకాశముండేదని బొత్స అభిప్రాయపడ్డారు. వివరణ ఇచ్చి ఉంటే ఆ చర్యలు మరోలా ఉండేవన్నారు. సబ్బం హరి వాడు వీడు అని సంభోదించడం దురదృష్టకరమని చెబుతూ.. రాజకీయ నాయకులు నోరు అదుపులో ఉంచుకోవాలని బొత్స హితవు పలికారు. విశాఖను రాజధానిగా చేయాలనుకుంటే వైఎస్సార్సీపీకి చెందిన విశాఖ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి గెలవాలని అయ్యన్నపాత్రుడు విసిరిన సవాల్ను చౌకబారు వ్యాఖ్యలుగా అభివర్ణించారు. ప్రభుత్వం పనితీరుపట్ల, సీఎం వైఎస్ జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాలపట్ల ఆకర్షితులై ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కొందరు అధికార పార్టీకి మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. -
నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం
సాక్షి, విశాఖపట్నం: మాజీ ఎంపీ సబ్బం హరి ఒక పొలిటికల్ బ్రోకర్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. ‘నీకు మేయిర్గా, ఎంపీగా రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందే మహానేత వైఎస్సార్.. అది మరిచిపోయి సీఎం వైఎస్ జగన్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలను ఉద్దేశించి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించబోం’.. అని ఆయన హెచ్చరించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సబ్బం హరి మరోసారి ఇష్టారాజ్యంగా మాట్లాడితే జగనన్న సైనికుడిలా వచ్చి నాలుక కోస్తానని హరిని హెచ్చరించారు. జీవీఎంసీకి సంబంధించిన సుమారు రూ.3 నుంచి 4 కోట్ల విలువైన 213 గజాల భూమిలో ‘సబ్బం’ నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తే చంద్రబాబు గుండెలు బాదుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 213 గజాలే కదా.. దానికే కూల్చివేయాలా? అని కొందరు టీడీపీ నేతలంటున్నారని.. రెండు గజాలు కూడా ప్రభుత్వ భూములు కబ్జా కానివ్వబోమని అమర్నాథ్ అన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించిన నాటి నుంచి చంద్రబాబు అండ్ కో ఎన్నో ఆరోపణలు చేశారని.. ఒక్కటీ రుజువు కాలేదన్నారు. -
రాజకీయాలతో ముడిపెట్టొద్దు: బొత్స
-
రాజకీయాలతో ముడిపెట్టొద్దు: బొత్స
సాక్షి, విశాఖ : ప్రభుత్వ భూముల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీతమ్మధారలో మాజీ మేయర్ సబ్బం హరి ఆక్రమించిన ప్రభుత్వ స్థలాన్ని తిరిగి అధికారులు స్వాధీనం చేసుకోవడం తప్పు లేదన్నారు. అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి రాజకీయం చేయడం తగదని మంత్రి బొత్స హితవు పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టిలో అందరూ సమానులే అని, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపును రాజకీయాలతో ముడి పెట్టడం సరికాదని అన్నారు. (చిత్తగించండి.. ఇదిగో ‘హరి’ చిట్టా..) మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాసరావు ఆదివారం ఉదయం ఎన్ఏడీ ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు. గత నెల ఫ్లై ఓవర్ తొలి దశ పనుల్లో భాగంగా విమానాశ్రయం నుంచి విశాఖ సిటీలోకి వెళ్లే రోడ్డు ప్రారంభమైంది. తాజాగా తాటిచెట్ల పాలెం నుంచి గోపాలపట్నం వైపు వెళ్లే రోడ్డు పనులను మంత్రి బొత్స ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యకు కేరాఫ్గా మారిన ఎన్ఏడీలో రెండు వైపులా రోడ్లు ప్రారంభం కావడంతో చాలా వరకు సమస్య పరిష్కారమైందన్నారు. ఏడాది చివరికల్లా ఫ్లైఓవర్ పనులు పూర్తవుతాయని తెలిపారు. త్వరితగతిన ఫ్లై ఓవర్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, నగర దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, జీవీఎంసీ కమిషనర్ సృజన తదితరులు పాల్గొన్నారు. (ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఏపీ పర్యాటకం) -
సీఎం జగన్ దృష్టిలో అందరూ సమానులే
-
‘అక్రమాలకు వాళ్లు అన్నదమ్ములు’
సాక్షి, విశాఖపట్నం: అక్రమాలకు చంద్రబాబు అన్నయ్య అయితే.. సబ్బం హరి తమ్ముడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. సబ్బం హరిని పొలిటికల్ బ్రోకర్గా ఆయన అభివర్ణించారు. ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ రూ.3 కోట్ల విలువైన భూమిని సబ్బం హరి కబ్జా చేశారని దుయ్యబట్టారు. అధికారులు అనేక సార్లు నోటిసులు ఇచ్చినా సబ్బం హరి స్పందించలేదని.. ఆయన నోటీసులు తీసుకోకపోవడంతో ఇంటి గోడకు అంటించారని తెలిపారు. అక్రమంగా భూములు దోచేస్తే చూస్తూ ఊరుకోవాలా? అని అమర్నాథ్ ప్రశ్నించారు. ‘‘విశాఖలో ఒక సెంట్ భూమి కూడా కబ్జా కానివ్వం. ప్రభుత్వ భూములను అక్రమదారుల చేతుల్లోకి వెళ్లనివ్వమని చాలా సార్లు చెప్పాం. చంద్రబాబు అధికారంలో ఉండగానే విశాఖలో భారీ భూ స్కామ్ జరిగింది. విశాఖలో భూ స్కామ్లు జరిగాయని టీడీపీ నేతలే ఆరోపించారు. విశాఖలో ప్రభుత్వ భూములను కాపాడతామని’’ అమర్నాథ్ పేర్కొన్నారు. (చదవండి: చిత్తగించండి.. ఇదిగో ‘హరి’ చిట్టా..) ‘‘సబ్బంహరి 213 గజాలు ఆక్రమిస్తే తప్పులేదు.. అధికారులు తొలగిస్తే తప్పని చంద్రబాబు అండ్ కో అంటున్నారు. 200 గజాలు కాదు కదా.. 2 గజాలు కూడా కబ్జా కానివ్వం. చంద్రబాబు బ్యాక్ డోర్ పొలిటిషియన్, సబ్బంహరి బ్లాక్మెయిల్ పొలిటిషియన్. దోపిడీలు, అక్రమాల్లో సీనియార్టీని బట్టి టీడీపీలో పదవులు ఇస్తారు. హత్యకేసులో నిందితుడు రవీంద్రకు టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తే, ఈఎస్ఐ స్కామ్లో డబ్బు మింగేసిన అచ్చెన్నాయుడుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. దోపిడీలు, అక్రమాల్లో సీనియార్టీని బట్టి టీడీపీలో పదవులు ఇస్తారని’’ ఆయన ఎద్దేవా చేశారు. విశాఖ ప్రజలు సబ్బం హరికి రాజకీయ భిక్ష ఇస్తే.. వారిని మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. తప్పు చేస్తే మాజీ ఎంపీ అయినా.. మేయర్ అయినా తమకు ఒకటేనని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్, విజయసాయిరెడ్డిలను విమర్శించే స్థాయి సబ్బం హరికి లేదని, ఇకనైనా సబ్బంహరి తన భాష మార్చుకోవాలని అమర్నాథ్ హెచ్చరించారు. (చదవండి: మెడలు విరిచేస్తా.. అంతు తేలుస్తా) -
అవినీతికి అన్నయ్య చంద్రబాబు.. తమ్ముడు సబ్బంహరి
-
చిత్తగించండి.. ఇదిగో ‘హరి’ చిట్టా..
♦.. లేస్తే మనిషిని కాదన్నట్టు ఎప్పుడూ కుర్చీల్లో కూర్చుని టీవీల్లో కనిపిస్తూ సుద్ద పూసలా మాట్లాడే మాజీ మేయర్ సబ్బం హరి అసలు బండారం ఇప్పుడు బయటపడింది. ♦ఘాజీ సబ్మెరైన్ను విశాఖ తీరానికి తానే తీసుకువచ్చానని అర్ధం పర్ధం లేని విశ్లేషణలు చేస్తూ.. తనకు తాను పెద్ద మనిషిలా బిల్డప్ ఇచ్చే హరి వారి నిజరూపం ఇప్పుడు విశాఖ ప్రజలకు నిలువెత్తుగా దర్శనమిచ్చింది. ♦ఆయన నోటి నుంచి ఎటువంటి మాటలు వస్తాయో.. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని కనీస స్పృహ లేకుండా ఎంత దారుణంగా మాటలు అంటారో... ప్రభుత్వ అధికారులను ఇష్టమొచ్చినట్టు ఎలా దునుమాడుతారో ఇన్నేళ్లకు స్పష్టంగా తెలుసొచ్చింది. ♦హరి ఓవర్ యాక్షన్ ఎందుకో తెలుసు కదా... ఆయన మేయర్గా వెలగబెట్టిన కాలంలో అడ్డగోలుగా కట్టేసిన ఓ అక్రమ నిర్మాణాన్ని కూలి్చవేయడమే అధికారులు, సర్కారు ఘోర తప్పిదమైనట్టు శనివారం రెచ్చిపోయాడాయన. ♦సీతమ్మధారలోని రేసపువానిపాలెం సర్వే నంబర్ 7లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి దర్జాగా రెస్ట్రూం, ప్రహరీ నిర్మాణం చేసేసిన నిర్వాకంపై స్థానికుల ఫిర్యాదు మేరకు శనివారం జీవీఎంసీ అధికారులు స్పందించి కూలగొట్టారు. అంతే.. దానికి నానాయాగీ చేస్తూ... అధికారులనే కాదు.. పాలకులను సైతం బండబూతులు తిడుతూ కనీస స్పృహ కూడా లేకుండా చేసిన సబ్బం గబ్బు చూసి సామాన్యులు సైతం ఛీ కొట్టారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇంతకూ అసలు సుద్దపూసలా కబుర్లు చెబుతున్న సబ్బం హరి జీవిత ప్రస్థానం ఏమిటో ఒక్కసారి చూద్దాం రండి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సబ్బం హరి.. నమ్మక ద్రోహానికి నిలువెత్తు రూపం... విశ్వాస ఘాతుకానికి అసలు సిసలు ప్రతిరూపం... ఇదేంటి అన్నేసి మాటలు. అని అనుకుంటున్నారా... అయితే సబ్బం హరి చిట్టా విప్పాల్సిందే.. ►విశాఖ నగరంలో పనీ పాటా లేకుండా చిల్లర వేషాలు, రౌడీవ్యవహారాలు, సెటిల్మెంట్లు చేస్తూ కాలం గడిపేసిన సబ్బం హరిని అదృష్టం వరించి 1995లో అనూహ్యంగా విశాఖ నగరపాలకసంస్థ మేయర్ అయ్యారు. గౌరవప్రదమైన మేయర్ పదవిలో ఉండి...ఓ సారి కార్పొరేటర్లను కిడ్నాప్ చేసిన ఉదంతంలో అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు ఆనాటి పోలీస్కమిషనర్ ఆర్íపీ మీనా, డీఎస్పీ రామచంద్రరాజులు బూటుకాళ్లతో బుద్ధి చెప్పారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన మేయర్గా ఉంటూనే.. ఏకంగా సీతమ్మధారలో ప్రభుత్వ పార్కు స్థలాన్ని కబ్జా చేసేశారు. ఇప్పుడు ఆ అక్రమ నిర్మాణాన్నే జీవీఎంసీ అధికారులు కూలగొట్టారు. (చదవండి: సబ్బం హరి కాదు.. పబ్బం హరి) ►ఒక్క దఫా మేయర్గా పని చేసి... చెరిగిపోని మరకలు అంటించుకున్న సబ్బం హరిని కాంగ్రెస్ పార్టీనే కాదు.. నగర ప్రజలు కూడా దూరంగా పెట్టేశారు. అందుకే 1999 ఎన్నికల్లో విశాఖ–1 నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే దారుణ పరాభవం రుచిచూపించారు. అటు తర్వాత మారిన మనిషినని నమ్మించి మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరుడిగా ముద్రపడ్డాడు. ఓ దఫా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న ఆరోపణతో అప్పటి విశాఖ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి సదరు సబ్బం హరిని సస్పెండ్ కూడా చేయించారు. అప్పుడు కూడా వైఎస్ పెద్దమనసుతో మన్నించి నేదురుమల్లిని ఒప్పించి తిరిగి హరిని పార్టీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి దగ్గరుండి అనకాపల్లి లోక్సభ సీటు ఇప్పించి గెలిపించారు. మహానేత హఠాన్మరణం తర్వాత సబ్బం హరి ఎలాంటి ‘కృతజ్ఞత’ చూపించారో అందరికీ తెలుసు. (చదవండి: మెడలు విరిచేస్తా.. అంతు తేలుస్తా) 2014 ఎన్నికల్లో సమైక్యాంధ్ర చివరి సీఎం కిరణ్కుమార్రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున విశాఖ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి.. ఆనక చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థి హరిబాబుకు ఓటేయాలని పిలుపునిచ్చాడు. ఆ ఎన్నికల తర్వాత ఐదేళ్లు 2014 నుంచి 2019 వరకు బయటకు మొహం చూపించలేని దుస్థితి దాపురించింది. 2019లో సరిగ్గా ఎన్నికల సమయంలో తెర మీదకు వచ్చి తెలుగుదేశం పారీ్టలో ఎవ్వరూ వద్దన్న భీమిలి బరిలో నిలుచుని వైఎస్సార్సీపీ అభ్యర్థి, ప్రస్తుత మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుపై భారీ ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. సబ్బం రుద్దుడు భరించలేక భీమిలి ప్రజలు తిప్పికొట్టడంతో ఎన్నికల తర్వాత బయటకు మొహం చూపించలేక టీవీలకే పరిమితమయ్యాడు. కేవలం టీవీల్లో తప్పించి బయట ఎక్కడా కానరాని సబ్బం హరి విన్యాసాలు చూస్తే.. జబర్దస్త్ కామెడీకి మించి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అయితే శనివారం ఆ కామెడీ శృతి మించి సీరియస్ కావడంతో సబ్బం హరిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన హరిపై అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునేందుకు వెనుకాడబోమని జీవీఎంసీ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. -
ఆక్రమణల కూల్చివేత
-
సబ్బం హరి కాదు.. పబ్బం హరి
పెదగంట్యాడ (గాజువాక): అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి పబ్బం గడుపుకున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. విశాఖపట్నంలోని సీతమ్మధారలో రూ.3 కోట్ల విలువైన 212 గజాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపించారు. శనివారం ధర్మశ్రీ పెదగంట్యాడలోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. ► కేవలం 5 అడుగుల స్థలంలో బాత్రూమ్ మాత్రమే నిర్మించామని సబ్బం చెప్పడం విడ్డూరంగా ఉంది. ► ఆక్రమణను తొలగిస్తామని జీవీఎంసీ అధికారులు పలుమార్లు నోటీసులు ఇస్తే.. వాటిని ఆయన బేఖాతరు చేశారు. సబ్బం మేయర్గా ఉన్న సమయంలోనే సీతమ్మధారలో స్థలం కొనుగోలు చేసి.. తర్వాత ఆ స్థలం వెనుక ఉన్న పార్కు స్థలాన్ని ఆక్రమించారు.అది ప్రభుత్వ స్థలమని అప్పట్లోనే వామపక్షాలు ఆందోళనలు చేశాయి. అప్పుడు అధికారంలో ఉన్న సబ్బం రికార్డులను టాంపరింగ్ చేశారు. -
ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నీతులా?
మహారాణిపేట (విశాఖ దక్షిణ): టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నీతులు చెబుతున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అదీప్రాజ్ ధ్వజమెత్తారు. శనివారం విశాఖపట్నం ప్రభుత్వ సర్క్యూట్ హౌస్లో వారిద్దరూ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. ► వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక జీవీఎంసీ పరిధిలో 450 అక్రమ కట్టడాలను కూల్చివేసింది. ► పార్క్ స్థలాన్ని ఆక్రమించి సబ్బం హరి కట్టిన గోడను తొలగిస్తే విశాఖకు ఎంతో అన్యాయం, ఘోరం జరిగినట్టుగా ఆయన ప్రచారం చేస్తున్నారు. ► ఆక్రమణలు కూల్చడానికి వెళ్లిన జీవీఎంసీ సిబ్బంది, పోలీసులు, సీఎం, ఎంపీ విజయసాయిరెడ్డిని సబ్బం నోటికి వచ్చినట్టు తిట్టడం ఎంతవరకు సమంజసం? ► మాజీ మేయర్గా పనిచేసిన సబ్బంకు ప్రభుత్వం స్థలం ఆక్రమించకూడదని తెలియదా? ఆయన చేసిన తప్పిదాలను సమర్థిస్తూ చంద్రబాబు, లోకేష్ మాట్లాడడం దారుణం. ► టీవీ చర్చల్లో శ్రీరంగ నీతులు చెప్పే సబ్బం ఇప్పటికైనా తన తప్పు ఒప్పుకోవాలి. భవిష్యత్తులో సీఎంను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. సబ్బం ఒళ్లు, నోరు దగ్గర పెట్టుకోవాలి. ► ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ, పార్టీ నేతలు కె.కె.రాజు, కోలా గురువులు పాల్గొన్నారు. -
మెడలు విరిచేస్తా.. అంతు తేలుస్తా
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి శనివారం రెచ్చిపోయారు. విశాఖ నడిబొడ్డున ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన ఇంటి ప్రహరీని, రెస్టు రూమ్ను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కూల్చివేసినందుకు అసభ్య పదజాలంతో ప్రభుత్వం, అధికారులపై విరుచుకుపడ్డారు. ‘మెడలు విరిచేస్తా.. ఒక్కొక్కడి అంతు తేలుస్తా.. నా ఈక కూడా పీకలేరు.. ఎవ్వడినీ వదిలిపెట్టను’ అంటూ చిందులు తొక్కారు. రాయడానికి కూడా వీలు లేని భాషలో, సభ్యత మరిచి నోటికొచ్చినట్టు దుర్భాషలాడారు. సబ్బం అనుచరులు కూడా అధికారులపై, కూలీలపై దౌర్జన్యానికి దిగడంతోపాటు, వారిని కులం పేరుతో దూషించి నెట్టివేయడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సబ్బం హరి అక్రమాల లీలలిలా.. ► విశాఖలోని రేసపువానిపాలెంలో సర్వే నంబర్ 7లో సుజనీ పార్క్ ఉంది. దీనికి ఆనుకొని ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసిన సబ్బం.. 2012లో గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్తో భవన నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నారు. ► 592.93 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టేందుకు జీవీఎంసీ ప్లాన్ మంజూరు చేసింది. ► పక్కనే రూ.3 కోట్ల విలువ చేసే 212 చదరపు గజాల పార్క్ స్థలాన్ని కబ్జా చేసేసిన సబ్బం ఆ స్థలంలో ప్రహరీ, రెస్టు రూమ్ను నిర్మించారు. ఈ ఆక్రమణలను గత నెల 5న ఏపీఎస్ఈబీ కాలనీ ప్రజలు జీవీఎంసీ దృష్టికి తీసుకెళ్లారు. ► అధికారుల కొలతల్లో ప్లాన్ ప్రకారం.. భవనం 58 అడుగులు మాత్రమే వెడల్పు ఉండాల్సి ఉండగా.. దీనికి అదనంగా 12 అడుగుల మేర ఉంది. పొడవుని లెక్కిస్తే 159 అడుగుల మేర ఆక్రమించినట్లు తేలింది. ► ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడితే నోటీసులు ఇవ్వకుండానే కూల్చే అధికారం ఉంది. జీవీఎంసీ ఈ నెల 2న సబ్బం ఇంటికి నోటీసులు అంటించింది. స్పందన లేకపోవడంతో శనివారం జేసీబీలు తీసుకొచ్చి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. ► 212 చదరపు గజాల ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైందని జీవీఎంసీ టౌన్ప్లానింగ్ ఏసీపీ మహాపాత్రో చెప్పారు. సబ్బం ప్లాన్కు దరఖాస్తు చేసినప్పుడు పార్కు స్థలాన్ని రోడ్డుగా చూపించారని, స్థానికుల ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయిలో విచారణ చేసి స్థలం ఆక్రమణకు గురైనట్లు గుర్తించి కూల్చివేశామన్నారు. నేనేంటో అందరికీ చూపిస్తా: సబ్బం హరి ఖాళీ స్థలంలో రెస్ట్ రూమ్ నిర్మించాను. అంతమాత్రాన రాత్రికి రాత్రి వచ్చి కొట్టేస్తారా? 24 గంటల్లో సమస్యని ముగిస్తా. నేనేంటో సీఎంకు తెలుసు.. విజయసాయికి ఇంకా తెలియదనుకుంటా. వైజాగ్లో కూర్చొని డ్యాన్స్ చేద్దామనుకుంటున్నారు.. ఆ డ్యాన్స్ కట్టిస్తాను. నా గురించి తెలియక ఇలా చేశారు.ఎందుకు చేశాం రా అని వాళ్లే అనుకునే స్థాయికి తీసుకెళ్తాను. వైఎస్ జగన్ నాపై కక్ష సాధింపు చేయలేరు. ఇలా చేసి మిగిలినవారికి ఒక మెసేజ్ పంపించాలని అనుకుంటున్నారు. నేనేంటో అందరికీ చూపిస్తా. -
సబ్బం హరిపై మంత్రి అవంతి ఆగ్రహం
-
సబ్బం హరిపై మంత్రి అవంతి ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన మాజీ ఎంపీ సబ్బం హరిపై మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత సమయంలో ఆయన వీధి రౌడీలా మాట్లాడారని మండిపడ్డారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) సిబ్బందిపై సబ్బం హరి దుర్భాషలాడారని అన్నారు. ఆక్రమణలు కూల్చివేస్తే కక్షసాధింపు అనడం సరికాదని మంత్రి అవంతి హితవు పలికారు. కక్షసాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం మాకు లేదని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మీరు ఆక్రమిస్తే విడిచిపెట్టాలా? సామాన్యులపై చర్యలు తీసుకోవాలా? పార్కు స్థలం కబ్జా చేసి ఇల్లు కట్టారని ఫిర్యాదు వచ్చింది. జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చే ఆక్రమణలు తొలగించారు’అని మంత్రి పేర్కొన్నారు. (చదవండి: ‘అందుకే సబ్బం హరి నిర్మాణాన్ని తొలగించాం’) సబ్బం హరి తీరుపై ఎమ్మెల్యే అదీప్రాజు విమర్శలు గుప్పించారు. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఎవరిపైనైనా చర్యలు ఉంటాయని అన్నారు. సబ్బం హరి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మీడియాకు తెలిపారు. రికార్డులు తారుమారు చేసి సబ్బం హరి పార్క్ స్థలాన్ని కబ్జా చేశారని అన్నారు. గతంలో ఆయన ఆక్రమణలపై టీడీపీ-వామపక్షాలు ధర్నాలు చేశాయని గుర్తు చేశారు. అధికారులు నోటీసులు ఇచ్చినా సబ్బం హరి పట్టించుకోలేదని కరణం ధర్మశ్రీ వెల్లడించారు. గతంలో ఆయన భూకబ్జాపై అయ్యన్నపాత్రుడు పోరాటం కూడా చేశారని, జిల్లా పరిషత్ సమావేశంలో సబ్బం హరి భూకబ్జాను అయ్యన్న నిలదీశారని తెలిపారు. ఇప్పుడు సబ్బం హరికి మద్దతుగా అయ్యన్న మాట్లాడటం సిగ్గుచేటని కరణం ధర్మశ్రీ విమర్శించారు. (చదవండి: కబ్జా స్థలంలో టాయిలెట్ నిర్మించిన సబ్బం హరి) -
‘అందుకే సబ్బం హరి నిర్మాణాన్ని తొలగించాం’
సాక్షి, విశాఖపట్నం : అనుమతులకు విరుద్ధంగా మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి నిర్మాణం చేపట్టారని విశాఖ మున్సిపల్ కమిషనర్ తెలిపారు. సబ్బంహరి అక్రమ నిర్మాణానికి సంబంధించి విశాఖ కమిషనర్ ప్రెస్నోట్ విడుదల చేశారు. ఇందులో పార్కు స్థలం కబ్జా చేసి ఇల్లు కట్టారని సెప్టెంబర్ 5న ఏపీఎస్ఈబీ కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. సీతమ్మధారలోని రేసపువానిపాలెం సర్వే నెం.7లో ఏపీఎస్ఈబీ పార్కు ఉందన్నారు. 2012లో ఇంటి నిర్మాణానికి సంబంధించి అనుమతి తీసుకున్న సబ్బం హరి 592.93చ.మీ విస్తీర్ణంలో జీ+1 కోసం అనుమతి తీసుకున్నారని తెలిపారు. ()సబ్బం హరికి ఝలక్.. జేసీబీతో కూల్చివేత) ఇంటి ముఖం 58 ఫీట్లకు అనుమతి తీసుకుని 70 ఫీట్లు కట్టినట్లు వెల్లడించారు. మొత్తం మీద పార్క్లోని 212 గజాలను ఆక్రమించిన సబ్బం హరికి ఆక్రమణలకు సంబంధించి 406 సెక్షన్ కింద నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. నోటీసులు తీసుకోవడానికి ఆయన నిరాకరించడంతో నోటీసులను సబ్బం హరి భవనానికి కమిషనరేట్ సిబ్బంది అతికించారు. నోటీసులకు ఏమాత్రం పట్టించుకోకపవంతో శనివారం ఉదయం జేసీబీతో వచ్చిన అధికారులు మాజీ ఎంపీకి ఝలక్ ఇచ్చారు. ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాన్ని తొలగించారు. ఆక్రమించిన ఖాళీ స్థలంలో కంచె ఏర్పాటు చేశారు. కాగా సీతమ్మధారలో మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి వద్ద పార్కు స్థలం కబ్జాకు గురైందని వైజాగ్ జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత తెలిపారు. స్థానికుల ఫిర్యాదుతో అక్రమ నిర్మాణాన్ని తొలగించామని వెల్లడించారు. ముందుగా సబ్బం హరికి ఆక్రమణ నోటీసు ఇచ్చాము కానీ ఆయన తీసుకోలేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
పార్క్ స్థలాన్ని కబ్జా చేసిన మాజీ ఎంపీ సబ్బంహరి
-
సబ్బం హరికి ఝలక్.. జేసీబీతో కూల్చివేత
సాక్షి, విశాఖపట్నం : మాజీ ఎంపీ సబ్బంహరి వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వానికి చెందిన స్థలాన్ని ఎంచక్కా కబ్జా చేసి టాయిలెట్ను నిర్మించారు. 12 అడుగుల పార్క్స్థలాన్ని ఆక్రమించి సొంత నిర్మాణాన్ని చేపట్టారు. అంతేకాకుండా మరికొంత ప్రభుత్వం స్థలం ఇంటి స్థలంలో కలిపేసుకున్నారు. ఈ విషయం కాస్తా స్థానిక అధికారుల దృష్టికి రావడంతో అక్రమ నిర్మాణన్ని తొలగించాలని నోటీసులు జారీచేశారు. నోటీసులకు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో శనివారం ఉదయం జేసీబీతో వచ్చిన అధికారులు మాజీ ఎంపీకి ఝలక్ ఇచ్చారు. ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాన్ని తొలగించారు. ఆక్రమించిన ఖాళీ స్థలంలో కంచె ఏర్పాటు చేశారు. అయితే అక్కడి చేరుకున్న అధికారులపై సబ్బం హరి నోరుపారేసుకున్నారు. మెడలు విస్తానంటూ బెదిరింపులకు దిగారు. ఆయన అనుచరులు సైతం అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఘటనాస్థలానికి పోలీసు చేరుకుని సముదాయించే ప్రయత్నం చేశారు. తాజా వివాదంపై జీవీఎంసీ ఏసీపీ మహాపాత్ర మాట్లాడుతూ.. ‘12 అడుగుల ప్రభుత్వ స్థలం సబ్బం హరి కబ్జా చేశారు. రికార్డ్ ప్రకారం ఆ స్థలం ప్రభుత్వంది. కబ్జా స్థలంలో నిర్మించిన నిర్మాణాలను తొలగించాము. ఆక్రమించిన కాళీ స్థలంలో కంచె ఏర్పాటు చేశాము. సమాచారం లేకుండా తొలగించాము అన్న సబ్బం హరి మాటల్లో వాస్తవం లేదు. అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని నోటీసు జరిచేసాము. నోటీసుకు సబ్బం హరి స్పందించలేదు. నోటీసుకు స్పందించక పోవడంతోనే టాయిలెట్ తొలగించి, ఆక్రమించిన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాము.’అని తెలిపారు. -
‘చంద్రబాబు చుట్టూ డర్టీ డజన్ నాయకులు’
సాక్షి, విశాఖపట్నం: ప్రజలు కరోనాలో బాధపడుతుంటే చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఏపీ టెక్నాలజీస్ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాద్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బాబు చుట్టూ యనమల రామకృష్ణుడు, సబ్బం హరి లాంటి డర్టీ డజన్ నాయకులు ఉన్నారని, వారితో ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. యనమల కలియుగ శకుని అని తూర్పు జనం అనుకుంటారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ రాజకీయ బిక్షతో స్పీకర్ పదవి పొందిన యనమల చంద్రబాబు మాటలతో వెన్నుపోటు పొడిచాడని మండిపడ్డారు. బాబును చూస్తే భారతంలో దుర్యోధనుడు గుర్తుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఇప్పటి కాంగ్రెస్కి పట్టిన గతే పడుతుందన్నారు. విశాఖపై విషం కక్కుతున్న టీడీపీని నిలదీయాల్సిన అవసరం ఉత్తరాంధ్ర జర్నలిస్టులపై ఉందని ప్రసాద్రెడడ్డి గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్ని యూ టర్న్లు తీసుకున్నా ప్రజలు నమ్మరని చెప్పారు. ఆకు రౌడీ సబ్బం, కలియుగ శకుని యనమల పతనం చివర దశలో ఉందన్నారు. మున్సిపల్ స్థలంలో సబ్బం హరి నివాసం ఉంటున్న విషయాన్ని చంద్రబాబు నాయుడే చెప్పిన విషయం అందరికీ తెలుసన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్తో విశాఖ నగరం మరో ముంబై, చెన్నై నగరాల సరసన చేరనుందని తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన విశాఖ నుంచి మొదలుపెడితే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. -
‘ఆయన వ్యాఖ్యల వెనుక ఏ కుట్ర దాగుందో’
సాక్షి, విశాఖపట్నం: అమరావతిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిజంగా చంద్రబాబుకు అమరావతిపై ప్రేమ ఉంటే విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని.. అమరావతి కావాలో, విశాఖ కావాలో అప్పుడు ప్రజలే నిర్ణయిస్తారన్నారు. గతంలో ఎంపీ గా గెలిపించిన విశాఖపట్నం ప్రజలపై పురంధేశ్వరి కృతజ్ఞత లేకుండా మాట్లాడారని ఆయన విమర్శించారు. (దేశమంతా ఏపీ వైపు చూసేలా..) రాజకీయ ద్వేషంతోనే.. ఉత్తరాంధ్రకు చెందిన సబ్బం హరి రాజకీయ ద్వేషంతో విశాఖ కేంద్రంగా క్యాపిటల్ ను వ్యతిరేకిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు జీవితాంతం కుట్ర రాజకీయాలే చేస్తారని.. ఇప్పుడు ఆయన వెంట సబ్బం హరి చేరారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్పై ఆయనకే ఎక్కువ బాధ్యత ఉన్నట్లుగా సబ్బంహరి మాట్లాడుతున్నారని, ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్సారేనని గుర్తు చేశారు. 2022 లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉండరని చెప్పిన సబ్బం హరి.. దాని వెనుక ఏం కుట్ర వుందో సమాధానం చెప్పాలన్నారు. బ్రేక్ ఫాస్ట్ జపాన్...మధ్యాహ్నం చైనా అంటూ రాజధానిపై చంద్రబాబు నాయుడు భ్రమలు సృష్టించారని ఎద్దేవా చేశారు. ‘‘ ఏపీ లో ప్రజాస్వామ్యం లేదని చెప్పే బీజేపీ నేతలు విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ కోసం ఏం చేశారు. తమ సొంత పనులు మినహా ప్రజల కోసం ఏమి చేయలేదు. తప్పు చేసిన నాయకులను అరెస్ట్ చేస్తే బీసీ నాయకులు అంటారా ? అంటే హత్య చేసిన వాళ్ళని.. మోసాలు చేసిన వారిని విడిచి పెట్టాలా ?’’ అంటూ మంత్రి నిప్పులు చెరిగారు. అన్ని వర్గాలు కలిసి దాడి చేసేందుకు కుట్ర చేసినా భారతంలో అర్జునుడికి మాదిరిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దేవుని ఆశీస్సులు ఉంటాయని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. -
లీకువీరుడు.. దొరికేశాడు..
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ప్రభుత్వోద్యోగుల పేర్లు, ఫోన్ నెంబర్లతో సహా బయటకు వచ్చిన వ్యవహారం మొత్తం.. ఓ తహసీల్దార్ దగ్గరుండి నడిపించాడని తేలింది. పోస్టల్ ఓట్లు కలిగిన ఉద్యోగుల జాబితాను బయటకు ఇవ్వకూడదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు జిల్లా అధికారులు చెప్పుకురాగా, అదే ఉద్యోగుల ఫోన్ నెంబర్లను సైతం భీమిలి టీడీపీ అభ్యర్ధి సబ్బం హరికి అందించిన నిర్వాకం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ జాబితాను పట్టుకుని సబ్బం హరి ఒకేసారి 500మంది ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రలోభాల వల విసిరారు. ఈ భాగోతంపై సాక్షి పత్రికలో వచ్చిన వరుస కథనాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ విచారణకు ఆదేశించారు. డీఆర్వోను విచారణాధికారిగా నియమించారు. సబ్బం హరి మాట్లాడిన ఆడియో టేపులను పరిశీలించిన తర్వాత.. అది కచ్చితంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని భావించి.. కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. ఈలోగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. అనుమానితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగుల వాట్సాప్ మెసేజ్లు, ఈ మెయిల్స్ కూడా చెక్ చేశారు. మొత్తంగా విచారణలో జిల్లాలోని ఓ తహసీల్దార్ ఈ డేటా లీక్కు పాల్పడినట్టు తేలింది. మొత్తం ఫోన్ నెంబర్లతో పాటు పోస్టల్ బ్యాలెట్ కలిగిన ఉద్యోగుల జాబితాను సదరు తహసీల్దార్... సబ్బం హరికి అందించినట్టు తెలిసింది. దీనిపై నిగ్గు తేల్చిన జిల్లా ఉన్నతాధికారులు ఆ తహసీల్దార్పై సస్పెన్షన్కు సిఫార్సు చేస్తూ ఎలక్షన్ కమిషన్కు నివేదించినట్టు తెలిసింది. కలెక్టరేట్ అధికారులకు సంబంధం లేదట వాస్తవానికి కలెక్టరేట్లో పనిచేసే రెవెన్యూ అధికారులపైనే తొలుత సందేహాలు వెల్లువెత్తాయి. ఇప్పటికే వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో పాటు పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారం పర్యవేక్షించే సెక్షన్ వర్గాలపైనా అనుమానాలు రేకెత్తాయి. కానీ సమగ్ర విచారణ అనంతరం కలెక్టరేట్ వర్గాలకు సంబంధం లేదని, ఇదంతా ఆ తహసీల్దార్ నిర్వాకమేనని తేలినట్టు తెలుస్తోంది. -
సబ్బం ప్రలోభాలు నిజమే
సాక్షి, విశాఖపట్నం : ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ ఓట్ల కోసం భీమిలి టీడీపీ అభ్యర్థి సబ్బంహరి వారితో సామూహికంగా టెలికాన్ఫరెన్సులు నిర్వహించి ప్రలోభాలకు గురి చేయడం వాస్తవమేనని.. అది ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని అధికారులు నిర్థారించారు. ఆ మేరకు జిల్లా ఎన్నికల అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. ఎన్నికల ప్రచారం, పోలింగ్ ముగిసిన తర్వాత ఎవరూ ప్రచారం చేయకూడదు. పైగా ఒకేసారి పెద్ద సంఖ్యలో ఉ ద్యోగులను కలవడం గానీ.. మాట్లాడడం గానీ చే యకూడదని ఎన్నికల ప్రవర్తనా నియమావళి స్ప ష్టం చేస్తోంది. దీన్ని భీమిలి టీడీపీ అభ్యర్థి సబ్బం యథేచ్ఛగా ఉల్లంఘించారు. బయట వ్యక్తులకు ఇవ్వకూడని పోస్టల్ ఓటర్ల జాబితాతోపాటు వారి ఫొన్ నెంబర్లు కూడా సంపాదించి.. దాదాపు నా లుగు రోజులపాటు టెలికాన్ఫరెన్స్ద్వారా 500 మంది చొప్పున భీమిలి నియోజకవర్గానికి చెం దిన ఉద్యోగులతో ఒకేసారి సబ్బం హరి మాట్లాడి పోస్టల్ ఓట్లు తనకే వేయాలని ప్రలోభాలకు గురి చేశారు. దీనికి సంబంధించి ఆడియో టేపులోని ఆయన మాటలతో సహా ‘సబ్బం.. ప్రలోభాల పబ్బం’ శీర్షకతో ఇచ్చిన కథనం ద్వారా సాక్షి వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. విచారణ.. నిర్థారణ ఎన్నికల నియమావళికి విరుద్దంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయనున్న ఉద్యోగుల వివరాలు సబ్బం హరికి చేరడం.. ఇందుకు కలెక్టరేట్లోని సంబంధిత విభాగాధికారులు కొందరు సహకరించినట్లు ఆరోపణలు రావడం తీవ్ర దుమారం రేపాయి. దీనిపై తీవ్రంగా స్పందించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కాటంనేని భాస్కర్ సమగ్ర విచారణకు ఆదేశించారు. డీఆర్వో గున్నయ్యను విచారణాధికారిగా నియమించారు. పోస్టల్ బ్యాలెట్ల కోసం అధికార పార్టీ నేతలు పాల్పడుతున్న ప్రలోభాల పరంపరపై వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల కమిషన్కు కూడా ఫిర్యాదు చేశారు. సామూహికంగా ఉద్యోగులతో ఫోన్లో మాట్లాడి ప్రలోభాలకు గురిచేస్తున్నట్లున్న ఆడియో టేపులను కూడా ఈసీకి అందజేశారు. దీనిపై ఈసీ కూడా సీరియస్ అయ్యింది. సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్లు కలిగి ఉన్న ఉద్యోగుల డేటాతోపాటు ఫోన్ నెంబర్లు ఎలా బయటకు వెళ్లాయన్న దానిపై కలెక్టరేట్తో పాటు భీమిలి తహసీల్దార్ కార్యాలయంలోనూ డీఆర్వో గున్నయ్య విచారణ జరిపారు. ఈ సమాచరం కలెక్టరేట్ నుంచి వెళ్లిందా? భీమిలి తహసీల్దార్ కార్యాలయం నుంచి వెళ్లిందా? ఆరా తీస్తున్నారు. ఎవరి ద్వారా ఆ డేటా టీడీపీ అభ్యర్థికి చేరిందన్న దానిపై విచారణ జరుపుతున్న ఆయన.. ఆ అధికారులెవరో తేలిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ ఈసీకి తుది నివేదిక సమర్పించనున్నారు. మరో వైపు ఎన్నికల ప్రచారం, పోలింగ్ ముగిసిన తర్వాత ప్రచారం చేయడం, మూకుమ్మడిగా ఒకేసారి ఉద్యోగులందరితో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడి ఓట్లు అభ్యర్థించడాన్ని సీరియస్గానే పరిగణిస్తున్నారు. అందుకు బాధ్యుడైన టీడీపీ అభ్యర్థి సబ్బం హరిపై కూడా కేసు నమోదుకు ఈసీకి నివేదించినట్టుగా చెబుతున్నారు. దక్షిణ నియోజకవర్గ ఆర్వో, ఏఆర్వో సస్పెన్షన్? ఎన్నికల విధి నిర్వహణలో అలసత్వం వహించారన్న కారణంతో ఇద్దరు అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన రిటర్నింగ్ అధికారి శ్రీనివాసమూర్తి, అసిస్టెంట్ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ (ఏఆర్ఓ) కిరణ్లను సస్పెండ్ చేసినట్లు సమాచారం. -
‘ఎన్నికల సంఘంలో టీడీపీ కోవర్టులు’
-
‘ఎన్నికల సంఘంలో టీడీపీ కోవర్టులు’
సాక్షి, అమరావతి: ఎన్నికల సంఘంలోని సోషల్ మీడియా వింగ్లో టీడీపీ కోవర్టులు ఉన్నారని వైఎస్సార్సీపీ నేత ఎంవీఎస్ నాగిరెడ్డి సీఈఓ గోపాలకిృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా, టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఈసీలో కొంత మంది పనిచేస్తున్నారని అన్నారు . ఈమేరకు శుక్రవారం ఆయన ద్వివేదిని కలిసి వినతిపత్రం అందించారు. ఈసీ సోషల్ మీడియా వింగ్ పేరుతో టీడీపీకి అనుకూలంగా పనిచేసే వారిని చంద్రబాబు నాయుడు పథకం ప్రకారం నియమించుకున్నారని నాగిరెడ్డి ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్ల కోసం ప్రలోభాలకు పాల్పడుతున్న టీడీపీ అభ్యర్థి సబ్బంహరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రలోభాలతో సబ్బంహరి పోస్టల్ బ్యాలెట్స్ను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రలోభాల ఆడియో టేపులను ఈసీకి అందచేశామని నాగిరెడ్డి తెలిపారు. టీడీపీకి తొత్తులుగా వ్యవహిస్తూ.. ఆబ్జెక్ట్ ఏజెన్సీ ఓటర్లని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని, ఇంటలిజెన్స్ అండతోనే అది ఈసీలోకి ప్రవేశించిందని ఆరోపించారు. కౌంటింగ్ రోజు కేంద్రాల వద్ద భద్రత పెంచాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాసిన లేఖను సీఈఓకు అందచేశామని అన్నారు. -
ఎవరు.. డేటా చోరులెవరు?
పోలింగ్కు కొద్దిరోజుల ముందు తెరపైకి వచ్చిన డేటా చౌర్యం వివాదం పెద్ద కలకలమే రేపింది.రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఈ–గవర్నెన్స్, ఈ–ప్రగతి వ్యవస్థల ద్వారా టీడీపీ నేతలకు చెందిన ఐటీగ్రిడ్, టీడీపీకే చెందిన సేవామిత్ర యాప్లలోకి ఓటర్ల కలర్ ఫొటోలతో కూడిన ఒరిజినల్ జాబితాలను, ఆధార్ వివరాలను కూడా చౌర్యం చేశారనీ.. తద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి.. దీనిపై కేసులు కూడా విచారణలో ఉన్నాయి..ఇప్పుడు విశాఖలోనూ అటువంటి డేటా చౌర్యమే కలకలం రేపుతోంది. పోస్టల్ బ్యాలెట్ల వినియోగానికి కౌంటింగ్ వరకు అవకాశమున్న నేపథ్యంలో ఆ ఓట్లు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన జాబితాలు, ఫోన్ నెంబర్లు భీమిలి టీడీపీ అభ్యర్థి సబ్బం హరికి చేతిలోకి వెళ్లడం.. వాటి ఆధారంగా ఆయనగారు ఉద్యోగులతో సామూహిక టెలికాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ.. ప్రలోభాలకు గురి చేస్తుండటంపై ‘సాక్షి’ ఆడియో వివరాలతో సహా రట్టు చేయడం కలెక్టరేట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. గోప్యంగా ఉంచాల్సిన ఈ జాబితాను చౌర్యం చేసి.. టీడీపీ అభ్యర్థికి అప్పగించిన చోరులెవరన్నది ఇప్పుడుచర్చనీయాంశమైంది.కలెక్టరేట్లో తిష్ట వేసిన టీడీపీకి సన్నిహితుడైన ఓ వివాదాస్పద అధికారి ద్వారా సదరు డేటా గడప దాటిందన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా.. ఈ వ్యవహారంపై విచారణ కలెక్టర్ భాస్కర్ ఆదేశించారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ప్రభుత్వోద్యోగుల పేర్లు, ఫోన్ నెంబర్లతో సహా బయటకు వచ్చిన వ్యవహారం కలెక్టరేట్ వర్గాల్లో కలకలం రేపుతోంది. పోస్టల్ ఓట్లు కలిగిన ఉద్యోగుల జాబితాను బయటకు ఇవ్వకూడదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు చెప్పుకొచ్చిన జిల్లా అధికారులు ఉద్యోగుల ఫోన్ నెంబర్లను సైతం భీమిలి టీడీపీ అభ్యర్థి సబ్బం హరికి అందించిన నిర్వాకం వివాదాస్పదమవుతోంది. ఆ జాబితాను పట్టుకుని సబ్బం హరి ఒకేసారి 500 మంది ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రలోభాల వల వేస్తున్న వైనాన్ని ‘సబ్బం.. ప్రలోభాల పబ్బం’ శీర్షికతో సాక్షి గురువారం బట్టబయలు చేయడంతో.. ఈ అంశం రాజకీయ, అధికార వర్గాల్లో చర్చకు తెరలేపింది. వాస్తవానికి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి టీడీపీ అభ్యర్ధులందరికీ ప్రభుత్వోద్యోగుల జాబితాలు చేరాయనే ప్రచారం ఉంది. కానీ సబ్బం హరికి మాత్రం జిల్లా రెవెన్యూ వర్గాల నుంచే ఆ జాబితా అందిందనే వాదనలకు బలం చేకూరుతోంది. ఆడియో టేపులు నిశితంగా పరిశీలించి విన్న వారికి ఇదే విషయం స్పష్టమవుతుంది. ఇది టీడీపీ ప్రజాప్రతినిధి బంధువు పనేనా? జిల్లా రెవెన్యూ వ్యవహారాల్లో టీడీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి బంధువు కొన్నేళ్లుగా హల్చల్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సదరు అధికారి తహసీల్దార్గా ఉన్నప్పుడు భూ కుంభకోణాల్లోనూ ఆయన పేరు మార్మోగిపోయింది. ఆ అధికారి విశాఖ రూరల్ తహసీల్దార్గా పని చేసిన కాలంలోనే ఎన్నో భూ రికార్డులు తారుమారయ్యాయి. బదిలీ అయిన తర్వాత కూడా దాదాపు 59 రోజులపాటు డిజిటల్ కీ అప్పగించని నిర్వాకం ఆయనది. రెవెన్యూ రికార్డులు, డిజిటల్ సిగ్నేచర్కు సంబంధించి ఈ కంప్యూటర్ కీ ఉంటేనే పని సాధ్యం. కొత్త తహసీల్దార్ వచ్చినా 59 రోజులపాటు కీ అప్పగించకపోవడం వెనక చాలా వ్యవహారాలు నడిచాయన్న ఆరోపణలు గట్టిగా వినిపించాయి. ఇక పెందుర్తి తహసీల్దార్గా చేసిన కాలంలో కూడా భూదందాలకు సంబంధించి ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తాయి. సదరు అధికారి ఈ ఐదేళ్లలో విశాఖ పరిసర ప్రాంతాల్లోనే.. అదీ కీలకమైన మండలాల్లోనే తహసీల్దార్గా పనిచేశారంటే ఆయన హవా ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. అంతటి ట్రాక్ రికార్డ్ ఉన్న అధికారికి ఎన్నికల సమయంలో కలెక్టరేట్లోని ఓ సెక్షన్ను అప్పగించారు. ఓటర్ల జాబితా వ్యవహారాలతో ఆ సెక్షన్కు నేరుగా సంబంధం లేనప్పటికీ కలెక్టరేట్లోనే మకాం వేసిన ఆ అధికారి ఎన్నికల విభాగం(పోస్టల్ బ్యాలెట్లు పర్యవేక్షించే) అధికారిపై ఒత్తిడి తెచ్చి జాబితాను తన సామాజికవర్గానికి చెందిన సబ్బం హరికి అందజేశారన్న ఆరోపణలు నేరుగా కలెక్టరేట్ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్లు పర్యవేక్షిస్తున్న విభాగాధికారిపై కూడా ఇప్పటికే ఎన్నో ఆరోపణలున్నాయి. ఆ అధికారి గత ఏడేళ్లుగా కలెక్టరేట్లోనే తిష్ట వేసిన నేపథ్యంతో పాటు టీడీపీ నేతలకు కొమ్ముకాస్తారనే ఆరోపణలు ఉన్నాయి. భీమిలి తహసీల్దార్ ఆఫీసు నుంచి కూడా...సమగ్ర విచారణ పోస్టల్ ఉద్యోగుల ఓట్ల జాబితా బయటకు రావడంపై సమగ్ర విచారణకు జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. గురువారం సాక్షిలో కథనం వచ్చిన దరిమిలా సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఉద్యోగుల జాబితా ఫోన్ నెంబర్లతో సహా బయట పెట్టడం ఎన్నికల నియమావళికి విరుద్ధం.. ఈ తప్పుడు పని ఎవరు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ వ్యవహారానికి సంబంధించి శుక్రవారం సాయంత్రంలోగా నివేదికనివ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించానని కలెక్టర్ సాక్షి ప్రతినిధితో చెప్పారు. -
సబ్బం.. ప్రలోభాలతో పబ్బం
-
సబ్బం.. ప్రలోభాలతో పబ్బం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఓట్ల కోసం అన్ని అడ్డదారులు తొక్కిన అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోలింగ్ ముగిశాక ఇప్పుడు ప్రభుత్వోద్యోగుల పోస్టల్ ఓట్ల కోసం బరితెగించారు. ఇప్పటికే పలువురు టీడీపీ అభ్యర్థులు ఒక్కో ఉద్యోగి పోస్టల్ ఓటు కొనుగోలుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఎరచూపుతూ వచ్చారు. తాజాగా భీమిలి టీడీపీ అభ్యర్థి సబ్బం హరి ఏకంగా ఒకేసారి 500 మంది ఉద్యోగులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ప్రలోభాలకు గురిచేయడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన ఆడియో టేప్ బయటపడటం వివాదాస్పదమైంది. ఆ ఆడియోలో ‘భీమిలిలో 3 వేల వరకు పోస్టల్ ఓట్లు ఉన్నాయని లెక్క తేలింది. మీరందరూ ఎన్నికల వేళ బిజీగా ఉన్నారు. మీరు నన్ను వైజాగ్ లేదా భీమిలిలో కలవచ్చు. నలుగురైదుగురుగా వచ్చి కలవండి. అన్నీ మాట్లాడుకుందాం’ అని సబ్బం చెప్పుకొచ్చారు. పోస్టల్ ఓట్లున్న ఉద్యోగుల జాబితా సబ్బం హరికి ఎక్కడి నుంచి వచ్చిందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. టీడీపీ నేతలకు జిల్లా కలెక్టరేట్లోని కొందరు అధికారులు జాబితాను అందించారని తెలిసింది. ఇదే జాబితాను తాము స్వయంగా కలిసి అడిగినా ఇవ్వలేదని, సబ్బం హరికి ఎలా ఇచ్చారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు ప్రశ్నించారు. ఉద్యోగుల పేర్లతో పాటు ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం దారుణమని, ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు వెంటనే వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా పోస్టల్ ఓట్ల వివరాలను టీడీపీ అభ్యర్థులందరికీ ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఈ బిల్డప్ బాబును భరించలేం..
ఔను.. ఊహించిందే జరుగుతోంది. భీమిలి ప్రజ ‘సబ్బు’ం రుద్దుడును అంగీకరించడం లేదని స్పష్టమైపోతోంది. 2014 నుంచి ఐదేళ్లుగా భూబకాసురులు, అక్రమార్కుల అరాచకాలతో వేగలేకపోయిన అక్కడి ప్రజలు.. ఇప్పుడు దౌర్జన్యాలు, అడ్డగోలు పంచాయితీలకు ట్రేడ్మార్క్ అయిన టీడీపీ అభ్యర్థి సబ్బం హరిని ఏ మాత్రం భరించే పరిస్థితి లేదని తేలిపోయింది. అందుకే ఆయనగారి ప్రచారపర్వమే అభాసుపాలవుతోంది. సాధారణ ప్రజలే కాదు. భీమిలి టీడీపీ శ్రేణులు కూడా హరిని మోయడం మా వల్ల కాదంటూ కాడి కింద పడేసి.. ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. ఇంకొందరూ ఏకంగా పార్టీనే వీడిపోయారు. ఏమిటీ ఈ విషయంలో ఏమైనా అనుమానాలున్నాయా?.. అయితే రండి.. పూర్తి వివరాలు తెలుసుకుందాం. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సబ్బం హరి.. నమ్మకద్రోహానికి నిలువెత్తు రూపం.. విశ్వాస ఘాతుకానికి అసలు సిసలు నిర్వచనం.. ఇదేంటి ఒక నేతను అన్నేసి మాటలు అంటారా.. అని అనుకుంటున్నారా.. అయితే ఆయనగారి చిట్టా విప్పాల్సిందే.. సబ్బం హరి పేరు చెబితేనే.. విశాఖ నగరంలో అడ్డగోలు పంచాయితీలు, భరించలేని హావభావ విన్యాసాలు, కాళ్లకు పొర్లు దండాలు గుర్తుకు వస్తాయి. బియ్యం బిజినెస్ పేరిట దందాలు చేసుకుంటూ 1995లో అనూహ్యంగా విశాఖ నగరపాలక సంస్థ మేయర్ అయ్యాడు. గౌరవప్రదమైన మేయర్ పదవిలో ఉండగానే ఓసారి కార్పొరేటర్లను కిడ్నాప్ చేసిన ఉదంతంలో బుక్కయ్యారు. అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు ఆనాటి పోలీస్ కమిషనర్ ఆర్పి మీనా, డీఎస్పీ రామచంద్రరాజులు ఇచ్చిన ‘కోటింగ్’ హరి మాటేమోగానీ.. మేయర్ పదవికే మచ్చ తెచ్చింది. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన మేయర్గా ఉన్న ఆయనే సీతమ్మధారలో ప్రభుత్వ పార్కు స్థలాన్ని కబ్జా చేసి బహుళ అంతస్తుల భవనం నిర్మించుకున్నాడు. ఒక్క దఫా మేయర్గా పని చేసి.. చెరిగిపోని మరకలు అంటించుకున్న సబ్బం హరిని కాంగ్రెస్ పార్టీయే కాదు.. నగర ప్రజలు కూడా దూరంగా పెట్టేశారు. అందుకే 1999 ఎన్నికల్లో విశాఖ–1 నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే దారుణ పరాభవం రుచిచూపించారు. బిల్డప్ బాబును భరించలేం.. టీడీపీలో తాను ఆశించిన టికెట్ తెచ్చుకోగలనని బిల్డప్ ఇచ్చిన సబ్బం హరికి చివరికి చంద్రబాబు ఎవరూ వద్దన్న భీమిలి టికెట్ పడేశారు. మాడుగుల, ఉత్తర అసెంబ్లీ లేదా విశాఖ ఎంపీ టికెట్ ఆశించిన హరి.. చివరాఖరుకు గతి ఏక భీమిలిలో పోటీకి దిగారు. అయితే సబ్బం అభ్యర్ధిత్వాన్ని భీమిలి ప్రజల మాట అటుంచి టీడీపీ శ్రేణులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. హరి రాకను నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు, వందలాది మంది కార్యకర్తలు టీడీపీకి రాజీనామా చేశారు. మొదట్లో వెల్లువెత్తిన వ్యతిరేకత తర్వాత సర్దుకుంటుందని అందరూ భావించారు. కానీ నియోజకవర్గంలో ఇప్పటికీ టీడీపీ కార్యాలయాలు సైతం తెరుచుకోకపోవడంతో పార్టీ పరిశీలకుడు కర్రోతు సత్యనారాయణ వచ్చి ఇక్కడి పరిస్థితిని పార్టీ అధిష్టానానికి నివేదించారు. ఇక పద్మనాభం మండలానికి చెందిన మాజీ మంత్రి ఆర్.ఎస్.డి.పి.అప్పలనరసింహరాజు, సమన్వయ కమిటీ సభ్యులైతే సబ్బం హరికి పనిచేయలేమని కుండబద్దలు కొట్టేశారు. ఇలా సొంత పార్టీ నేతలే సబ్బం హరికి దూరంగా ఉంటుండగా, అక్కడి ప్రజలైతే మండే ఎండలకంటే ముందు.. ప్రచారంలో సబ్బం హరి హావభావ విన్యాసాలు, ‘తాను భీమిలి నుంచి పోటీ చేస్తున్నానంటే అది ఈ ప్రాంతానికే గొప్ప’ అంటూ ప్రదర్శిస్తున్న అతిశయాలు భరించలేక అల్లాడిపోతున్నారు. మారిన మనిషినంటూ.. మళ్లీ మోసం అటు తర్వాత మారిన మనిషినని నమ్మించి మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరుడిగా తెరపైకి వచ్చాడు. ఓ దఫా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న ఆరోపణతో అప్పటి విశాఖ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి సదరు సబ్బం హరిని సస్పెండ్ కూడా చేయించారు. అప్పుడు కూడా వైఎస్ పెద్దమనసుతో మన్నించి నేదురుమల్లిని ఒప్పించి తిరిగి హరిని పార్టీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత 2009లో వైఎస్ దగ్గరుండి అనకాపల్లి లోక్సభ సీటు ఇప్పించి గెలిపించారు. మహానేత హఠాన్మరణం తర్వాత సబ్బం ఆ కుటుంబం పట్ల ఎంత కృతజ్ఞత చూపించారో అందరికీ తెలుసు. విశ్వాస ఘాతుకం 2014 ఎన్నికల్లో విశాఖలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా విషప్రచారాలకు పాల్పడ్డాడు. సమైక్యాంధ్ర చివరి సీఎం కిరణ్కుమార్రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున విశాఖ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి.. చివరి నిమిషంలో ప్లేటు ఫిరాయించి బీజేపీ అభ్యర్ధి హరిబాబుకు ఓటేయాలని పిలుపునిచ్చాడు. మొదట అటు కిరణ్కుమార్రెడ్డి నుంచి పార్టీ ఫండ్గా డబ్బులు తీసుకుని.. చివర్లో ఇటు హరిబాబు వద్ద కూడా ముడుపులు పొందారన్న అపకీర్తి గడించాడు. ఆనక ఐదేళ్లు బయటకు మొహం చూపించలేని దుస్థితి దాపురించింది. అప్పుడప్పుడు బయటికొచ్చి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు భజన చేసి మళ్ళీ తెర వెనక్కి వెళ్ళిపోయేవాడు. ఎన్నికలొస్తే తాను కోరుకున్న పార్టీ నుంచి, కోరుకున్న నియోజకవర్గం నుంచి పోటీ చేయగలనని బీరాలు పోయాడు. సరిగ్గా ఎన్నికల సమయం వచ్చేసరికి టికెట్ కోసం చంద్రబాబు కాళ్ళావేళ్లా పడ్డాడు. -
టీడీపీ సభ్యత్వం లేని సబ్బంహరికి అసెంబ్లీ టికెట్
-
సబ్బం హరికి అసమ్మతి సెగ
సాక్షి, విశాఖపట్నం: అధికార టీడీపీలో అసమ్మతి సెగలు రాజుకుంటూనే ఉన్నాయి. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా సబ్బం హరి పేరు ఖరారు చేయడాన్ని తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సబ్బం హరికి టికెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ సీనియర్ నేత కోరాడ రాజబాబుతో సహా పలువురు నేతలు మంగళవారం టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీలో చేరకుండానే అధిష్ఠానం సబ్బం హరికి టికెట్ ఇవ్వడం దారుణమని టీడీపీ నాయకులు వాపోతున్నారు. బాబూరావు గరం గరం కనిగిరి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, కదిరి బాబురావు టీడీపీ అధిష్టానంపై రగిలిపోతున్నారు. పార్టీకి సేవ చేసిన తనను పక్కన పెట్టి టీడీపీకి ఏమాత్రం సంబంధం లేని ఉగ్రనరసింహరెడ్డికి టికెట్ ఇవ్వడంపై మండిపడ్డారు. సొంత నియోజకవర్గాన్ని వదిలి దర్శికి వెళ్లేది లేదని బాబూరావు తెగేసి చెప్తున్నారు. అవసరమయితే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బాబురావుకి కనిగిరి టికెట్ ఇవ్వాల్సిందే అని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. సీఎం నివాసం వద్ద నిరసన జ్వాలలు అమరావతిలోని సీఎం నివాసం వద్ద కొనసాగుతున్న నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. మాచర్ల టిక్కెట్ అంజిరెడ్డికి కేటాయించడంపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు నివాసానికి భారీగా తరలివచ్చి నిరసన చేపట్టారు. అంజిరెడ్డికి సీటు ఇస్తే నామినేషన్ వేయకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. కొత్తగా వచ్చిన వారికి సీట్లు ఇస్తే పార్టీ కోసం కష్ట పడిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. -
రాహుల్ కోటాలో టీడీపీ ఎంపీ అభ్యర్థులు..!
సాక్షి, అమరావతి : టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితాను సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత విడుదల చేశారు. అయితే, లోక్సభ అభ్యర్థుల ఎంపికపై పార్టీ శ్రేణులు పెదవి విరుస్తున్నాయి. మొన్నటివరకు కాంగ్రెస్లో ఉండి ఎన్నికల ముందు టీడీపీలో చేరిన నేతలకు పెద్దపీట వేశారని పలువురు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ సూచన మేరకు ముగ్గురు కాంగ్రెస్ తాజా మాజీలకు ఎంపీలుగా అవకాశం కల్పించారని విమర్శిస్తున్నారు. కిశోర్ చంద్రదేశ్, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, పనబాక లక్ష్మీకి రాహుల్ కోటాలో టికెట్లిచ్చారని, పార్టీ కోసం పనిచేసిన వారికి అన్యాయం చేశారని మండిపడుతున్నారు. ఇక ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పార్టీ కోసం పనిచేసిన నేతలకు ఎంపీ సీట్లు కేటాయిస్తే.. బాబు మాత్రం కోట్లు కుమ్మరించే పారిశ్రామిక వేత్తలకు, వ్యాపారులకు టికెట్లు దోచిపెట్టారని ఆగ్రహం వ్యక్త చేశారు. ఇదిలాఉండగా.. టీడీపీ, జనసేన లోపాయికారి ఒప్పందం మరోసారి బయటపడింది. నరసాపురంలో జనసేన అభ్యర్థిని దృష్టిలో పెట్టుకుని టీడీపీ తరపున శివరామరాజును డమ్మీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించుతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీలో చేరకుండానే టికెట్..! కాంగ్రెస్ నేత సబ్బం హరికి టీడీపీ భీమిలీ అసెంబ్లీ టికెట్ కేటాయించింది. అయితే, తాను విశాఖ ఎంపీ సీటు కోరితే ఎమ్మెల్యే టికెట్ కేటాయించారని ఆయన ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. ఈ విషయంలో మంత్రి గంటా కలగజేసుకుని ఆయనకు నచ్చజెప్పినా వెనక్కు తగ్గలేదు. మంగళవారం ఉదయం అమరావతి చేరుకున్న సబ్బం చంద్రబాబు వద్ద తన అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. గతకొంత కాలంగా ఆయన టీడీపీకి అనుకూలంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్తో సబ్బం తలపడనున్నారు. -
సబ్బం హరికి నోటీసులు
సాక్షి, విశాఖపట్నం: అనకాపల్లి మాజీ ఎంపీ, విశాఖ మాజీ మేయర్ సబ్బం హరి ఆస్తుల స్వాధీనానికి విశాఖ కో ఆపరేటివ్ బ్యాంకు నోటీసులు జారీ చేసింది. ఆస్తులు తనఖా పెట్టి తీసుకున్న రుణం వడ్డీ, ఇతర ఖర్చులతో కలిపి రూ.9.54 కోట్లు చెల్లించాల్సి ఉంది. వాయిదాలు చెల్లించకపోవడంతో ఎన్పీఏ జాబితాలో చేర్చిన బ్యాంకు ఆర్బీఐ నిబంధనల మేరకు మంగళవారం ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసింది. బకాయిలను 60 రోజుల్లోగా చెల్లించకపోతే సీతమ్మధారలోని 1622 చదరపు గజాల స్థలంలోని నివాసంతో పాటు మాధవధారలోని వుడా లేఅవుట్లో 444.44 చదరపు అడుగుల విస్తీర్ణంలోని విష్ణు వైభవం అపార్టుమెంట్, విశాఖ బీచ్రోడ్లోని రుషికొండ దగ్గరలో ఉన్న 800 చదరపు గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది. ఇదీ నేపథ్యం.. నగరం నడిబొడ్డున మద్దిలపాలెంలో ఉన్న డక్కన్ క్రానికల్ భవనాన్ని 2014లో కోటక్ మహేంద్ర వేలం వేసింది. ఆ వేలంలో రూ.17.80 కోట్లకు సబ్బం హరి పాడుకున్నారు. ఆ సమయంలో తన ఆస్తులను తనఖా పెట్టి విశాఖ కో–ఆపరేటివ్ బ్యాంకు నుంచి రూ.8.50 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే వేలం నిబంధనల మేరకు నిర్వహించలేదంటూ డక్కన్ క్రానికల్ (డీసీ) యాజమాన్యం డెబిట్ రికవరీ అపిలేట్ అథారిటీ (డీఆర్ఏపీ)లో కేసు ఫైల్ చేసింది. అథారిటీ డీసీ వాదనను సమర్ధిస్తూ వేలం రద్దు చేయాలని, సబ్బం హరి డిపాజిట్ చేసిన రూ.17.80 కోట్లను వడ్డీ సహా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై కోటక్ మహేంద్ర అప్పీల్కు వెళ్లింది. మరో వైపు ఈ కేసును జాతీయ స్థాయిలో ఏర్పాటైన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఏసీఎల్టీ)కి రిఫర్ చేశారు. దీనిపై తుది తీర్పు రావాల్సి ఉంది. విశాఖ కో ఆపరేటివ్ బ్యాంకులో తనఖా పెట్టిన సీతమ్మధారలోని సబ్బం హరి నివాసం ఉంటున్న ఇల్లు చెల్లింపులో ఎలాంటి సందేహం లేదు రూ.60 కోట్ల ఆస్తులను కొలాట్రల్ సెక్యురిటీ పెట్టి కో ఆపరేటివ్ బ్యాంకులో రూ.8.50 కోట్ల రుణం తీసుకున్నా. రూ.1.50 కోట్ల వరకు తిరిగి చెల్లించా. వడ్డీ సహా రూ.9.54 కోట్లు చెల్లించాలని బ్యాంకు నోటీసు ఇచ్చింది. డక్కన్ క్రానికల్ కేసులో తుది తీర్పు వెలువడగానే బ్యాంకు వాళ్లకు చెల్లించాల్సిన బకాయిలను వడ్డీ సహా కోటక్ మహేంద్రాయే నేరుగా చెల్లిస్తుంది. ఈ రుణ బకాయిల చెల్లింపు విషయంలో సందేహ పడాల్సిన పనిలేదు. – సబ్బం హరి, మాజీ ఎంపీ నిబంధనల ప్రకారమే నోటీసులు బకాయిలు వసూలు కాకపోవడం వల్లే సబ్బం హరి ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఉపక్రమించాం. తుది తీర్పు వెలువడగానే సబ్బం హరి రుణాన్ని వడ్డీ సహా సెటిల్ చేస్తామని కోటక్ మహేంద్ర లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వడంతో ఇన్నాళ్లు ఎదురు చూశాం. తుది తీర్పు ఎప్పుడొస్తుందో తెలియడం లేదు. అందువల్లే నోటీసులు జారీ చేశాం. – మానం ఆంజనేయులు,చైర్మన్, విశాఖ కో ఆపరేటివ్ బ్యాంకు -
ఈ నాయకులంతా ఏమయ్యారు
హైదరాబాద్: రెండేళ్ల కిందట ఈ నాయకులు చేసిన హడావిడి ఇంతా అంతా కాదు. విభజనకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో నానా హడావిడి చేసిన కొందరు నాయకులు ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. రాజకీయాల నుంచి దాదాపుగా కనుమరుగయ్యారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే అయినప్పటికీ అప్పట్లో హడావిడి చేసిన నేతలెవరూ ఇప్పుడు బయట కనిపించడం లేదు. ఒకవైపు విభజన ఉద్యమం మరోవైపు సమైక్య ఉద్యమం నడుస్తున్న కాలంలో రాష్ట్రం ఎట్టిపరిస్థితుల్లోనూ విడిపోదని చెబుతూ తెగ హడావిడి చేసిన నేతలు చేసేదేమీ లేక గడిచిన రెండేళ్లుగా తమ ఇళ్లకే పరిమితమయ్యారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, మాజీ మంత్రి టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాపరెడ్డి.. ఇలా ఒక్కొక్కరుగా ఎంతో మంది నేతలు రాష్ట్ర విభజనకు ముందు ఎంతో హడావిడి చేశారు. విభజన జరగదని ఆనాడు గంటాపథంగా చెప్పారు. సాధారణ ఎన్నికలకు ముందే రాష్ట్ర విభజన చట్టం చేయడం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వేర్వేరు రాష్ట్రాలుగా ఏర్పాటు కావడం జరిగిపోయాయి. ఈ నాయకులు కూడా సైలెంట్ అయిపోయారు. రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోదని చెబుతూ వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గత ఎన్నికల సమయంలో జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి ఆ పార్టీని ఎన్నికల రంగంలో నిలిపారు. జర్మనీ నుంచి ఆయన మిత్రుడొకరు తెచ్చిన రాయిని చూపించి విడిపోయినా మళ్లీ రెండు రాష్ట్రాలు కలుస్తాయని కూడా చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత అంతే... ఆయనెక్కడా కనిపించలేదు. తన సన్నిహితులకు చెందిన ఒకరిద్దరు నిర్వహించిన శుభకార్యాలకు హాజరు కావడం మినహాయిస్తే రాజకీయంగా ఆయన పూర్తిగా తెరమరుగైపోయారు. ఆయన బీజేపీలో చేరనున్నారని ఆ మధ్యన వార్తలొచ్చాయి. కానీ అదీ జరగలేదు. ఆయన నియోజకవర్గానికి కూడా వెళ్లిన దాఖలాలు లేవు. తానూ హైదరబాదీనే అని చెప్పుకున్న కిరణ్ ఈ రెండేళ్లు దాదాపుగా హైదరబాద్ ఇంటికే పరిమితమయ్యారు. పాత మిత్రులతో పిచ్చాపాటి మాట్లాడుకోవడం తప్ప ఇప్పుడు రాజకీయాలపై ఆయన మక్కువ చూపడం లేదని సన్నిహితులు చెబుతున్నారు. ఇకపోతే, లగడపాటి రాజగోపాల్... సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో నాటకీయ ఫక్కీలో నిమ్స్ ఆస్పత్రిలో చేరి హడావుడి చేసిన ఆయన రాష్ట్రం విడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు చేశారు. అన్నట్టుగానే ఆయన గత ఎన్నికల్లో పోటీ చేయకపోగా, గడిచిన రెండేళ్లుగా ఏ వేదికపైనా కూడా ఆయన కనిపించలేదు. ఆయనతో పాటు విశాఖ మాజీ ఎంపీ సబ్బం హరి, మరో మాజీ ఎంపీ కిల్లి కృపారాణి, మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజులు కూడా ఏ వేదికలపైనా కనిపించడం లేదు. విభజన జరిగితే తమకు రాయల తెలంగాణ కావాలని నినదించిన మాజీ మంత్రులు టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాపరెడ్డి తదితరుల హడావిడి కూడా లేదు. పేరుకు టీడీపీలో చేరినప్పటికీ ఆ పార్టీలో వారికి పెద్దగా పనిలేకుండా పోయింది. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కొనసాగిన శైలజానాథ్ ఆ తర్వాత కిరణ్ ఏర్పాటు చేసిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరి, ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ లో చేరారు. మధ్యలో టీడీపీలో చేరడానికి ప్రయత్నాలు కూడా సాగినప్పటికీ ఫలించలేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆయన అప్పడుప్పుడు మీడియా సమావేశాల్లో కనిపిస్తున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ ఆ రోజుల్లో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నందమూరి హరికృష్ణ ఆ తర్వాత తెరపైన పెద్దగా కనిపించడం లేదు. టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో అసంతృప్తితోనే ఉన్నట్టు చెబుతున్నారు. ఈ రాజకీయ నాయకుల పరిస్థితి ఇలా ఉంటే, సమైక్య ఉద్యమంలో ఉద్యోగ సంఘాల నేతగా ఒక వెలుగు వెలిగిన ఎన్టీవో నేత అశోక్ బాబు రాష్ట్ర విభజన తర్వాత కాలంలో క్రియాశీలంగా లేకపోవడం గమనార్హం. -
కొత్త పార్టీ ఆవశ్యకత ఉంది: సబ్బం హరి
విశాఖపట్నం: సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో పోరాడిన నేతలతో రాష్ట్రంలో కొత్త పార్టీ నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందని అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొందని చెప్పారు. మరో 8 మాసాలు చూసి కొత్త పార్టీ కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. రాష్ట్ర విభజనకు సహకరించిన స్వార్థపరులంతా ఇప్పుడు ముసుగు వేసుకుని కొత్త పార్టీల పేరుతో ప్రజల్లోకి వస్తున్నారని విమర్శించారు. మళ్లీ ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్న అలాంటి నేతలను అడ్డుకోవాలన్నారు. -
జనాలతో ఆడుకుంటారా?
పులివెందుల: తమ ఇష్టం వచ్చిన విధంగా వ్యవహరిస్తూ జనాలతో ఆడుకుంటారా? అని సబ్బం హరిని ఉద్దేశించి వైఎస్ఆర్ సిపి నాయకురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఈ ఉదయం ఆమె తన వదిన భారతితో కలసి పులివెందులలో ఓటు వేశారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మొదటి నుంచి రాష్ట్రం విడిపోదని చెబుతూ వచ్చారని విమర్శించారు. ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు. ఆ తరువాత క్లీన్ బౌల్డ్ అయి చెప్పుల పార్టీ ఒకటి పెట్టారన్నారు. వారికి విశ్వసనీయతలేదని, అందుకే సబ్బం హరి పోటీ నుంచి విరమించుకొని బిజెపికి మద్దతు అంటున్నరని విమర్శించారు. బిజెపి లేకపోతే టిడిపికి మద్దతు అంటారు. ఏమనుకుంటున్నారు వారు? జనంతో ఆడుకుంటారా? అని మండిపడ్డారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసని చెప్పారు. జనం స్పందన బ్రహ్మాండంగా ఉందన్నారు. రాజశేఖర రెడ్డి గారిలో విశ్వసనీయతను చూశారు. అదే విశ్వసనీయతను జగన్మోహన రెడ్డిలో చూస్తున్నారని చెప్పారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వందమందిని వేసుకొచ్చినా ఆయనకు విశ్వసనీయత లేదన్నారు. జనం ఆయనను నమ్మరని చెప్పారు. ఓటర్లు చాలా కసిగా ఉన్నారని, వారు కసిగా ఓటువేస్తారని చెప్పారు. తెలుగుదేశం వారి వద్ద గొట్టం పెడితే 175 స్థానాలు తమవే అంటారు. -
సబ్బంపై రెండు కేసుల నమోదుకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: జై సమైక్యాంధ్ర పార్టీ విశాఖపట్టణం లోక్సభ అభ్యర్థి సబ్బం హరిపై రెండు కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ తెలిపారు. ప్రచారంపై నిషేధం ఉండగా హరి ఒక పార్టీకి ఓటు వేయాలని చెప్పడాన్ని ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్-126 ప్రకారం ఎన్నికల నియమావళి ఉల్లంఘనగా భావించి కేసు నమోదుకు ఆదేశించడంతో పాటు ఆయనకు నోటీసు జారీ చేస్తామని చెప్పారు. హరి మరో పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడంతో ఆయనను డమ్మీ అభ్యర్థిగా పరిగణిస్తామని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం డమ్మీ అభ్యర్థి ఎన్నికల వ్యయాన్ని ప్రధాన అభ్యర్థి ఎన్నికల ఖాతాలో జమ చే యనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అడుక్కుతింటుందా? అని ఓ టీవీ చానల్ ప్రసారం చేయడాన్ని భన్వర్లాల్ తప్పుపట్టారు. గతంలో కూడా ఆ టీవీ చానల్ వాహనంలో అభ్యర్థికి చెందిన సెల్ఫోన్లు దొరికాయని, ఈ రెండు అంశాలపైన కేసు నమోదు చే యడంతో పాటు చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. -
'బీజేపీతో సబ్బంహరికి చీకటి ఒప్పందం'
విశాఖ: విశాఖపట్నం పార్లమెంట్ స్థానంలో పోటి నుంచి తప్పుకున్న జైసమైక్యాంధ్ర అభ్యర్థి సబ్బంహరి పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా నేతలు మళ్ల విజయప్రసాద్, ఫైనాల విజయకుమార్ మండిపడ్డారు. సబ్బం హరి అసత్యాలు మాట్లాడుతున్నారని విశాఖ నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ విమర్శించారు. మహానేత వైఎస్ఆర్ కుటుంబం గురించి తప్పుడు మాటలు సరికాదని ఆయన హితవు పలికారు. బీజేపీతో సబ్బంహరి చీకటి ఒప్పందం చేసుకున్నారని ఉత్తర నియోజకవర్గ పరిశీలకులు ఫైనాల విజయకుమార్ ఆరోపించారు. రెండు పార్టీల నుంచి సస్పెండ్ అయిన సబ్బం హరి ప్రజల మనసు నుంచి కూడా సస్పెండ్ అయ్యారన్నారు. విశాఖ పార్లమెంట్ బరి నుంచి తప్పుకుని బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
'సబ్బం హరిపై కేసు నమోదు చేస్తాం'
హైదరాబాద్: ఒక పార్టీ నుంచి పోటీ చేస్తూ మరో పార్టీకి మద్దతు ప్రకటించడం చెల్లదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ తెలిపారు. సబ్బం హరిపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. అలా మద్దతు ప్రకటించేవారిని డమ్మీ అభ్యర్థులుగా ప్రకటిస్తామన్నారు. డమ్మీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చును మద్దతు ప్రకటించిన అభ్యర్థి ఖర్చులో కలుపుతామని వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా పెట్టిన అన్ని కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో విచారణ చేపడతామన్నారు. ప్రలోభాలతో తాత్కాలికంగా ఎన్నికైనా ఎన్నికల చట్టాల ప్రకారం శిక్ష తప్పదన్నారు. ఓటర్ స్లిప్పులు లేకపోయినా ఓటర్ లిస్ట్లో పేరుంటే ఓటు వేయొచ్చని వివరించారు. ఓటర్ పోలింగ్ బూత్లోకి ఓటర్లు వెళ్లేందుకు పోలీసులు అభ్యంతరం చెప్పకూడదన్నారు. పక్క గ్రామాల నుంచి కూడా పోలింగ్ ఏజెంట్లను నియమించుకోవచ్చని భన్వర్లాల్ తెలిపారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సబ్బం
-
''సబ్బంహరిది రాజకీయ ఆత్మహత్యే'
హైదరాబాద్: జై సమైక్యాంధ్ర పార్టీ విశాఖపట్నం లోకసభ అభ్యర్ధి సబ్బం హరిపై వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డిపద్మ నిప్పులు చెరిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సబ్బంహరి పోటీ నుంచి తప్పుకుని రాజకీయంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు అని వాసిరెడ్డి పద్మ అన్నారు. విశాఖలో బీజేపీ అభ్యర్థి గెలుస్తారంటూ సబ్బంహరి కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆమె అన్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాడానన్న సబ్బంహరి విభజనకు కారకులైన టీడీపీ-బీజేపీలకు మద్దతెలా ఇస్తున్నారని ఘాటుగా ప్రశ్నించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అండ, చలువతో రాజకీయాల్లో చక్రం తిప్పిన సబ్బంహరి వైఎస్ విజయమ్మపై బురద జల్లడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలోనే కాదు చాలా చోట్ల జేఏసీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుని టీడీపీకి సహకరిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. -
బీజేపీ నుంచి ఎన్ని కోట్ల రూపాయలు ముట్టాయి?
విశాఖపట్నం: ఎన్నికల పోలింగ్కు కొన్ని గంటల ముందు విలేకరుల సమావేశం పెట్టిన అనకాపల్లి ఎంపీ సబ్బం హరిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలని విశాఖపట్నం వైఎస్ఆర్ సీపీ అధికారి ప్రతినిధి గుడిమెట్ల రవిరెడ్డి డిమాండ్ చేశారు. సబ్బం హరి పచ్చి అవకాశవాదని విమర్శించారు. బీజేపీ నుంచి సబ్బం హరికి ఎన్ని కోట్ల రూపాయలు ముట్టాయని ప్రశ్నించారు. సమైక్యవాదులంతా సబ్బం హరి తీరును ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనకు బీజేపీ మద్దతిచ్చిన విషయాన్ని మరిచారా అని ప్రశ్నించారు. ఎవరెన్ని కుయుక్తులు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకోలేరని అన్నారు. -
'సబ్బం హరి రాజకీయంగా చచ్చినట్టే'
-
సబ్బం హరి తీరుతో కంగుతిన్న సీపీఎం
విశాఖపట్నం: అనకాపల్లి ఎంపీ సబ్బంహరి వ్యాఖ్యలపై సీపీఎం శ్రేణుల ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమతో పొత్తు పెట్టుకొని బీజేపీ-టీడీపీకి ఓట్లేయమని ఎలా చెబుతున్నారని మండిపడ్డాయి. సమైక్యవాదానికి సబ్బంహరి తూట్లు పొడిచారని విమర్శించాయి. సమైక్యాంధ్రకు కట్టుబడిన సీపీఎం... కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని జై సమైక్యాంధ్ర పార్టీతో సీమాంధ్రలో ఎన్నికల పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా విశాఖపట్నం లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన సబ్బం హరికి సీపీఎం మద్దతు పలికింది. అయితే చివరి నిమిషంలో సబ్బం హరి చేతులెత్తేయడంతో సీపీఎం శ్రేణులు కంగుతిన్నాయి. పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు చివరి నిమిషంలో సబ్బం హరి ప్రకటించడంతో ఆయనపై సీపీఎం శ్రేణులు కారాలు మిరియాలు నూరతున్నాయి. పిరికివాడిలా పోటీ నుంచి తప్పుకోవడమే కాకుండా, ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని అడిగే అధికారం ఆయనకెక్కడిదని ప్రశ్నిస్తున్నాయి. అసలు ఎవరినడిగి పోటీ నుంచి తప్పుకున్నారని నిలదీస్తున్నాయి. -
'ఆయన' నైజాన్ని ప్రజలు ఎప్పుడో గుర్తించారు
విశాఖ : సబ్బం హరిపై అరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి కొత్తపల్లి గీత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనంతో సంబంధం లేని నేత సబ్బం హరి అని అన్నారు. ఫలానా పార్టీకి ఓటెయండంటూ సబ్బం హరి వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అవుతుందని ఆమె అన్నారు. ఆయనపై ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని కొత్తపల్లి గీత డిమాండ్ చేశారు. సబ్బం హరి వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఆయన నైజాన్ని ప్రజలు ఎప్పుడో గుర్తించారని కొత్తపల్లి గీతా అన్నారు. ఎన్నికల్లో ఓటమి భయంత తప్పదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. -
నల్లారికి సబ్బం హరి షాక్
విశాఖపట్నం: మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్ కుమార్ రెడ్డికి అనకాపల్లి ఎంపీ సబ్బం హరి షాక్ ఇచ్చారు. ఎన్నికల పోలింగ్కు ఒక్కరోజు ముందు కిరణ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. జై సమైక్యాంధ్ర పార్టీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైనప్పటి నుంచి సబ్బం హరి... కిరణ్ పంచన చేరారు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టడానికి కారణమైన వారిలో సబ్బం హరి కూడా ఒకరు. ఇప్పుడు ఆయనే పార్టీని వీడారు. ఇంతకుముందు కిరణ్ వెంట నడిచిన పితాని సత్యనారాయణ, ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేష్ తర్వాత తమదారి తాము చూసుకున్నారు. ఈ ముగ్గురు నాయకులు టీడీపీలో చేరి కిరణ్కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. తాజాగా సబ్బం హరి కూడా కిరణ్ను వీడారు. పోలింగ్ ఒక రోజు ముందు మీడియా ముందుకు వచ్చిన సబ్బం హరి... పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అనారోగ్యం కారణంగానే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. సబ్బం హరి ఇచ్చిన షాక్ నుంచి కిరణ్ ఎలా కోలుకుంటారో చూడాలి. -
'సబ్బం హరి పిల్లి మొగ్గలు!'
విశాఖ : జై సమైక్యాంధ్ర పార్టీ కీలక నేత, విశాఖ ఎంపీ అభ్యర్థి సబ్బం హరి పిల్లి మొగ్గలు వేస్తున్నట్లు తెలుస్తోంది. పోలింగ్కు మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న సమయంలో ఆయన పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు లీకులు ఇస్తున్నారు. డిపాజిట్ కూడా రాదనే భయంతోనే సబ్బం హరి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాగా మాచర్ల, వినుకొండ, నర్సరావుపేట, చిలకలూరిపేట అసెంబ్లీ స్థానాలకు బరిలోకి జై సమైక్యాంధ్ర పార్టీ(జేఎస్పీ) అభ్యర్థులు పచ్చ కండువా కప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో వారు సోమవారం టీడీపీలో చేరారు. అక్కడితో ఆగకుండా తమ పార్టీ ఓట్లు టీడీపీకి వేయిస్తామంటూ జేఎస్పీ అభ్యర్థులు ప్రకటించడం గమనార్హం. ఇక జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఏకంగా ఎన్నికల బరి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. సబ్బం హరి, జై సమైక్యాంధ్ర, విశాఖ ఎంపీ, జేఎస్పీ, కిరణ్ కుమార్ రెడ్డి, sabbam Hari, jai samaikyandhra, visakha mp condidate, JSP, kiran kumar reddy -
'సబ్బం హరి పిల్లి మొగ్గలు!'
-
12 నుంచి జై సమైక్యాంధ్ర పార్టీ ప్రచారం
విశాఖపట్నం: జై సమైక్యాంధ్ర పార్టీ ఈనెల 12 నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనుందని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, ఎంపీ సబ్బం హరి తెలిపారు. గురువారం విశాఖపట్నం సీతమ్మధారలోని తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రచార వ్యవస్థను తొలిసారిగా ఉపయోగిస్తున్నామని చెప్పారు. సీపీఎంతో కలసి ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తమ పార్టీ తెలంగాణలో 35, సీమాంధ్రలో 175 స్థానాల్లో తమ పార్టీ బరిలో ఉంటుందని వెల్లడించారు. టీడీపీ, వైఎస్సార్సీపీ ఇస్తున్న హామీలకయ్యే ఖర్చు వార్షిక బడ్జెట్పై ఏవిధంగా భారంకానుందనే విషయాన్ని పట్టిక రూపంలో రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్తామని వివరించారు. తమ పార్టీ తరఫున విశాఖ, విజయనగరం లోక్సభ స్థానాల నుంచి పోటీ చేయాలనే ఆలోచన ఉందన్నారు. ఒకవేళ అసెంబ్లీకి పోటీ చేయాల్సి వస్తే విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంటానని చెప్పారు. -
కాంగ్రెస్కు 5 శాతం ఓట్లు కూడా రావు : సబ్బం హరి
విశాఖపట్నం: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయి, ఓట్ల కోసం ఆ పార్టీలు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని జై సమైక్యాంధ్ర పార్టీ నేత, ఎంపీ సబ్బం హరి దుయ్యబట్టారు. విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ విభజన పిటిషన్పై న్యాయస్థానం జోక్యం చేసుకోవడం ద్వారా రాష్ట్రం విడిపోదనే నమ్మకం ఇప్పటికీ ఉందన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్కు ఆంధ్రప్రదేశ్లో 5% ఓట్లు కూడా రావన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన పార్టీపై తనకు ప్రత్యేకంగా అభిప్రాయం లేదని, అయినా విభజనకు ముందే వవన్ స్పందించి ఉంటే బాగుండేదన్నారు. -
'ఆవగింజంత అవకాశం కూడా వదలకుండా పోరాడాం'
ఆంధ్రప్రదేశ్ విభజనపై పార్లమెంట్లో బీజేపీ అనుసరించిన వైఖరిపై అనకాపల్లి ఎంపీ సబ్బం హరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఉదయంఆయన విశాఖపట్నంలో విలేకర్లతో మాట్లాడుతూ... బిల్లు ఆమోదంలో లోక్సభలో ఒక విధంగా, రాజ్యసభలో మరోలా వ్యవహారించిందని ఆయన బీజేపీ తీరును ఎండగట్టారు. విభజన బిల్లు కాంగ్రెస్ - బీజేపీ చీకటి ఒప్పందంలో భాగమేనని ఆయన ఆరోపించారు. భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా బిల్లును తీసుకువచ్చారని విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తుది వరకు పోరాటం చేసింది ఎవరో రాష్ట్ర ప్రజలుకు తెలుసన్నారు. అలాంటివారినే రానున్న ఎన్నికల్లో ప్రజలు పట్టం కడతారన్నారు. ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచే క్రమంలో ఆవగింజ అంత అవకాశం కూడా వదులు కోకుండా పోరాడామని సబ్బం హరి ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
కిరణ్ కొత్త పార్టీ
* ఎట్టకేలకు ప్రకటించిన మాజీ సీఎం * 12న రాజమండ్రి సభలో పార్టీ పేరు, విధానాల ప్రకటన * తెలుగుజాతి ఆత్మగౌరవ పరిరక్షణే లక్ష్యం * కిరణ్ వెంట నలుగురు కాంగ్రెస్ బహిష్కృత ఎంపీలు, ఓ మాజీ మంత్రి సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఎట్టకేలకు కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈనెల 12న రాజమండ్రి బహిరంగ సభలో కొత్తపార్టీ పేరు, విధానాలు ప్రకటిస్తామన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవ పరిరక్షణ కోసమే పార్టీ పెడుతున్నామని, పార్టీలోకి అందరినీ ఆహ్వానిస్తున్నామని పిలుపునిచ్చారు. కిరణ్కుమార్రెడ్డి గురువారం తన ప్రైవేటు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కొత్త పార్టీ గురించి ప్రకటన చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ బహిష్కృత ఎంపీల్లో కేవలం నలుగురు (లగడపాటి రాజగోపాల్, సబ్బంహరి, సాయిప్రతాప్, హర్షకుమార్), మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీ రెడ్డపరెడ్డి మాత్రమే ఉన్నారు. కిరణ్ చెప్పిన మాటలు నమ్మి సొంతపార్టీని వీడి ఆయన వెంట నడిచిన నాయకులు తమ పరిస్థితి ఎటూ కాకుండాపోతోందని ఒత్తిడిచేయడంతో ఎట్టకేలకు పార్టీ ఏర్పాటుకు నిర్ణయించారని తెలుస్తోంది. ఆయనేమన్నారంటే... * రాష్ట్ర విభజన ద్వారా తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్, బీజేపీలు దెబ్బతీశాయి. బిల్లు రూపొందించిన తీరు, పార్లమెంటులో అప్రజాస్వామికంగా ఆమోదించిన విధానం సిగ్గుచేటు. * అధికార దాహంతోనే టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేశాయి. ఇద్దరూ విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చారు. బాబు, జగన్లకు సీఎం పదవిలోకి ఏదోవిధంగా రావాలన్నదొక్కటే లక్ష్యం. * పురుడుపోసి తల్లిని చంపేశారని మోడీ చెబుతున్నారు. నలుగురు ఎంపీలు పోడియంలోకి వెళ్తే హృద యం గాయపడింద ని ప్రధాని అంటున్నారు. కానీ వీరెవ్వరూ తెలుగు ప్రజల గుండెకు తగిలిన గాయం గురించి ఆలోచించలేదు. * ప్రస్తుతం ఎన్నికల సంఘం కొత్తగా ‘నోటా’ (పైవారెవ్వరూ కాదు అన్న ఆప్షన్) పెడుతున్నందున రాష్ట్ర ప్రజలంతా ఆయా పార్టీలకు కాకుండా నోటాపై ఓటువేసే ఉద్దేశంతో ఉన్నారు. అలాంటి వారందరికీ విన్నవిస్తున్నాను. మీ ఆలోచనల మేరకు నడిచే, మీ ఆత్మగౌరవాన్ని పరిరక్షించేందుకు కొత్త పార్టీ పెడుతున్నాం. ‘నోటా’కు బదులుగా మాకు ఓటేయండి. * రాజమండ్రి బహిరంగసభలో పార్టీపేరు, విధానాలు, అధ్యక్షుడితోపాటు అన్ని విషయాలూ చెబుతాం. సీమాంధ్రతోపాటు, తెలంగాణలోని అన్ని స్థానాల్లో పోటీచేస్తాం. * నా జీవితం తెరచిన పుస్తకం. నాపై ఆరోపణలు చేస్తున్నవారు ఆధారాలు చూపించాలని సవాల్ విసురుతున్నాను. నేను చేసిన ప్రతి నిర్ణయం చట్టం, నిబంధనల ప్రకారమే జరిగింది. గవర్నర్కే కాదు ఎక్కడైనా ఫిర్యాదులు ఇచ్చుకోనివ్వండి. నన్నెవరూ ఏమీ చేయలేరు. * సీఎం నిర్ణయాలు తిరగదోడేందుకు గవర్నర్ ఎవరు? వచ్చే ప్రభుత్వాలు తిరగదోడొచ్చేమో కానీ గవర్నర్ ఎవరు? తిరగదోడితే మాత్రం ఏమవుతుంది? ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటే మంచిది. * రాష్ట్ర విభజనపై నేను సుప్రీంకోర్టును ఆశ్రయించా. ఏమవుతుందో చూడాలి. మాకు అన్ని పార్టీలూ ప్రధాన పోటీదారులే. * ఒకప్పుడు వేర్వేరుగా ఉన్న ఉభయ జర్మనీ దేశాలు గోడలు పగులకొట్టి మరీ ఏకంకాలేదా? ఇక్కడ అలా గోడలు కూడా లేవు కదా? -
'కిరణ్ ఫోన్ చేసినందునే... భేటీకి'
హైదరాబాద్ : కొత్త పార్టీ ఏర్పాటుపై ఇప్పుడే చెప్పలేమని... మరో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని కాంగ్రెస్ బహిష్కృత ఎంపీ సబ్బం హరి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం కాంగ్రెస్ బహిష్కృత ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొత్త పార్టీ పెట్టాలా, వద్దా అనే అంశంతో పాటు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనట్లు తెలుస్తోంది. ఈ భేటీకి ముందు అనంతరం సబ్బం హరి మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసినందునే సమాశానికి హాజరు అవుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జాతీయ పార్టీల ప్రభావతం తగ్గినట్లు కనిపిస్తోందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని, మూడో ప్రాంతీయ పార్టీగా వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేమన్నారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాలను పూర్తిగా అంచనా వేస్తామన్నారు. ఈ భేటీకి సబ్బం హరి, రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, సాయిప్రతాప్, హర్షకుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్, మంత్రులు పితాని సత్యనారాయణ, శైలజానాథ్, పార్థసారధి తదితరులు హాజరు అయ్యారు. మరోవైపు కిరణ్కుమార్రెడ్డి తన రాజకీయ భవితవ్యంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కొత్త పార్టీ పెట్టాలా, వద్దా... పెడితే తనతో పాటు ఎంతమంది ఉంటారు... ప్రజలు ఆదరిస్తారా, లేదా అన్న మీమాంస మధ్య గత రెండు రోజులుగా ఆయన తన సన్నిహితులతో ముమ్మరంగా మంతనాలు జరుపుతున్నారు. -
టికెట్ కోసమే స్పీకర్ అలా చేసి ఉంటారు: సబ్బం హరి
పార్లమెంటులో స్పీకర్ మీరాకుమార్ వ్యవహరించిన తీరు విచారకరమని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి వ్యాఖ్యానించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తనకు మళ్లీ టికెట్ ఇవ్వదనే భయంతోనే ఆమె అలా ప్రవర్తించి ఉంటారన్నారు. తనపై వ్యూహాత్మకంగానే దాడి జరిగిందని సబ్బం హరి అన్నారు. లగడపాటి రాజగోపాల్ వెంటన ఎప్పుడూ పెప్పర్ స్ప్రే ఉంటుందని, అదేదో విషవాయువు అన్నట్లు, మారణాయుధం అన్నట్లు చిత్రీకరించడం తగదని తెలిపారు. సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్ కాంగ్రెస్ పార్టీ పన్నిన కుట్రలో భాగమేనని, పార్లమెంటు సీసీ టీవీ ఫుటేజిని తాము త్వరలోనే మీడియా ముందు ఉంచుతామని సబ్బం హరి తెలిపారు. -
సస్పెన్షన్ ఎత్తి వేయండి: లగడపాటి, సబ్బం
తమపై విధించిన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని విజయవాడు ఎంపీ లగడపాటి రాజగోపాల్, అనకాపల్లి ఎంపీ సబ్బం హరి లోక్సభ స్పీకర్ మీరాకుమార్ను డిమాండ్ చేశారు. శుక్రవారం మీరాకుమార్కు ఆ ఇద్దరు ఎంపీలు ఈ మేరకు లేఖలు రాశారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ లోక్సభ వెల్లోకి 100 మంది ఎంపీలు దూసుకొస్తే మమ్మల్ని మాత్రమే సస్పెండ్ చేశారని వారు ఆరోపించారు. ఇది పక్షపాత ధోరణి కాదా అని వారు రాసిన లేఖలో స్పీకర్ మీరా కుమార్ను ప్రశ్నించారు. -
మమ్మల్ని అడ్డుకునే వారుండరు: సబ్బం హరి
హైదరాబాద్: తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం అవకాశం కల్పించిందని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు. విభజన బిల్లును అడ్డుకోవడం, వ్యతిరేకించి ఓటు వేసే అవకాశం కల్పించి కాంగ్రెస్ తమకు మేలు చేసిందని వ్యాఖ్యానించారు. ఇక తమను అడ్డుకునేవారు ఉండరని అన్నారు. తమను పార్టీ నుంచి బహిష్కరించగలరు కానీ పార్లమెంట్ తప్పించలేరని అన్నారు. పార్లమెంట్లో తమ వాణి వినిపించకుండా ఆపలేరన్నారు. ప్రతిపక్షాలకు సమాధానం చెప్పుకునేందుకే కాంగ్రెస్ తమను బహిష్కరించిందని ఆరోపించారు. వచ్చే 15 రోజులు తెలంగాణ బిల్లు పార్లమెంట్కు రాకుండా చూడడమే తమ లక్ష్యమని వెల్లడించారు. ఈనెల 21 తర్వాత సీమాంధ్రలో కాంగ్రెస్ బీఫారం తీసుకునేవారుండరని చెప్పారు. ఈనెల 24న ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందని వెల్లడించారు. 24 తర్వాత తమతో పాటు పలువురు ఎంపీలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. -
సిగ్గులేకుండా ఇంకా కాంగ్రెస్లో ఎందుకు కొనసాగుతున్నారు?:షర్మిల
ఇడుపులపాయ: సబ్బం హరి గారు సిగ్గులేకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఇంకా ఎందుకు కొనసాగుతున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల ప్రశ్నించారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ప్రజా ప్రస్థానం పేరుతో జరుగుతున్న పార్టీ రెండవ ప్లీనరీలో ఆమె ప్రసంగించారు. హరితోపాటు మరో ప్రబుద్దుడు కనుమూరు రఘురామ కృష్ణం రాజు సమైక్యాంధ్ర కోసం జగనన్న చిత్తశుద్దితో పోరాటం చేయడంలేదని అంటున్నారు. ఈ రాష్ట్రంలో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా సమైక్య రాష్ట్రం కోసం ఎవరు పోరాడుతున్నారో చెబుతారన్నారు. జగనన్న పోరాడుతున్నారో లేక కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పోరాడుతున్నారో చెబుతారన్నారు. సమైక్య రాష్ట్రం కోసం విజయమ్మ, జగనన్న, సీమాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 175 మంది కోఆర్డినేటర్లు నిరాహార దీక్ష చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సిగ్గులేకుండా రాష్ట్రాన్ని విడదీయాలనుకుంటున్న బిజెపిలో ఎందుకు చేరారు? అని రఘురామ కృష్ణం రాజును ఆమె ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విడదీస్తున్నంది సోనియా గాంధీ - సహకరిస్తున్నది కిరణ్ కుమార్ రెడ్డి - దానికి సహకరిస్తూ లేఖ రాసింది చంద్రబాబు నాయుడు.. ఈ విషయాలు రాష్ట్రంలో అందరికీ తెలుసన్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తమపై లేనిపోని తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. చిన్నాన్న సుబ్బారెడ్డిని, తనను జగనన్న తొక్కేస్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. తన తరపున కూడా సమాదానం చెప్పమని చిన్నాన్న చెప్పారన్నారు. ఆ సమయంలో సుబ్బారెడ్డి ఆమె పక్కనే నిలబడ్డారు. తనని, చిన్నాన్నను ఎంపిగా పోటీ చేయమని ఎప్పుడో అడిగారని చెప్పారు. తన అభిప్రాయాన్ని టివి ఇంటర్వ్యూలో కూడా స్పష్టం చేసినట్లు ఆమె తెలిపారు. -
విభజనను ఆపే శక్తి బీజేపీకే ఉంది: సబ్బం హరి
రాష్ట్ర విభజనను ఆపే శక్తి భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని అనకాపల్లి లోక్సభ సభ్యుడు సబ్బం హరి స్పష్టం చేశారు. బుధవారం విజయవాడలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సబ్బం హరి ప్రసంగించారు. ఓట్లు, సీట్లు కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేస్తుందని ఆయన ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లలోపే వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వల్లే రాష్ట్ర విభజన ప్రక్రియ ఆలస్యమైందని అన్నారు. -
'జగన్పై విషం కక్కుతున్న సబ్బం హరి'
-
జగన్పై విషం కక్కుతున్న సబ్బం హరి:ఎంపి మేకపాటి
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిపై కాంగ్రెస్ ఎంపి సబ్బం హరి విషం కక్కుతున్నారని ఆ పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి విమర్శించారు. గతంలో వైఎస్ ఓడిపోతారని అనేక సర్వేలు చెప్పాయని, కాని వాస్తవం ఏంటో ప్రజలకు తెలుసన్నారు. రాజకీయ ఆటలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన జరగదని తాము నమ్మకంతో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి వైఎస్ జగన్ అనేక ప్రయత్నాలు చేశారని చెప్పారు. మూడుసార్లు రాష్ట్రపతిని కలినట్లు తెలిపారు. నితీష్కుమార్, మమతాబెనర్జీ, నవీన్పట్నాయక్, జయలలిత, కరుణానిధి, శరద్పవార్, ప్రకాష్ సింగ్ బాదల్ సహా పలువురు నేతలను జగన్ కలిశారని మేకపాటి వివరించారు. జగన్ టార్గెట్గా రాష్ట్ర విభజన ప్రక్రియ చేపట్టారన్నారు. జగన్కు రాజకీయంగా ప్రతిబంధకాలు సృష్టించడానికే కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోందని చెప్పారు. విభజనకు లేఖ ఇచ్చిన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికీ వెనక్కి తీసుకోలేదన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మనసా, వాచా కోరుకునే వ్యక్తి జగన్ అని ఆయన స్పష్టం చేశారు. ---------------------------------------------------------------- -
బీజేపీ నేతల్లో మార్పు శుభపరిణామం: సబ్బంహరి
సాక్షి,విశాఖపట్నం: బీజేపీలో మార్పు శుభపరిణా మని అనకాపల్లి ఎంపీ సబ్బంహరి అన్నారు. విశాఖలో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు అన్ని పార్టీలూ రాజకీయలబ్ధి కోసమే ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. యూపీఏకు పార్లమెంటులో మెజార్టీ లేదు. బిల్లుపై నిర్ణయం తీసుకునే బలం లేదు. బీజేపీ మద్దతిస్తుం దనే నమ్మకంతో యూపీఏ తెలంగాణపై ముందకెళుతోందన్నారు. అయితే బీజేపీ వైఖరి తాజాగా ఆ పార్టీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్తో తేలిపోయిందని, ఆ పార్టీ నేతలు రాజ్నాథ్సింగ్, నరేంద్రమోడి కూడా ఈ విభజన ప్రతిపాదనలు రాజకీయ లబ్ధికోసమే చేశారని అంగీకరించారని చెప్పారు. ఇదే సమావేశంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్పై పలు విమర్శలు చేశారు. తన దిష్టిబొమ్మలు తగుల బెట్టడం వంటివి చేస్తున్నారని, తాను కూడా ఆ పని చేయగలనని సబ్బం అన్నారు. ‘దిష్టిబొమ్మలు తగులబెట్టే కార్యక్రమాన్ని ఔట్సోర్సింగ్కు ఇచ్చేస్తాను. 175 నియోజకవర్గాల్లో నీ దిష్టి బొమ్మలు తగలబెడతాను’ అని ఆయన పేర్కొన్నారు. ప్రెస్మీట్ పెట్టి ఎవరిపైనైనా చెడుమాట్లాడే అలవాటు తనకు లేదంటూనే ఆయన విమర్శలు కొనసాగించారు. -
మీ కళ్లు బైర్లు కమ్మాయా?: వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్:'కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చేసిన ప్రతి తప్పులో మీరు భాగస్వాములు కాదా?, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని నిలవదీయలేని మీరు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారా?, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం జగన్, విజయమ్మలు చేసిన దీక్షలు మీకు కనిపించలేదా?, కళ్లు బైర్లు కమ్మాయా?, కాంగ్రెస్ విసిరే కుక్క బిస్కెట్లకు ఎగబడే మీరా?మమ్ముల్ని విమర్శించేది' అని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సీమాంధ్ర ఎంపీలపై మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డిపై అనకాపల్లి ఎంపీ సబ్బం హరి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్ర సమైక్యత కోసం ఆ ప్రాంత ఎంపీ హోదాలో ఉన్న సబ్బం హరి ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. అసలు వైఎస్ జగన్ కు సలహాలు ఇచ్చే అర్హత ఉందా?అని నిలదీశారు. కాంగ్రెస్ చేస్తున్న ప్రతి తప్పులో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు భాగస్వాములేనని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యం ఉంచడం కోసం వైఎస్ జగన్, విజయమ్మ చేసిన దీక్షలు కనబడలేదా?అని ఆమె ప్రశ్నించారు. -
సోనియా ఏజెంట్గా సబ్బంహరి పనిచేస్తున్నారు:వాసిరెడ్డి
-
రాజకీయ లబ్ధికోసమే విభజన : సబ్బం హరి
హైదరాబాద్: కేంద్రం రాజకీయ లబ్ధికోసమే రాష్ట్ర విభజన చేస్తోందని అనకాపల్లి ఎంపీ సబ్బంహరి వ్యాఖ్యానించారు. సమైక్య ముసుగులో అన్నీపార్టీలు రాజకీయం చేస్తున్నాయని సబ్బం విమర్శించారు. ఆదివారమిక్కడ ఏపీ ఏపీ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభజనే వద్దనుకున్నప్పుడు ఏం కావాలో అడిగే పరిస్థితి రాదని అన్నారు. విభజన అంశంపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా చర్చలో పాల్గొనాలని సబ్బం హరి తెలిపారు. కాగా, ఈ సమావేశానికి ఆయనతోపాటు ఎంపీ అమలాపురం కాంగ్రెస్ ఎంపీ జివి హర్షకుమార్, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావులు హాజరైయ్యారు. -
విభజనకు ఏ ఒక్క ఎంపీ సిద్ధంగా లేరు: సబ్బం హరి
రాష్ట్ర విభజనకు సీమాంధ్రకు చెందిన ఏ ఒక్క పార్లమెంట్ సభ్యుడు అనుకూలంగా లేరని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు. ఢిల్లీలో జరగుతున్న రాజకీయ క్రీడకు తెలుగు ప్రజలు బలయ్యారని ఆయన పేర్కొన్నారు. బిల్లుపై అసెంబ్లీలో కచ్చితంగా చర్చ జరగాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అబిడ్స్లోని ఏపీఎన్జీవో భవన్లో శనివారం జరిగిన రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయంపై రాష్ట్రపతి ప్రణబ్ మరో సారి పునరాలోచన చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఐక్యత కోసం ఏపీఎన్జీవోలు చేసే పోరాటంలో అన్ని పార్టీలు సహయ సహకారాలు అందించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర మంత్రి ఎస్.శైలజానాథ్ వెల్లడించారు. భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలకు హాజరై సమైక్య నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏపీఎన్జీవోలు గతంలో చేసిన 66 రోజుల ఉద్యమంతో కేంద్రానికి ముందల కాళ్లకు బంధం వేసిన సంగతిని ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవు గుర్తు చేశారు. పదవుల్లో కొనసాగుతున్న కేంద్రమంత్రులు తమ మనస్సులను మార్చుకోవాలని ఆయన వారికి హితవులు పలికారు. టి. బిల్లు వ్యతిరేకించే విషయంలో అన్ని పార్టీలు కలిసి కట్టుగా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆ సమావేశానికి వివిధ పార్టీలకు చెందిన రాజ్యసభ, లోక్ సభ సభ్యులతోపాటు రాష్ట్ర మంత్రులు, వివిధ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. -
తెలంగాణ బిల్లు సభలోకి రానివ్వకుండా చేయగలిగాం
న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును రానీవ్వకుండా చేయగలిగామని కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి అన్నారు. లోక్సభ వాయిదా అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకిస్తూ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి 70-80మంది సభ్యులు మద్దతు ఉందన్నారు. స్పీకర్ ముందు అనేక విషయాలను లేవనెత్తామని సబ్బం హరి తెలిపారు. ప్రజలు జరుగుతున్న విషయాన్ని చూస్తున్నారని ఆయన అన్నారు. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళతామని .... విభజనపై కేంద్ర వైఖరిని వారికి తెలియచేస్తామని సబ్బం హరి తెలిపారు. కాగా లోక్సభలో ఈరోజు లోక్పాల్ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేశారు. దాంతో సోనియా వారిపై అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు ఇలా జరుగుతుందంటూ ఆమె....కేంద్రమంత్రి కమల్నాథ్ను ప్రశ్నించారు. ఎంపీలు సబ్బం హరి, ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్ నినాదాలు చేశారు. సీమాంధ్ర ఎంపీల నినాదాల మధ్యే లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందింది. -
కాంగ్రెస్ ఎంపిల అవిశ్వాసం ఉపసంహరణ
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎంపిలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీస్ను ఉపసంహరించుకున్నారు. తాము వ్యూహాత్మకంగానే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకున్నట్లు కాంగ్రెస్ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి చెప్పారు. రోజుకు ఒక్కొక్కరి చొప్పున అవిశ్వాస నోటీస్ ఇస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించటంతో ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు సొంత పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ లోక్సభ స్పీకర్కు నోటీసు అందించిన విషయం తెలిసిందే. ఎంపీలు రాయపాటి సాంబశివ రావు, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్ కుమార్, ఎ.సాయి ప్రతాప్, లగడపాటి రాజగోపాల్, జి.వి.హర్షకుమార్లు ఆ నోటీస్పై సంతకం చేశారు. సీమాంధ్ర ప్రాంతం నుంచి కాంగ్రెస్కు మొత్తం 19 మంది లోక్సభ సభ్యులు ఉండగా, వారిలో ఆరుగురు మాత్రమే నోటీసుపై సంతకాలు చేశారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు సహా మిగతా లోక్సభ సభ్యులు ‘అవిశ్వాసం’పై స్పందించలేదు. అవిశ్వాసం కోసం అని రాజీనామాలు ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు ఏకంగా అవిశ్వాసం కూడా ఉపసంహరించుకున్నారు. ఈ రోజు తమకు తగిన సంఖ్యాబలం లేదని, అందువల్ల అవిశ్వాసం ఉపసంహరించుకున్నట్లు లగడపాటి చెప్పారు. రోజుకు ఒక్కొక్కరం అవిశ్వాస నోటీసు ఇస్తామన్నారు. -
యూపీఏ పలాయనం చిత్తగించింది: సబ్బం హరి
-
యూపీఏ పలాయనం చిత్తగించింది: సబ్బం హరి
న్యూఢిల్లీ : అవిశ్వాస తీర్మానంపై యూపీఏ సర్కార్ పలాయనం చిత్తగించిందని కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి వ్యాఖ్యానించారు. లోక్సభ వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానానికి సభలో తమకు మద్దతు ఉందని తెలిసే... ప్రతిపక్షాలతో కలిసి కాంగ్రెస్ కుట్ర పన్నుతోందన్నారు. సభ సజావుగా జరిగేందుకు కాంగ్రెస్ సహకరించటం లేదని సబ్బం హరి అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు తమకు స్పష్టమైన మద్దతు ఉందని.. అది తెలిసే చర్చ జరగకుండా ఉండేందుకు సభలో గందరగోళం సృష్టిస్తోందని ఆయన విమర్శించారు. అంతే కాకుండా అవిశ్వా తీర్మానంపై చర్చ జరగకుండా పార్లమెంట్ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం ప్రొరోగ్ చేయాలనుకుంటున్నట్లు సబ్బం హరి ఆరోపించారు. తమను సస్పెండ్ చేసినా వెనకాడేది లేదని...తాము ఎవరికీ అమ్ముడు పోలేదన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పోరాడుతున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తమను సస్పెండ్ చేసేందుకు సర్వాధికారాలు ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రాంత నేతలు చేసిన వ్యాఖ్యలపై సబ్బం హరి మాట్లాడేందుకు నిరాకరించారు. -
ప్రభుత్వంపై సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల అవిశ్వాసం
న్యూఢిల్లీ: సొంత ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం పెట్టాలని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించారు. ఈ మేరకు స్పీకర్ లోక్సభ మీరా కుమార్కు నోటీసు అందజేశారు. 190 నింబంధన కింద స్పీకర్ మీరా కుమార్కు నోటీయిచ్చారు. అవిశ్వాస తీర్మానంపై ఉండవల్లి అరుణ్ కమార్, సబ్బం హరి, లగడపాటి రాజగోపాల్, సాయిప్రతాప్, హర్షకుమార్, రాయపాటి సాంబశిరావు సంతకాలు చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశమైన సీమాంధ్ర ఎంపీలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని స్పీకర్కు స్వయంగా నోటీసు అందజేసినట్టు ఎంపీ సబ్బం హరి తెలిపారు. అవిశ్వాస తీర్మానానికి 55 మంది మద్దతు ఉంటే తప్పనిసరిగా చర్చకు అనుమతించాల్సివుంటుందని తెలిపారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఏం నిర్ణయం తీసుకున్నారో తనకు తెలియదన్నారు. అవిశ్వాసం పెట్టాలంటే పార్లమెంట్ సభ్యత్వం ఉండాలని ఆయన చెప్పారు. అందుకే ఇంతకుముందు చేసిన రాజీనామాలను ఉపసంహరించుకున్నట్టు తెలిపారు. విభజన విషయంలో పార్టీగానీ, ప్రభుత్వం గానీ నైతికంగా వ్యవహరించలేదని విమర్శించారు. విభజనను అడ్డుకునేందుకు సీఎం తమకు అండగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్కు వచ్చి ఆమోదం పొందేంత వరకు అడ్డుకునేందుకు తాము ప్రయత్నాలు చేస్తుంటామన్నారు. విభజనకు వ్యతిరేకంగా అవగింజ అంత అవకాశం దొరికినా ముందుకు వెళతామన్నారు. సమైక్యాంధ్రే తమ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. తమను అనుమానించొద్దని సబ్బం హరి కోరారు. -
సబ్బం హరి, సాయి ప్రతాప్ రాజీనామా
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యులు సబ్బం హరి, సాయి ప్రతాప్ తమ రాజీనామా లేఖలను లోక్సభ జనరల్ సెక్రెటరీకి అందజేశారు. అనంతరం సాయిప్రతాప్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రక్రియ ఆలోచన లేకుండా చేసిందన్నారు. ప్రజా ఉద్యమం ద్వారానే తాము కూడా సమైక్యాంధ్ర కోరుతున్నట్లు చెప్పారు. రాజకీయ అంశాల ద్వారానే విభజనను ఆపాలన్నారు. -
కాంగ్రెస్కు కోవర్టు హరి
నక్కపల్లిన్యూస్లైన్: ‘జగన్పక్షాన చేరిన అనకాపల్లి ఎంపీ సబ్బం హరి కాంగ్రెస్ పార్టీకి కోవర్టుగా మారారు. రెండు పడవలపై ప్రయాణం ద్వారా పబ్బం గడుపుకొంటున్నారు.’ అని డీసీసీబీ మాజీ డెరెక్టర్ వీసం రామకృష్ణ విమర్శించారు. ఆయన విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం సరైనదేనని వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన నక్కపల్లి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డిపైన, వైఎస్ కుటుంబంపైన నిజంగా అభిమానం ఉంటే హరి తన ఎంపీ పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. పార్టీకి చెందిన15 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ రాజీనామా చేసినప్పుడే హరి కూడా పదవిని వదులుకుని ఉంటే జగన్ అభిమానులంతా ఆనందించేవారన్నారు. రాజీనామా చేయకుండా తాను జగన్ పక్షాన ఉంటానని, ఆయన రాజీనామా చేయమంటే చేస్తానని చెబుతూ మోసం చేశారని చెప్పారు. ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా యూపీఏకి మద్దతు విషయంలో తన అభిప్రాయాన్ని జగన్ అభిప్రాయంగా ప్రకటించి కార్యకర్తలను గందర గోళానికి గురిచేశారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే దానిపై తర్వాత ఆలోచిస్తామని మాత్రమే జగన్ అన్నారని, ఫలానా పార్టీకి మద్దతు ఇస్తామని జగన్ ఏనాడూ చెప్పలేదన్నారు. హరి విషయంలో తమపార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి కార్యక ర్త స్వాగతిస్తున్నారని చెప్పారు. నాయకులెవరైనా అధినేత ఆదేశాల కనుగుణంగానే నడచుకోవాలని చెప్పారు. క్రమశిక్షణ తప్పిన వారికి ఇదే పరిస్థితి ఎదురవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు. -
'సబ్బం హరి మా పార్టీ వ్యక్తి కాదు'
విశాఖ: అనకాపల్లి ఎంపీ సబ్బం హరి తమ పార్టీ వ్యక్తి కాదని వైఎస్సార్ సీపీ నేత సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు. సబ్బం హరి వైఎస్సార్ సీపీపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సబ్బం వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నారు. వైఎస్సార్ సీపీ పార్టీ కోసం వ్యాఖ్యానించాల్సిన అవసరం సబ్బం హరికి లేదని రంగారావు తెలిపారు. ఎవరైనా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను అనుసరించాల్సిందేనని సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎంతో బలంగా ఉందన్న విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. అక్టోబర్ 1, 2వ తేదీల్లో విస్తృత సమైక్యాంధ్రకు మద్దతుగా పార్టీ కార్యక్రమాలు ఉంటాయన్నారు. అంతకుముందు సబ్బం వ్యాఖ్యలపై శోభా నాగిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై సబ్బం హరి చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయనకు తమ పార్టీలో సభ్యత్వం లేదని, ఎలాంటి బాధ్యతలు లేవని స్పష్టం చేశారు. ఆయన పార్టీలోకి రావాలనుకున్నారని కానీ కాంగ్రెస్ కుట్రలో భాగంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. సబ్బం హరి వ్యాఖ్యలు తమ పార్టీ అధ్యక్షుడు జగన్ సహా తామందరినీ బాధించాయని తెలిపారు. -
సబ్బం హరికి వైఎస్సార్ సీపీతో సంబంధం లేదు: శోభా నాగిరెడ్డి
-
బాబు 'సమైక్య' లేఖపై జగన్ సంతకం: శోభ
హైదరాబాద్: వైఎస్ జగన్ మీద బురదజల్లే బదులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంపై దృష్టిపెట్టాలని చంద్రబాబు, రాజగురువులకు వైఎస్సార్ కాంగ్రస్ పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి కోరారు. సమైక్యం కోసం చంద్రబాబు ఏకవాక్య లేఖ ఇచ్చినా... సంతకం పెట్టడానికి వైఎస్ జగన్ సిద్ధమని ఆమె ప్రకటించారు. వైఎస్సార్సీపీ లేదా జేఏసీ ఇచ్చే సమైక్య లేఖపై సంతకానికి చంద్రబాబు సిద్ధమా అని సూటిగా అడిగారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంలో వైఎస్సార్సీపీ ఏ అడుగు వేసినా దాన్ని చంద్రబాబు తప్పుబడుతున్నారని, ఎవరు దొంగలో తేల్చాల్సిన సమయం వచ్చిందని శోభానాగిరెడ్డి అన్నారు. సమైక్యకోసం రాసిన లేఖపై సంతకానికి... చంద్రబాబు, కిరణ్, బొత్స సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. టీడీపీని దెబ్బతీయడానికి ఎవరో కుట్రచేయాల్సిన అవసరంలేదని, చంద్రబాబు విధానాలే ఆ పార్టీని దెబ్బతీస్తున్నాయని చెప్పారు. వైఎస్ జగన్ను దెబ్బతీయడానికి ఆలోచిస్తున్నారు... అందుకే దెబ్బతింటున్నారన్నారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వమని మేం చెప్పామా అని నిలదీశారు. సోనియా గాంధీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మాతో డీల్ కుదిరిందా లేక సోనియా నిర్ణయానికి అనుకూలంగా లేఖ ఇచ్చిన... చంద్రబాబుతో డీల్ కుదిరిందా అని ప్రశ్నించారు. సోనియాతో డీల్ కుదరలేదంటే చంద్రబాబు లేఖను వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు లేఖను వెనక్కి తీసుకోమని రామోజీరావు, తోక పత్రికలు ఎందుకు అడగడంలేదన్నారు. సీమాంధ్ర టీడీపీ నాయకులు చంద్రబాబును ప్రశ్నించాలని సూచించారు. జగన్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడే బదులు ఆరుకోట్ల తెలుగు ప్రజలగురించి ఆలోచించాలని హితవు పలికారు. తమని సోనియా వదిలిన బాణాలు అని వ్యాఖ్యానించడంపై మాట్లాడుతూ.. చంద్రబాబు ఇంకా బాణాలు వదిలే పరిస్థితిలో ఉన్నారా అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అంపశయ్యపై ఉన్నారని గుర్తించాలని శోభానాగిరెడ్డి చురక అంటించారు. సబ్బం హరి వ్యాఖ్యలు బాధించాయి రాష్ట్ర విభజనపై అనకాపల్లి ఎంపీ సబ్బం హరి చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయని శోభా నాగిరెడ్డి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయనకు తమ పార్టీలో సభ్యత్వం లేదని, ఎలాంటి బాధ్యతలు లేవని స్పష్టం చేశారు. ఆయన పార్టీలోకి రావాలనుకున్నారని కానీ కాంగ్రెస్ కుట్రలో భాగంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. సబ్బం హరి వ్యాఖ్యలు తమ పార్టీ అధ్యక్షుడు జగన్ సహా తామందరినీ బాధించాయని తెలిపారు. -
జగన్తో చర్చించి కాంగ్రెస్కు రాజీనామా: సబ్బం హరి
ఎంపీ పదవికి తాను చేసిన రాజీనామాను ఆమోదించాల్సిందిగా స్పీకర్ మీరా కుమార్ను కోరినట్లు విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ సబ్బం హరి తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల లోపే రాజీనామాను ఆమోదిస్తారని తాను భావిస్తున్నానన్నారు. సమైక్య రాష్ట్రం కోసం రెండు నెలలుగా ఉద్యమిస్తున్న ప్రజలలోనే ఉండి.. కేంద్రం మెడలు వంచుతామని హరి చెప్పారు. రెండు రోజుల్లో తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహనరెడ్డిని కలుస్తానని, ఆయనతో చర్చించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని వివరించారు. -
వైఎస్సార్ సీపీ అధినేతతో సబ్బం హరి భేటీ
విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి : వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడినప్పటి నుంచి ఆయన వెంటే ఉన్న ఎంపీ సబ్బం హరి తన పయనం జగన్తోనేనని మరో మారు కుండబద్ధలు కొట్టారు. మంగళవారం చంచల్ గూడ జైల్లో జగన్మోహన్రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య చాలా సేపు పార్టీ వ్యవహారాలకు సంబంధించిన చర్చ జరిగింది. జగన్ సూచన మేరకు ఇక సమైక్యాంధ్ర పోరాటంలో కీలకంగా పనిచేయాలని హరి నిర్ణయించుకున్నారు. మూడున్నరేళ్లుగా జగన్తోనే హరి పయనిస్తున్నారు. సాంకేతికంగా కాం గ్రెస్లో ఉన్నప్పటికీ తాను జగన్ మనిషినేననీ, వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీ నుంచే పోటీకి దిగుతానని హరి అనేక సార్లు ప్రకటించారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నం దుకు నిరసనగా ఇటీవలే ఆయన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్తో తన అనుబంధం ఎప్పుడో తెగిపోయిందని ప్రకటించారు. వైఎస్సార్ సీపీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉండాలని నిర్ణయం తీసుకోవడం, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్ దీక్షల అనంతరం పార్టీ శ్రేణుల్లో సమైక్యాంధ్ర ప్రదేశ్ ఉద్యమ తీవ్రత పెరిగింది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు, పార్టీ వ్యవహారాల గురించి చర్చించడానికి సబ్బం హరి మంగళవారం జైల్లో జగన్ను కలిశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఇక నేరుగా కీలక పాత్ర పోషించాలని జగన్ సూచించడంతో హరి ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇదే సందర్భంలో జిల్లాలో పార్టీ వ్యవహారాలు, మూడు రోజుల కిందట జరిగిన షర్మిల సమైక్య శంఖారావం యాత్రకు సంబంధించిన అంశాల పై కూడా ఇద్దరూ చర్చించారు. తాను కాంగ్రెస్ దూతగా జగన్ను కలుస్తున్నానని జరుగుతున్న విషప్రచారంపై ఆయన మండిపడుతూ జగన్ కాంగ్రెస్తో కలవాల్సిన అవసరమే లేద న్నారు. తాను జగన్ మనిషిగానే ఆయన్ను కలుస్తున్నానని స్పష్టంగా చెప్పారు. నాలుగు నెలల్లో విచారణ పూర్తి చేసి చార్జిషీటు వేస్తామని సీబీఐ సుప్రీం కోర్టుకు చెప్పినందువల్ల చట్టప్రకారం బెయిల్ పొందడానికి జగన్ అర్హుడనే విషయాన్ని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైఎ స్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానన్నారు. -
వైఎస్సార్సీపీ తరఫునే పోటీచేస్తా : సబ్బం హరి
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయనున్నట్లు అనకాపల్లి లోక్సభ సభ్యుడు సబ్బం హరి చెప్పారు. ఆయన మంగళవారమిక్కడ చంచల్గూడ జైలులో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని కలుసుకున్నారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ మరణానంతరం తాను జగన్ వెంటే ఉన్నానన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ దూతను కాదన్నారు. తాను జగన్ను చాలాసార్లు కలిసి పార్టీ విధివిధానాలు, వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిపారు. సీబీఐ విచారణ సమయంలో తాను జగన్ వెంటే ఉన్నానన్నారు. జైలును రాజకీయ కేంద్రంగా మార్చారని ప్రతిపక్షాలు ఆరోపించటం సరికాదన్నారు. ములాఖత్లో జగన్ను ఎవరూ కలవకుండా ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేశాయన్నారు. అయితే జైలు నిబంధన ప్రకారమే తాము నడుచుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించినందుకే జగన్ను జైలుపాలు చేశారని సబ్బం హరి ఆవేదన వ్యక్తంచేశారు. ఎవరెన్ని రాజకీయ కుతంత్రాలు చేసినా జనం జగన్ వెంటే ఉండటాన్ని గుర్తించాలన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. నాలుగు నెలల్లోగా సీబీఐ విచారణ పూర్తిచేయాలని, ఆ తర్వాత జగన్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోవాలని సుప్రీంకోర్టు గత మే నెలలో పేర్కొందని, ఆ గడువు పూర్తయిందని ఆయన చెప్పారు. జగన్ను ఇంకా ఇబ్బందులకు గురిచేసే పరిస్థితులు ఇకపై ఉండవన్నారు. జగన్ను విచారించేందుకు ఎంత సమయం పడుతుందని సుప్రీంకోర్టు ప్రశ్నించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ.. ఇప్పుడు కేసు విచారణను నాన్చుతోందన్నారు. సమైక్య రాష్ట్రం విషయంలో ఏ పార్టీ నాయకుడూ తీసుకోని సాహసోపేత నిర్ణయాన్ని జగన్ తీసుకోవటం అభినందనీయమన్నారు. రాజకీయ నష్టం జరుగుతోందని తెలిసినప్పటికీ ప్రజల సంక్షేమాన్నే జగన్ కోరుకున్నారని, ఆయన వెంట ఉన్నందుకు గర్విస్తున్నానని సబ్బం హరి చెప్పారు. ఇదిలా ఉండగా సమైక్య శంఖారావం పేరుతో 13 జిల్లాల్లో బస్సుయాత్ర పూర్తి చేసిన జగన్ సోదరి షర్మిల కూడా మంగళవారం చంచల్గూడ జైలులో ఆయన్ను కలిశారు. మంగళవారం జగన్ను కలిసిన వారిలో సతీమణి వైఎస్ భారతి, జక్కంపూడి రాజా కూడా ఉన్నారు. -
చంచలగూడ జైలులో జగన్ను కలిసిన సబ్బం హరి
-
కాంగ్రెస్ను ఢీ కొట్టగల ఏకైక నాయకుడు జగన్
హైదరాబాద్ : కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ఢీ కొట్టగల ఏకైక నాయకుడు జగన్ అని .. అందుకే రాష్ట్ర ప్రజలంతా జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అనకాపల్లి ఎంపి సబ్బం హరి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన చంచల్గూడ జైల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను మూడున్నరేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నానని సబ్బం హరి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తానని ఆయన తెలిపారు. ఓ పార్టీ అధ్యక్షునిగా ఉంటూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలన్న నాయకుడు కేవలం జగన్ మాత్రమేనని సబ్బం హరి స్పష్టం చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. జగన్కు త్వరలోనే బెయిల్ వస్తుందని సబ్బం హరి ఆశాభావం వ్యక్తం చేశారు. -
త్వరలో మంచి వార్త వింటాం: సబ్బం హరి
విశాఖపట్నం: రాష్ట్ర సమైక్యత కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి ధృడ నిర్ణయం తీసుకున్నారని, దానిని తాను స్వాగతిస్తున్నట్లు అనకాపల్లి ఎంపీ సబ్బం హరి చెప్పారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ప్రజలంతా తిప్పికొట్టారన్నారు. త్వరలోనే మంచి వార్త వింటామన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలనే భావనతోనే దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలించారని సబ్బం హరి అన్నారు. అందుకే ఆయన చనిపోయి నాలుగేళ్లైనా దేశ వ్యాప్తంగానే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. విశాఖలోని 72 వార్డుల్లోనూ కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. -
విశాఖపట్నం- హైదరాబాద్ చార్జీ రూ.2,500
సీమాంధ్ర ఉద్యమాన్ని సాకుగా చూపి ప్రయాణికుల నుంచి అధిక చార్జీలను వసూలు చేసే ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు తమ తీరు మార్చుకోవాలని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి బుధవారం విశాఖపట్నంలో హెచ్చరించారు. ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు మంగళవారం రాత్రి విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు వెళ్లే ఒకొక్క ప్రయాణీకుడి నుంచి రూ.2500 వసూలు చేశారు. ఆ విషయం తెలుసుకున్న సమైక్యాంధ్ర ఆందోళనకారులు వోల్వో బస్సులను నిలిపివేసి టైర్లలో గాలి తీశారు. సాధారణంగా అయితే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు వోల్వో బస్సుల్లో చార్జీ సుమారు 800 మాత్రమే ఉంటుంది. సంక్రాంతి లాంటి పండుగల సమయాల్లో కూడా మహా అయితే 1500 రూపాయలు మాత్రమే తీసుకునేవారని, కానీ ఇప్పుడు రైళ్లలో రిజర్వేషన్లు దొరక్కపోవడం, ఆర్టీసీ సిబ్బంది సమ్మెలో ఉండటంతో ఇంత దారుణంగా నిలువుదోపిడీ చేస్తున్నారని పున్నమరాజు సురేష్ కుమార్ అనే ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా దోపిడీకి అధికారులు, నాయకులు అడ్డుకట్ట వేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీమాంధ్రలో సమైక్య ఉద్యమానికి ఆర్టీసీ సిబ్బంది మద్దతు తెలపడంతో ఆ సంస్థకు చెందిన బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దాంతో సీమాంధ్ర నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు ఆవేదన వర్ణనాతీతంగా మారింది. అయితే ప్రయాణీకుల అత్యవసర ప్రయాణాన్నీ అసరగా తీసుకుని ప్రైవేట్ ఆపరేటర్లు బస్సు చార్జీలను పెంచి అందినకాడికి దండుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సబ్బం హరి ఆపరేటర్లను హెచ్చరించారు. -
విభజించే హక్కు సోనియాకు లేదు: సబ్బం హరి
సాక్షి, విశాఖపట్నం: తెలుగువాళ్లని విభజించే హక్కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేదని ఆ పార్టీ ఎంపీ సబ్బం హరి వ్యాఖ్యానించారు. విభజనపై సోనియా నిర్ణయం తీసేసుకున్నారని, ఒక్కసారి మాట ఇస్తే ఆమె తప్పరని పార్టీ పెద్దలు వ్యాఖ్యానించడంపై ఆయన మండిపడ్డారు. తాను రాజకీయాల్లోకి రానని గతంలో సోనియా గాంధీ అన్నారని, మరి ఇప్పుడెందుకు రాజకీయాలు చేస్తున్నారని సబ్బం విమర్శించారు. ఒక్కసారి చరిత్రను గుర్తుచేసుకోవాలని ఆయన సోనియా గాంధీని కోరారు. ప్రధాని పదవి కోసం ఆమె అప్పట్లో ములాయం సింగ్, మాయావతి, జయలలిత తదితరుల్ని కలిసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తాను రాజకీయాల్లోకి రానని చెబుతున్న ఆమె ఆ విషయాన్ని ఎందుకు గుర్తుచేసుకోవడం లేదని అడిగారు. సంఖ్య సరిపోకపోవడంతోనే నాడు ఆమె ప్రధాన మంత్రి కాలేదని గుర్తుచేశారు. మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్లు అందరూ దేశమైనా రాష్ట్రమైనా సమైక్యంగా ఉండాలని కృషి చేస్తే.. సోనియా మాత్రం విభజించడానికి చూస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖ బీచ్రోడ్డులో ఆదివారం ఆయన ‘సమైక్యాంధ్ర ఉద్యమం-అవగాహన సదస్సు’ పేరిట సభ నిర్వహించారు. తొలుత పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం పూలమాల వేశారు. పార్టీలు, కుల వర్గాలకతీతంగా సమైక్యాంధ్ర కోసం అంతా ముందుకు రావాలని కోరారు. త్వరలో పాదయాత్ర.. రాజీనామా విషయంలో వెనక్కు తగ్గేది లేదని హరి కుండబద్ధలు కొట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమం కోసం తాను పాదం ముందుకు వేశానని, అందుకు వేదిక సిద్ధమైందని, ఉత్తరాంధ్ర జిల్లాల్లో త్వరలోనే పాదయాత్ర చేపడతానని, అంతా ముందుకు రావాలని కోరారు. వైఎస్సార్ తనకెంతో ఇష్టమైన నాయకుడని, ఆయనపై నిందలు మోపడం సబబుకాదని అన్నారు. రాష్ట్ర విభజనకు ఆయన ముందుకు వచ్చారని చెబుతున్న నాయకులు.. 60 ఏళ్లనుంచి తాము ఉద్యమం చేస్తున్నామని చెబుతున్న నాయకులు.. ఎవరైనా సరే వైఎస్సే విభజనకు ఆజ్యం పోశారని చెప్పగలరా అని ప్రశ్నించారు. తన పిల్లల కోసం, పదవుల కోసం సోనియా ప్రయత్నించారని, కానీ ఏనాడూ వైఎస్ తన పిల్లలకు పదవుల గురించి ఆలోచించలేదన్నారు. సమైక్యాంధ్ర కోసం ముందుకు రావాలని స్వర్గం నుంచి ఎన్టీఆర్ చంద్రబాబును కోరాలని, ఆయన మాట వినకపోతే కొడుకుల్నయినా కోరాలని సబ్బం అన్నారు. విశాఖ ప్రజలు పురందేశ్వరిని ఎన్నుకుంటే కనిపించకపోవడం ఘోరమన్నారు. తన కూతుర్ని ఉద్యమంలోకి పంపించాలని పైనున్న ఎన్టీఆర్ను కోరుకుంటున్నట్టు చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్నప్పుడు చిరంజీవిది ఎక్స్ట్రా క్యారెక్టర్ అని, ఇప్పుడు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారని, రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంటే ఆయన మాత్రం కేరళలో పడవలకు జెండా ఊపుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనపై ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి వెల్లడించిన అభిప్రాయాలు సరైనవేనన్నారు. జనం కోసం జగన్.. ‘జనం కోసం జగన్ తిరుగుతున్నారనే ఆయన్ను జైల్లోకి పంపారు.. ఇప్పుడు ఉద్యమ కాగడాలతో విజయమ్మ, షర్మిల ముందుకు వచ్చారు’ అని సబ్బం అన్నారు. పదవుల్ని త్యజించిన విజయమ్మ, జగన్ల గొప్పతనాన్ని ఆయన అభినందించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమన్నారు. జగన్, విజయమ్మలను చూసి ఇతర రాజకీయ నేతలు ఎంతో నేర్చుకోవాలని చెప్పారు. కేసీఆర్ది అబద్ధాల కుటుంబం టీఆర్ఎస్ నేత కేసీఆర్ది అబద్ధాల కుటుంబం అని హరి ధ్వజమెత్తారు. తెలుగువారి ఉనికినే ప్రశ్నించే స్థాయికి ఆయన ఎదిగిపోయారని, హైదరాబాద్ వచ్చి తగిన సమాధానం చెబుతామని అన్నారు. త్యాగాలు చేసి సాధించుకున్న రాష్ర్టం మీ తాత సొత్తా అని కేసీఆర్ను ప్రశ్నించారు. ఆయన ఏపీ రాక్షసుడు అని, అంతమొందించాల్సిందేనని అన్నారు. సమాజంలో చిచ్చుపెడుతున్నవారెవరైనా త్వరలో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. -
ప్రజల జీవితాలతో ఆటలాడుకోవద్దు: సబ్బం
-
తెలుగువారిని విడగొట్టొద్దు: సబ్బం హరి
తెలుగువారిని విడగొట్టవద్దని అనకాపల్లి లోక్సభ సభ్యుడు సబ్బం హరి కోరారు. సమైక్యంగా ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆదివారం ఆర్కే బీచ్ లో జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనకు మద్దతు పలకడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆయనకు స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ కనువిప్పు కలిగించి సమైక్య ఉద్యమంలో పాల్గొనేలా చేయాలని ఆకాంక్షించారు. కనీసం తన కుమారులనైనా ఎన్టీఆర్ కళ్లు తెరిపించి సమైక్య ఉద్యమబాట పట్టించాలన్నారు. ఇందిరా గాంధీ చిన్న రాష్ట్రాలను వ్యతిరేకిస్తే ఆమె కోడలు మన రాష్ట్రాన్ని విడదీయాలని చూస్తున్నారని విమర్శించారు. ఆఎ ఏ ఉద్దేశంతో రాష్ట్ర విభజనకు పూనుకున్నారో అది జరగదన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు సబ్బం హరి ఇటీవలే ప్రకటించారు. తాను ఉత్తుత్తి రాజీనామా చేయలేదని, ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ తిరిగి ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు రాదని, తన రాజీనామా ఆమోదించకుంటే.. బిల్లు వచ్చినప్పుడు వ్యతిరేకంగా ఓటేస్తానని ఆయన చెప్పారు. -
తెలుగు వారంతా కలిసే ఉండాలి
-
రాష్ట్ర విభజన తీరు బాధాకరం: సబ్బం హరి