
'పొన్నాలకు చెప్పు చూపించాడు'
వరంగల్ : రాజకీయ నేతలపై చెప్పులు విసిరే సంస్కృతి నానాటికీ ఎక్కువ అవుతోంది. ... విషయం తెల్సిందే. తాజాగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు సోమవారం చేదు అనుభవం ఎదురైంది. జనగామలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనకు వీవర్స్ కాలనీలో ఓ యువకుడు చెప్పు చూపించి తన నిరసన తెలిపాడు. దాంతో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆ వ్యక్తిపై దాడి చేశారు. పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.