పాదం తాకితే పండంటి బిడ్డ! | Foot touches the cute baby! | Sakshi
Sakshi News home page

పాదం తాకితే పండంటి బిడ్డ!

Published Sun, Jan 12 2014 10:40 PM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM

ఈ ఆవు ‘ఐదో కాలు’ను తాకే అవకాశం వస్తే చాలన్నట్టుగా ఉన్నారు. ఈ కథేంటంటే... ఆవు పేరు రాజు.

చత్తీస్‌ఘడ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఈ ఆవును చాలా మంది ప్రత్యక్ష దైవంగా చూస్తున్నారు. ప్రత్యేకించి మగసంతానాన్ని కోరుకొనే తల్లులు అయితే ఈ ఆవు ‘ఐదో కాలు’ను తాకే అవకాశం వస్తే చాలన్నట్టుగా ఉన్నారు. ఈ కథేంటంటే... ఆవు పేరు రాజు. చత్తీస్‌ఘడ్ రాజధాని రాయ్‌పూర్‌లో రాజ్ ప్రతాప్ అనే వ్యక్తి ఈ గోమాతను సంరక్షిస్తున్నాడు.

మూపురానికి కాలు ఉన్న ఈ ఆవుకు చాలా ప్రత్యేకత ఉందట! గర్భవతులు ఈ ఆవు పాదాన్ని తాకితే వారికి మగబిడ్డ పుడుతున్నాడట. స్థానికంగా ఇప్పటి వరకూ అనేక మంది గర్భవతులు ఈ ఆవు ఆశీర్వాదంతో మగబిడ్డను సంతానంగా పొందారనే ప్రచారం జరుగుతోంది. దీంతో  ఆవు యజమాని  దీని ఐదోకాలిని తాకాలనుకొనే వారి సెంటిమెంటును క్యాష్ చేసుకొంటున్నాడు.

ముందు తనకు రూ.500 చెల్లించి, ఆ తర్వాత మూపురం వద్ద ఉన్న కాలును తాకాలని అంటున్నాడు. అయినప్పటికీ ఆవుకున్న మహిమను మనస్పూర్తిగా నమ్ముతున్న మనుషులకు ఈ మొత్తం పెద్ద విషయంగా కనిపించడం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement