కలుషిత నీరు తాగి విద్యార్థి మృతి | 10th class student died in ranga reddy district | Sakshi
Sakshi News home page

కలుషిత నీరు తాగి విద్యార్థి మృతి

Published Thu, Aug 11 2016 9:33 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

10th class student died in ranga reddy district

హైదరాబాద్‌: హయత్‌నగర్ మండలం పసుమాముల బీసీ హాస్టల్ విద్యార్థి మృతి చెందాడు.  వివరాలు ఇలా ఉన్నాయి... సదరు బీసీ హాస్టల్లో ఉంటూ రాకేశ్ అనే విద్యార్థి కలుషిత నీరు తాగి తీవ్ర అనారోగ్యం పాలైయ్యాడు. దీంతో హాస్టల్ సిబ్బంది అతడిని ఎల్బీ నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రెండు రోజులుగా చికిత్స పొందుతు బుధవారం రాత్రి మరణించాడు.

అయితే గత రెండు రోజులుగా అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా... అతడి తల్లిదండ్రులకు హాస్టల్ సిబ్బంది సమాచారం ఇవ్వలేదు. అతడు మరణించిన తర్వాత వారికి సమాచారం అందించారు. దీంతో రాకేశ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. గురువారం  రాకేశ్ తల్లిదండ్రులతోపాటు బంధువులు హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement