Rakesh
-
రజనీకాంత్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ మాట అన్నారు: మూవీ ఈవెంట్లో హరీశ్ రావు
జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన చిత్రం ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్). గరుడవేగ అంజి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనన్య కృష్ణన్ కథానాయికగా నటించారు. రాకింగ్ రాకేష్ నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ మంత్రి, తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..'ముఖ్యమంత్రులు వస్తు ఉంటారు. పోతుంటారు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మాత్రం ఒకే ఒక్కడు కేసీఆర్. ఆయన పేరు మీద సినిమా తీయడం సంతోషం. కేసీఆర్ అంటే ఒక చరిత్ర. తెలంగాణను సాధించడమే కాదు అద్భుతంగా 10 సంవత్సరాలు పరిపాలించారు. రజనీకాంత్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక మాట అన్నారు. నేను హైదరాబాద్లో ఉన్నానా? న్యూయార్క్లో ఉన్నానా అని. కేసీఆర్ పల్లెలను, హైదరాబాద్ను ఎంతో అభివృద్ధి చేశారు. మనం చూసే భౌతికమైన అభివృద్దే కాదు. సామాజిక పరంగా సంస్కృతి పరంగా తెలంగాణని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఒక దశ దిశను చూపించారు. దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలబడింది అంటే కేసీఆర్ చేసిన కృషి. అధికారంలో ఉన్న పార్టీ వారి మీద సినిమాలు తీస్తారు. కానీ అధికారంలో లేకపోయినా రాకేష్ ప్రేమతో, దమ్ము ధైర్యంతో ఈ సినిమా తీశారు' అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా.. లంబాడీ వర్గానికి చెందిన ఓ యువకుడి నిజ జీవితం నుంచి స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందించారు. -
కొండా సురేఖ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి
-
బాలుడి దారుణ హత్య
బాల్కొండ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో పన్నెండేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. బాలుడిని గుప్త నిధుల కోసం చంపారా? లేదా డబ్బుల కోసమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలివి. బాల్కొండకు చెందిన బండి నరేందర్.. నచ్చు రాకేశ్ మేనమామ అయిన నాగాపూర్కు చెందిన దశరథ్ మేకలను మేతకు తీసుకుని వెళ్తాడు. దీంతో రాకేశ్ కుటుంబ సభ్యులకు పరిచయమయ్యాడు. గణపతులను చూసి వద్దామని చెప్పి ఈ నెల 11న బండి నరేందర్ చిట్టాపూర్ గ్రామానికి చెందిన బాలుడు నచ్చు రాకేశ్ను.. బాల్కొండకు తీసుకొచ్చాడు. ఆ రోజు రాత్రి 11 గంటల వరకు కూడా రాకేశ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు నరేందర్ను ప్రశ్నించారు. అతని నుంచి సరైన సమాధానం రాక పోవడంతో బాల్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా శనివారం ఉదయం బాల్కొండలోని ఖిల్లా ప్రాంతంలో బాలుడి మృతదేహం ఉందని చిట్టాపూర్ గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో ఈ ఘోరం వెలుగుచూసింది. బాలుడి మృతదేహంపై దుస్తులు లేకపోగా.. ఎడమ కంటి భాగంపై బండరాయితో మోది హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. ఖిల్లాలోని ఓ గుహ ముందు హత్య చేసి మృతదేహాన్ని కొద్దిదూరంలో పారేశారు. ఘటన స్థలాన్ని సీఐ శ్రీధర్రెడ్డి పరిశీలించారు. బాలుడిని నరేందర్ హత్య చేసి ఉంటాడని బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. నరేందర్తో వెళ్లేముందు బాలుడు తన అన్న మణికంఠకు ఫోను చేసి చెప్పాడని తెలిపారు. పోలీసులు నరేందర్ను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే అనుమానితుడు నేరాన్ని అంగీకరించలేదని పోలీసులు పేర్కొన్నారు. త్వరలోనే పూర్తిస్థాయి దర్యాçప్తు చేపట్టి నిందితులను పట్టుకుంటామన్నారు. కాగా బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసు స్టేషన్కు చేరుకుని నరేందర్ను తమకు అప్పగించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హత్య జరిగిన మర్నాడు కూడా నరేందర్ తన భార్య మొబైల్తో ఫోన్ చేసి.. రాకేశ్ ఖానాపూర్ వద్ద ఉన్నాడని అబద్ధం చెప్పాడని వివరించారు. హత్య జరిగిన రోజు ఉదయం నరేందర్.. మొదట బాలుడి అన్న మణికంఠకు ఫోన్చేసి ఖిల్లా వద్దకు రమ్మన్నాడని, మణికంఠ వెళ్లకపోవడంతో రాకేశ్ను తీసుకెళ్లినట్లు వివరించారు. న్యాయం చేస్తామని ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి హామీ ఇవ్వడంతో మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనను విరమించారు. హతుని తండ్రి రెండేళ్ల క్రితమే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. -
కోస్ట్ గార్డ్ డీజీ హఠాన్మరణం
సాక్షి, చెన్నై/న్యూఢిల్లీ: భారత తీర రక్షక దళం(ఐసీజీ) డైరెక్టర్ జనరల్ రాకేశ్ పాల్ హఠాన్మరణం చెందారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగిన ఐసీజీ కార్యక్రమంలో రాజ్నాథ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండెపోటుకు గురైన రాకేశ్ పాల్ను వెంటనే చెన్నైలోని రాజీవ్ గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించారు. రాత్రి 7 గంటల సమయంలో ఆయన ఆస్పత్రిలో కన్నుమూశారని అధికార వర్గాలు తెలిపాయి. చెన్నైలోనే ఉన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ ఆస్పత్రికి వెళ్లి రాకేశ్ పాల్కు నివాళులర్పించారు. రాకేశ్ పాల్ పారి్థవ దేహాన్ని ప్రత్యేక ఏర్పాట్లతో చెన్నై నుంచి అర్ధరాత్రి వేళ ఢిల్లీకి తరలించారు. రాకేశ్ పాల్ గతేడాది జూలై 19వ తేదీన ఐసీజీ 25వ డీజీగా బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ నావల్ ఎకాడమీ విద్యార్థి అయిన రాకేశ్ పాల్ 1989లో ఐసీజీ (ఇండియన్ కోస్ట్ గార్డ్)లో చేరి 34 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేశారు. -
చిత్రలేఖనంలో డెలివరీ బాయ్ వారెవ్వా..
సాక్షి, సిటీబ్యూరో: అతడో డెలివరీ బాయ్.. అది సమాజానికి తెలిసిన విషయం. కానీ ప్రపంచానికి తెలియని మరో విషయం ఏంటంటే అతడో మంచి చిత్రకారుడు. కుంచె పట్టాడంటే అద్భుతాలు అలా జాలువారుతాయి. చక్కటి రూపాలను మలచడంలో ప్రసిద్ధుడు. కానీ కుటుంబ పరిస్థితులు మాత్రం ఓ డెలివరీ బాయ్ పనికి పరిమితం చేశాయి. అతడి పేరే రాకేశ్ రాజ్ రెబ్బా. పుట్టింది మహారాష్ట్రలోని సోలాపూర్లో.. పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చేసి ఇక్కడే డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు.చిన్నప్పటి నుంచీ ఆసక్తి..రాకేశ్కు చిత్రలేఖనం అంటే చిన్నప్పటి నుంచే ఆసక్తి.. ఆ కళపై ఎలాగైనా పట్టుసాధించాలనే తపనతో చిన్నప్పుడు.. ఎప్పుడూ చూసినా ఏదో ఒక బొమ్మ గీస్తుండేవాడట. అలా కొన్ని వందల చిత్రాలను పుస్తకాల్లో గీసి అపురూపంగా దాచిపెట్టుకున్నాడు.మనుషుల ముఖాలను కూడా గీస్తూ ప్రశంసలు పొందుతున్నాడు. ప్రస్తుతం అప్పుడప్పుడూ వాల్ పెయింటిగ్స్ వేస్తూ తన కళను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తన కళకు మరిన్ని నగిïÙలు అద్దితే ఎన్నో ఎత్తులకు చేరుకుంటాడనడంలో అతిశయోక్తి లేదు.మంచి ఆర్టిస్టు కావాలని కోరిక.. ఆర్ట్ వేయడం అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. సొంతంగానే ఎన్నో బొమ్మలు వేశాను. డెలివరీ బాయ్గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నా. ఎవరైనా ప్రోత్సాహం అందిస్తే మంచి ఆరి్టస్టుగా జీవితంలో పేరు తెచ్చుకోవాలనేది నా కోరిక. – రాకేశ్ రాజ్ రెబ్బా -
నిషేధిత డ్రగ్ తయారీ ముఠా గుట్టురట్టు
జిన్నారం (పటాన్చెరు): టీఎస్ న్యాబ్, జిల్లా పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి నిషేధిత డ్రగ్ను తయారు చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ మంగళవారం వివరాలు వెల్లడించారు. గుమ్మడిదలకు చెందిన గోసుకొండ అంజిరెడ్డి, కొత్తపల్లికి చెందిన ప్రభాకర్గౌడ్, అనంతారానికి చెందిన సాయికుమార్గౌడ్, వికారాబాద్ జిల్లా పంచలింగాలకు చెందిన క్యాసారం రాకేశ్లు నిషేధిత అ్రల్పాజోలం తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. నలుగురూ కలిసి కొత్తపల్లి గ్రామ శివారులో ఓ కోళ్ల ఫారాన్ని లీజుకు తీసుకున్నారు. అక్కడ ఓ ప్రత్యేక గదిలో డ్రగ్ను తయారు చేసేందుకు రియాక్టర్తో సహా అన్ని రకాల వసతులను ఏర్పాటు చేసుకున్నారు. అంజిరెడ్డి బాలానగర్లో అ్రల్పాజోలం తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు తీసుసురాగా రాకేశ్ డ్రగ్ను ప్రాసెస్ను చేసేవాడు. ఆరు నెలలుగా వీరి డ్రగ్ వ్యాపారం బాగానే నడిచింది.అయితే గ్రామ శివారులో వ్యర్థాల ఘాటు వాసనలు వెలువడటంతో ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలిపారు. దీంతో టీఎస్ న్యాబ్, పోలీసులు సంయుక్తంగా డ్రగ్ కేంద్రంపై దాడులు జరిపి, రూ.40 లక్షల విలువైన 2.6 కిలోల అ్రల్పాజోలం, మరో రూ.60 లక్షల విలువైన ముడి పదార్థాలు, యంత్రాలను అధికారులు సీజ్ చేశారు. రాకేశ్, అంజిరెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకోగా, సాయికుమార్గౌడ్ ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నాడు. ప్రభాకర్గౌడ్ పరారీలో ఉన్నాడని ఎస్పీ రూపేశ్ తెలిపారు. సమావేశంలో న్యాబ్ డీఎస్పీ శ్రీధర్, ఇన్స్పెక్టర్ సంతోష్, పటాన్చెరు డీఎస్పీ రవీందర్రెడ్డి, జిన్నారం సీఐ సు«దీర్ కుమార్, ఎస్ఐలు మహేశ్వర్రెడ్డి, విజయారావు తదితరులు పాల్గొన్నారు. -
అమెరికాలో ఖమ్మం యువకుడు మృతి
ఖమ్మం సహకారనగర్: బీటెక్ పూర్తిచేశాక బహుళజాతి కంపెనీలో ఉద్యోగం వచ్చినా కాదను కున్న యువకుడు ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. ఇటీవలే కోర్సు పూర్తికాగా, కుమారుడు పట్టా స్వీకరించడాన్ని కళ్లారా చూసేందుకు తల్లి దండ్రులూ అమెరికా వెళ్లారు. పట్టా స్వీకరించిన సంతోషంలో స్నేహితులతో కలిసి విహారయాత్ర కు వెళ్లిన ఆ యువకుడు అక్కడి జలపాతంలో మునిగి మృతి చెందగా.. కొడుకు మృతదేహంతో స్వస్థలానికి వెళ్లాలని తెలిసిన ఆ తల్లిదండ్రుల రోదనకు అంతు లేకుండా పోయింది. ఈ విషాద ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఖమ్మంలోని మాంటిస్సోరి పాఠశాలల డైరెక్టర్ లక్కిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఏకైక కుమారుడు రాకేశ్ (24) రెండేళ్ల క్రితం బీటెక్ పూర్తిచేయగా అమెజా న్లో ఉద్యోగం వచ్చింది. అయినా ఎంఎస్ చదవా లనే లక్ష్యంతో అమెరికా వెళ్లాడు. అక్కడ అరిజోనా యూనివర్సిటీ నుంచి ఎంఎస్ పూర్తిచేసిన ఆయన వారం క్రితం పట్టా స్వీకరించారు. కుమారుడు పట్టా స్వీకరించడాన్ని కళ్లారా చూసేందుకు చంద్రశేఖర్రెడ్డి దంపతులు అమెరికా వెళ్లి ప్రస్తుతం అక్కడే ఉన్నారు. అయితే, ఎంఎస్ విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా అమెరికాలోని ప్రసిద్ధ ఫాసిల్ క్రీక్ జలపాతం వద్దకు రాకేశ్, ఆయన స్నేహితులు ఈనెల 8వ తేదీన వెళ్లారు.జలపాతం వద్ద సరదాగా గడుపుతుండగా రాకేశ్తో పాటు మరో యువకుడు ప్రమాదవశాత్తు జారి నీటిలో మునిగిపోయారు. గాలింపు చర్యలు చేపట్టగా మరుసటిరోజు 25 అడుగుల లోతులో మృతదే హాలు లభించాయి. రాకేశ్తో పాటు మృతి చెందిన మరో యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. -
జస్టిస్ రాకేష్ పై సుప్రీం సీరియస్
-
రైళ్ల పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: కాజీపేట్–డోర్నకల్, విజయవాడ– డోర్నకల్ మధ్య రైళ్లను పునరుద్ధరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు. కాజీపేట్–డోర్నకల్ మధ్య ఈ నెల 14 నుంచి, విజయవాడ–డోర్నకల్ మధ్య ఈ నెల 20 నుంచి రైళ్లు యాథావిధిగా రాకపోకలు సాగించనున్నాయి. రైల్వేలైన్ల నిర్వహణ దృష్ట్యా ఈ రెండు రైళ్లను ఈ నెల ఒకటో తేదీ నుంచి రద్దు చేసినట్లు పేర్కొన్నారు. -
దీపావళి ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా హైదరాబాద్–కటక్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్–కటక్ (07165/07166) ప్రత్యేక రైలు ఈ నెల 7, 14, 21 తేదీల్లో రాత్రి 8.10 గంటలకు బయల్దేరి మర్నాడు సాయంత్రం 5.45 గంటలకు కటక్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 8, 15, 22 తేదీల్లో రాత్రి 10.30 గంటలకు కటక్ నుంచి బయల్దేరి మర్నాడు రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. -
ప్రేమించిన యువతి పెళ్లికి ఒప్పుకోలేదని.. యువకుడు..
సాక్షి, జగిత్యాల: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని వెంగళాపూర్ గ్రామానికి చెందిన అంతెల్పుల రాకేశ్ (22) కొంతకాలంగా ఓ యువతితో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. ఇటీవల పెళ్లి చేసుకుందామని ఆమెను కోరగా ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాకేశ్ సదరు యువతి పెళ్లికి ఒప్పుకోవడంలేదని ఇంట్లో చెబుతూ బాధపడుతుండేవాడు. సోమవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: నా భార్యది ఆత్మహత్య కాదు.. ఇదిగో వినండి.. వాయిస్ రికార్డ్! -
పెళ్లి బరాత్.. డీజే వాహనం.. అదుపు తప్పి ఒక్కసారిగా..
మహబూబాబాద్: పెళ్లి బరాత్లో పాల్గొని వస్తున్న డీజే వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర, ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామ శివారులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం హసన్పర్తి మండలం పెంబర్తికి చెందిన కొయ్యడ రాకేష్, జోరుక సందీప్ , కక్కర్ల పృథ్వీ (18), పున్నంచందర్, హసన్పర్తికి చెందిన మేకల జిధ్యాన్.. ఏపీ 36 టీఏ 4854 నంబరు గల టాటా ఏస్ డీజే వాహనంతో శనివారం పరకాలలో జరిగిన ఓ పెళ్లి బరాత్లో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం తమ ఇళ్లకు వస్తున్న క్రమంలో కమలాపూర్ మండలం అంబాల గ్రామ శివారులో డీజే వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో వరంగల్ ఎంజీఎం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కక్కెర్ల పృథ్వీ మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతుడి తండ్రి రాంబాబు ఫిర్యాదు మేరకు డ్రైవర్ కొయ్యడ రాకేశ్పె కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సంజీవ్ తెలిపారు. -
లండన్ గడ్డపై రాకింగ్ రాకేశ్ - జోర్దార్ సుజాత బోనాల జాతర
వరంగల్కు చెందిన ఎన్నారై ఫొరమ్ లండన్లో బోనాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత పదేళ్లుగా ఈ ఉత్సవం నిర్వహిస్తునప్పటికీ ఈ ఏడాది మరింతగా ఘనంగా నిర్వహించాలని ఎన్నారై ఫోరమ్ నిర్ణయించుకుంది. యాంకర, నటి తెలంగాణ మహిళ అయిన జోర్దార్ సుజాత ఆధ్వర్యంలో బోనాల జాతర నిర్వహించారు. ఈ మేరకు ఫోరమ్ ప్రెసిడెంట్ శ్రీధర్ నీల మాట్లాడుతూ ‘తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోనాల ఉత్సవాలు ఎన్నో ఏళ్లగా లండన్లో నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది ఎప్పటిలా కాకుండా మరింత ఘనంగా చేస్తున్నాం. ఈ వేడుకలో మరింత ఉత్సాహాన్ని నింపడానికి హైదరాబాద్ నుంచి రాకింగ్ రాకేశ్, సుజాత ఇక్కడికి రావడం ఆనందించదగ్గ విషయం’అని తెలిపారు. నేరెళ్ల వేణుమాధవ్ శిష్యుల తర్వాత రాకింగ్ రాజేశ్ మిమిక్రీ అంతగా పాపురల్ అయ్యారు. బజర్దస్త్ వంటి షోలతో చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. ఇటీవల అమెరికా, న్యూజెర్సీలోని నాట్స్ కార్యక్రమం విజయవంతం తర్వాత రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాత లండన్లో జరిగిన బోనాల ఉత్సవంలో తమదైన శైలి స్కిట్లు, మిమిక్రీ కార్యక్రమాలతో అలరించారు. ఈ షోతో ఆయన 2300 షోల మార్కును దాటారు. రాకింగ్ రాకేశ్ మాట్లాడుతూ ‘వరంగల్ ఎన్నారై ఫోరమ్తో నాకు మంచి అనుబంధం ఉంది. కరోనా సమయంలోనే కాకుండా మామూలు సమయంలో కూడా ఇబ్బందుల్లో ఉన్న ఎంతోమందికి నా ద్వారా డబ్బు పంపి సహకారం అందించారు. చిన్నారుల, చదువు ఆర్యోగాలకు సహకరించారు. ఈసారి బోనాల వేడుకలో మేం భాగం కావాలని వరంగల్ ఎన్నారై ఫోరమ్ కోరగా.. గతంలో వారు చేసినా సేవలకు కృతజ్ఞతా భావంతో లండన్ షో చేశాం. మమ్మల్ని ఇందులో భాగం కావాలని ప్రత్యేకంగా ఆహ్వానించడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం లండన్లో చేసిన షోతో 2300 షోలను పూర్తి చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫోరమ్ ప్రెసిడెంట్ శ్రీధర్ నీల, ఫౌండర్ కిరణ్ పసునూరి, జనరల్ సెక్రటరీ రమణ, వైస్ ప్రెసిడెంట్ నాగ ప్రశాంతి, ప్రవీణ్ బిట్ల, కమల తదితరులకు కృతజ్ఞతలు’ అని అన్నారు. -
నాకు మాస్టర్ గా జీవితం ఇచ్చింది రాకేష్ మాస్టర్
-
రాజేష్ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు
సాక్షి, రంగారెడ్డి: హయత్నగర్లో దారుణంగా హత్యకు గురైన రాజేష్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు పోలీసుల విచారణలో వెలుగు చూస్తున్నాయి. సుజాతతో వివాహేతర సంబంధం కారణంగానే.. ఆమె భర్త రాజేష్ను హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. ఈలోపు నాగేశ్వర్రావు పెద్ద ట్విస్టే ఇచ్చాడు. తన భార్యది సూసైడ్ కాదని.. రాజేష్ చంపాడంటూ సాక్షి టీవీతో చెప్పాడు. ‘‘నా భార్యను రాజేషే చంపాడు. విషం తెచ్చి బలవంతంగా నా భార్యకు తాగించాడు. నేను కానీ.. నా కొడుకులు కానీ రాజేష్ను కొట్టలేదు. కొన్ని నెలలుగా నా భార్యను రాజేష్ టార్చర్ పెడుతున్నాడు’’ అని సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడాయన. ఇదిలా ఉంటే ఈ కేసులో వివాహేతర సంబంధమే రాజేష్ హత్యకు కారణమనే విషయాన్ని పోలీసులు దాదాపుగా ధృవీకరించుకున్నారు. ప్రభుత్వ టీచర్ అయిన సుజాతతో రాజేష్కు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. పురుగుల మందు తాగిందని పేర్కొంటూ.. ఈ నెల 24వ తేదీన సుజాతను ఆస్పత్రిలో చేర్పించాడు నాగేశ్వరరావు. చికిత్స పొందుతూ సోమవారం ఆమె కన్నుమూసింది. అయితే ఆమె విషం తాగిందని చెబుతున్న సమయానికి ముందు ఆమె ఇంటి వద్ద రాజేష్ కనిపించాడని, అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం ద్వారా తెలుస్తోంది. మరోవైపు రాకేష్ హత్య కేసులో హయత్నగర్ పోలీసులు నాగేశ్వర్రావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజేష్ను నాగేశ్వరరావు కొట్టి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
ఎల్కతుర్తి: ప్రాణస్నేహితులిద్దరూ చనిపోయారన్న బెంగతో ఒక డిగ్రీ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలకేంద్రంలో సోమ వారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తులు తెలిపిన వివరాలివి. తంగళ్లపెల్లి సంపత్, సుమలత దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. కార్తీక్(21) హనుమకొండలో డిగ్రీ ప్రథమ సంవత్సరం, చిన్న కుమారుడు వినయ్ 8వ తరగతి చదువుతున్నారు. కార్తీక్ మేనమామ కుమారుడు అఖిల్ ఆరేళ్ల క్రితం క్యాన్సర్తో చనిపోయాడు. మరో స్నేహితుడు రాకేష్ రెండేళ్ల క్రితం మృతి చెందాడు. ఈ ముగ్గురు చిన్ననాటి స్నేహితులు కావడంతో.. వారు చనిపోయినప్పటి నుంచి కార్తీక్ దిగాలుగా ఉండేవాడు. తాను కూడా వారి వద్దకు వెళ్తానంటూ.. అప్పుడప్పుడు తల్లిదండ్రులకు చెప్పేవాడు. దీంతో వారు అధైర్యపడొద్దని కుమారుడికి సర్దిచెప్పేవారు. కాగా, కార్తీక్ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ‘నా చావుకు ఎవరూ కారణం కాదని’సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకున్నాడు. ఎస్ఐ పరమేశ్ కేసు నమోదు చేశారు. -
ఘట్ కేసర్ వద్ద ట్రాక్ ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాం : CPRO రాకేష్
-
పట్టాలు తప్పిన గోదావరి
-
యాంకర్ రవి యాడ్ షూటింగ్ కోసం భారీ సెట్టింగ్!
బిగ్బాస్ షోతో మరింత పాపులర్ అయ్యాడు యాంకర్ రవి. ప్రస్తుతం ఈ స్టైలీష్ యాంకర్ ఓ కమర్షియల్ యాడ్లో నటించబోతున్నాడు. ‘జబర్దస్త్’ రాకింగ్ రాకేష్తో కలిసి నటించబోయే ఈ యాడ్ .. ఓ వస్త్ర వ్యాపారానికి సంబంధించినది. దీని కోసం హైదరాబాద్లో ఓ భారీ సెట్ని వేసినట్లు తెలుస్తోంది. దాదాపు ఓ సినిమా కోసం వేసేంత సెట్లో ఈ కమర్షియల్ యాడ్ షూటింగ్ జరగనుందట. ఆ యాడ్ ద్వారా జబర్దస్త్ రాకింగ్ రాకేష్, బిగ్ బాస్ యాంకర్ రవి, మోడల్ యశ్వంత్ లు ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ యాడ్ ను యాడ్స్ కింగ్ మేకర్ అయిన సంజీవ్ డైరెక్ట్ చేశారు. అలాగే జబర్దస్త్ కి రైటర్ గా చేసినటువంటి సుభాష్ కెమెరామెన్ గా వర్క్ చేయడం విశేషం. ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి భారీగా ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలోని పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లో ఈ బ్రాండ్ కు సంబందించిన బ్రాంచెస్ ఓపెన్ అవుతుండడం విశేషం. -
ప్రయాణికులకు గుడ్న్యూస్.. సంక్రాంతికి మరో 30 ప్రత్యేక రైళ్లు.. వివరాలివే
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో 30కి పైగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, వికారాబాద్ స్టేషన్ల నుంచి నర్సాపూర్, మచిలీపట్నం, కాకినాడ నగరాలకు ఇవి అందుబాటులో ఉంటాయి. వీటిలో జనరల్ బోగీలు, రిజర్వ్డ్ బోగీలు ఉంటాయి. రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం ఆయా ప్రాంతాలకు చేరుకొనే విధంగా ఈ రైళ్లను నడపనున్నారు. జనరల్ ప్రయాణికులు యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు 94 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. అన్ని ప్రత్యేక రైళ్లకు ఈ నెల 31వ తేదీ ఉదయం 8 గంటల నుంచి రిజర్వేషన్ సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. సికింద్రాబాద్–కాకినాడ టౌన్ (07048) జనవరి 6న, కాకినాడ టౌన్–సికింద్రాబాద్(07049) జనవరి 7న, హైదరాబాద్–నర్సాపూర్ (070 19) రైలు 7న, నర్సాపూర్–వికారాబాద్ (070 20) రైలు 8న, వికారాబాద్–నర్సాపూర్ (070 21) 9న, నర్సాపూర్–హైదరాబాద్ (07022) 10న, సికింద్రాబాద్–కాకినాడటౌన్ (07039) 9న, కాకినాడటౌన్–వికారాబాద్ (07040) 10న, వికారాబాద్–నర్సాపూర్ (07041) 11న, నర్సాపూర్–సికింద్రాబాద్ (07042) 12వ తేదీన నడపనున్నారు. హైదరా బాద్– మచిలీపట్నం (07011) 11, 13 తేదీల్లో, మచిలీ పట్నం–హైదరాబాద్ (07012) 12, 14 తేదీల్లో, సికింద్రాబాద్–కాకినాడ టౌన్ (07035) 11న, కాకినాడ టౌన్–వికారాబాద్ (07036) జనవరి 12న, వికారాబాద్– కాకినాడటౌన్ (07037) 13న, కాకినాడ టౌన్–సికింద్రాబాద్ (07038) 14న, సికింద్రాబాద్–నర్సాపూర్ (07023) 13న, నర్సాపూర్–సికింద్రాబాద్ (07024) 14న, సికింద్రాబాద్–కాకినాడ టౌన్ (07027) 16న, కాకినాడ టౌన్–సికింద్రాబాద్ (07028) 17న, సికింద్రాబాద్–కాకినాడ టౌన్ (07031) 15న, కాకినాడ టౌన్–వికారాబాద్ (07032) 16న, వికారాబాద్–కాకినాడ టౌన్ (07033) 17న, కాకినాడ టౌన్–సికింద్రాబాద్ (07034) 18న, హైదరాబాద్–నర్సాç³Nర్ (07015) 15, 17 తేదీల్లో, నర్సాపూర్–హైదరాబాద్ (07016) 16, 18 తేదీల్లో నడపనున్నారు. -
Rakesh Master: వైజాగ్లో రాకేష్ మాస్టర్ సందడి
గాజువాక(విశాఖపట్నం): ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాకేష్ గాజువాకలో సందడి చేశారు. రిచ్ గైస్ ఆధ్వర్యంలో చిట్టినాయుడు కాలనీలో నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాలకు హాజరైన ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధనను ప్రారంభించారు. అనంతరం అభిమానులతో ముచ్చటించారు. చదవండి: ‘బ్రహ్మాస్త్ర’ ట్విటర్ రివ్యూ -
Software Engineer Rakesh: భార్య వేధింపులు.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
సాక్షి, హన్మకొండ: భార్య, అత్తింటివారి వేధింపులు తాళలేక సూసైడ్ నోట్ రాసి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం రాజపల్లి గ్రామంలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎస్సై వీరభద్రరావు కథనం ప్రకారం.. రాజపల్లికి చెందిన కొండా రాకేశ్(28) హెచ్సీఎల్ కంపెనీలో సాప్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతడికి ఫిబ్రవరి 2న ఎలుకుర్తి హవేలికి చెందిన దేవుళ్లపల్లి శంకర్ కుమార్తె నిహారికతో వివాహం జరిగింది. కొన్ని రోజులు వీరి సంసారం సాఫీగానే సాగింది. రాకేశ్ ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తుండడంతో రాజపల్లిలోనే ఉంటున్నారు. పల్లెటూరులో ఉండడం ఇష్టంలేని నిహారిక హైదరాబాద్ వెళ్దామని రాకేశ్తో తరుచూ గొడవ పడేది. వర్క్ ఫ్రం హోం పూర్తికాగానే వెళ్దామని సర్ధి చెప్పినా వినకుండా గొడవపడేది. ఈ విషయమై పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. అయినా వినని నిహారిక రాకేశ్తో సంసారం చేయడం ఇష్టంలేదని, పుట్టింటికి వెళ్లి అబార్షన్ చేయించుకుంటానని భర్త, అత్తమామలతో గొడవపడి చీపురుతో కొట్టి వెళ్లిపోయింది. చదవండి: (ప్రేమ వివాహం.. ఆపై కులం తక్కువని..) ఈ క్రమంలో వీడియోకాల్ చేసి రాకేశ్ను దుర్భాషలాడుతూ నువ్వు చస్తే నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని అబార్షన్ చేయించుకుంటానని నిహారిక వేధించింది. ఇదే విషయమై ఆమె తల్లిదండ్రులు సైతం మానసికంగా వేధించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాకేశ్ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ములుగు ఫ్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తండ్రి వెంకటరాజ్యం ఫిర్యాదు మేరకు రాకేశ్ భార్య నిహారిక, అత్తమామలు దేవుళ్లపల్లి శంకర్, అరుణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: (Doctor Death Mystery: ‘అశ్లీల చిత్రాలతో బెదిరించి చంపేశాడు’) -
పలు రూట్లలో ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్–తిరుపతి (07691/07692) స్పెషల్ ట్రైన్ ఈనెల 26 రాత్రి 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 9.55 గంటలకు తిరుపతి నుంచి బయ ల్దేరి మరుసటి రోజు ఉదయం 10.10 గంటలకు నాంపల్లికి చేరుకుంటుంది. సికింద్రాబాద్–యశ్వంత్పూర్ (07193/ 07194) స్పెషల్ ట్రైన్ ఈనెల 29న మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు జామున 4 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 30న సాయంత్రం 5.20 గంటలకు యశ్వంత్పూర్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్–నాగర్సోల్ (07089/07090) ప్రత్యేక రైలు ఈనెల 24న రాత్రి 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.25 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 25 రాత్రి 10 గంటలకు నాగర్సోల్ నుంచి బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ చేరుకుంటుంది. -
రాకేశ్ సోదరునికి ఉద్యోగం.. తెలంగాణ సీఎస్ ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన హింసాత్మక ఘటనల సమయంలో పోలీసు కాల్పుల్లో మరణించిన దామెర రాకేశ్ సోదరునికి ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కారుణ్య నియా మకాల కింద మృతుని సోదరునికి ఉద్యోగం కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడం తెలిసిందే. ఈ మేరకు రాకేశ్ సోదరుడు దామెర రామ్రాజుకు అతని విద్యార్హతల ఆధారంగా వరంగల్ జిల్లాలో ఉద్యోగం ఇవ్వాలని సీఎస్ సోమేశ్కుమార్ వరంగల్ జిల్లా కలెక్టర్ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. (క్లిక్: సుబ్బారావు తగలబెట్టమన్నాడు.. శివ అమలు చేశాడు!) -
‘పుష్ప’ ఐటం సాంగ్ టైటిల్తో సినిమా
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రంలోని ఐటం సాంగ్ ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ పాట పేరుతోనే ఓ సినిమా తెరకెక్కుతుంది. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జబర్దస్త్ రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై తుమ్మల ప్రసన్నకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రెండు పాటలు మినహా షూటింగ్ అంతా పూర్తయినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. మిగిలిన రెండు పాటల షూట్ కోసం కశ్మీర్ వెళ్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్లో టైటిల్ అనౌన్స్మెంట్ కార్యక్రమం చేపట్టింది. నిర్మాత మాట్లాడుతూ ‘పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న చిత్రమిది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందనే నమ్మకం వుంది. బ్యాలెన్స్ రెండు పాటలను కాశ్మీర్లోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరిస్తాం. జూలై చివరివారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం. అందరూ ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా రేలంగి నరసింహారావు గారు గత సినిమాల రికార్థులను ఈ సినిమా అధిగమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు. దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ..ఇప్పటి వరకు చేసిన కామెడీ సీనిమాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. ఇది కామెడీ తో కూడుకున్న హార్రర్ సినిమా. కాశ్మీర్ లో జరిగే పాటల షూట్ తో సినిమా పూర్తి చేసుకొని జులై చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేస్తాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్తో పాటు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు కొల్లి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి దామోదర్ ప్రసాద్, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, దర్శకులు అజయ్ కుమార్, రాజా వన్నెం రెడ్డి, సత్య ప్రకాష్, ఆచంట గోపినాథ్, దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాత బెక్కం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కాల్పులకు బాధ్యులు ఎవరు ??
-
ముగిసిన రాకేశ్ అంత్యక్రియలు.. వేలాదిగా తరలిన జనం (ఫొటోలు)
-
ముగిసిన రాకేష్ అంత్యక్రియలు
-
కాబోయే సైనికుడు రాకేష్ అంతిమ యాత్ర
-
అంతిమ యాత్రకు బయలుదేరిన రేవంత్ రెడ్డికి షాకిచ్చిన పోలీసులు
-
రాకేశ్ మృతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో రాకేశ్ అనే విద్యార్థి చనిపోవడం బాధాకరమని టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాకేశ్ మృతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని.. ఇది బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు చేసిన హత్య అని శుక్రవారం ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ ఘటనలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
రాకేశ్ కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్ గ్రేషియా
సాక్షి, హైదరాబాద్: అగ్నిపథ్ నియామక ప్రక్రియను వ్యతిరేకిస్తూ శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరుద్యోగులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్ మృతిచెందడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలకు బలైపోయిన బీసీ బిడ్డ రాకేశ్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియాతోపాటు, ఆ కుటుంబంలో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లనే రాకేశ్ బలయ్యాడని విచారం వ్యక్తంచేశారు. -
అక్క స్ఫూర్తి, అన్న ఆశయం కోసం..
ఖానాపురం: అక్క బీఎస్ఎఫ్లో కానిస్టేబుల్.. అన్న కూడా ఆర్మీలో చేరేందుకు చాలా ప్రయత్నించి విఫలమయ్యాడు.. ఆ అక్కను స్ఫూర్తిగా తీసుకుని, అన్న ఆశయాన్ని తాను నెరవేర్చాలనుకుని శిక్షణ పొందాడు. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పరుగు పందెం, దేహ దారుఢ్య పరీక్షల్లో విజయం సాధించాడు. రాత పరీక్ష పూర్తయితే ఆర్మీలో చేరడమే ఆలస్యమని అనుకున్నాడు. కానీ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ఆర్పీఎఫ్ పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబ్బీర్పేట గ్రామానికి చెందిన దామెర రాకేశ్ (21) కథ ఇది. దబ్బీర్పేటకు చెందిన దామెర కుమారస్వామి–పూలమ్మలకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుల్లో రాకేశ్ చిన్నవాడు. బీఏ చివరి సంవత్సరం చదువుతున్నాడు. రాకేశ్ సోదరి రాణి, సోదరుడు రాంరాజ్ సైన్యంలో చేరేందుకు చాలాకాలం ప్రయత్నించారు. 2016 లో రాణి బీఎస్ఎఫ్ రిక్రూట్మెంట్లో కానిస్టేబుల్గా ఎం పికై పశ్చిమబెంగాల్లో పనిచేస్తున్నారు. అక్కను స్ఫూర్తిగా తీసుకుని, అన్న ఆశయాన్ని నెరవేర్చాలని నిర్ణయించుకున్న రాకేశ్.. రెండేళ్ల క్రితం బాపట్లలో ఆర్మీ ఉద్యోగ శిక్షణ పొందాడు. 2021లో హకీంపేటలో జరిగిన రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొని రాత పరీక్షకు అర్హత సాధించాడు. హకీంపేటలో అర్హత సాధించినవారు ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ గ్రూప్లో.. ఆందోళన కార్యక్రమం గు రించి తెలిసి స్నేహితులతో కలిసి సికింద్రాబాద్కు వచ్చా డు. రైల్వేస్టేషన్లో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. నేడు దబ్బీర్పేటలో అంత్యక్రియలు! రాకేశ్ మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం.. ప్రత్యేక అంబులెన్స్లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని తమకు చూపకుండానే మార్చురీకి తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నేతలు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగగా.. శనివారం ఉదయం అప్పగిస్తామని పోలీసులు సర్దిచెప్పారు. రాకేశ్ మృతదేహానికి శనివారం దబ్బీర్పేటలో అంత్యక్రియలు జరుగుతాయని పోలీసువర్గాలు తెలిపాయి. మోదీ నా కొడుకును చంపాడు నా కొడుకు పట్టుదలతో చదువుకుంటున్నాడు. ఉద్యోగం సాధిస్తాడనే నమ్మకం ఉండేది. కానీ నా బిడ్డను కేంద్రం పొట్టన పెట్టుకుంది. నరేంద్ర మోదీ నా కొడుకును చంపాడు. ఉద్యోగం రాకున్నా కష్టపడి సాదుకునేవాడిని. నా కొడుకును కనుమరుగు చేశారు. మాకు న్యాయం కావాలి. అంతవరకు మృతదేహానికి అంత్యక్రియలు చేయబోం.. – దామెర కుమారస్వామి, రాకేశ్ తండ్రి ప్రాణం పోయినా పోరాటం ఆగదు ఛాతీలో పిల్లెట్ గాయంతో యువకుడి వీడియో వైరల్ గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): ‘‘2021లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో రన్నింగ్, ఫిజికల్, మెడికల్ టెస్ట్ల్లో పాసయ్యాను. రెండేళ్లవుతున్నా రాతపరీక్ష నిర్వహించలేదు. ఇప్పుడు అగ్నిపథ్ అంటున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద ధర్నా చేస్టుంటే కాల్చారు. ప్రాణం పోయినా మా పోరాటం ఆగదు. ఒకవేళ నేను చనిపోతే పోలీసులు, కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ కారణం..’’.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కాల్పుల్లో గాయపడిన లక్కం వినయ్ (20) బాధ ఇది. పోలీసులు జరిపిన కాల్పుల్లో మహబూబ్నగర్కు చెందిన వినయ్కు ఛాతీపై కుడి భాగంలో పిల్లెట్ తగిలి తీవ్ర గాయమైంది. అతడిని గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో అంబులెన్స్ సిబ్బంది వినయ్తో మాట్లాడుతూ వీడియో తీశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వినయ్కు చిన్నపాటి శస్త్రచికిత్స చేశామని, ఆరోగ్యం నిలకడగానే ఉందని గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. -
ఆహా ఏమి కారు.. రూ. 30 ఖర్చుతో 300 కి.మీ ప్రయాణం..!!
-
పలు రూట్లలో ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు రూట్లలో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు విశాఖపట్టణం–సికింద్రాబాద్ (08579/ 08580) వీక్లీ స్పెషల్ ట్రైన్ జూన్ 1వ తేదీ నుంచి 30 వరకు విశాఖపట్టణం– మహబూబ్ నగర్ (08585/08586) వీక్లీ స్పెషల్ ప్రతి మంగళ వారం విశాఖ నుంచి రాత్రి 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు మహబూబ్నగర్కు చేరుకుం టుంది. కాచిగూడ– తిరుపతి (07297/ 07298) స్పెషల్ ట్రైన్ జూన్ 1వ తేదీ రాత్రి 10.20 గంటలకి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు తిరుపతికి చేరుకుం టుంది. హైదరాబాద్– తిరుపతి (07433/ 07434) స్పెషల్ ట్రైన్ ఈనెల 31, జూన్ 7, 14, 21, 28 తేదీ ల్లో సాయంత్రం 6.40కి నాంపల్లి నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.50కి తిరుపతికి చేరు కుంటుంది. తిరుగు ప్రయాణంలో జూన్ 1, 8, 15, 22, 29 తేదీల్లో రాత్రి 8.25కు బయల్దేరి మర్నాడు ఉదయం 8.30కు నాంపల్లికి చేరుకుంటుంది. -
ప్రియుడికి రూ.లక్ష విలువైన ఫోన్ గిఫ్టిచ్చిన సుజాత
జోర్దార్ సుజాత.. టీవీ యాంకర్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె బిగ్బాస్ షోతో మరింత ఎక్కువమందికి చేరువైంది. నాగార్జునను కిట్టూ అని పిలుస్తూ అందరినీ తనవాళ్లే అనుకునే అమాయకత్వం, చిరునవ్వు చాలామందిని కట్టిపడేసింది. బిగ్బాస్ తెలుగు నాలుగో సీజన్లో పాల్గొన్న ఆమె సూపర్ సుజాత అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నిత్యం అభిమానులను ఎంటర్టైన్ చేస్తోంది. ఇక జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్తో ప్రేమలో పడ్డ సుజాత తాజాగా తన ప్రియుడికి మర్చిపోలేని బహుమతినిచ్చింది. లక్ష రూపాయల విలువైన కొత్త ఫోన్ కొనిచ్చింది. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియోను వదిలింది. చదవండి: ఆయన ఫోటో చూసి భోరున విలపించిన మిత్రాశర్మ 'నా ఆత్మీయుడు, ఫ్రెండ్, అంతకుమించి అయిన రాకేశ్కు ఫోన్ కొనిస్తున్నాను. తను కొద్దిరోజుల నుంచి మొబైల్తో ఇబ్బందిపడుతున్నాడు. పైగా కోపం వస్తే ఫోన్ పగలగొట్టే అలవాటు ఉంది. నేను అతడి మనసుకు దగ్గరైన వ్యక్తిని కాబట్టి నేను ఫోన్ కొనిస్తే దాన్ని పగలగొట్టడానికి ఆలోచిస్తాడు కదా అనిపించింది. తను నాకు దగ్గరైనప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నాను, నా ప్రతీ విజయంలో రాకేశ్ ఉన్నాడు. నేను ఫోన్ గిఫ్టిస్తే దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడనిపించింది, అందుకే ఈ ఫోన్ బహుమతిగా ఇస్తున్నాను' అని చెప్పుకొచ్చింది. సామ్సంగ్ గెలాక్సీ S 22 అల్ట్రా ఫోన్తో పాటు స్మార్ట్ వాచ్ కొనుగోలు చేసింది. వీటి ఖరీదు లక్షా 20 వేల రూపాయలు అని రాకేశ్ వెల్లడించాడు. ఇక సుజాత వీటిని తనకోసమే కొన్నానని చెప్పడంతో అతడు సర్ప్రైజ్ అయ్యాడు. మాటలు రావడం లేదంటూ ఎమోషనల్ అయ్యాడు. చదవండి: విశ్వక్ సేన్ గురించి చెప్పగానే షాకయ్యా! -
'జబర్దస్త్' కమెడియన్తో బిగ్బాస్ బ్యూటీ లవ్ ట్రాక్.. త్వరలోనే పెళ్లి
Rocking Rakesh And Jordar Sujatha All Set To Tie Knot: ప్రేమ..ఎప్పుడు ఎలా అయినా పుట్టొచ్చు. ఇక నటీనటుల మధ్య ప్రేమ సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని జోడీలు కేవలం షో కోసం లవ్ ట్రాక్ నడిపితే మరికొందరేమో నిజంగానే లవ్లో పడతారు. అలాంటి జోడీనే రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాతలు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ షోలో పాల్గొన్న వీరిద్దరూ తమది రియల్ జోడీనే అని ప్రకటించారు. ఇక రాకేశ్ అయితే రింగ్ పెట్టి మరీ ప్రపోజ్ చేయగా సుజాత సిగ్గుతో నవ్వేసింది. త్వరలోనే తమ పెళ్లి ఉంటుందంటూ ఇద్దరూ హింట్ కూడా ఇచ్చేశారు. కాగా యాంకర్గా కెరీర్ మొదలుపెట్టిన సుజాత బిగ్బాస్ సీజన్-4లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ షోతో మరింత గుర్తింపు తెచ్చుకున్న సుజాత ప్రస్తుతం టీవీ షోలు చేస్తుంది. ఈ క్రమంలోనే రాకింగ్ రాకేష్తో కలిసి పలు స్కిట్లు చేసింది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, వీరి పెళ్లికి ఇరు వర్గాల కుటుంబసభ్యులు ఇప్పటికే అంగీకరించినట్లు తెలుస్తుంది. ఈ ఏడాదే వీరి పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు సమాచారం. -
తగ్గేదేలే... ఈసారి గర్వంగా మెలేశాడు
భోపాల్: తగ్గేదేలే... సస్పెండ్ చేసినా సరే బారు మీసం తీయనంటే తీయనని భీష్మించిన మధ్యప్రదేశ్ కానిస్టేబుల్ రాకేశ్ రాణా పంతమే నెగ్గింది. మీసం నా ఆత్మగౌరవానికి ప్రతీకన్న ఆయన సగర్వంగా మీసం తిప్పాడు. పోలీసు శాఖ రాణాపై సస్పెన్షన్ను ఎత్తివేసింది. మధ్యప్రదేశ్లో పోలీసు రవాణా విభాగంలో డ్రైవర్గా పనిచేస్తున్న రాకేశ్ రాణాను మీసాలు, తలపై జుట్టును తగ్గించాలని.. అలా పెంచడం నిబంధనలకు విరుద్ధమని ఉన్నతాధికారులు హెచ్చరించినా.. అతను ఖాతరు చేయలేదు. దాంతో సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వార్తకు బాగా ప్రాచుర్యం లభించడంతో పోలీసు శాఖ యూటర్న్ తీసుకుంది. రాణాను సస్పెండ్ చేసే అధికారం లేకున్నా ఏఐజీ ప్రశాంత్ శర్మ... ఆ మేరకు ఆదేశాలు ఇచ్చారని, అందువల్ల రాకేశ్ రాణాను తిరిగి విధుల్లో చేర్చుకుంటున్నట్లు పోలీసు హెడ్క్వార్టర్స్ డీఐజీ (పర్సనల్) ఉత్తర్వులు జారీచేశారు. -
ఖతర్నాక్ కానిస్టేబుల్.. మీసాలపై తగ్గేదేలే... తీయనంటే తీయను, ఇంకేముంది!
భోపాల్: ఉద్యోగం ఊడినా బేఖాతర్.. మెలేయడానికి మీసాలుంటే చాలు.. ఇదీ భోపాల్కి చెందిన ఓ పోలీసు కానిస్టేబుల్ వైఖరి. పొడవుగా పెంచిన జుట్టు, మీసాలు తగ్గించనందుకు మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన రాకేశ్ రాణా అనే పోలీసు కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు పడింది. క్రమశిక్షణా చర్యల కింద అతనిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. పోలీసుశాఖలోని రవాణా విభాగంలో డ్రైవర్గా ఉన్న రాణా ఎంతో మక్కువతో చాలా ఏళ్లుగా మీసాలు పెంచుతున్నాడు. అవి ఏకంగా మెడవరకు వచ్చేశాయి. పోలీసుశాఖలో పనిచేస్తున్నప్పుడు చూడడానికి హుందాగా ఉండాలంటూ సీనియర్లు రాణాని మీసాలు, జుట్టు తగ్గించాలని ఆదేశించారు. కానీ ఆ ఆదేశాలను రాణా ధిక్కరించాడు. ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే మీసం విషయంలో రాజీ పడలేనని తెగేసి చెప్పేశాడు. దీంతో రాణాని సస్పెండ్ చేసినట్టు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ప్రశాంత్ శర్మ చెప్పారు. అయినప్పటికీ రాణా తగ్గేదేలే అంటున్నాడు. తాను ఒక రాజ్పుత్నని మీసం మెలేయడమే తప్ప వాటిని తగ్గించడం చేతకాదని టీవీ ఛానెళ్లకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పాడు. -
‘గైడ్’ సినిమాను తలపించే ప్రేమ కథ.. ఫ్రెంచ్ అమ్మాయి మనసు దోచిన బిహారీ
ఢిల్లీ చూడటానికి వచ్చింది పారిస్ నుంచి ఆమె. అతడు గైడ్. అతడు కబుర్లు చెప్పి తిప్పాడు. ఆమె పదే పదే నవ్వింది. ఇద్దరూ ఫోన్ నంబర్లు తీసుకున్నారు. మూడు నెలల తర్వాత ఐ లవ్ యూ చెప్పుకున్నారు. ఆమె అతణ్ణి గైడ్ నుంచి బిజినెస్మేన్గా మార్చడానికి పారిస్ పిలిపించింది. ఎదిగేలా చేసింది. ఆరేళ్ల తర్వాత ఇదిగో ఇలా బిహార్కు వచ్చి మరీ వివాహం చేసుకుంది. ఒక కుతూహలం రేపే రాకుమారి తోటరాముడు కథ. గైడ్ సినిమాలో దేవ్ఆనంద్ కథ. ఈ ప్రేమకథ వింటే పాత తరం వారికి ‘గైడ్’ సినిమా గుర్తుకు వస్తుంది. ఆర్.కె.నారాయణ్ రాసిన నవల ఆధారంగా దేవ్ ఆనంద్, వహీదా రహెమాన్ నటించిన ‘గైడ్’ సినిమాకు ఈ ప్రేమ కథ కొంతమేర పోలి ఉంది. ‘గైడ్’లో ఉదయ్పూర్ దగ్గర గైడ్గా పని చేస్తున్న దేవ్ ఆనంద్ను ఆ ప్రాంతాన్ని చూడటానికి వచ్చిన వహీదా ప్రేమిస్తుంది. ఈ ప్రేమ కథలో కూడా భారత్ను చూడటానికి ఫ్రాన్స్ నుంచి వచ్చిన యువతి ఢిల్లీలో గైడ్గా పని చేస్తున్న కుర్రాణ్ణి ప్రేమించింది. అయితే మనదేశంలో కొన్నిసార్లు కనిపించే కుల, మత, జాతి అడ్డంకులు ఈ ప్రేమకథలో రాలేదు. ప్రేమ ఫలించింది. మొన్నటి ఆదివారం వీరి పెళ్లి జరగగా నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆరేళ్ల క్రితం ఆరేళ్ల క్రితం పారిస్ నుంచి మేరీ లోరి హెరెల్ అనే యువతి ఇండియా చూడటానికి ఢిల్లీ వచ్చింది. అక్కడ బిహార్లోని బేగుసరాయి జిల్లాకు చెందిన రాకేష్ గైడ్గా పని చేస్తున్నాడు. మేరీకి ఢిల్లీ చూపించే బాధ్యత వృత్తిలో భాగంగా అతనిపై పడింది. చురుగ్గా ఉంటూ విసుగు చూపించకుండా నవ్విస్తూ ఢిల్లీలో రెండు మూడు రోజుల పాటు గైడ్గా వ్యవహరించిన రాకే మేరీకి నచ్చాడు. నిజానికి పారిస్లో మేరీ టెక్స్టైల్ రంగంలో ఉంది. వ్యాపారవేత్త. రాకుమారి కిందే లెక్క. రాకేష్ బేగుసరాయ్లో ఒక దిగువ మధ్యతరగతి తల్లిదండ్రులకు పుట్టిన కుర్రవాడు. ఒక దేశం కాదు. ఒక భాష కాదు. ఒక సంస్కృతి కాదు. అయినా సరే ‘మనిషి మంచివాడు... ఈమె హృదయం మంచిది’ అని స్త్రీ, పురుషులకు అనిపించడానికి అవి అడ్డు నిలవలేకపోయాయి. వారు ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. అసలైన ప్రేమ ఆ తర్వాత మొదలైంది. ఫోన్ ప్రేమ టూరిస్ట్లు టూర్ ముగిసిన వెంటనే గైడ్లను మర్చిపోతారు. వారికి చూసిన ప్రాంతాలు గుర్తుంటాయి కాని చూపించిన మనుషులు గుర్తుండరు. కాని భారత్ చూసి పారిస్ వెళ్లిపోయిన మేరీ రాకేష్కు తరచూ ఫోన్ చేసేది. రాకేష్ కూడా ఆమెకు ఫోన్ చేసి మాట్లాడేవారు. సరిగ్గా మూడు నెలలు గడిచాక ఇద్దరికీ అర్థమైంది తాము ప్రేమలో ఉన్నామని. ఇద్దరూ ఐ లవ్ యూ చెప్పుకున్నారు. కాని ప్రపంచాన్ని చూసిన మేరీకి రాకేష్ చేస్తున్న ఉద్యోగం, పని భవిష్యత్తులో ముందుకు పోవడానికి సహకరించవని మేరీకి అర్థమైంది. ‘నువు పారిస్ వచ్చి ఏదైనా మంచి పని చేయి’ అంది. ‘నాకు ఎవరు ఇస్తారు పని’ అన్నాడు రాకేష్. ‘నా వ్యాపారంలోనే పార్టనర్గా మారు’ అంది మేరీ. అంతే కాదు వీసా, టికెట్ రెండూ పంపింది. మూడేళ్ల క్రితం రాకేష్ పారిస్ వెళ్లాడు. అంతవరకూ మధ్యలో సంవత్సరానికి ఒకటి రెండుసార్లు మేరీ ఇండియా వచ్చి రాకేష్ను కలిసి వెళ్లేది. అప్పటికి వారిది ప్రేమే తప్ప పెళ్లి ఆలోచన లేదు. తండ్రి పాదాలకు నమస్కరిస్తున్న నూతన వధువు ప్రేమతో పని చేస్తుంటే పారిస్ వెళ్లిన రాకేష్ మేరీ వ్యాపారంలో పార్టనర్గా మారి పని చేయడం మొదలెట్టాడు. ఢిల్లీలో చూసిన రాకేష్లో ఏమాత్రం మార్పు లేదని అతను తన పనిని మనసు పెట్టి చేస్తాడని, జీవితం పట్ల, మనుషుల పట్ల అతనికి విశ్వాసం ఉందని మేరీ అర్థం చేసుకుంది. జీవితాంతం అతనితో కలిసి జీవించవచ్చని మరో మూడేళ్లకు ఆమె నిర్థారణ చేసుకుంది ‘మనం పెళ్లి చేసుకుందాం’ అంది. సరే చేసుకుందాం అని రాకేష్ అంటే ‘ఇక్కడ కాదు... ఇండియాలో. మీ పద్ధతిలో. మీ తల్లిదండ్రుల సమక్షంలో’ అని చెప్పింది. రాకేష్ పారిస్ నుంచి తల్లిదండ్రులతో బంధువులతో మాట్లాడారు. ‘నువ్వు చేసుకుంటే మేము అడ్డు చెప్పేదేముంది’ అన్నారు వారు. రాకేష్ను మూడేళ్లుగా చూస్తున్నారు కనుక మేరీ తల్లిదండ్రులు కూడా అభ్యంతరం చెప్పలేదు. పెళ్లి ఖాయమైంది. నవంబర్ 19, ఆదివారం రాత్రి, బేగుసరాయ్లో పెళ్లి. వియ్యంకులయ్యారు రాకేష్ తండ్రి రామచంద్ర షా, మేరీ తండ్రి వేస్ హెరెల్ వియ్యంకులయ్యారు. పారిస్ నుంచి తల్లిదండ్రులతో బేగుసరాయ్ వచ్చిన మేరీ వధువుగా మారి రాకేష్ను పతిగా పొందింది. దానికి ముందు వియ్యంకులు ‘జప్మాలా’ అనే తంతులో పాల్గొన్నారు. బాలీవుడ్, భోజ్పురి పాటలకు నృత్యాలు చేశారు. విదేశీ అమ్మాయిని మన ఊరి కుర్రాడు పెళ్లి చేసుకుంటున్నాడన్న వార్త విని ఊరి జనాలు విరగపడ్డారు. పెళ్లి బాగా జరిగింది. మరి కొన్ని రోజుల్లో ఆ జంట పారిస్కు వెళ్లనుంది. కొన్ని ప్రేమకథలు కలతను కలిగిస్తాయి. కొన్ని సంతోషాన్నిస్తాయి. ఈ పెళ్లి వార్త సోషల్ మీడియాలో అందరికీ నచ్చింది. మేరీ, రాకేష్లను అందరూ అభినందిస్తున్నారు. ప్రేమ పండించుకున్న అదృష్టవంతులు వీరు. త్వరలో ఇదంతా సినిమాగా వచ్చినా ఆశ్చర్యం లేదు. -
రాకేష్ మాస్టర్పై పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, కుషాయిగూడ: హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడిన డ్యాన్స్ మాస్టర్ రాకేష్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేవైఎం రాష్ట్ర నాయకులు సందీప్యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం కుషాయిగూడ ఇన్స్పెక్టర్ మన్మోహన్కు ఫిర్యాదు చేశారు. అనంతరం సందీప్ యాదవ్ మాట్లాడుతూ శ్రీ కృష్ణ పరమాత్ముడిపై అనుచిత వాఖ్యలు చేసిన రాకేష్ మాస్టర్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో యాదవ సమాజం భౌతిక దాడులకు సైతం వెనుకాడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బంగి లక్ష్మణ్, బీజేవైఎం నాయకులు ఉదయ్కిరణ్, నరేష్, మధు, రాకేశ్, జయంత్, అడ్వొకేట్ హరికృష్ణ ఉన్నారు. చదవండి: నాపై దాడికి యత్నించారు: రాకేష్ మాస్టర్ -
నాపై దాడికి యత్నించారు: రాకేష్ మాస్టర్
బంజారాహిల్స్: ఇంట్లోకి ప్రవేశించి తనపై దాడి చేయడానికి యత్నించడమే కాకుండా ఇంట్లోని వస్తువులన్నీ ధ్వంసం చేశారంటూ సినీ నృత్యకారుడు ఎస్.రామారావు అలియాస్ రాకేష్ మాస్టర్ (50) బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. శ్రీకృష్ణానగర్ ‘ఏ’ బ్లాక్లోని దేవేందర్ గౌడ్ అపార్ట్మెంట్స్లో నివసిస్తున్న తన ఇంట్లోకి సాయంత్రం సాయి యాదవ్, ఇమ్రాన్తో పాటు మరికొందరు అక్రమంగా ప్రవేశించి తనను దుర్భాషలాడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తూ కిటికీలు ధ్వంసం చేస్తూ చంపేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తొమ్మిది నెలల క్రితం ఓ యూట్యూబ్ చానల్కు తాను ఇంటర్వ్యూ ఇచ్చానని ఈ నేపథ్యంలోనే తనపై దాడి జరిగిందని ఆయన పేర్కొన్నారు. సాయి యాదవ్, ఇమ్రాన్తో పాటు తనపై దాడికి యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘దీదీ ఓ దీదీ సినిమా..’ ఆర్జీవీ వైరల్ వీడియో..! -
రైళ్లను పెంచుతున్నాం.. ఎంఎంటీఎస్పై స్పష్టత రాలేదు
సాక్షి, హైదరాబాద్: రైళ్లను దశలవారీగా పెంచుతున్నామని, కరోన ముందు నడిచే రైళ్లు 70 శాతం ఇప్పటికే నడుస్తున్నాయని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్ఓ రాకేష్ తెలిపారు. ఆయన బుధవారం సాక్షి టీవీతో మాట్లాడుతూ.. సుమారు 300 రైళ్లు ఉండేవి అందులో 215 రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే 140 రైళ్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 1నుంచి కొన్ని రైళ్లు పెంచుతున్నామని, ఇవన్నీ సికింద్రాబాద్ జోన్ నుంచి వెళ్తాయని తెలిపారు. పూర్తిగా రైళ్లని రిజర్వేషన్ ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఎక్కడ కూడా సాధారణ ప్రయాణికులు రావడానికి అనుమతి లేదన్నారు. రిజర్వేడ్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయిని, వెయిటింగ్ లిస్ట్ ఉన్నవారిని కూడా అనుమతించడం లేదని పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ రైళ్ల పునరుద్ధరనపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. కోవిడ్ కేసులు ఇంకా తగ్గని కారణంగా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. పరిస్థితి బట్టి ఎంఎంటీఎస్ రైళ్ల ప్రకటన ఉంటుంది అనుకుంటున్నామని ఆయన తెలిపారు. చదవండి: పట్టాలెక్కనున్న మరిన్ని స్పెషల్ రైళ్లు -
ఎవరూ నమ్మరు
ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్, విక్రమ్ విక్కి, విజయేందర్, రాకేష్ ముఖ్య పాత్రల్లో ఆర్యన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెప్పినా ఎవరూ నమ్మరు’. ఎం.మురళీ శ్రీనివాసులు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది. హీరో, డైరెక్టర్ ఆర్యన్ కృష్ణ మాట్లాడుతూ– ‘‘మా సినిమా ట్రైలర్, ఫస్ట్ లుక్కు చాలా మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ చూసి థియేటర్లో మా సినిమాను విడుదల చెయ్యడానికి డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వచ్చారు. జనవరి 1న విడుదల చేయాలనుకున్నాం.. అయితే థియేటర్ల సమస్య వల్ల మూవీ మాక్స్ అధినేత శ్రీనివాసులు ద్వారా ఈ నెల 29న విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో సహజమైన సన్నివేశాలు ఉంటాయి. ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఎం. మురళీ శ్రీనివాసులు. -
‘గతం’... గుర్తు పెట్టుకోలేం! అలాగని మరిచిపోలేం!
ఓ.టి.టిలో సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ తరహా కంటెంట్కు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఆ నమ్మకంతో రిలీజైన ఫిల్మ్ ‘గతం’. ఎన్నారైలైన ఐ.టి. ఉద్యోగులే నటిస్తూ, సమష్టిగా నిర్మిస్తూ చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. కథేమిటంటే..: ఆస్పత్రి మంచం మీద కోమాలో నుంచి లేచి, గతం మర్చిపోయిన ఓ అబ్బాయి (రిషి పాత్రలో రాకేశ్). అతని ప్రియురాలిగా గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించే ఓ అమ్మాయి (పూజిత). గతాన్ని తెలుసుకోవడానికంటూ వారిద్దరూ కారులో బయలుదేరతారు. మార్గమధ్యంలో, చిమ్మచీకటిలో కారు ఆగిపోతే, అపరిచిత వ్యక్తి అర్జున్ (భార్గవ పోలుదాసు) తన ఇంట్లో ఆశ్రయం ఇస్తాడు. ఆ ఇంట్లోకి వెళ్ళాక ఆ జంటకు ఎదురైన విచిత్రమైన అనుభవాలు ఏమిటి, మర్చిపోయిన ఆ గతం ఏమిటి, ఆ గతానికీ ఈ వ్యక్తులకూ సంబంధం ఏమిటన్నది కథ. ఎలా చేశారంటే..: ‘‘ప్రతి మనిషిలోనూ ఓ సైకోపాత్ ఉంటాడు’’ అంటూ ఔత్సాహికులు చేసిన ఈ సినిమాలో నటీనటులంతా కొత్తవాళ్ళే. అపరిచిత ముఖాలే. అయినా, వెండితెరపై విలన్ పాత్రలకు సరిపోయే అర్జున్ పాత్రధారి భార్గవ ఆకట్టుకుంటారు. రిషి పాత్రధారి రాకేశ్ గొంతు, ఉచ్చారణ కళ్ళు మూసుకొని వింటే, హీరో విజయ్ దేవరకొండ గుర్తుకొస్తారు. ‘మాయాబజార్’ దర్శకులు కె.వి. రెడ్డికి ముని మనుమరాలైన పూజితారెడ్డి పాత్ర పరిధిలో ఉన్నంత మేరకు చేశారు. మిగిలిన పాత్రలన్నీ కథలో భాగంగా వచ్చిపోయేవి. ఎలా తీశారంటే..: మొత్తం అమెరికా నేపథ్యంలోనే సాగే ఈ చిత్రంలో మనోజ్ రెడ్డి కెమెరాలో అమెరికాలో మంచుతో నిండిన లొకేషన్లు తెరపై అందంగా కనిపించాయి. సినిమాకు మరో ప్రధాన బలం శ్రీచరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం. థ్రిల్లర్ కథనూ, సన్నివేశాలనూ బలంగా చెప్పడంలో చరణ్ పనితనం బాగా ఉపయోగపడింది. షార్ట్ ఫిల్ముల నుంచి దర్శకుడిగా మారిన అమెరికన్ ఐ.టి. ఉద్యోగి కిరణ్ రెడ్డి మంచి పాయింట్ను ఎంచుకున్నారు. కానీ, అంతకు తగ్గ పటిష్ఠమైన కథనం అల్లుకోలేదనిపిస్తుంది. ఇన్ని నేరాలు జరుగుతున్నా ప్రధాన పాత్రధారి తప్ప పోలీసులెవరూ పరిశోధిస్తున్నట్టు కనపడరు. కొడుకు చేసే ఘోరాలకు తండ్రి ఎందుకు సహకరిస్తున్నాడన్న దానికీ పెద్దగా లాజిక్ లేదు. కథనంలో కొన్ని సన్నివేశాలు ముందుగా ఊహించేసే తీరులో ఉండడమూ మరో బలహీనత. సినిమా ఫస్టాఫ్ స్లోగా సాగుతుంది. అసలు కథ మొదలైన సెకండాఫ్ చివరికొచ్చే కొద్దీ ఆసక్తి పెరుగుతుంది. కానీ, అప్పటికే ఆలస్యమైపోయిందని వీక్షకులు భావిస్తేనే కష్టం. అయితే, ఐ.టి. ఉద్యోగులు తమ ఉద్యోగాలు చేసుకుంటూనే, క్రిస్మస్ సెలవుల్లో, వీకెండ్స్ లో తీస్తూ, వీలైనంత తక్కువ బడ్జెట్లో, అతి తక్కువ యూనిట్తో చేసిన ప్రయత్నంగా కథలోని చాలా లోపాలను క్షమించ బుద్ధేస్తుంది. కమర్షియల్ లెక్కలతో కాకుండా, ప్రేమతో ప్రవాస భారతీయులు చేసిన ప్రయత్నంగా ‘గతం’ను అభినందించాలని అనిపిస్తుంది. కానీ, గ్రిప్పింగ్గా ఉన్న ట్రైలర్కు భిన్నంగా స్లోగా సాగే ఈ నూటొక్క నిమిషాల కథాకథనాన్ని అందరూ ఆనందించగలరా? కొసమెరుపు: ‘గతం’... గుర్తు పెట్టుకోలేం! అలాగని మరిచిపోలేం! బలాలు: ► నేపథ్య సంగీతం ► క్రై మ్, ఇన్వెస్టిగేషన్ అంశం ► సినిమా చివరి అరగంట ► భార్గవ అభినయం. బలహీనతలు: ∙ ► అంతా కొత్తవాళ్ళే కావడం ► సీన్లలోని ప్రిడిక్టబిలిటీ ► ఫస్టాఫ్లోని స్లో నేరేషన్ ► కథ నడిపిన విధానం. – రెంటాల జయదేవ -
వెయిట్ & సీ!
సాక్షి, హైదరాబాద్: అధిక బరువు.. ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య.. కరోనా కారణంగా అనేకమంది ఇళ్లకే పరిమితమయ్యారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మొదలు అనేకమంది ప్రైవేట్ వృత్తి నిపుణులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది లాక్డౌన్ టైంలో వెయిట్ పెరిగారు.. దీన్ని చాలా మంది లైట్ తీసుకుంటున్నారు కూడా.. అయితే.. ఇది సరికాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిపై సీరియస్గా దృష్టి పెట్టాలంటున్నారు. ఈ విషయంపై ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ (ఏఐజీ)లోని సెంటర్ ఫర్ ఒబెసిటీ అండ్ మెటబాలిక్ థెరపీ డైరెక్టర్, ప్రముఖ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ రాకేశ్ కలపాల ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... మారిన లైఫ్ సై్టల్తో అనారోగ్యం కరోనా కారణంగా చాలామంది ఇంటికే పరిమితం అయ్యారు. జీవనశైలి రూపురేఖలు మారిపోయాయి. శారీరక శ్రమ లేకపోవడంతో షుగర్, బీపీ, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. దీంతో సైలెంట్గా ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు సైడ్ ఎఫెక్ట్స్కు దారితీస్తున్నాయి. బలవర్థకం పేరుతో అతి తిండి... కరోనా కాలంలో పోషకాహారం తినాలన్న సూచనలతో కొందరు అతిగా తినేస్తున్నారు. దీంతో బరువు పెరుగుతున్నారు. బరువు అతిగా పెరిగితే ఫ్యాటీ లివర్ వస్తుంది. పేగుల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. లూజ్ మోషన్స్ లేదా మలబద్దకం వస్తుంది. దీన్నే ఇరిటబుల్ బౌల్ సిండ్రోం అంటారు. ఊబకాయం ఉన్నవారిలో శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. ఈట్ హెల్దీ... ఈట్ వైజ్లీ... ఈట్ టైమ్లీ ఊబకాయం నుంచి బయటపడాలంటే ప్రత్యేక ఆహార అలవాట్లు పాటించాలి. ఈట్ హెల్దీ... అంటే తక్కువ కార్బోహైడ్రేట్, తక్కువ ఫ్యాట్, ఎక్కువ ప్రొటీన్ ఉండేలా ఆహారం తినాలి. ఈట్ వైజ్లీ... అంటే ఆహార పదార్థాలను తెలివిగా ఎంచుకొని తినాలి. అంటే షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బులున్నవారు పోషకాహార నిపుణుల సలహా మేరకు ఎంపిక చేసుకొని తినాలి. ఈట్ టైమ్లీ... అంటే ఉదయం 8–9 గంటల మధ్య బ్రేక్ఫాస్ట్, తర్వాత 11 గంటలకు స్నాక్స్... మధ్యాహ్నం 1–2 గంటల మధ్య భోజనం... సాయంత్రం 5 గంటలకు స్నాక్స్... మళ్లీ రాత్రి 7–8 గంటల మధ్య డిన్నర్ చేయాలి. పైగా తక్కువ మోతాదులో తినాలి. బెరియాట్రిక్ సర్జరీ: దీంతో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇక మూడోది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అంటే 24 గంటల్లో 6–8 గంటల మధ్యలో తిని మిగతా 16–18 గంటలు ఏమీ తినకుండా ఉండటమే. డాక్టర్లు, పోషకాహార నిపుణల సూచనల మేరకు చేయాలి. గుండె, కిడ్నీ, ఇతర దీర్ఘకాలిక జబ్బులున్నవారు వైద్యుల పర్యవేక్షణలో జాగ్రత్తగా చేయాలి. ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రో ప్లాస్టీతో..చెక్ అధిక బరువు ఉన్న వారు కొన్ని రకాల చికిత్సలతో తగ్గించుకోవచ్చు. అందులో అత్యుత్తమమైనది ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రో ప్లాస్టీ (ఈఎస్జీ). ఈ విధానం నాన్ సర్జికల్ (కోత లేకుండా) చేసే ప్రక్రియ. ఇది నూటికి నూరుశాతం సురక్షితమైనది. ఎలాంటి మందులూ వాడాల్సిన అవసరం లేదు. ఈ ప్రక్రియలో పొట్ట సైజ్ను లోపల కుట్టేసి కుదిస్తారు. దీంతో తక్కువ ఆహారం తినడం వల్ల బరువు తగ్గుతారు. హార్మోన్ ్స ప్రొడక్షన్ను తగ్గిస్తుంది. ఆరు నెలల్లో 15–20 శాతం తగ్గుతారు. దీన్ని ఎటువంటి అనారోగ్య సమస్యలున్నవారైనా చేసుకోవచ్చు. వాకింగ్ అవసరం... మానసిక ఒత్తిడి వల్ల కూడా కొందరు అతిగా తింటారు. దానివల్ల ఊబకాయం వస్తుంది. వాకింగ్, రన్నింగ్, బరువులు ఎత్తాలి. 40 నిమిషాల నుంచి గంట పాటు వీటిని చేయవచ్చు. ఎసిడిటీ రాకుండా కారం, మసాల, ఆయిల్ తగ్గించి తినాలి. -
ఆఫీసర్ @ ట్రూ కాలర్
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇప్పిస్తానంటూ ఎర వేసి అనేక మంది నిరుపేదల్ని నిండా ముంచిన వై.రాకేష్ యాదవ్ ‘సాంకేతిక పరిజ్ఞానాన్నీ’ వినియోగించుకున్నాడు. ట్రూ కాలర్ యాప్లో తన నెంబర్ను కలెక్టరేట్లో అధికారి అంటూ నమోదు చేసుకున్నాడు. దీని ఆధారంగానే బాధితులకు కాల్స్ చేస్తూ వారిని నమ్మించి నిండా ముంచాడు. 17 మంది నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసి మోసం చేసిన రాకేష్ యాదవ్ను ఉత్తర మండల టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం విదితమే. ఇతడి విచారణలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఉప్పుగూడలోని కందిగల్గేట్ ప్రాంతానికి చెందిన వై.రాకేష్ యాదవ్ పదో తరగతి వరకు చదివి స్థానికంగా ఎలక్ట్రీషియన్గా పని చేసేవాడు. ఇతడి తండ్రి వై.అంజయ్య రేషన్ కార్డులు ఇప్పించడానికి దళారిగా వ్యవహరించాడు. (‘జేసీ బ్రదర్స్’ బాగోతం.. బిగుస్తున్న ఉచ్చు ) ఆయన ద్వారానే ప్రభుత్వ కార్యాలయాల పని తీరుపై రాకేష్కు అవగాహన వచ్చింది. ఇటీవల కాలంలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు భారీగా డిమాండ్ పెరిగిందని రాకేష్ తెలుసుకున్నాడు. దీంతో తానే ఓ ప్రభుత్వ అధికారిగా చెప్పుకుంటూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారిని గుర్తించడం మొదలెట్టాడు. ఇలా చేయడానికి ముందు తన స్మార్ట్ ఫోన్లో ట్రూ కాలర్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. అందులో తన నెంబర్ను ‘ఆఫీసర్ రంగారెడ్డి కలెక్టరేట్’ అంటూ సేవ్ చేసుకున్నాడు. దీంతో ఈ నెంబర్ నుంచి ఎవరికైనా కాల్స్ చేసినప్పుడు ఆ పేరునే ట్రూ కాలర్ చూపేది. దీంతో శ్రీనివాస్గా చెప్పుకున్న రాకేష్ కలెక్టరేట్ అధికారి అని తేలిగ్గా నమ్మేవాళ్ళు. దరఖాస్తుదారులకు పూర్తి నమ్మకం కలగడానికి వారి నుంచి దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, పాస్పోర్టు ఫొటోలను సంగ్రహించేవాడు. ముందుగా డీడీ కట్టాలంటూ రూ.40 వేల వరకు అడ్వాన్సుగానూ తీసుకునేవాడు. ఆపై తన ఫోన్లో సేవ్ చేసి ఉండే ‘మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరైంది. మొదటి ఇన్స్టాల్మెంట్ రూ.40 వేలు అందింది. రెండోది చెల్లించండి’ అనే ఎస్సెమ్మెస్ను బాధితులకు చూపేవాడు. దీని ఆధారంగా మిగిలిన మొత్తం కూడా తీసుకుని మోసం చేసేవాడు. ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం రాకేష్ అబిడ్స్, గోషామహల్, కోఠి తదితర ప్రాంతాలకు చెందిన 17 మంది నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేశాడు. ఇతడిని అరెస్టు చేసే సమయానికి బ్యాంకు ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా లేదని అధికారులు చెప్తున్నాడు. దేవరయాంజాల్లో ఓ విల్లా అద్దెకు తీసుకుని ఉంటున్న రాకేష్ జల్సాలకు ఎక్కువగా ఖర్చులు చేశాడని వివరిస్తున్నారు. రాజకీయ నాయకుడి మాదిరిగా వైట్ అండ్ వైట్ ధరించడం, కార్లలో తిరగడం చేస్తూ డబ్బు ఖర్చు చేసినట్లు గుర్తించారు. ఇతడి గతం, తాజా వ్యవహారాలను ఆరా తీస్తున్న పోలీసులు విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. -
90 శాతం రైళ్లు రద్దు
-
వైరస్ల తీరే వేరు!
భారత్లాంటి ఉష్ణమండల ప్రాంతాల్లో ‘కోవిడ్–19’ బతికి బట్టకట్టదు.. మాస్కులు ధరిస్తే వైరస్ దరిచేరదు.. ‘కోవిడ్’ నేపథ్యంలో వినిపిస్తున్న మాటలివి. అయితే, వీటిలో వాస్తవం కొంతేనని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్మిశ్రా చెబుతున్నారు. వాతావరణానికి, కోవిడ్కు సంబంధం ఉన్నట్టు ఎలాంటి శాస్త్రీయ ఆధారాల్లేవని ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. వైరస్ నుంచి రక్షణకంటూ చాలామంది మాస్కులు ధరిస్తున్నారని.. ఆరోగ్యవంతులకు ఇవి అవసరం లేదని, దగ్గు, జలుబు వంటివి ఉన్న వారు మాస్కులు తొడుక్కోవడం వల్ల ఆయా సమస్యలకు కారణమైన సూక్ష్మజీవులు ఇతరులకు సోకకుండా జాగ్రత్త పడవచ్చునని తెలిపారు. కోవిడ్–19 విషయంలో మాత్రం వ్యాధి సోకిన వారు లేదా లక్షణాలున్న వారు, రోగులకు వైద్య సాయం అందిస్తున్న వారు మాత్రమే మాస్కులు తొడుక్కోవడం మేలని సూచించారు. తెలివిమీరిన వైరస్లు కోవిడ్ కొత్తది కాకపోయినా, చాలాకాలంగా దీనిపై పరిశోధనలు జరుగుతున్నా ఇప్పటికీ తగిన చికిత్స లేకపోవడానికి వైరస్ల తీరుతెన్నులు కారణమని డాక్టర్ రాకేశ్మిశ్రా తెలిపారు. బ్యాక్టీరియా కంటే తక్కువ సైజుండే వైరస్లకు సొంతంగా పునరుత్పత్తి చేసే సామర్థ్యం ఉండదని, అందుకే ఇది పరాన్నజీవి మాదిరిగా ఇతరుల శరీర కణాల్లోకి చొరబడి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుందన్నారు. కోవిడ్ వంటివి తరచూ రూపురేఖలను మార్చుకుంటాయని, ఫలితంగా వాటిని మన రోగ నిరోధక వ్యవస్థ గుర్తించలేదన్నారు. అందువల్లే కొన్నేళ్లుగా కోవిడ్ కుటుంబంలోని సార్స్, మెర్స్ వైరస్ల గురించి తెలిసినా చికిత్సను అభివృద్ధి చేయలేకపోయామని వివరించారు. అయితే వైరస్లు ఎలా సోకుతాయి? ఎలా వ్యాపిస్తాయన్న అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండటం వల్ల కోవిడ్–19ను సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నామన్నారు. ‘కోవిడ్’ వేడికి చస్తుందా? కోవిడ్ వేడి వాతావరణంలో బతకలేదనేందుకు శాస్త్రీయ ఆధారాల్లేవని రాకేశ్ మిశ్రా తెలిపారు. సాధారణ వ్యక్తులు కోవిడ్ నుంచి రక్షణ కోసమని మాస్కులు తొడుక్కోవడం అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. కోవిడ్, సార్స్, మెర్స్ వంటి వైరస్ సమస్యలన్నింటికీ ఒకే మందు కనుక్కోవడం అసాధ్యం కాదని, ఆ దిశగా ప్రయత్నాలు జరగాలన్నారు. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నందున భారత్లో కోవిడ్ పెద్ద ఆరోగ్య సమస్యగా మారే అవకాశాల్లేవన్నారు. చైనాలో 90 వేలమందికి సోకి, మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయినా.. మరణించిన వారిలో 80ఏళ్లు పైబడిన వారు ఎక్కువగా ఉండటం గమనించాలన్నారు. -
శాల్తీని లేపేస్తానంటూ శ్రీరెడ్డి వార్నింగ్!
సాక్షి, బంజారాహిల్స్: సినీనటి శ్రీరెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ప్రముఖ కొరియోగ్రాఫర్, సినీ దర్శకుడు రామారావు అలియాస్ రాకేష్ మాస్టర్ శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి వివరాల ప్రకారం.. శ్రీకృష్ణానగర్లోని ఏ బ్లాక్లో నివసించే తాను తెలంగాణ కళామ్మతల్లి డ్యాన్స్ డైరెక్టర్ అండ్ డ్యాన్సర్స్ యూనియన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నానని, ఇప్పటివరకు 1500 సినిమాలకు కొరియోగ్రాఫర్గా పనిచేశానని, ప్రస్తుతం ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తున్నానని తెలిపారు. (హత్యా బెదిరింపులు.. శ్రీరెడ్డి ఫిర్యాదు) గత నెల 28వ తేదీన సాయంత్రం శ్రీరెడ్డి యూట్యూబ్, ఫేస్బుక్లో తనను చంపుతానని బెదిరించిందని, ఆమె అనుచరులతో ఫోన్ చేయిస్తూ బెదిరిస్తోందని వీడియో రికార్డులను పోలీసులకు అందజేశారు. తనపై శ్రీరెడ్డి చెన్నై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిందని, అక్కడి పోలీసులను హైదరాబాద్కు పంపించి చెన్నైకి ఈడ్చుకువచ్చి తనను అక్కడి పోలీసులతో కొట్టిస్తానని కూడా హెచ్చరిస్తోందని అన్నారు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి తాను చెప్పిన మాటలను అపార్థం చేసుకున్న ఆయన అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ పేరుతో ప్రతీరోజు తనకు వందల సంఖ్యలో కాల్ చేస్తూ చంపుతామని బెదిరించడమే కాకుండా, అసభ్యంగా దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి తన ఇంటికి వచ్చి తనను అంతం చేస్తామని కూడా బెదిరించారన్నారు. (శ్రీరెడ్డిపై మరో ఫిర్యాదు) ఒకవైపు శ్రీరెడ్డి, ఇంకోవైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హెచ్చరిస్తుండటంతో వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల ఓ చానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో లైవ్లోనే శ్రీరెడ్డి తనను అసభ్యపదజాలంతో దూషించిందని, తన మనోభావాలు కూడా దెబ్బతిన్నాయంటూ ఆ వీడియో రికార్డులను కూడా ఆయన పోలీసులకు అందజేశారు. ఇటీవల తాను సీసీఎస్లో సైబర్క్రైమ్లో పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలంటూ శ్రీరెడ్డి ఒత్తిడి తీసుకు వస్తోందని, అందులో భాగంగానే శాల్తీని లేపేస్తానంటూ బెదరిస్తున్నారని వాపోయారు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించి ఆధారాలు తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (‘శ్రీరెడ్డి దొరికిపోయింది’) -
జయరాం హత్య కేసులో ఛార్జ్షీట్ దాఖలు
సాక్షి, హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు సోమవారం ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మొత్తం 23పేజీల ఛార్జ్షీట్లో 12మంది నిందితులను పేర్కొన్నారు. ఈ కేసులో 73 మంది సాక్షులుగాను విచారించినట్లు పోలీసులు వెల్లడించారు. ఏ-1గా రాకేష్, ఏ-2గా విశాల్ను ఛార్జ్షీట్లో చేర్చారు. అయితే ఈ కేసులో చిగురుపాటి జయరాం మేనకోడలు శిఖాచౌదరిని 11వ సాక్షిగా పేర్కొన్నారు. హనీ ట్రాప్ ద్వారానే జయరాంను హత్య చేశారని చెప్పారు. అలాగే ఇందులో ముగ్గురు పోలీసు అధికారుల పాత్ర ఉన్నట్లు పేర్కొన్న పోలీసులు.. వారి సలహా మేరకే జయరాం మృతదేహాన్ని తరలించారని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. 11 వీడియోలు, 13 ఫోటోలను పోలీసులు రాకేశ్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. -
జయరాం హత్య, ఏపీ మంత్రికి రాకేష్ ఫోన్
-
జయరాం హత్య, ఏపీ మంత్రికి రాకేష్ ఫోన్
సాక్షి, హైదరాబాద్: ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్.. ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఏపీ మంత్రికి ఫోన్ చేసినట్లు స్పష్టమైంది. కేసు దర్యాప్తులో భాగంగా రాకేష్ కాల్ వివరాలు అధ్యయనం చేసిన హైదరాబాద్ పోలీసులు హత్య జరిగిన మరుసటి రోజున నిందితుడి నుంచి సదరు మంత్రికి ఔట్ గోయింగ్ కాల్ ఉన్నట్లు గుర్తించారు. ఓ చిన్న పని ఉందంటూ ఫిబ్రవరి 2న కలుస్తానంటూ నిందితుడు అపాయింట్మెంట్ కోరినట్లు, అందుకు మంత్రి అంగీకరించి విజయవాడ రమ్మని చెప్పినట్లు పోలీసు విచారణలో తేలింది. మంత్రిని కలిసేందుకు నిందితుడు హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున 4.30 గంటలకు విజయవాడకు విమానం టికెట్ బుక్ చేసుకున్నాడు. అప్పటికే జయరాం హత్య విషయంపై మీడియాలో హంగామా నడుస్తోంది. దీంతో తాను ఇంట్లో ఉంటే పోలీసులకు దొరికిపోతానని గచ్చిబౌలిలో ఉన్న ఓ హోటల్లో రూమ్ బుక్ చేసుకుని అక్కడ బస చేశాడు. తెల్లవారు జామున రాకేష్ శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరుతున్న సమయంలోనే పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఏపీ టీడీపీ నేతలతో, మంత్రులతో తనకున్న పరిచయాలతో కేసు నుంచి ఎలాగైనా బయటపడొచ్చనే ఉద్దేశంతో హైదరాబాద్లో హత్య చేసి కృష్ణా జిల్లా నందిగామ వద్ద కారును నిందితుడు వదిలి వెళ్లాడని విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. మృతుని భార్య, కుటుంబ సభ్యులు కూడా ఏపీలో అయితే న్యాయం జరగదని, కేసును తారుమారు చేస్తారని ఆరోపించడంతో కేసును తెలంగాణకు బదిలీ చేశారు. ఇప్పుడు వారి ఆరోపణలకు బలం చేకూర్చేలా నిందితుడు మంత్రికి ఫోన్ చేసినట్లు తేలడం చర్చనీయాంశంగా మారింది. మంత్రితో తనకు పరిచయం ఉందని, అయితే ఆ రోజు ఫోన్ చేసినప్పుడు హత్య విషయం చెప్పలేదని రాకేశ్ పేర్కొన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి తెలంగాణ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తేలాల్సి ఉంది. ఇదిలాఉండగా ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాల తారుమారుకు సహకరించిన పోలీసు అధికారులు, చోరీ కేసులో నిందితురాలిగా ఉన్న శిఖా చౌదరిలకు నోటీసులు ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు. -
జయరాం హత్య కేసు; కస్టడీకి రాకేష్, శ్రీనివాస్
-
‘డెత్ట్రాక్స్’పై స్పెషల్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో రక్తసిక్తమవుతున్న రైలుపట్టాల గురించి ‘సాక్షి’ ప్రచురించిన ప్రత్యేక కథనంపై దక్షిణ మధ్య రైల్వే స్పందించింది. నగరంలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ‘డెత్ ట్రాక్స్’ నివారణకు చర్యలు చేపట్టింది. ప్రమాదాలకు అవకాశమున్న అన్ని చోట్లా స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు ద.మ.రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ గురువారం తెలిపారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులతో కలిసి కార్యాచరణ కొనసాగించనున్నట్లు చెప్పారు. జంటనగరాల్లో ప్రమాదకరంగా మారిన రైల్వే పట్టాలపై.. ‘డెత్ట్రాక్స్’ శీర్షికన ‘సాక్షి’ గురువారం ప్రత్యేక కథనాన్ని ప్రచురిం చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కదిలిన రైల్వే శాఖ.. పోస్టర్లు, కరపత్రాలు, తదితర రూపాల్లో ప్రచారం చేయడంతోపాటు రైల్వే చట్టాలపై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించింది. గతంలో కంటే ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని, పట్టాలు దాటకుండా అనేక చర్యలు చేపట్టామని రాకేశ్ తెలిపారు. కొన్ని చోట్ల ప్రజలు నిర్లక్ష్యంగా పట్టాలు దాటుతున్నట్లు గమనించామన్నారు. అవసరమైన అన్ని చోట్లా సైడ్వాల్స్, ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు, ప్రజల భద్రత దృష్ట్యా ట్రాక్లపై రైల్వే శాఖ చేపట్టే అవగాహన కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు సహకరించాలని కోరారు. నగరంలోని సుమారు 48 కిలోమీటర్ల ఎంఎంటీఎస్ ట్రాక్ మార్గంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు సీపీఆర్వో స్పష్టం చేశారు. -
దక్షిణ మధ్య రైల్వే 108 ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి–నాగర్సోల్–నాందేడ్–కాకినాడల మధ్య 108 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి–నాగర్సోల్ (07417) వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ (28 సర్వీసులు) మార్చి 1, 8, 15, 22, 29, ఏప్రిల్ 5, 12, 19, 26, మేæ 3, 10, 17, 24, 31 తేదీల్లో ఉదయం 7.30 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 11.35 గంటలకు నాగర్సోల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (07418) మార్చి 2, 9, 16, 23, 30, మే 4, 11, 18, 25, జూన్ 1 తేదీల్లో రాత్రి 10 గంటలకు నాగర్సోల్లో బయలుదేరి రెండోరోజు ఉదయం 4 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. నాందేడ్–తిరుపతి (07607) రైలు(26 సర్వీసులు) మార్చి 5, 12, 19, 26, ఏప్రిల్ 2, 9, 16, 23, 30, మే 7, 14, 21, 28 తేదీల్లో సాయంత్రం 6.45 గంటలకు నాందేడ్లో బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో (07608) మార్చి 6, 13, 20, 27, ఏప్రిల్ 3, 10, 17, 25, మే 1, 8, 15, 22, 29 తేదీల్లో మధ్యాహ్నం 3.35 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 11.30 గంటలకు నాందేడ్ చేరుతుంది. తిరుపతి–కాకినాడ టౌన్–రేణిగుంట (07942) (26 సర్వీసులు) మార్చి 3, 10, 17, 24, 31, ఏప్రిల్ 7, 14, 21, 28, మే 5, 12, 19, 26 తేదీల్లో సాయంత్రం 7గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు కాకినాడ టౌన్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో (07941) మార్చి 4, 11, 18, 25, ఏప్రిల్ 1, 8, 15, 22, 29, మే 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 7 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6 గంటలకు రేణిగుంట చేరుకుంటుంది. కాచిగూడ–కాకినాడ పోర్ట్(07425) (28 సర్వీసులు) మార్చి 1, 8, 15, 22, 29 ఏప్రిల్ 5, 12, 19, 26 మే 3, 10, 17, 24, 31 తేదీల్లో సాయంత్రం 6.45 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6 గంటలకు కాకినాడ పోర్ట్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (07426) మార్చి 2, 9, 16, 23, 30 ఏప్రిల్ 6, 13, 20, 27 మే 4, 11, 18, 25, జూన్ 1 తేదీల్లో సాయంత్రం 5.50 గంటలకు కాకినాడ పోర్ట్లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 5.10 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. -
రాకేష్ అనే వ్యక్తిని హత్య చేసిన ప్రత్యర్ధులు
-
ఆడపిల్లని కాపాడదాం
‘సేవ్ గర్ల్ చైల్డ్’.. అంటే ఆడపిల్లని కాపాడదాం అని. ఇదే నినాదంతో ‘సమాజానికో హెచ్చరిక’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. చామకూరి కంబైన్స్ పతాకంపై చామకూరి. యమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పాటల రికార్డింగ్ హైదరాబాద్లోని ఎస్.ఏ స్టూడియోలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు శివకృష్ణ, జబర్దస్త్ అప్పారావు, రాకింగ్ రాజేశ్, అలేఖ్య, ప్రియాంక, నటి గీతాసింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చామకూరి. యమ్ మాట్లాడుతూ– ‘‘ముగ్గురు యువకులు తమ కాళ్ల మీద తాము నిలబడుతూ, సమాజానికి ఎలా ఉపయోగపడ్డారో తెలియజేసే సినిమా ఇది. ఈ చిత్రానికి కథ, మాటలు నేను అందిస్తున్నా’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, పాటలు: సురేంద్ర కృష్ణ. -
తెలుగుయువత నాయకుడికి బెయిల్ మంజూరు
బంజారాహిల్స్: బంజారాహిల్స్కు చెందిన వ్యాపారిని కిడ్నాప్ చేసిన ఘటనలో అరెస్టై చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న టీడీపీ వైజాగ్ యువనేత శ్రీరామినేని రాకేష్కు సోమవారం బెయిల్ మంజూరైంది. బంజారాహిల్స్ పోలీసులు ఈ నెల 9న కిడ్నాప్ కేసులో రాకేష్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా 2 వారాల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఆదేశించడంతో అదే రోజు అతడిని జైలుకు తరలించారు. 6 రోజుల అనంతరం అతడికి బెయిల్ మంజూరైంది. వారానికొకసారి బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఎస్ఐ ఎదుట హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అయితే నిందితుడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ఆయన నేర చరిత్రను తవ్వేందుకు పోలీసులు కస్టడీకి పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది. కేసు పూర్వాపరాలు ఇవీ.. విశాఖపట్నం అర్బన్, నక్కవానిపాలెం పీఅండ్టీ కాలనీకి చెందిన శ్రీరామినేని రాకేష్ వైజాగ్ తెలుగు యువత శిక్షణ శిబిరాల సమన్వయకర్తగా పని చేస్తున్నాడు. కేబుల్ వ్యాపారం కూడా నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి పరిచయమైన దామోదర్ అనే ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడంతో రాకేష్ తన బంధుమిత్రుల నుంచి రూ.5 లక్షలు చొప్పున మొత్తం రూ.50 లక్షలు వసూలు చేశాడు. ఎంతకూ ఉద్యోగం రాకపోవడంతో వారు రాకేష్పై ఒత్తిడి తెచ్చారు. దీంతో రాకేష్ తనకు హామీ ఇచ్చిన దామోదర్ను నిలదీయడమేగాక, తాను ఇచ్చిన డబ్బులకు గాను వ్యవసాయభూమి రాసివ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెం.2 సాగర్ సొసైటీలో ఉంటున్న తన బాబాయ్ కుమారుడు సుంకు బాలాజీ కుమార్ సంతకాలు పెడితేనే ఆ భూమి వస్తుందని చెప్పాడు. దీంతో రాకేష్ గత నెల 13న తన అనుచరులు ముగ్గురిని కారులో హైదరాబాద్కు పంపించి బాలాజీ కుమార్ను కిడ్నాప్ చేయించాడు. అనం తరం అతడిని పిడుగురాళ్లకు తీసుకెళ్లి ఓ గది లో బంధించి తీవ్రంగా హింసించాడు. 14న మరో కారులో బాలాజీకుమార్ను వైజాగ్ తీసుకెళ్లి అక్కడ బంధించారు. రాకేష్ అక్కడికి వచ్చి వైజాగ్ తన అడ్డా అని తనను ఎవ రూ ఏమి చేయలేరని మీ తండ్రికి ఫోన్ చేసి రమ్మనాలని సూచించాడు. బాలాజీకుమార్ తండ్రి రమేష్బాబును కూడా కిడ్నాప్ చేసి పెద్ద ఎత్తున డబ్బు లాగాలని రాకేష్ పథకం వేశారు. అయితే దామోదర్, రాకేష్కు మధ్య ఎలాంటి సంబంధాలు లేవని వారిద్దరి మధ్య మాటలు కూడా లేవని తెలియడంతో రాకేష్ 15వ తేదీన బాలాజీకుమార్ను వదిలి వేశాడు. అప్పటికే తమ బంధీలో ఉన్న బాలాజీకుమార్ నుంచి రాకేష్ బలవంతంగా స్టాంప్ పేపర్ల మీద సంతకాలు తీసుకున్నాడు. బంగారు గొలుసులు, ఉంగరాలు లాక్కున్నాడు. పేటీఎం నుంచి పెద్దమొత్తంలో డబ్బులు కూడా డ్రా చేసుకున్నారు. హైదరాబాద్ తిరిగి వ చ్చిన తర్వాత బాలాజీకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాకేష్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పక్కా నిఘా వేసిన బంజారాహిల్స్ పోలీసులు ఈ నెల 8న వైజాగ్లోని తన ఇంటికి వచ్చిన రాకేష్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకొని అరెస్ట్చేశారు. మర్నాడు అతడిని రిమాండ్కు తరలించారు. కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. -
తెలుగు యువత నేత రాకేశ్ లీలలెన్నో..!
పెదవాల్తేరు (విశాఖ తూర్పు): ఓ వ్యాపారి కిడ్నాప్ కేసులో బుధవారం అరెస్టయిన తెలుగు యువత నేత రాకేశ్ బాగోతాలు ఒక్కొక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సీఎం తనయుడు, మంత్రి నారా లోకేశ్తో చనువుగా ఉన్న ఫొటోలు చూపించి నిరుద్యోగుల నుంచి రూ.కోటి వరకు వసూలు చేసినట్లు తెలిసింది. రాకేశ్ అరెస్టు విషయం తెలిసిన బాధితులంతా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. వివరాలు.. గుంటూరు జిల్లా నూజెండ్లకు చెందిన తెలుగు యువత నాయకుడు శ్రీరామినేని రాకేశ్ విలాసాలకు అలవాటు పడ్డాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు మంత్రులు, టీడీపీ నాయకులతో పరిచయాలను ఉపయోగించుకున్నాడు. విశాఖ సీతమ్మధార పీ అండ్ టీ కాలనీలో నివసిస్తున్నాడు. ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేశ్ తెలుసు.. ఉద్యోగాలిప్పిస్తానంటూ ఇక్కడి నిరుద్యోగులతో నమ్మబలికాడు. ఆయనతో దిగిన ఫొటోలు చూపించాడు. లోకేశ్ ఎంతో ఆప్యాయంగా రాకేశ్తో మాట్లాడుతున్న ఫొటోలు కావడంతో నిరుద్యోగులు కూడా నమ్మేశారు. అంతేకాదు మంత్రి గంటా శ్రీనివాస్, పరిటాల శ్రీరామ్ తదితరులతో తాను చనువుగా ఉన్న ఫొటోలు చూపించి వారి నుంచి రూ.కోటి వరకు వసూలు చేశాడు. బంజారాహిల్స్కు చెందిన ఓ వ్యాపారి కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న రాకేశ్ను హైదరాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేయడంతో.. నిరుద్యోగులను మోసం చేసిన విషయం బయటపడింది. -
వయసు 11.. మెడల్స్ 11
పశ్చిమగోదావరి, తణుకు అర్బన్: మార్షల్ ఆర్ట్స్లో సత్తా చాటుతున్నాడు తణుకు మండలం మండపాకకు చెందిన బుడతడు పురాల్ రాకేష్. పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెతకు నిదర్శనంగా 5వ తరగతి చదువుతున్న రాకేష్ 11 ఏళ్ల వయస్సులో జాతీయ, రాష్ట్రస్థాయిలో 11 మెడల్స్ సొంతం చేసుకుని శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈ మెడల్స్లో 10 గోల్డ్, 1 సిల్వర్ మెడల్ ఉండటం విశేషం. వయసుకు, ఎత్తుకు సంబంధం లేకుండా కుంగ్ ఫు ఫైట్స్లో ప్రత్యర్థిని చిత్తు చేస్తున్నాడు. వెళ్లిన ప్రతి పోటీలోనూ మెడల్ సాధిస్తూ క్రీడాభిమానం ఉన్న వారందరి చూపూ తనవైపు తిప్పుకుంటున్నాడు. తల్లిదండ్రులు కూడా కరాటేలో ప్రావీణ్యం ఉండడంతో వారి ప్రోత్సాహంతో మార్షల్ ఆర్ట్స్లోని పెన్కాక్ సిలాట్, కుంగ్ ఫూ, కరాటే, సెల్ఫ్ డిఫెన్స్, కిక్ బాక్సింగ్, థాయ్ బాక్సింగ్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అంశాల్లో శిక్షణ పొందుతున్నాడు. మండపాక చదలవాడ ఇంగ్లిషు మీడియం స్కూలులో చదువుతున్న రాకేష్ ఇటు చదువులోనూ మొదటి ర్యాంకులో నిలుస్తున్నాడు. గురువు సత్య శిక్షణలో.. తణుకు శ్రీ రామకృష్ణ సేవా సమితి భవనంలో సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ షావొలిన్ కుంగ్ ఫు డ్రంకెన్ మార్షల్ ఆర్ట్స్ కుంగ్ ఫు–డు మాస్టర్ డీడీ సత్య శిక్షణలో గత ఏడాదిన్నరగా రాకేష్ రాటుదేలుతున్నాడు. రాకేష్ తండ్రి పురాల్ వెంకటేష్ మండపాకలో చిన్న టిఫిన్ హోటల్ నిర్వహిస్తుండగా తల్లి కనకదుర్గ కూడా భర్తకు సహాయంగా ఉంటారు. చెల్లి జ్యోతి 4వ తరగతి చదువుతోంది. ప్రోత్సాహం కరువు మార్షల్ ఆర్ట్స్ అంటే ఎంతో ఖరీదైన క్రీడ. శిక్షణతో పాటు ఏ టోర్నమెంట్కు వెళ్లాలన్నా వేలల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చినట్టు రాకేష్ తండ్రి వెంకటేష్ చెప్పారు. -
సీబీఐ వ్యవహారంపై అర్థిక మంత్రి జైట్లీ స్పందన
-
కథ విని చిరంజీవిగారు అలా అన్నారు
‘‘విజేత’ కథ కొత్తవారికైనా, ఎస్టాబ్లిష్డ్ హీరోలకైనా సరిపోతుంది. ఏ హీరో అంటే ఆ హీరో అని మా నిర్మాత నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. అప్పుడు నేను వైజాగ్ సత్యానంద్గారి దగ్గరకు వెళ్లి ‘ఈ బ్యాచ్లో ఎవరైనా కొత్తవారు ఉన్నారా?’ అని అడిగా. ఆయన నాకు కల్యాణ్గారి గురించి చెప్పారు. కల్యాణ్గారు చిరంజీవిగారి అల్లుడని అప్పుడే మాకు తెలిసింది’’ అని దర్శకుడు రాకేష్ శశి అన్నారు. కల్యాణ్ దేవ్, మాళవికా నాయర్ జంటగా సాయి శివాని సమర్పణలో రజని కొర్రపాటి నిర్మించిన ‘విజేత’ రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాకేష్ శశి పంచుకున్న విశేషాలు... ∙నేను ఎమ్మెస్సీ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ చేశా. 2006లో హైదరాబాద్ వచ్చాను. 2007లో రాఘవేంద్రరావుగారి టీవీ షో ‘రేపటి దర్శకులు’లో టాప్ టెన్లో ఉన్నా. ‘రక్తచరిత్ర’లో డైలాగ్ వెర్షన్ రాశాను. పరుచూరి బ్రదర్స్, చిన్నికష్ణగారి వద్ద పనిచేశాను. ‘రుద్రమదేవి’ చిత్రానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ, బయటికి వచ్చాను. ∙తండ్రీ కొడుకుల మధ్య సాగే కథే ‘విజేత’. మనలో ఉన్న 90 శాతం మంది కథ ఇది. మన దేశంలో మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువ. ఆ జర్నీలోని బాధలు, సంతోషాలు, అవమానాలన్నింటినీ ప్రతిబింబిస్తుంది. శ్రీనివాసరావు అనే ఫ్యాక్టరీ ఉద్యోగి, అతని కొడుకు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన రామ్ పాత్రలు హైలైట్. వాళ్ల ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితులను దాటుకుని ముందడుగేసింది అనేది సినిమా. ∙చిరంజీవిగారి ‘విజేత’ చిత్రానికీ, మా ‘విజేత’కు ఎక్కడా పోలికలు ఉండవు. చాలా టైటిల్స్ అనుకున్నాం. ఒక మనిషి విజయం మీదనే కథ సాగుతుంది కాబట్టి ‘విజేత’ అని ఫిక్స్ చేశాం. చిరంజీవిగారి పర్మిషన్ తీసుకునే ఈ టైటిల్ పెట్టాం. ∙‘విజేత’ కథను ముందు కల్యాణ్గారికి చెప్పా. రెండు రోజుల దాకా ఆయన్నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో నచ్చలేదేమో అనుకున్నా. ఒక రోజు ఫోన్ చేసి చిరంజీవిగారికి కథ చెప్పమన్నారు. సరేనని వెళ్లా. చిరంజీవిగారు కథ మొత్తం విని ‘నువ్వు నాకు ఏం చెప్పావో అది తియ్ చాలు’ అన్నారు. డీఐ కాకముందు ఓసారి సినిమా చూశారు. ఆయనకు చాలా బాగా నచ్చింది. ∙కల్యాణ్గారు చాలా హోమ్ వర్క్ చేశారు. కొత్త విషయాలను నేర్చుకోవాలనే తత్వం ఉంది. మాళవిక ఇందులో ఇండిపెండెంట్ విమెన్గా నటించారు. ఈ చిత్రకథ కల్పన కాదు. నేను పుట్టిందే మిడిల్ క్లాస్లో. నా ఫ్రెండ్స్ చాలామంది మిడిల్ క్లాస్కి చెందినవాళ్లే. నా 12 ఏళ్లప్పుడు మా నాన్న చనిపోయారు. నేను చూసిన జీవితం ఈ సినిమాలో ఉంటుంది. -
ఏం పాడాడండీ!
ఏ కోటలోనో పాగా వేయడానికి అతడు పాట పాడలేదు కానీ, తోటలో పని చేసుకుంటూ తను పాడిన పాట సినీ స్టార్ కమల్హాసన్, మ్యూజిక్ స్టార్ మహదేవన్ల గుండెల్లో పాగా వేసింది! ఇప్పుడతడు మ్యూజిక్లో ‘రాకింగ్ స్టార్’. అంటే మట్టిరాళ్లలోని మాణిక్యం! ఎక్కడో కేరళలో రబ్బరు తోటల్లో పనిచేస్తూ కూనిరాగాలు తీసిన ఓ యువకుడి కోసం ప్రఖ్యాత సంగీత దర్శకులు గాలిస్తున్నారంటే అతిశయమే అవుతుంది. అంతేకాదు.. ఆ యువకుడిని లోక నాయకుడు కమల్ హాసన్ తన ఇంటికి పిలుచుకుని అభినందించాడంటే మరో నమ్మశక్యం కాని విషయం అవుతుంది. సంగీతం తెలియదు. అసలు చదువు కూడా అబ్బలేదు. కానీ.. ఆ మలయాళీ యువకుడి అదృష్టం ఒకే ఒక్క పాటతో మారిపోయింది. యూట్యూబ్ లో ట్రెండ్ గా మారిన ఆ మలయాళీ అసలేం చేశాడో చూద్దాం. కేరళలోని ఆళపుళ జిల్లా ఓ మారుమూల గ్రామానికి చెందిన రాకేష్ ఉన్ని రబ్బరు తోటల్లో కూలీగా పనిచేస్తున్నాడు. పని చేస్తూ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం’ చిత్రంలోని ‘ఉన్నై కానామేం..’ అంటూ సాగే పాటను హృద్యంగా పాడగా దానిని సెల్ఫోన్లో రికార్డు చేసిన స్నేహితులు యూట్యూబ్ లో ఉంచారు. అనుకోకుండా ఆ పాటను విన్న కమల్ హాసన్ వెంటనే దానిని సంగీత దర్శకుడు, గాయకుడు శంకర్ మహదేవన్ చేరవేశారు. దీంతో ఆ పాటను విన్న శంకర్ మహదేవన్ దానిని తన ట్విట్టర్ లో పెట్టి ఆ యువకుడిని కలుసుకోవాలని ఉందంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు.. సంగీతం తెలిసిన జ్ఞానిలా స్వరబద్దంగా రాకేష్ ఉన్ని ఆలపించిన తీరు తనకంటే చాలా బాగుందని అభినందించారు. దీంతో ఆ యువకుడి వివరాలను తీసుకున్న నటుడు కమల్ హాసన్ మంగళవారం రాకేష్ను చెన్నైలోని తన కార్యాలయానికి పిలిపించి అభినందించారు. ఈ సందర్భంగా మీడియాతో సమావేశమైన కమల్ హాసన్ రాకేష్ ఉన్నిను పరిచయం చేశారు. తాను కూనిరాగంగా పాడిన ఓ పాటతో తనకు ఇంతటి పేరు వస్తుందని తాను ఊహించలేదని అంటూ.. కమల్ హాసన్, శంకర్ మహదేవన్కు రాకేష్ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు శంకర్ మహదేవన్ ను కలుసుకునేందుకు తనకు ఆరాటంగా ఉందన్నారు. – సంజయ్ గుండ్ల, సాక్షి, చెన్నై -
సోషల్ మీడియాలో వైరల్గా మారిన రాకేష్ పాట
-
సూసైడ్కు ముందు విజయ్ సెల్ఫీ వీడియో!
సాక్షి, సినిమా : నటుడు విజయ్ సాయి ఆత్మహత్య చేసుకోవడం టాలీవుడ్ సర్కిల్లో కలకలం రేపింది. విజయ్ ఆత్మహత్యపై ‘బజర్ధస్త్’ కమెడియన్ రాకేష్ విచారం వ్యక్తం చేశారు. ‘ప్రతి చిన్న విషయాన్ని సెన్సిటీవ్ గా తీసుకునే వ్యక్తి విజయ్. మా గ్రూపులో సమస్య ఏదైనా షేర్ చేసుకుంటే మేం సాయం చేసేవాళ్లం. ఇలా జరిగి ఉండేది కాదు. నిన్న (ఆదివారం) రాత్రి ఈ విషాదం జరిగిందంటున్నారు. విషయం తెలియగానే ఉదయం మేం వచ్చి చూశాం. సెల్ఫీ సూసైడ్ వీడియో కూడా తీసుకున్నాడని తెలుస్తోంది. పోలీసులు ఈ కోణంలో విచారణ చేపట్టారు. ఒంటరి వాడినయ్యాడని తరచూ స్నేహితులతో అనేవాడు. కష్టాలు దిగమింగుకుని సినిమాల్లో నటించేవాడు. ఎక్కువగా బాధ కలిగితే వారం రోజుల పాటు ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండేవాడు. వ్యక్తిగత సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని’ నటుడు రాకేష్ అభిప్రాయపడ్డారు. కాగా, నగరంలోని యూసఫ్గూడలో అపార్ట్మెంట్లో విజయ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు, బొమ్మరిల్లు, సోగ్గాడు, భగీరథ, డిస్కో తదితర చిత్రాల్లో ఆయన నటించారు. సినిమాల్లో అవకాశాల్లేక ఇలా చేసుకున్నాడని కొందరు అంటుండగా, భార్యతో విభేదాల కారణంగానే బలవన్మరణం చెందాడంటూ వదంతులు వినిపిస్తున్నాయి. -
అనుకోని ఓ కథ!
రాకేష్, రమ్య, వెంకట్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘అనుకోని ఓ కథ’. ఏ.ఎం.జె. ఫిలిమ్స్ పతాకంపై జనార్ధన్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఫలాన్ని స్వరపరచిన ఈ చిత్రం పాటల్ని హైదరాబాద్లో రిలీజ్ చేశారు. నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ– ‘‘టైటిల్ బాగుంది. ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తుందనుకుంటున్నా. ఫలాన్ని చాలా సినిమాలకు పనిచేశారు. తన సంగీతం బాగుంటుంది’’ అన్నారు. ‘‘మంచి హారర్ మూవీ ఇది. జనార్ధన్ చక్కగా తీశారు. కథ బాగుంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా విజయవంతమవుతాయి. ఈ సినిమా హిట్ కావాలి’’ అన్నారు తెలంగాణ ఫిలించాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్. ‘‘తక్కువ బడ్జెట్లో సినిమా తీశా. అన్ని వర్గాల వారికీ నచ్చే అంశాలున్నాయి’’ అన్నారు జనార్ధన్. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య, నిర్మాతలు ప్రసన్నకుమార్, సాయి వెంకట్ పాల్గొన్నారు. -
యువ నటుడు మృతి
సాక్షి, బెంగళూరు: కన్నడ యువ నటుడు, ‘పప్పుసీ కామెడీ’ ఫేం రాకేశ్(27) మంగళవారం మృతి చెందారు. కన్నడ సినిమా పరిశ్రమలో ‘బుల్లీ’గా సుపరిచితుడైన ఆయన కోరమంగలలో ఉన్న సెయింట్జాన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గ్యాంగ్రిన్ వ్యాధితో బాధపడుతున్న రాకేశ్ రెండు నెలలక్రితం శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నారు. మరోసారి వ్యాధి తిరగబెట్టడంతో ఆయన సెయింట్జాన్స్ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు. చెలువినచిత్తార చిత్రం ద్వారా బాలనటుడిగా పరిచయమైన రాకేశ్ పలు కన్నడ సినిమాల్లో ప్రతిభను కనబరిచారు. రాకేశ్ తల్లిదండ్రులు ఆశారాణి, నాగేశ్ కూడా నటులే. ఆయన ప్రధానపాత్రలో నటించిన తాజాచిత్రం ‘ధూమపాన’ షూటింగ్ పూర్తికావొచ్చింది. రాకేశ్ మృతికి పలువురు నటులు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. -
క్యూలో ఏం జరిగింది?
పెద్దనోట్ల రద్దు వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే కథతో తీసిన చిత్రం ‘ఏటీఎం వర్కింగ్’. పవన్, కారుణ్య, రాకేశ్, మహేంద్ర, నారాయణ, ఆషా, మహేశ్ ముఖ్య తారలుగా పి. సునీల్కుమార్రెడ్డి దర్శకత్వంలో కిశోరి బసిరెడ్డి, యక్కలి రవీంద్రబాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలవుతోంది. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘125 కోట్లమంది భారతీయులపై ప్రభావం చూపిన ఓ నిర్ణయంపై సరదాగా సినిమా చేశాం. ‘ఏటీఎం నాట్ వర్కింగ్’ అని టైటిల్ పెడితే.. సెన్సార్ సభ్యులు ‘నాట్’ అనే పదాన్ని తొలగించారు. ప్రజలకు నిజాలేంటో తెలుసు. రాజకీయ నేపథ్యంలో కాకుండా బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను చర్చిస్తూ వినోదాత్మకంగా ఈ సినిమా తీశాం. ఏటీఎం క్యూలో ఏం జరిగింది? అనేది కథ’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: కుర్రా విజయ్కుమార్, రాజ.సి, పీఎల్కే రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి. బాపిరాజు, సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి. -
అపన్న హస్తం కోసం ఎదురుచూపు..
ఏ క్షణంలో ఎవరికి ఏం జరుగుతుందో.. ఒక్క క్షణంలో ప్రమాదానికి గురైన నిరుపేద కుటుంబం.. తన కొడుకును కాపాడుకోవడానికి ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది ఖానాపూర్ :మండలంలోని తర్లపాడ్ గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పట్టణంలోని పద్మావతి నగర్ కాలనీలోని ఎరుకల వాడకు చెందిన నిరుపేద కుంటుబానికి చెందిన ఏఆర్ఎస్ కళాశాల ఇంటర్ విధ్యార్థి లోకిని రాకేష్ తల్లిదండ్రులు అపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఈనెల 15న రాత్రి తర్లపాడ్ నుంచి ఖానాపూర్ వస్తుండగా ద్విచక్రవాహనం అదుపుతప్పి తమ కుమారుడి తలకు తీవ్ర గాయాలై ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాతున్నాడని బాధిత విధ్యార్థి తల్లిదండ్రులు లోకిని పెంటన్న, సత్తవ్వలు సాక్షితో వారి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందిచినప్పటికీ పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకె ళ్లామని తెలిపారు. కాగా తమ కుమారుడి వైద్యానికి రూ. లక్షల్లో ఖర్చు అవుతుందని, తాము రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలో కూలీచేసి కుటుంబాన్ని పోషిస్తున్నామని ఇటువంటి క్రమంలో ఎవరైనా దాతలు ముందుకు వచ్చి అపన్నహస్తాన్ని అందించాలని వారు వేడుకున్నారు. విరాళాల సేకరణ... ప్రమాదంలో గాయపడ్డ తోటి స్నేహితునికి తమ వంతు సహాయం అదించాలనే ఉద్దేశంతో సుమారు 50 మంది వరకు అతని స్నేహితులు మండల కేంద్రంలోని వ్యాపార సముదాయాలతోపాటు విద్యా సంస్థల్లో విరాళాలు సేకరిస్తున్నారు. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే సెల్ 9666701055, 8331889391 లేదా ఎస్భీహెచ్ ఖాతా నెం. 62103514522 నెంబరల్లో విరాళాలు వేయాలని కోరారు. -
శిథిల భవనం కూలి ఇద్దరికి గాయాలు
రంగారెడ్డి జిల్లా మేడ్చల్ పట్టణంలో వర్షాల ధాటికి ఒక భవనం కూలిన ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. స్థానిక ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో ఓ పాత భవనం వర్షాలకు నాని మంగళవారం మధ్యాహ్నం కూలింది. ఆ భవనంలో ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పినట్లయింది.అయితే, అదే సమయంలో అటుగా వెళ్తున్న రాకేష్, మంజుల దంపతులు స్వల్పంగా గాయపడ్డారు. -
కలుషిత నీరు తాగి విద్యార్థి మృతి
హైదరాబాద్: హయత్నగర్ మండలం పసుమాముల బీసీ హాస్టల్ విద్యార్థి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి... సదరు బీసీ హాస్టల్లో ఉంటూ రాకేశ్ అనే విద్యార్థి కలుషిత నీరు తాగి తీవ్ర అనారోగ్యం పాలైయ్యాడు. దీంతో హాస్టల్ సిబ్బంది అతడిని ఎల్బీ నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రెండు రోజులుగా చికిత్స పొందుతు బుధవారం రాత్రి మరణించాడు. అయితే గత రెండు రోజులుగా అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా... అతడి తల్లిదండ్రులకు హాస్టల్ సిబ్బంది సమాచారం ఇవ్వలేదు. అతడు మరణించిన తర్వాత వారికి సమాచారం అందించారు. దీంతో రాకేశ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. గురువారం రాకేశ్ తల్లిదండ్రులతోపాటు బంధువులు హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. -
టీమ్ స్పీడ్ను ఆదుకున్న రాకేశ్
హైదరాబాద్: తడబడిన టీమ్ స్పీడ్ జట్టును రాకేశ్ యాదవ్ (56) అర్ధసెంచరీతో రాణించి ఆదుకున్నాడు. ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్లో శ్రీచక్రతో గురువారం మొదలైన ఈ మ్యాచ్లో తొలి రోజు ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమ్ స్పీడ్ 56.5 ఓవర్లలో 7 వికెట్లకు 103 పరుగులు చేసింది. ప్రత్యర్థి బౌలర్ అబ్దుల్ ఖురేషీ 22 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఇతర మ్యాచ్ల స్కోర్లు విశాక సీసీ: 92/7 (బాలాజీ సింగ్ 35; శ్రీకరణ్ 4/22), సాయిసత్యతో మ్యాచ్. డెక్కన్ వాండరర్స్: 251/9 డిక్లేర్డ్ (అజీముద్దీన్ 48, భాస్కర్ 47; సత్యనారాయణ 5/46, నితీశ్ 3/61), ఉస్మానియా: 63/1. న్యూబ్లూస్: 124/4 (భగత్ ప్రతాప్ 34, అబ్దుల్ ఆరిఫ్ 31, అకేందర్ 33 బ్యాటింగ్), అవర్స్ సీసీతో మ్యాచ్. రోహిత్ ఎలెవన్: 133/3 (ఆరిఫ్ 59 బ్యాటింగ్, అంకుర్ 43), బ్రదర్స్ ఎలెవన్తో మ్యాచ్. బడ్డింగ్ స్టార్స్: 138 (మణిదీప్ 3/12, సయ్యద్ అలీ 3/28), శ్రీశ్యామ్తో మ్యాచ్. డెక్కన్ బ్లూస్: 118/4 (ఠాకూర్ హర్షవర్ధన్ 71), మహమూద్ సీసీతో మ్యాచ్. అగర్వాల్ సీనియర్స్: 191 (మహేశ్ 51, అన్వేశ్ 4/63, వివేక్ 3/72), నిజామ్ కాలేజి: 149/2 (సాయిసందీప్ నాయుడు 73 బ్యాటింగ్, శరత్ 35 బ్యాటింగ్). గ్రీన్టర్ఫ్: 145/5 (అక్షయ్ 39, సయ్యద్ అస్కారి 45; సాయికుమార్ 4/52). -
సెల్ఫోన్ మాట్లాడుతూ విద్యార్థి మృతి
-
సెల్ఫోన్ మాట్లాడుతూ విద్యార్థి మృతి
హైదరాబాద్: సెల్ఫోన్లో మాట్లాడుతున్న విద్యార్థి పక్కనే ఉన్న విద్యుత్ తీగలను తాకి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని వనస్థలిపురం ప్రశాంత్నగర్లో శనివారం చోటుచేసుకుంది. ఎల్బీనగర్లో నివాసముంటున్న రాకేష్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ప్రశాంత్నగర్లోని తన ఫ్రెండ్స్ రూమ్కు వచ్చాడు. బిల్డింగ్ పైన నిలబడి ఫోన్ మాట్లాడుతూ... ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న విద్యుత్ తీగలను తాకాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
లాఠీచార్జిలో గాయపడిన విద్యార్థి పరిస్థితి విషమం
రాజేంద్రనగర్లోని అగ్రికల్చర్ వర్సిటీలో మంగళవారం పోలీసుల లాఠీదెబ్బలతో తీవ్రంగా గాయపడిన రాకేష్ ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉండటంతో కేర్ ఆసుపత్రికి తరలించారు. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రాక సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెల్సిందే. మంత్రిని విద్యార్థులు నిర్బంధించటంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. జీవో నెంబర్ 45ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, పశువైద్య అధికారుల పోస్టులను డిపార్టుమెంటల్ పరీక్షల ద్వారానే ఎంపిక చేయాలంటూ పశువైద్య విద్యార్థులు మంత్రిని సమావేశమందిరంలోనే నిర్బంధించారు. గాయపడిన విద్యార్థి రాకేష్ వెటర్నరీ విభాగంలో 4వ సంవత్సరం చదువుతున్నాడు. విద్యార్థి సొంత జిల్లా వరంగల్. -
ట్రాక్టర్ ఢీకొని చిన్నారి మృతి
ఆటో కోసం ఎదురు చూస్తున్న చిన్నారిని మృత్యువు ట్రాక్టర్ రూపంలో కబళించింది. ఈఘటన మునగ చర్ల సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. మునగచర్ల గ్రామానికి చెందిన సికుల్ల ఆకాశ్(4)కు గత రెండు రోజులుగా జ్వరంగా ఉండటంతో అతని తల్లి రాధా నందిగామలోని ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు ఆటో కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎన్హెచ్ 65పై వేగంగా వస్తున్న ట్రాక్టరు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడిక్కడే మృతి చెందగా అతని తల్లి గాయాలపాలయ్యింది. -
కారుబోల్తా.. విద్యార్థి మృతి
వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ విద్యార్థి మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం గుత్యా గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని అభిలాష్ ఇంటర్ కళాశాలకు చెందిన 11 మంది విద్యార్థులు నల్లగొండ నుంచి గుత్యాకు కారులో వస్తుండగా.. గ్రామ శివారులో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో కారులో ఉన్న రాకేష్(16) మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బాలుడిని మింగిన బోరుబావి
రక్తస్రావం, ఊపిరాడక చిన్నారి రాకేశ్ మృతి * 22 గంటలపాటు సాగిన సహాయక చర్యలు వృథా * ఆదివారం ఉదయం 6:45గంటలకు బాలుడి వెలికితీత * హుటాహుటిన సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలింపు * అప్పటికే మృతి చెందినట్లు వైద్యాధికారి నిర్ధారణ * జారి పడిన 3-4 గంటల్లోనే బాలుడు మరణించి ఉండొచ్చన్న వైద్యులు సాక్షి, ప్రతినిధి, సంగారెడ్డి: జరగరానిదే జరిగింది... మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం తండా ‘బోరుబావి ఘటన’ విషాదాంతమైంది. మూడేళ్ల బాలుడు రాకేశ్ను బోరుబావి మింగేసింది. అతన్ని సజీవంగా బయటకు తీసేందుకు అధికార యంత్రాంగం దాదాపు 22 గంటలపాటు పడిన శ్రమ వృథా అయింది. ఆదివారం ఉదయం సరిగ్గా 6.45 గంటలకు బాలుడిని సహాయ బృందాలు బయటకు తీయగా అప్పటికే సిద్ధంగా ఉంచిన 108 అంబులెన్సులో అతన్ని హుటాహుటిన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే రాకేశ్కు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ విజయ్కుమార్ బాలుడు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. నిర్జీవంగా ఉన్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు బైరు సాయిలు, మొగులమ్మ, సోదరుడు బాలేష్, సోదరి కన్నీరు మున్నీరుగా విలపించారు. తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం కావడంతోపాటు శ్వాస అందక ఆ చిన్నారి మరణించి ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. బాలుడు తలకిందులుగా బోరుబావిలో పడినందున అతను పడిన మూడు నాలుగు గంటల్లోనే మరణించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. బాలుడిని కాపాడేందుకు సహాయ బృందాలు అంతకుముందు తీవ్రంగా శ్రమించాయి. మూడు భారీ ప్లొక్లెయిన్లను ఉపయోగించినా ఆదివారం తెల్లవారుజాము 3 గంటల వరకు అధికారులు బోరుబావికి సమాంతరంగా కేవలం 18 అడుగుల గుంత మాత్రమే తీయగలిగారు. అడ్డువచ్చిన భారీ బండరాళ్లు సహాయక చర్యలను ముందకు కదలనివ్వలేదు. అయితే నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఏజెన్సీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు 4 గంటలకు ఘటనా స్థలికి చేరుకొని మెదక్ ఆర్డీఓ మెంచు నగేశ్ నుంచి వివరాలు సేకరించి రంగంలోకి దిగాయి. అయితే సమాంతర గుంతకు మరో పెద్ద బండరాయి అడ్డు రావడంతో దాన్ని డైనమెట్లతో పేల్చేయాలని నిర్ణయించాయి. బోరుబావికి నష్టం కలగకుండా పేల్చేందుకు ఉదయం 4.30కి డ్రిల్లింగ్ మెషిన్తో బండకు వరుస రంధ్రాలు చేశాయి. బోరు బావిలోకి సీసీ కెమెరాలను వదిలి బాలుడి పరిస్థితిని, చుట్టూ పరిసరాలను గమనించాయి. సాధారణ మెకానిక్ సాయం బోరుబావి ఘటనను టీవీలో చూసి తెలుసుకున్న నల్లగొండ జిల్లా వేములపల్లికి చెందిన సాధారణ బోరుబావి మెకానిక్ పుట్టా కరుణాకర్ తన వంతు సాయం అందించేందుకు ఘటనాస్థలికి చేరుకున్నాడు. సమాంతర బావి తవ్వే అవసరం లేకుండా తన వద్ద ఉన్న పరికరాలతో బాలుడిని సురక్షితంగా బయటకు తీస్తానని... అందుకు అవకాశం ఇవ్వాలని సహాయ బృందాలు, ఆర్డీఓ నగేశ్ను అభ్యర్థించాడు. సీసీ కెమెరాలను బోరుబావిలోకి పంపి వాటి ఆధారంగా బాలుడికి గాయం కాకుండా క్లిప్పులు తగిలించి 3, 4 నిమిషాల్లో కప్పి సాయంతో బయటికి లాగుతానంటూ అప్పటికప్పుడు డెమో నిర్వహిం చాడు. ఇందుకు స్పందించిన ఆర్డీఓ...డిజాస్టర్ మేనేజ్మెంటు సభ్యుల అభిప్రాయం తీసుకొని కరుణాకర్ను కూడా సహాయ చర్యల్లో పాల్గొనేందుకు అనుమతించారు. వెంట తెచ్చుకున్న పరికరాల సాయంతో 40 నిమిషాలు ప్రయత్నించి రాకేశ్ కాళ్లకు క్లిప్పులు తగిలించిన కరుణాకర్...తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కప్పి ద్వారా సరిగ్గా ఉదయం 6.45కు రాకేష్ను బయటికి తీశారు. కాగా, చిన్నారి రాకేశ్ మరణం దురదృష్టకరమని, ఈ ఘటన తనను కలచివేసిందని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. విఫలమైన బోరుబావులను ప్రజలు ఇప్పటికైనా గుర్తించి వెంటనే పూడ్చేయాలని కోరారు. -
ప్రభుత్వ వైద్యుడిపై అత్యాచారయత్నం కేసు
ప్రభుత్వ వైద్యుడిపై అత్యాచారయత్నం కేసు నమోదైన సంఘటన అదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగుచేసింది. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో దంత వైద్యుడిగా పని చేస్తున్న రాకేష్(25) తన ఇంటి పక్కన ఉన్న గృహిణి(22) పై అత్యాచారానికి యత్నించాడు. దీంతో బాదితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఎసై్స శ్రీనివాసరావు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.