హైదరాబాద్: జీడిమెట్ల ఆంధ్రాబ్యాంకులో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను పోలీసుల చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో ఆంధ్రాబ్యాంకులో ఇద్దరు దొంగలు చొరబడ్డారు. బ్యాంకుకు సమీపంలోనే నివాసముంటున్న తమసయ్య అనే ఆర్టీసీ డ్రైవర్ బ్యాంకులో లైటు వెలుగుతుండటం గమనించాడు. బ్యాంకు దగ్గరికి వెళ్లి చూడగా షట్టర్ తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. బయటి వ్యక్తులు తమను గమనించారని తెలుసుకున్న దొంగలు పరారయ్యారు. ఇందులో ఓ వ్యక్తిని పోలీసుల సహాయంతో ఆర్టీసీ డ్రైవర్ తమసయ్య పట్టుకున్నారు. తర్వాత పరారైన వ్యక్తిని పట్టుబడిన వ్యక్తి సహాయంతో అరెస్ట్ చేశారు. ఇద్దరు దొంగలను నిజామాబాద్ జిల్లాకు చెందిన తుడుం స్వామి(25), సడుగు నవీన్(21)లుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రాబ్యాంకు దొంగల అరెస్ట్
Published Sat, Jun 18 2016 12:45 PM | Last Updated on Thu, Aug 30 2018 5:24 PM
Advertisement
Advertisement