హైదరాబాద్: రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ సంఘటన నగరంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం కాలనీలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. బైక్ పై వచ్చిన దుండగులు రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.