వస్తుసేవల పన్ను (జీఎస్టీ)పై వ్యాపారులు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జీఎస్టీ అదనపు కమిషనర్ ఆనంద్కుమార్ అన్నారు.
ఆనంద్కుమార్ మాట్లాడుతూ.. జీఎస్టీపై సందేహాలుంటే తమను అడిగి నివృత్తి చేసుకోవాలని వ్యాపారులకు సూచించారు. ఒక దేశం–ఒక పన్ను విధానంతో అమల్లోకి వచ్చిన జీఎస్టీ సమాజానికి మేలు చేస్తుందన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ శివనారాయణ్, అసిస్టెంట్ కమిషనర్ మనోజిత్ మజుం దార్, సెంట్రల్ ఎక్సైజ్ శాఖ సిబ్బంది ఎం.ఏ.రవూఫ్, టి.నాగమహేశ్, బి.వి.శ్రీధర్, జి.వి.ప్రసాద్, కొంపల్లి శ్రీనివాస్, బసన్నగౌడ, ఇన్స్పెక్టర్ హరిశర్మ పాల్గొన్నారు.