ఎక్సైజ్‌ కార్యాలయానికి వెళ్లిన నటుడు | drugs racket in tollywood: actor nandu went excise office | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్‌ కార్యాలయానికి వెళ్లిన నటుడు

Published Fri, Jul 14 2017 6:37 PM | Last Updated on Wed, Sep 5 2018 1:38 PM

ఎక్సైజ్‌ కార్యాలయానికి వెళ్లిన నటుడు - Sakshi

ఎక్సైజ్‌ కార్యాలయానికి వెళ్లిన నటుడు

డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వర్ధమాన నటుడు నందు శుక్రవారం నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లాడు.

హైదరాబాద్‌: డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వర్ధమాన నటుడు నందు శుక్రవారం నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లాడు. అయితే, అక్కడ అధికారులు లేకపోవడంతో వెనుదిరిగాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. తనకు ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు. డ్రగ్స్‌ సరఫరాదారు కెల్విన్ ఎవరో తనకు తెలియదని, అయితే మీడియాలో వస్తున్న కథనాలను స్పందించి అవి తప్పని రుజువు చేసుకోవడానికే వచ్చినట్లు వివరించాడు.

తాను ఇప్పటి వరకు డ్రగ్స్ తీసుకోలేదన్నాడు. ఇంకా అనుమానం ఉంటే రక్త పరీక్షలకు సైతం తాను సిద్ధమని చెప్పాడు. తన కుటుంబ సభ్యులకు తనను తాను రుజువు చేసుకోవడానికి ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చానన్నాడు. ఒక వేళ తనకు ఎక్సైజ్ శాఖ నుంచి నోటీసులు వస్తే కచ్చితంగా హాజరవుతానన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement