నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను నార్త్జోన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
నకిలీ నోట్ల ముఠా అరెస్ట్
Published Wed, Oct 19 2016 3:09 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
హైదరాబాద్: నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను నార్త్జోన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 9 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని మహంకాళీ మార్కెట్ ప్రాంతంలో నకిలీ నోట్లను చలామణి చేస్తుండగా.. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా చలామణి చేస్తున్న నోట్లు పాకిస్తాన్లో ముద్రించినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement