హయత్నగర్ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో విషాదం చోటుచేసుకుంది.
హయత్నగర్ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చాకలి మల్లయ్య అనే వ్యక్తి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 20 రోజుల క్రితం కూతురికి బాల్యవివాహం చేస్తున్నాడని రెవెన్యూ అధికారులు, చైల్డ్ క మీషన్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.