హైదరాబాద్ : చందానగర్ సబ్స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాను సోమవారం (జూన్ 13) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిలిపివేయనున్నట్లు తారానగర్ ఏఈ ఆర్.వెంకట్రామ్రెడ్డి తెలిపారు. హుడాకాలనీ, చందానగర్, ఇంజినీర్స్ ఎన్క్లేవ్, తారా నగర్, రైల్విహార్ కాలనీ ఫీడర్స్ పరిధిలో విద్యుత్ ఉండదు.
ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు నల్లగండ్ల, గోపన్పల్లి, అపర్ణ, సుదర్శన్నగర్ ఫీడర్ పరిధిలో నిలిపివేస్తారు. పాపిరెడ్డి కాలనీ 11కేవీ సబ్స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాపిరెడ్డి కాలనీ, రాజీవ్గృహకల్ప, రాజీవ్ స్వగృహ, దూబే కాలనీలలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.
నగరంలో విద్యుత్ ఉండని ప్రాంతాలు
Published Sun, Jun 12 2016 6:31 PM | Last Updated on Mon, Sep 4 2017 2:20 AM
Advertisement
Advertisement