మిడ్మానేరు ఇళ్ల ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించాకే ఇళ్లను ఖాళీ చేయిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు హామీనిచ్చింది.
ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తగ్గించడం ముగ్గురు అధికారులతో కూడిన కమిటీ సిఫార్సులకు వ్యతిరేకమన్నారు. దీనికి ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ.. పరిహారం కోసం ఇళ్ల నిర్మాణాల వ్యయాన్ని పెంచేసి చెబుతున్నారని, ఈమేరకు నిఘా నివేదికలు కూడా వచ్చాయన్నారు. అయినా తగిన పరిహారం ఇచ్చిన తర్వాతే వారిని ఖాళీ చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో ఈ నెల 9న భూసేకరణ అధికారి నిర్వహించే విచారణ సమయంలో ముంపు బాధితుల çసమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని అధికారులకు హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 11 కి వాయిదా వేసింది.