
నేడు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం, ఒరిస్సా నుంచి తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో నైరుతి రుతుపవనాలు మరింత ఊపందుకున్నాయి.
గత 24 గంటల్లో కొల్హాపూర్లో 6 సెం.మీ. అధిక వర్షం కురిసింది. కూసుమంచి, సంగారెడ్డి, కొత్తగూడెంలలో 4 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. నారాయణఖేడ్, జుక్కల్, మధిర, మాచారెడ్డిల్లో 3 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. వెంకటాపురం, మెదక్, పినపాక, మార్పల్లి, గట్టు, బోధన్, నల్లబెల్లి, బోనకల్, ఆలంపూర్ల్లో 2 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది.