
15నుంచి ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు
హైదరాబాద్: హైటెక్స్లో ఈనెల 15వ తేదీ నుంచి ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు నిర్వహించనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నిర్మాణంలో నూతన పద్ధతులు, పర్యావరణం, రోడ్ల భద్రత, ప్రమాదాల నివారణపై ఈ సదస్సులో చర్చిస్తామన్నారు.
ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దేశ, విదేశీ ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. కాగా, 338 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం ఆమోదం తెలిపిందని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా పేర్కొన్నారు.