Tummala Nageswara Rao
-
ఎకరంలోపు రైతులకు ‘తొలి’ భరోసా
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా పథకం అమల్లో భాగంగా తొలుత ఎకరం విస్తీర్ణం వరకున్న సాగు భూములకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం విడుదల చేసింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 17.03 లక్షల రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.533 కోట్లకు పైగా నిధులు జమ చేసింది. గత నెల 26న రైతు భరోసా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుని 27వ తేదీన 4,41,911 మంది రైతుల ఖాతాల్లో రూ.593 కోట్లు జమ చేశారు. దీంతో ఇప్పటివరకు దాదాపుగా 21.45 లక్షల మంది రైతులకు రూ.1,126.54 కోట్ల మొత్తాన్ని రైతుభరోసా కింద అందజేసినట్లయింది. 72 లక్షల మందికి పైగా రైతులకు... రాష్ట్రంలో తాజాగా నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వే ప్రకారం కోటిన్నర ఎకరాలకు పైగా వ్యవసాయ యోగ్యమైన భూమిని రైతు భరోసాకు అర్హత గలదిగా తేల్చారు. 72 లక్షల మందికి పైగా రైతుల వద్ద ఉన్న ఈ భూములన్నింటికీ ఖజానాలో నిధుల లభ్యతను బట్టి రైతుభరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖజానాలో ఉన్న నిధులను బట్టి విడతల వారీగా రెండు, మూడు ఎకరాల ప్రాతిపదికన రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం ఎకరం వరకు ఉన్న భూమికి రైతు భరోసా నిధులివ్వగా, ఎకరం పైబడి రెండు ఎకరాల వరకు గల రైతులకు త్వరలోనే ఈ పథకం కింద నిధులను జమ చేయనున్నారు. అయితే సరిగ్గా ఎప్పుడు మలివిడత నిధులు విడుదల చేస్తారనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. వ్యవసాయ యోగ్యం కాని భూములు 2.50 లక్షల ఎకరాలు! రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యం కాని భూములు అటు ఇటుగా రెండున్నర లక్షల ఎకరాలని అధికారులు లెక్క తేల్చినట్లు తెలిసింది. గత నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ ఎక్స్టెన్షన్ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా జరిపిన సర్వేలో 2.10 లక్షల ఎకరాలు సాగు యోగ్యం కానివిగా గుర్తించగా, 21 నుంచి 24వ తేదీ వరకు సాగిన గ్రామ సభల్లో వచ్చిన విజ్ఞప్తులు, ఫిర్యాదుల అనంతరం వాటి విస్తీర్ణం 2.50 లక్షల ఎకరాలకు పెరిగినట్లు తెలిసింది. హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి, యాదాద్రి–భువనగిరి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాల్లో రియల్ వెంచర్లుగా, ఇతర అవసరాలకు వినియోగిస్తున్న భూములపై ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా పలు జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో తొలుత వ్యవసాయ యోగ్యం కాని భూములుగా గుర్తించిన వాటిని తర్వాత సాగుకు పనికొచ్చేవిగా మార్చారు. ఈ కసరత్తు కోసం ప్రభుత్వం దాదాపు వారం రోజుల సమయం తీసుకుంది. కూడికలు, తీసివేతల తరువాత సాగు యోగ్యం కాని భూముల విస్తీర్ణం 2.50 లక్షల ఎకరాలుగా నిర్ధారించినట్లు తెలిసింది. రైతులకిచ్చిన మాట నిలబెట్టుకుంటాం రైతులకిచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రైతు భరోసా నిధులను నిర్ణీత కాల వ్యవధిలో చెల్లిస్తుంది. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.1,126.54 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఇప్పటికే రైతుబంధు (కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో) కింద రూ.7,625 కోట్లు, రుణమాఫీకి రూ.20,616.89 కోట్లు, రైతు భీమాకు రూ.3000 కోట్లు చెల్లించాం. పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. గతంలో ఎన్నడూలేని విధంగా రూ.14,893 కోట్లతో 20,11,954 మెట్రిక్ టన్నుల పత్తిని మద్దతు ధరకు సేకరించాం. రూ. 406.24 కోట్లతో సోయాబీన్, పెసర, కంది పంటలను మార్క్ఫెడ్ ద్వారా మద్దతు ధరకు కోనుగోలు చేశాం. యాసంగిలో 48.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రూ.10,547 కోట్లు వెచ్చించి సేకరించాం. సన్న ధాన్యానికి రూ.500 బోనస్ కింద రూ.1,154 కోట్లు రైతులకు అందజేశాం. ఈ యాసంగికి కూడా సన్నాలకు బోనస్ కొనసాగిస్తాం. – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు -
సాగు భూమికే రైతుభరోసా
సాక్షి, హైదరాబాద్: పంటలు సాగుచేసిన భూమికే రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించారు. ఇందుకోసం శాటిలైట్ సర్వే ద్వారా రిమోట్ సెన్సింగ్ డేటాను వినియోగించనున్నట్లు తెలిపారు. సర్వే నంబర్లవారీగా సాగులో ఉన్న భూమి విస్తీర్ణంతోపాటు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగైందనే వివరాలను రిమోట్ సెన్సింగ్ డేటాతో పొందవచ్చని చెప్పారు. ఇదే విషయాన్ని ఈ నెల 26వ తేదీన ‘సాగు రైతుకే భరోసా’శీర్షికతో ప్రచురితమైన కథనంలో ‘సాక్షి’వెల్లడించింది. ఈ సంక్రాంతి నుంచి ‘రైతుభరోసా’ప్రారంభించనున్న నేపథ్యంలో శనివారం సచివాలయంలో రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణాన్ని అంచనా వేసే వివిధ కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సమావేశమయ్యారు. రిమోట్ సెన్సింగ్ డేటానే కీలకం సాగు చేసిన భూముల వివరాలను వ్యవసాయ అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు నమోదుచేస్తామని మంత్రి వెల్లడించారు. పథకం అమలులో కచ్చితత్వం కోసం ఉపగ్రహ డేటాలో గ్రామాల వారీగా, సర్వే నంబర్ల వారీగా సాగుభూమి, పంటల వివరాలను సేకరిస్తామని చెప్పారు. సాగు భూముల విస్తీర్ణం, సాగుకు అనువుగా లేని భూముల విస్తీర్ణంతో పాటు ప్రస్తుతం ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగైందనే వివరాలను పక్కాగా నమోదు చేస్తామని తెలిపారు. ఈ వివరాలను రైతుభరోసా పథకంతోపాటు, పంటల బీమా పథకానికి కూడా వినియోగిస్తామని పేర్కొన్నారు. పంటల ఆరోగ్య స్థితి, పంటల ఎదుగుదల, చీడపీడలను ఆరంభంలోనే గుర్తించడం, వరదలు, తుఫాన్ల వల్ల జరిగే పంటనష్టాన్ని అంచనా వేయడంలో నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సమావేశానికి హాజరైన వివిధ కంపెనీల ప్రతినిధులు తమ సంస్థల ద్వారా ఇంతకు ముందు చేపట్టిన ప్రాజెక్టుల గురించి వివరించారు. నమూనా సర్వే కింద రెండు మండలాల్లో పంటలు, గ్రామాల వారీగా సాగైన వివరాలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. సాగుకు అనువుగా లేని ప్రాంతాలను డిజిటల్ మ్యాప్స్ ద్వారా చూపించారు. పంటలను సోకే చీడపీడలను ఆరంభంలోనే గుర్తించే విధంగా ఆయా కంపెనీలు ఏఐ పరిజ్ఞానంలో తయారు చేసిన మోడల్స్ను వివరించారు. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ వీటన్నిటిని పరిశీలించి మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయం మేరకు, కేబినెట్ ఆమోదానికి పంపించడం జరుగుతుందని మంత్రి తుమ్మల తెలిపారు. -
రైతన్నలూ.. ఆయిల్పాం సాగు చేయండి
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘రైతులంతా ఆయిల్పాం సాగుపై దృష్టి పెట్టాలి. మొదటి మూడే ళ్లు మీకు పెట్టుబడి పెట్టే బాధ్యత మాది. అంతర పంటలు వేస్తే బోనస్ ఇచ్చే బాధ్యత కూడా మాదే. మీ పంటను ఇంటి వద్దే కొనిపించే బాధ్యత తీసు కుంటాం. వెంటనే మీ ఖాతాలో డబ్బులు వేస్తాం. పామాయిల్ పంట వేయండి.. మీ బతుకుల్లో వెలుగులు నింపలేకపోతే వ్యవసాయ శాఖపరంగా మీరు ఏ శిక్ష విధించినా దానికి సిద్ధంగా ఉంటాం. రైతులకు నష్టం రాకుండా చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్లో మూడు రోజుల రైతు పండుగ సదస్సును పద్మశ్రీ అవార్డుగ్రహీత, రైతు వెంకటరెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సదస్సులో మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, ఆహార పదార్థాలకు సంబంధించి రైతులకు అవగాహన కల్పించేలా మైదానంలో ఏర్పాటు చేసిన 117 స్టాళ్లు, ఎగ్జిబిట్లను తిలకించిన అనంతరం సదస్సులో మంత్రి తుమ్మల మాట్లాడారు. రాష్ట్రానికి అప్పులు, కష్టాలు ఉన్నా రైతాంగాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి పనిచేస్తున్నట్లు తెలిపారు.అనుకున్నవన్నీ నాలుగేళ్లలో చేస్తాం..రైతులు తమకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని, వచ్చే నాలుగేళ్లలో అనుకున్న వ న్నీ చేసి అన్నదాతల చేత శెభాష్ అనిపించుకుంటా మని మంత్రి తుమ్మల చెప్పారు. బీఆర్ఎస్ నేతలు పదేళ్లు వ్యవసాయాన్ని ఎలా ఆగం చేశారో, ఈ పది నెలల్లో ఏ రకంగా ఆదుకున్నామో ఈ నెల 30న జరి గే సభలో సీఎం రేవంత్రెడ్డి చెబుతారని తుమ్మల తెలిపారు. రైతులను సమీకరించి సంక్రాంతికి ముందే రైతు పండుగను నిర్వహించుకుంటామన్నారు.సాగు దండగ కాదు.. పండగని వైఎస్ నిరూపించారు: దామోదరఉమ్మడి ఏపీలో 2003–04లో వ్యవసాయం దండగ అని ప్రచారం జరిగితే 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమైన ప్రాజెక్టు లను చేపట్టి కొంత వరకు పూర్తి చేశారని.. వ్యవసాయం దండగ కాదు.. పండగని నిరూ పించారని మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ఇన్ చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొ న్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వ్యవసా య రంగాన్ని నిర్లక్ష్యం చేసినా ప్రస్తుత ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాలు తీసుకొన వాటిని సాకారం చేసుకుంటూ ముందుకు సాగుతోందన్నారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ రైతులు సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల పెట్టుబడులు తగ్గి లాభాలు పెరుగుతాయన్నా రు. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెలేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
వాణిజ్య పంటలవైపు రైతులను ప్రోత్సహించాలి
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పంటల సాగువైపు రైతాం గాన్ని ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. ప్రధా నంగా పంటల మార్పిడిపైన విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా నియమితులైన వ్యవసాయ అధికారులకు శనివారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, రానున్న ఐదేళ్లలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా ని లబెట్టాలనే సంకల్పంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా పనిచేస్తోం దని అన్నారు. ప్రభుత్వ సంకల్పంలో వ్యవసాయాధికారులంతా భాగస్వామ్యం కావాలన్నారు. సాంకేతికంగా వస్తున్న మార్పుల ను, పద్ధతులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్డేట్ కావా లన్నారు. నూతన విషయాలు తెలుసుకునే విధంగా వ్యవసాయ శాఖ అధికారులకు క్రమం తప్పకుండా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సంచాలకుడు గోపి, కోర్సు కోఆర్డినేటర్ ఉషారాణి, ఎంసీఆర్హెచ్ఆర్డీ డీజీ శశాంక్ గోయల్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగా నియమితులైన అధికారులు ముఖ్యమంత్రి సహాయనిధి కోసం రూ.51 వేల చెక్కును మంత్రి తుమ్మలకు అందచేశారు. -
రాష్ట్రంలో సీడ్ గార్డెన్ ఏర్పాటు చేస్తాం: మంత్రి తుమ్మల
సాక్షి, హైదరాబాద్: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో సొంతంగా సీడ్ గార్డెన్ ఏర్పాటు చేస్తామని, అందుకు తగిన అవకాశాలను పరిశీలిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మలేసియా పర్యటనలో ఉన్న మంత్రి తుమ్మల సీడ్ గార్డెన్ ప్రతినిధులతో గురువారం సమావేశమయ్యారు. అనంతరం ఎఫ్జీవీ కంపెనీ సీడ్ గార్డెన్, నర్సరీలు, అధునాతన సాంకేతిక పద్ధతులతో నడుపుతున్న విత్తన కేంద్రాన్ని సందర్శించారు.అక్కడ ఎఫ్జీవీ కంపెనీ రిఫైనరీ మొక్కలను సందర్శించి అక్కడ తయారు చేసే వివిధ ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ...ఎఫ్జీవీ కంపెనీ నుంచి ఇప్పటికే రాష్ట్రానికి సీడ్స్ను చాలావరకు తెప్పించుకున్నామన్నారు. రాష్ట్రంలో సీడ్ గార్డెన్ ఏర్పాటుకు ఎఫ్జీవీ కంపెనీ సహాయ సహకారాలు అందజేయాలని కోరగా వారు సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు తెలిపారు. వివిధ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ గురించి అక్కడ కంపెనీ ప్రతినిధులు మంత్రికి వివరించారు. -
ఖరీఫ్ ‘భరోసా’ బోల్తా
‘ఈ ఖరీఫ్ సీజన్కు రైతు భరోసా ఇవ్వలేం’.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం చేసిన ప్రకటన రైతులకు శరాఘాతమైంది. ఈ వానాకాలం సీజన్కు రైతు భరోసా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం చివరకు చేతులెత్తేసింది. – సాక్షి, హైదరాబాద్ ఆర్భాటంగా కేబినెట్ సబ్ కమిటీకాగా, జూలై 2వ తేదీన రైతు భరోసాపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం తెలిసిందే. అందులో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్బాబులను సభ్యులుగా నియమించారు. అప్పటినుంచి 15 రోజుల్లోగా మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇవ్వాలి. ఆ నివేదికపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి రైతు భరోసాపై నిర్ణయం తీసుకోవలసి ఉంది. అసెంబ్లీ ఆమోదం తర్వాత మార్గదర్శకాలు జారీచేసి రైతులకు పెట్టుబడి సాయం చేస్తామని సర్కారు ప్రకటించింది. సమావేశాలు పెట్టి.. అభిప్రాయాలు సేకరించి..జూలై 15వ తేదీన కేబినెట్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో వరంగల్లో రైతులతో సమావేశం నిర్వహించారు. రైతు భరోసాపై అభిప్రాయాలు తీసుకున్నారు. ఆదిలాబాద్ సహా కొన్ని జిల్లాల్లోనూ అభిప్రాయాలు తీసుకున్నారు. జూలై 23వ తేదీ నుంచి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కానీ అసెంబ్లీ సమావేశాల్లో రైతుభరోసా ఊసే ఎత్తలేదు. దీంతో మార్గదర్శకాలు ఖరారు కాలేదు. ఈ వానాకాలం ఖరీఫ్ సీజన్కు రైతు భరోసా ఇవ్వబోమని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శనివారం స్పష్టం చేయడంతో రైతులు కంగుతిన్నారు. రైతు భరోసాకు బదులుగా సన్న ధాన్యం పండించిన ప్రతి రైతుకు రూ.500 బోనస్ ఇస్తామని తుమ్మల ప్రకటించారు. పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు స్పష్టం చేశారు. వ్యవసాయం చేయని వారికి రైతు భరోసా ఇవ్వబోమని తేల్చిచెప్పారు. కాగా, వరదలు, భారీ వర్షాలతో అన్నదాత కుదేలయ్యాడు. మరోవైపు రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగకపోవడంతో లక్షలాది మంది రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వలేదు. ఖరీఫ్ ముగిసినా రైతు భరోసా కింద ఆర్థిక సాయం చేస్తారన్న నమ్మకంతో రైతులున్నారు. చివరికి ఇలా జరగడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీలక పథకానికి తొలి ఆటంకం..వాస్తవానికి సీజన్కు ముందే రైతు భరోసా ఇవ్వాలనేది పథకం ఉద్దేశం. రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు, కూలీల ఖర్చును పెట్టుబడి సాయం ద్వారా అందించాలన్నది దీని లక్ష్యం. 2018 నుంచి ఏటా రెండు సీజన్లలో నిరాటంకంగా కొనసాగిన ఈ పథకం ఈ వానాకాలం సీజన్లో మాత్రం తొలిసారిగా నిలిచిపోయింది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా పథకం ఆగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత యాసంగిలో రైతుబంధు పథకం కింద పాత పద్ధతిలోనే పెట్టుబడి సాయం చేశారు. కనీసం అలాగైనా ఈ వానాకాలం సీజన్కు ఇచ్చినా బాగుండేదని రైతులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా మొత్తాన్ని సీజన్కు ఎకరానికి రూ.7,500కు పెంచి ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ ప్రకారం రెండు సీజన్లకు కలిపి రూ.15 వేలు ఇస్తామని చెప్పింది. ఈ వానాకాలం సీజన్ నుంచే అమలు చేస్తామని పేర్కొంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు నిబంధనలు పునఃసమీక్ష తర్వాత అర్హులకు రైతుభరోసా ఇస్తామని ప్రకటించింది. మార్గదర్శకాలు ఎలా ఉంటాయో..?ప్రభుత్వం ముఖ్యంగా రైతుభరోసాకు సీలింగ్ విధించాలన్న ఆలోచనలో ఉందని అంటున్నారు. అందరికీ కాకుండా ఐదు లేదా పదెకరాలకు దీనిని పరిమితం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సాగు చేసిన రైతులకు మాత్రమే ఇవ్వాలనేది ఉద్దేశం. గత యాసంగి సీజన్లో మొత్తం 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.99 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేశారు. అందులో ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షల మంది కాగా, వారి చేతిలో కోటి ఎకరాల భూమి ఉంది. అంటే మొత్తం రైతుబంధు అందుకున్న వారిలో ఐదెకరాల్లోపు రైతులే 90.36 శాతం ఉండటం గమనార్హం.కాగా ఐదెకరాలకు పరిమితం చేస్తే 90 శాతం మందికి రైతుభరోసా ఇచ్చినట్లు అవుతుందనేది ప్రభుత్వ ఉద్దేశంగా చెబుతున్నారు. ఇక ఎకరాలోపున్న రైతులు 22.55 లక్షల మంది, ఎకరా నుంచి రెండెకరాల వరకున్న రైతులు 16.98 లక్షల మంది, రెండెకరాల నుంచి మూడెకరాల్లోపున్న వారు 10.89 లక్షల మంది, మూడెకరాల నుంచి నాలుగెకరాల్లోపున్న వారు 6.64 లక్షల మంది, నాలుగెకరాల నుంచి ఐదెకరాల్లోపున్న రైతులు 5.26 లక్షల మంది ఉన్నారు. ఇక 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల సంఖ్య 5.72 లక్షల మంది కాగా.. వారి చేతిలో 31.04 లక్షల ఎకరాల భూమి ఉంది. పదెకరాల వరకు ఇస్తే, రైతు భరోసాకు వీరు కూడా తోడవుతారు. పీఎం కిసాన్ నిబంధనలను అమలు చేస్తే అనేక మందికి కోత పడుతుంది. భూములున్న ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించేవారు.. ఇలా చాలామందికి కోతపడే అవకాశాలున్నాయి. చివరికేం జరుగుతుందో చూడాలి. -
ఖరీఫ్ సీజన్ రైతు భరోసా లేదు!
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్ రైతు భరోసా ఇవ్వలేమని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ముగిసిందని, పంట దిగుబడులు కూడా వచ్చేశాయన్నారు. రైతు భరోసా పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుందన్నారు.కమిటీ నివేదికకు అనుగుణంగా పథకాన్ని అమలు చేస్తామన్నారు. రబీ సీజన్ నుంచి రైతుభరోసా పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు వివరించారు. శనివారం బీఆర్కేఆర్ భవన్లోని రైతు సంక్షేమ కమిషన్ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో కలిసి తుమ్మల మీడియా సమావేశంలో మాట్లాడారు. సాగు చేసే రైతులకే రైతు భరోసా అమలు చేస్తామని, మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ప్రభుత్వానికి అందిన తర్వాత డిసెంబర్ నుంచి ఈ పథకం అమలవుతుందన్నారు. గత ప్రభుత్వం పంటలు సాగు చేయని, పంట యోగ్యత లేని భూములకు రైతుబంధు కింద డబ్బులు ఇచ్చిందని, దాదాపు రూ.25 వేల కోట్లు ఇలాంటి భూములకు ఇచ్చినట్లు తుమ్మల వ్యాఖ్యానించారు. చిన్న పొరపాట్లతో..: దేశంలో ఏ రాష్ట్రం కూడా రైతురుణ మాఫీ చేయలేదని, తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏకంగా రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేసిందని మంత్రి తుమ్మల చెప్పారు. సాంకేతిక కారణాలు, చిన్నపాటి పొరపాట్లతో దాదాపు 3 లక్షల మందికి మాఫీ కాలేదన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే నిర్వహించారని, వారికి డిసెంబర్లోగా రూ.2,500 కోట్ల మేర రుణమాఫీ చేయనున్నట్లు వివరించారు. రెండు లక్షల రూపాయలకు మించి రుణాలు తీసుకున్న వారికీ మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందులో భాగంగా రూ.2 లక్షలకు మించి ఉన్న బకాయిని చెల్లించిన రైతులకు మాఫీ చేసేందుకు విడతల వారీగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుందన్నారు. రాష్ట్రంలో పంటబీమా అమలు లేదని, త్వరలో ప్రతి రైతుకూ ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుందని, త్వరలో బీమా కంపెనీలను టెండర్లకు పిలుస్తామన్నారు. రాష్ట్రంలో పంట దిగుబడులను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, కానీ కేంద్రం మాత్రం 25 శాతానికి మించి కోటా కొనుగోలు చేయడం లేదని చెప్పారు. అనంతరం రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగానికి లబ్ధి కలిగించే సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేసిందని, రెండేళ్లపాటు ఈ కమిషన్కు అవకాశం ఉందన్నారు. మెరుగైన అంశాలతో రైతు సంక్షేమం కోసం ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పి.సుదర్శన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పామాయిల్ సాగు చేయండి.. దర్జాగా బతకండి
నల్లగొండ: రైతులు పామాయిల్ సాగు చేస్తే.. మీసం మీద చేయి వేసుకుని దర్జాగా బతకొచ్చని వ్యవసాయ శాఖ మంత్రి, నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. బుధవా రం నల్లగొండలోని ఎస్ఎల్బీసీ బత్తాయి మార్కె ట్లో ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. పామాయిల్ పంట తక్కువ నీటితో సాగవుతుందని చెప్పారు. తాను వంద ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నానని.. మీరు మంత్రి కోమటిరెడ్డిని వెంటబెట్టుకుని వచ్చి చూడవచ్చని రైతులకు సూచించారు. నల్లగొండ జిల్లాలో 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తే.. ఇక్కడే పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని.. మిగిలిన రుణమాఫీని కూడా చేయా లని కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం ఎటు పోయిందో.. ఎవరు తిన్నారో కూడా తెలియదని.. రూ.50 వేల కోట్ల అప్పులయితే ఉన్నాయని చెప్పా రు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినవారే ఇప్పుడు శ్రీరంగ నీతులు చెబుతున్నారని విమర్శించారు. సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నా మని.. ఆ ధాన్యం కొనుగోలు చేసి రేషన్ కార్డు దారులకు, హాస్టళ్లకు బియ్యం సరఫరా చేస్తామ న్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మళ్లీ మంత్రిగా రావడంతోనే సొరంగ మార్గం పనులు మొద లయ్యాయని, ఆయన హయాంలోనే సొరంగ మార్గం పూర్తవుతుందని పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేకపోయిందని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామని చెప్పారు. -
ఎస్హెచ్జీ సభ్యులకు ఒకే డిజైన్ చీరలు
సాక్షి, హైదరాబాద్: మహిళా స్వయం సహాయక సంఘాల్లో (ఎస్హెచ్జీ) సభ్యులుగా ఉన్న మహిళలకు ఒకే డిజైన్తో ఉండే చీరలు పంపిణీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి ఈ నెలాఖరులోగా విధి విధానాలు ఖరారు చేయా లని నిర్ణయించింది. చీరల పంపిణీ పథకాన్ని ఏ తరహాలో అమలు చేయాలనే అంశానికి సంబంధించి చేనేతశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల సమీక్షించారు. మరో వారం రోజుల్లో సీఎం రేవంత్రెడ్డితో జరిగే భేటీలో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత, చీరల పంపిణీ పథకం అమలుపై తుది నిర్ణయం తీసుకుంటారు.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్కార్డులో పేర్లు కలిగిన 18 ఏళ్లు పైబడిన యువతులు, మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసింది. అయితే రాష్ట్రంలో గ్రామీణ పేదరి క నిర్మూలన సంస్థ (సెర్ప్), మెప్మా పరిధిలోని 63 లక్షల మంది మహిళా సభ్యులకు ఈ చీరలు పంపిణీ చేయాలని ప్రస్తుత ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అయితే స్వయం సహాయక సంఘా ల మహిళలకు పంపిణీ చేసేది బతుకమ్మ చీరలు కాదని, రాష్ట్రమంతటా ఒకే డిజైన్ కలిగిన చీరలను పంపిణీ చేస్తామని చేనేతశాఖ వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరల్లో నాణ్యత లేదని, సరఫరాలో కుంభకోణం జరిగిందని సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో పూర్తిగా స్థానికంగా ఉండే నేత కారి్మకులను భాగస్వాములను చేస్తూ నాణ్యత కలిగిన చీరలను ఉత్పత్తి చేసి పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఒక్కో మహిళకు ఒకటా.. రెండా..? స్వయం సహాయక సంఘాల మహిళలకు ఒక్కొక్కరికీ ఏటా ఎన్ని చీరలు పంపిణీ చేయాలనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎస్హెచ్జీల్లో పెరిగే సభ్యు ల సంఖ్యను కూడా దృష్టిలో పెట్టుకొని ఏటా రెండేసి చీరల చొప్పున పంపిణీ చేస్తే 1.3 కోట్ల చీరలు అవసరమవుతాయని ప్రాథమికంగా లెక్కలు వేశా రు. ఒక్కో చీర తయారీకి అయ్యే ఖర్చు, ఏటా కేటాయించాల్సిన బడ్జెట్ తదితరాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.ఈ చీరలను పండుగ సమయా ల్లో ఇవ్వాలా, ఏదైనా ప్రత్యేక సందర్భంలో ఇవ్వా లా అకోణంలోనూ అధికారులు ఆలోచిస్తున్నారు. 2017లో బతుకమ్మ చీరల పథకం ప్రారంభంకాగా సగటున రూ.325 కోట్ల బడ్జెట్తో కోటి చీరలు పంపిణీ చేస్తూ వచ్చారు. గత ఏడాది 30 రకాల డిజైన్లు, 20 విభిన్న రంగుల్లో 240 వెరైటీల్లో చీరలను తయారు చేయించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) డిజైనర్లతో బతుకమ్మ చీరలు డిజైన్ చేయించారు. ఎస్హెచ్జీ మహిళలకు పంపిణీ చేసే చీరల డిజైన్లను కూడా నిఫ్ట్ డిజైనర్ల సూచనలు, సలహాల ఆధారంగా ఖరారు చేస్తారు. ప్రస్తుతం సొంతంగా ఎస్హెచ్జీల కొనుగోలు ప్రస్తుతం రాష్ట్రంలోని ఎస్హెచ్జీల మహిళలకు ప్రత్యేక యూనిఫారం లేకున్నా స్థానికంగా గ్రామ, మండల సమాఖ్యలు మూకుమ్మడిగా నిర్ణయించుకొని తమకు నచ్చిన డిజైన్ చీరలను యూనిఫారాలుగా ఎంచుకుంటున్నాయి. ఎస్హెచ్జీల సమావేశాలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ఒకే డిజైన్ చీరలు ధరించి హాజరవుతున్నారు. గ్రామ, మండల సమాఖ్య నిధుల నుంచి లేదా సొంతంగా తలాకొంత మొత్తం పోగు చేసి వీటిని కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వమే పంపిణీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఒకటి లేదా రెండు డిజైన్లను ఎంపిక చేసి చీరల తయారీకి ఆర్డర్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు ప్రాథమికంగా పది డిజైన్లను సిద్ధం చేసిన చేనేత విభాగం త్వరలో సీఎంతో జరిగే భేటీలో ఒకటి రెండు డిజైన్లను ఖరారు చేసే అవకాశముంది. -
భద్రాద్రిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, రాష్ట్రంలో కోకోనట్ బోర్డు ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శివరాజ్సింగ్ చౌహాన్లకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీ పర్యటనలో భాగంగా తుమ్మల కేంద్ర మంత్రులతో విడివిడిగా సమావేశమై రాష్ట్రానికి చెందిన పలు అంశాలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రా లు అందజేశారు. అనంతరం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్నగర్లో ఎయిర్పోర్టుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని రామ్మోహన్ నాయుడును కోరినట్లు తెలిపారు. తెలంగాణలో నూతన కోకోనట్ బోర్డ్ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరానన్నారు. ఆయిల్పామ్ మీద 28% దిగుమతి సుంకం విధించి, దేశీయంగా ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తున్నందుకు తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. ఆయిల్పామ్కు కేంద్రం కనీస మద్దతు ధర కలి్పంచాలని కోరారు. అలాగే ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటలో సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ను ఏర్పాటు చేయాలని కూడా విన్నవించారు. ఇటీవలి వరదల్లో నష్టపోయిన ఖమ్మం జిల్లాకు తగిన మొత్తంలో సహాయం అందజేయాలని కోరారు. నష్టంపై నివేదిక రాగానే సహాయం అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచి్చనట్లు తెలిపారు. కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ను కలిసి, తెలంగాణలో ఎక్కువగా పండే పంటలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని కోరానన్నారు. అలాగే.. ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ ఆహార సదస్సులో పాల్గొని.. తెలంగాణలోని అవకాశాలను వివరించి, ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించడానికి రాష్ట్రానికి రావాలని ఆహా్వనించానన్నారు. సాగు చేసేవారికే రైతుబంధువ్యవసాయం చేసే వారికే రైతుబంధు ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కౌలు రైతు, భూమి యజమాని చర్చించుకొని రైతుబంధు ఎవరు తీసుకోవాలన్నది వారే నిర్ణయించుకోవాలన్నారు. ఏపీలో ఉన్నట్లుగా తెలంగాణలో కౌలు రైతు ఒప్పందాలు లేవని గుర్తుచేశారు. ఐదేళ్లలో కేసీఆర్ రూ.లక్ష రుణమాఫీ చేయలేదని, ఒకేసారి రూ.18,000 కోట్లు ఇచ్చి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. అవసరమైతే ఇంకా నిధులు సమకూరుస్తామని తెలిపారు. ప్రతి పంట, ప్రతి రైతుకు వర్తించేలా రూ.3,000 కోట్లతో బీమా చేయనున్నట్లు తుమ్మల తెలిపారు. -
సోషల్ మీడియాలో బతికేస్తున్న కేటీఆర్, హరీశ్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రతిపక్షాలు ప్రజాప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు పనికిమాలినవని.. వాళ్లు చేసిన పాపాలపై నిలదీస్తారనే భయంతో ప్రజల్లోకి వచ్చే ధైర్యం లేక ట్విటర్, ఫేస్బుక్, వాట్సాప్ వేదికగా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్రావు రాజకీయంగా బతికేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. అనుకోని విధంగా వచి్చన ఈ విపత్తును ఎదుర్కొనేలా రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్గా ఉన్నందునే రాష్ట్రంలో ఎక్కడా ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు.వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులరి్పంచాక డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలకు పని లేదని.. వారు చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. గత బీఆర్ఎస్ పాలకుల మాదిరిగా తాము గడీల్లో పడుకోలేదని, ప్రజల మధ్యే ఉండి సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో కొద్దిపాటి వర్షం పడితే జంట నగరాలు మునిగిపోయాయని, కానీ ఇంత పెద్ద విపత్తు వచ్చినా హైదరాబాద్ నేడు సురక్షితంగా ఉందంటే తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ఫలితమేనని భట్టి తెలిపారు. భారీ వర్షాలు, వరదతో నిరాశ్రయులైన వారికి తక్షణమే నిత్యావసర సరుకులను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. -
ఎన్నో అవమానాలు.. మంత్రి తుమ్మల కంటతడి
సాక్షి, ఖమ్మం: నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఆవేదన... అవమానాలు చెప్పాలనుకుంటున్నా.. వాస్తవాలు ప్రజలకు అవసరం అంటూ మీడియా సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంటతడి పెట్టారు. పేరు కోసం, ఫ్లెక్సీ కోసం రాజకీయం చేయలేదన్నారు. ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతోనే పనిచేశానన్నారు.శ్రీరామచంద్రుడు దయ, ఖమ్మం జిల్లా ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్లో చేరాను. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి లో భాగస్వామ్యం కల్పించారు. ఖమ్మం జిల్లాకి సంబంధించి సుదీర్ఘ ప్రయాణం చేసిన గోదావరి తల్లిని వాడుకోలేక పోతున్నాం. నాకు అవకాశం వచ్చినప్పుడుల్లా... నాటి బడ్జెట్ తక్కువగా ఉండేది.. ఇరిగేషన్కి కూడా తక్కువ బడ్జెట్ ఉండేది. కరువు పీడిత ప్రాంతాల ప్రజలకు నీరు ఇవ్వాలనేది నా సంకల్పం’’ అని తుమ్మల పేర్కొన్నారు.‘‘ఏ ప్రభుత్వంలో ఉన్నా దుమ్ముగూడెం ప్రాజెక్ట్ను ప్రతిపాదించా.. నాడు బడ్జెట్లో దేవదులను పూర్తి చేశాం. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ గా విడదీశారు. ఇందిరా సాగర్ వద్ద బ్యాక్ వాటర్కు ఆనాటి సీఎం వైఎస్సార్ టెండర్లు పిలిచారు.. దురదృష్టవశాత్తు వైఎస్సార్ మృతి ఆ ప్రాజెక్టుకి శాపం అయింది.’’ అని తమ్మల వివరించారు.తెలంగాణ ఉద్యమం ఫలితంగా రాష్ట్రం ఏర్పాటయ్యింది. ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లా ప్రజల కోసం ఆనాటి సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు వెళ్లాను. కేసీఆర్తో శంకుస్థాపన చేశారు... పనులు ప్రారంభం అయ్యాయి... మళ్ళీ జరిగిన ఎన్నికల తరవాత పనులు ఆగిపోయాయి. రోళ్లపాడు ఆలైన్మెంట్ జూలూరుపాడుకి మార్చారు. బిజి కొత్తూరు 150 చెక్ డ్యాంలు నిర్మించాలి. జూలూరుపాడు టన్నెల్ ప్రాతిపదిన లేదు.. రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యాను. ఇప్పటికే 8వేల కోట్లు ఖర్చు చేశారు. పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరాను’’ అని తుమ్మల చెప్పారు. -
‘సుంకిశాల’ నష్టాన్ని కాంట్రాక్టరే భరిస్తాడు
సాక్షి, హైదరాబాద్/పెద్దవూర: జంటనగరాలకు తాగునీరు అందించేందుకు సుంకిశాల వద్ద చేపడుతున్న ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్ కూలిన సంఘటన చిన్నదని, నష్టం తక్కువైనా చాలా దురదృష్టకరమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. పనులు పూర్తి కావడానికి రెండు నెలలు ఆలస్యమవుతుందని, ఎంతటి నష్టమైనా కాంట్రాక్టరే భరిస్తాడని, ప్రభుత్వానికి ఏమీ నష్టం లేదని పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టును కాంట్రాక్టర్ పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుందని తెలిపారు. నీట మునిగిన సుంకిశాల పంప్హౌస్ను ఉత్తమ్కుమార్రెడ్డి శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిలతో కలిసి పరిశీలించారు.అనంతరం మంత్రి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. సుంకిశాల ప్రాజెక్టుకు ఈ పరిస్థితి రావడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు. సుంకిశాల ప్రాజెక్టును డిజైన్ చేసింది, కాంట్రాక్ట్ ఇచ్చింది. నిర్మాణం చేపట్టింది బీఆర్ఎస్ పార్టీనే అని చెప్పారు. ప్రతిపక్ష నాయకులు ఎందుకు మొత్తుకుంటున్నారో అర్థం కావడం లేదని, ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఈ పనులను ప్రారంభించటంలో మతలబు ఏమిటో వారే చెప్పాలన్నారు. శ్రీశైలం సొరంగం పనులు పూర్తి చేసి ఉంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు, హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందేదని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను పట్టించుకోలేదని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి తీరుతామని చెప్పారు. సీఎంపై ఆరోపణలు సరికావు : గుత్తా సుంకిశాల ఘటనకు సీఎం రేవంత్రెడ్డి బాధ్యుడని రాజకీయ ఆరోపణలు కేటీఆర్ చేయడం సరికాదని, ప్రస్తుతం మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నంత మాత్రాన ఈ ఘటనకు సీఎం బాధ్యుడని అంటే ఎలా అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రశ్నించారు. సుంకిశాల ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లోనే ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో, ఎవరి కోసం చేపట్టాల్సి వచ్చిందో కేసీఆర్, కేటీఆర్లలో ఎవరి మానసపుత్రికనో వారికే తెలియాలన్నారు. గ్రావిటీ ద్వారా తాగునీరు అందిస్తాం : తుమ్మలప్రభుత్వంపై ఎత్తిపోతల భారం లేకుండా మిగిలి పోయిన 9.5 కిలోమీటర్ల ఎస్ఎల్బీసీ సొరంగాన్ని పూర్తి చేసి నల్లగొండజిల్లాకు సాగునీటితో పాటు జంట నగరాలకు గ్రావిటీ ద్వారా తాగునీరు ఇవ్వ టానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వరద ఉధృతి ని ఏజెన్సీ ఊహించకపోవడం, త్వరగా పూర్తి చేయా లన్న తపనో, త్వరగా నీరు ఇవ్వాలన్న తాపత్ర యమో దురదృష్టవశాత్తు ఈ సంఘటన జరిగిందని భావిస్తున్నట్టు తెలిపారు. ఎప్పుడైతే మీడియా దృష్టికి వచ్చిందో వెంటనే ప్రభుత్వం స్పందించి కమిటీ వేసిందన్నారు. రిపోర్టు రాగానే ఏంచర్యలు తీసుకో వాలి.. బాధ్యులు ఎవరనేది తప్పకుండా ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. సుంకిశాలను సందర్శించిన వారిలో జలమండలి ఎండీ ఆశోక్రెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్లు, ఇంజనీర్ల బృందం కూడా ఉంది.పునర్నిర్మాణ వ్యయం రూ.20 కోట్లపైనేరిటైనింగ్ వాల్ నిర్మాణ ఖర్చు భరించేందుకు కాంట్రాక్టర్ సంస్థ అంగీకరించనట్టు తెలి సింది. అయితే ఈ పనులకు సుమారు రూ.20 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నాగార్జున సాగర్ జలాశయంలో నీటిమట్టం తగ్గిన తర్వాతనే దెబ్బతిన్న భాగాన్ని తిరిగి నిర్మించే అవకాశాలున్నాయి. సుంకిశాల ‘ఘటన’. రిటైనింగ్ వాల్ కూలిన వ్యవహారంలో గోప్యత ప్రదర్శించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. పనుల నాణ్యతపై కూడా ఆరా తీస్తోంది. -
పాస్బుక్ ఆధారంగా.. ప్రతి రైతుకు రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీపై రాజకీయం చేయాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలు చూస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాకముందే దానిపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్బుక్ ఆధారంగా ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని, రైతుకు రుణ విముక్తి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. 30 వేల మంది రైతులకు రుణమాఫీ కానట్లుగా లెక్కలు చెబుతున్నాయని మంత్రి చెప్పారు. ఎక్కడో ఒక దగ్గర సాంకేతిక సమస్య, పేర్లు, ఆధార్, ఇతర డేటా తప్పుడు నమోదుతో రుణమాఫీ కాలేదని పేర్కొన్నారు. రుణమాఫీ కాని రైతుల పేర్ల నమోదుకు అధికారులను నియమిస్తామని, ప్రతి రైతుకు రుణమాఫీ చేసి తీరుతామని అన్నారు. కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, వారు గతంలో ఏం చేశారో ఒక్కసారి ఆలోచన చేయాలని హితవు పలికారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.15న వైరా సభలో రూ.2 లక్షల రుణమాఫీ!ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తామని చెప్పి చేతులెత్తేసిన వాళ్లు ఈ రోజు రుణమాఫీపై మాట్లాడడం ఏమిటని తుమ్మల ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తాము రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఖమ్మం జిల్లాలోని వైరాలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేసేలా వ్యవసాయ శాఖ ఆలోచిస్తోందని తెలిపారు. రైతు భరోసా, పంటల బీమా పథకాలు కూడా అమలు చేస్తామన్నారు.సకాలంలో ప్రాజెక్టులు ఫుల్..ఈ ఏడాది సకాలంలో అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండాయంటూ మంత్రి తుమ్మల సంతోషం వ్యక్తం చేశారు. రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా విత్తనాలు, ఎరువులు సకాలంలో అందిస్తామని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన ఎరువులు కేంద్రం సకాలంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
పెదవాగు ప్రాజెక్టు రీడిజైన్ చేస్తాం
అశ్వారావుపేట రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి వద్దగల పెదవాగు ప్రాజెక్టును రీడిజైన్ చేసేలా సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన గుమ్మడవల్లి, కొత్తూరు, నారాయణపురంలో పర్యటించి వరద బాధితులు, పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అధిక వర్షాలు, వరద పోటుతో పెదవాగు ప్రాజెక్టుకు పడిన గండ్లను పరిశీలించారు.అనంతరం మాట్లాడుతూ, పెదవాగు ప్రాజెక్ట్కు గండ్లు పడి భారీగా ఆస్తి, పంట నష్టపోవడం బాధాకరమని, ఇందులో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో పెదవాగు ప్రాజెక్టుకు మరమ్మతులు చేసినా ప్రయోజనం ఉండదని, తిరిగి నిర్మించడమే మంచిదని అన్నారు.గోదావరి నదీ యాజమాన్య బోర్డు, ఏపీ రాష్ట్రంతో సమన్వయం చేసుకుంటూ ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా ప్రాజెక్టు సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచేలా, అదనంగా మరో మూడు గేట్లు ఏర్పాటుచేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే వానాకాలం సీజన్ నాటికే ప్రాజెక్టు రీడిజైన్, నిర్మాణ పనులు పూర్తయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి తుమ్మల వెంట భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్, ఎస్పీ రోహిత్రాజ్, కొత్తగూడెం ఆర్డీఓ మధు, ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్రెడ్డి ఉన్నారు.దెబ్బతిన్న పార్వతీ బరాజ్ కరకట్టమరమ్మతు చేపట్టిన నీటిపారుదల శాఖ అధికారులుమంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపు రం గ్రామ సమీపంలోని పా ర్వతీ బరాజ్ కరకట్ట కోతకు గురైంది. అప్రమత్తమైన నీటిపారుదల శాఖ అధికా రులు యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేపట్టారు. ఏడాదిన్నర క్రితం బరాజ్ డెలివరీ సిస్టం వైపు ఉన్న కరకట్ట దెబ్బతినగా మట్టి పోశారు. కానీ, భారీ వర్షాలకు మరోసారి కరకట్ట కోతకు గురైంది. అప్పటినుంచి మరమ్మతు చేపట్టలేదు. జాతీయ భద్రత ప్రాధికార సంస్థ ఆదేశాలకనుగుణంగా ప్రస్తుతం బరాజ్ మరమ్మతు కొనసాగుతోంది. ఈ క్రమంలో దిగువ గేట్లవైపు పనులు చేస్తున్నారు. ప్రస్తుతం 74 గేట్లను ఎత్తడంతో బరాజ్లోని నీరు పూర్తిగా ఖాళీ అయింది. పనిలోపనిగా గతంలో దెబ్బతిన్న కరకట్ట మరమ్మతు కూడా చేస్తున్నారు. కరకట్ట కోతకు గురికాకుండా పకడ్బందీగా పనులు..నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతోనే కరకట్ట కోతకు గురైనట్లు పలువురు భావించారు. కానీ, బరాజ్లోకి పూర్తిస్థాయి నీరు చేరినా...కరకట్ట కోతకు గురికాకుండా పనులు పకడ్బందీగా చేస్తున్నామని డీఈఈ లక్ష్మీనారాయణ ఆదివారం తెలిపారు. కోతకు గురైన ప్రాంతంలో మట్టి తొలగించి కంకర, సిమెంట్, కాంక్రీట్తోపాటు దిగువకు జారకుండా సిమెంట్ బిళ్లలు అమర్చుతామని ఆయన వివరించారు.ఏవైనా అనూహ్య పరిస్థితులేర్పడి కరకట్ట ప్రమాదానికి గురైనా దిగువన 130 మీటర్ల లోతు ఉంటుందని, సమీప గ్రామాలకు వరద చేరే అవకాశం లేదని ఆయన తెలిపారు. కాగా బరాజ్లోకి 5,429 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా అంతేమొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నామని ఆయన వివరించారు. -
తప్పుడు వివరాలిస్తే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: పంటరుణాలకు సంబంధించి తప్పుడు సమాచారమిచ్చే బ్యాంకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రుణమాఫీకి సంబంధించి బ్యాంకుల వారీగా క్షేత్రస్థాయి సమాచారాన్ని తెప్పిస్తున్నామని, ఒక సొసైటీ పరిధిలో ఒకే రోజు ఐదువందల మందికి రుణాలు ఇచ్చినట్లు సమాచారం వచి్చందని, ఇదే తరహాలో 7 బ్యాంకులు సమాచారం ఇచ్చాయన్నారు.వాటిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని, ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో రుణ మంజూరుకు కారణాలను పరిశీలించి నిర్ధారించుకుంటామన్నారు. తప్పుడు సమాచా రం ఇచ్చినట్లు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం సచివాలయంలో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్రావుతో కలిసి తుమ్మల మీడియాతో మాట్లాడారు.రుణమాఫీకి 25 లక్షల కుటుంబాలు అర్హత సాధిస్తా యని ప్రాథమికంగా భావించామని, అయితే, రాష్ట్రవ్యాప్తంగా 32 బ్యాంకుల ద్వారా రూ.2 లక్షలలోపు రుణాలు తీసుకున్న వారి సంఖ్య 44 లక్షలు ఉందన్నారు. కుటుంబం యూనిట్గా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. రేషన్ కార్డు ఆధారంగా కుటుంబ నిర్ధారణ చేస్తామని, ఈ కా ర్డు లేని వారిని పాస్బుక్ ఆధారంగా గుర్తిస్తామన్నారు.రుణమాఫీ చేయకుంటే ఉరితీయండి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పంటరుణ మాఫీ చారిత్రక నిర్ణయమని తుమ్మల చెప్పారు. అన్నదాతకు లబ్ధి చేకూరే ఈ పథకంపై రాజకీయ నేతలు తప్పుగా మాట్లాడొద్దని, అర్హత ఉన్న ప్రతి రైతుకూ పంటరుణాన్ని మాఫీ చేస్తామన్నారు. నెలరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు తెలిపారు. ఏవైనా అనుమానాలు ఉంటే రైతు వేదికల వద్ద వ్యవసాయాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు.ఇంకా నాలుగున్నరేళ్లపాటు తమ ప్రభుత్వం కొనసాగుతుందని, రుణమాఫీ చేయకుంటే తమను ఉరితీయాలని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రూ.లక్షలోపు రుణమాఫీ చేశామని, త్వరలో రూ.1.5 లక్షలలోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని, ఆ తర్వాత రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామన్నారు. రూ.1.50 లక్షలు, రూ.2 లక్షల రుణమాఫీ లబి్ధదారులు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు చెప్పలేమని, నిధులు విడుదల సమయంలో వెల్లడిస్తామని మంత్రి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.మొత్తంగా రూ.31 వేల కోట్ల మేర రుణమాఫీ జరుగుతుందని, ఇప్పటివరకు చేసిన రూ.లక్ష లోపు మాఫీ ద్వారా 11 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని వివరించారు. రుణమాఫీ పొందని రైతులు సంబంధిత కలెక్టరేట్లో లేదా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి కారణాలు తెలుసుకోవచ్చన్నారు. -
విత్తన సహకార సంస్థ ఏర్పాటు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా విత్తన ఉత్పత్తి, సేంద్రియ ఉత్పత్తుల సహకార సంస్థ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ సంస్థ ద్వారా సేంద్రియ వ్యవసాయం, విత్తన ఉత్పత్తుల్లో నిమగ్నమైన రైతులకు నేరుగా ప్రయోజనం కలుగుతుందని వివరించారు. రాష్ట్రంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సహకార సంఘాలకు గురువారం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ద్వారా అవార్డులు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి.. రైతులనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో సహకార ఉద్యమం దాదాపు 125 సంవత్సరాల నుంచి ఉందని, కానీ సకాలంలో మార్పులు చేయకపోవడం వల్ల అది కాలం చెల్లినట్లు కనిపిస్తోందని అన్నారు. సహకార రంగం ఈ కాలపు అవసరాలకు అనుగుణంగా బలోపేతం కావాలని అభిప్రాయపడ్డారు. సహకార రంగం పటిష్టతకు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేయడం చాలా ముఖ్యమని, ఇందు కోసం ప్రభుత్వం ద్వారా అనేక చర్యలు తీసు కుంటామని హామీ ఇచ్చారు. కాగా, ఈ కార్య క్రమంలో ఐదు సహకార సంఘాలకు అవార్డు లతో పాటు రూ.25 వేల నగదు బహుమతిని అందజేశారు. టీజీకాబ్ చైర్మన్ ఎం.రవీందర్రావు, ఎండీ గోపి, ఎన్సీడీసీ రీజనల్ డైరెక్టర్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.ఉద్యోగుల హాజరుపై నివేదిక ఇవ్వండివ్యవసాయ శాఖ డైరెక్టరేట్ పరిధిలో ఉద్యోగుల హాజరుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ శాఖ సంచాలకుడిని ఆదేశించారు. గురువారం మంత్రి బషీర్బాగ్లోని వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు సమయానికి రాని విషయాన్ని గుర్తించిన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల హాజరు తీరుపై సమగ్ర నివేదిక సమర్పించాలని మంత్రి ఈ సందర్భంగా డైరెక్టర్ను ఆదేశించారు. -
నాలుగు పథకాలకు రూ.60 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రానున్న 3 నెలల్లో రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా పథకాలకు రూ.50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన అన్ని జిల్లాల వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇది ప్రభుత్వానికి భారమైనా.. సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి సాహసోపేతమైన నిర్ణయాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రానున్న కాలంలో ఆర్థిక వెసులుబాటును బట్టి ఒక్కొక్కటిగా అన్ని పథకాలను పునరుద్ధరిస్తామని, ఇప్పటికే మట్టి నమూనా పరీక్ష కేంద్రాలను తిరిగి వాడుకలోకి తెచ్చి భూసార పరీక్షలు ప్రారంభించిన విషయాన్ని తుమ్మల గుర్తుచేశారు. రైతుబీమాలో 1,222 క్లెయిమ్స్ వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయన్నారు. ఇంత పెద్ద మొత్తంలో పెండింగ్ ఉంటే చనిపోయిన రైతు కుటుంబాలకు మనం అందించే ఆసరా సకాలంలో అందుతుందా? లేదా? అన్నది పరిశీలించాలని పేర్కొన్నారు. పంటల నమోదులో కచ్చితత్వం ఉండాలని, ఇది అన్నింటికీ ప్రాతిపదిక అన్నారు. ఆయిల్ పామ్ ప్రాజెక్ట్ చేపట్టి మూడేళ్లయినా ఇంకా రెండు శాఖల మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయం లేదని తుమ్మల అసంతృప్తి వ్యక్తంచేశారు. 2023–24 సంవత్సరంలో 2.30 లక్షల ఎకరాల లక్ష్యానికి గాను కేవలం 59,200 ఎకరాలు మాత్రమే పురోగతి ఉందన్నారు. హెచ్ఈవోలు లేనిచోట ఏఈవోలు పూర్తి బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. రైతును ఎంపిక చేయడం నుంచి డ్రిప్ ఇన్స్టాల్ చేయించడం, మొక్కలు నాటించడం వరకు అన్నింటిపై ఏఈవో, ఏవో బాధ్యత తీసుకోవాలన్నారు. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు సబ్సిడీపై ఇతర పంటలు సాగుచేసే రైతులకు కూడా ఈ సంవత్సరం నుంచి ఇస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్యదర్శి రఘునందన్, డైరెక్టర్ గోపి, ఉద్యాన డైరెక్టర్ యాస్మిన్ బాషా పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ ధరలు స్థిరీకరించండి
సాక్షి, హైదరాబాద్: ఆయిల్పామ్ రైతాంగాన్ని ప్రోత్సహించేందుకు ధరలను స్థిరీకరించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు శనివారం కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల ప్రత్యేకంగా లేఖ రాశారు. ఆయిల్పామ్ గెలలకు టన్ను ధర రూ.15 వేలుగా నిర్ణయించాలని, అదేవిధంగా పామాయిల్ ధర కనీసం టన్నుకు రూ.లక్ష వరకు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం 1992 నుంచి వివిధ కార్యక్రమాల ద్వారా ఆయిల్ పామ్ అభివృద్ధిని ప్రోత్సహిస్తోందని, ప్రస్తుతం రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగు, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమైన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్– ఆయిల్ పామ్ ద్వారా అమలు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేపట్టేందుకు 14 కంపెనీలకు అనుమతులిచ్చామని, ఆయిల్ పామ్ మొక్కలు పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 44 నర్సరీలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం ఆయిల్ పామ్ గెలల ధర టన్నుకు రూ.13,438గా ఉందని, అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతున్న ముడి పామాయిల్ ధరలు, వంట నూనెల దిగుమతి సుంకంపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు రైతులను నిరాశపరచడమే కాకుండా కొత్తగా ఆయిల్ పామ్ వైపు మొగ్గు చూపుతున్న రైతులపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందన్నారు.ముడి పామాయిల్ దిగుమతులపై ఉన్న సుంకాన్ని కేంద్రం పూర్తిగా ఎత్తివేయడంతో ఆయిల్ పామ్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ కారణంగా ఖమ్మం జిల్లాలో చాలామంది ఆయిల్ పామ్ రైతులు తమ తోటలను తొలగించి వాటి స్థానంలో వేరే పంటల సాగుకు మారారని మంత్రి లేఖలో పేర్కొన్నారు. -
17 లక్షల ఎకరాల్లో సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 19 వరకు 17 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పత్తి 15.60 లక్షల ఎకరాలు, కంది 76 వేల ఎకరాల్లో సాగయిందని చెప్పారు. రానున్న రోజుల్లో వరినాట్లు, ఆరుతడి పంటల సాగు ఊపందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం సచివాలయంలో వానాకాలం పంటల సాగు, ఎరువుల నిల్వ, సరఫరాపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎరువుల సరఫరా పారదర్శకంగా జరగాలని, ఎవరైనా నిబంధనలు అతిక్రమించి అమ్మకాలు చేస్తే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేయాలని, అదే విధంగా విక్రయాలను పరిశీలించాలని సూచించారు. 10.40 ఎల్ఎంటీల యూరియా కేటాయింపు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 10.40 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) యూరియా, 2.40 ఎల్ఎంటీల డీఏపీ, 10.00 ఎల్ఎంటీల కాంప్లెక్స్ , 0.60 ఎల్ఎంటీల ఎంవోపీ ఎరువులు కేటాయించిందని మంత్రి తెలిపారు. జూలై చివరి నాటికి 5.65 ఎల్ఎంటీల యూరియా అవసరం కాగా ఇప్పటికే 8.35 ఎల్ఎంటీల యూరియా, అలాగే 1.57 ఎల్ఎంటీల డీఏపీ, 1.30 ఎల్ఎంటీల కాంప్లెక్స్, 0.38 ఎల్ఎంటీల ఎంవోపీ అందుబాటులో తెచ్చామన్నారు. 1.07 ఎల్ఎంటీల యూరియా, 0.54 ఎల్ఎంటీల డీఏపీ, 1.06 ఎల్ఎంటీల కాంప్లెక్స్ ఎరువులను రైతులు కొనుగోలు చేశారని మంత్రికి అధికారులు వివరించారు. ఆగస్టు వరకు సరిపడా ఎరువుల కోసం కేంద్ర మంత్రికి లేఖఆగస్టు నెల వరకు సరిపడా ఎరువులను వీలైనంత త్వరగా రాష్ట్రానికి సరఫరా చేయాలని కోరుతూ కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ మంత్రి జేపీ నడ్డాకు మంత్రి లేఖ రాశారు. వానాకాలం పంటలు తెలంగాణలో ముందుగా ప్రారంభమవుతాయని, దానికి తగ్గట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే రెండు నెలలకు సరిపడా ఎరువులను ముందుగానే తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు. రాష్ట్ర కేటాయింపుల ప్రకారం ఆగస్టు నెల వరకు కేటాయించిన డీఏపీ, ఇతర ఎరువులను వెంటనే సరఫరా చేసేలా తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. -
విత్తన కంపెనీల టార్గెట్పై విజిలెన్స్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలోని విత్తన కంపెనీలు విత్తనాలను సరఫరా చేయాల్సిందేనని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. విత్తన కంపెనీలకు నిర్దేశించిన లక్ష్యాల సాధనను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. శనివారం మంత్రి చాంబర్లో వ్యవసాయ, సహకార శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విత్తన ప్యాకెట్లు కంపెనీ నుంచి రైతులకు చేరే వరకు నిఘా వ్యవస్థ కట్టుదిట్టంగా పనిచేయాలని సూచించారు.పచ్చిరొట్ట విత్తనాల పంపిణీపై వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హరిత వివరిస్తూ రూ.61.15 కోట్లు విలువగల 1,09,937 క్వింటాళ్ళ విత్తనాలను రైతులకు అందచేశామని వివరించారు. గతేడాది జూన్15 నాటికి 64,34,215 పత్తి ప్యాకెట్లు రైతులకు అందుబాటులో ఉంచగా, ఈసారి 1,02,45,888 ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని, రైతులు ఇప్పటికే 62 లక్షల ప్యాకెట్లు కొనుగోలు చేశారని తెలిపారు. రాష్ట్రంలో 7,97,194 మెట్రిక్ టన్నుల యూరియా, 75,278 మెట్రిక్ టన్నుల డీఏపీ, 4,27,057 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 26,396 మెట్రిక్ టన్నుల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ ఎరువులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు వివరించారు. పంటల నమోదు పారదర్శకంగా ఉండాలి రాష్ట్రంలో పంటల నమోదు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని, ఎలాంటి లోపాలకు తావులేకుండా సజావుగా జరపాలని మంత్రి తుమ్మల సంబంధింత అధికారులను ఆదేశించారు. నిర్దేశిత లక్ష్యాల మేర ఫలితాలు చూపని ఆయిల్ పామ్ కంపెనీలకు నోటీసులు ఇవ్వాలని ఉద్యానవన శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. డ్రిప్, స్ప్రింక్లర్స్ సౌకర్యం కేవలం ఆయిల్ పామ్ పంటలకే కాకుండా ఇతర పంటలకూ వర్తింపజేయాలని సూచించారు. -
75 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం
సాక్షి, హైదరాబాద్: విత్తనాల సరఫరాను పర్యవేక్షించడానికి జిల్లా కలెక్టర్లు విస్తృతంగా పర్యటించా లని, రైతులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కోరారు. గత ఏడాది పచ్చిరొట్ట విత్తన విక్ర యాలు 26,997 క్వింటాళ్లు ఉండగా.. ఈ ఏడాది 58,565 క్వింటాళ్లు పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. ఈ ఏడాది 75 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అందు బాటులో ఉంచామని స్పష్టం చేశారు.శుక్రవారం వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ల కలెక్టర్లతో మంత్రి మాట్లాడి విత్తన పంపిణీపై ఆరా తీశారు. గతేడాది 1,000 క్వింటాళ్ల జీలుగు విత్తనాలు పంపిణీ అయితే.. ఈ ఏడాది 1,800 క్వింటాళ్ల విత్తనాలు అందు బాటులో ఉన్నాయని మంత్రికి అధికారులు వివరించారు. రైతులు కోరుతున్న ఓ కంపెనీ పత్తి విత్తనాల విషయంలో 30 వేల ప్యాకెట్లు అదనంగా ఇవ్వడానికి ఆ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసిందని తెలిపారు. ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేసి రైతులకు సకాలంలో విత్తనాలు అందేలా చూస్తామని మంత్రికి వివరించారు. -
పత్తి విత్తనాల కొరత ?..మంత్రి తుమ్మల రియాక్షన్
-
పత్తి విత్తనాల కొరత లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి విత్తనాల కొరత ఎక్కడా లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. 2023–24 సంవత్సరంలో 44.92 లక్షల ఎకరాల పత్తి పంట సాగు కాగా, ఈ వానాకాలం సీజన్లో 55 లక్షల ఎకరాలలో పత్తి పంట సాగవుతుందని అంచనా వేసి 1.24 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లను రైతులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించామని వెల్లడించారు. దీనికనుగుణంగా బుధవారం వరకు 51,40,405 పత్తి ప్యాకెట్లను వివిధ జిల్లాలలో రైతులకు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ఇందులో వివిధ కంపెనీలకు చెందిన 10,39,040 పత్తి ప్యాకెట్లను ఇప్పటికే రైతులు కొనుగోలు చేశారని తెలిపారు. ఈ మేరకు మంత్రి తుమ్మల బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.క్యూల్లో ప్యాకెట్ల పంపిణీ ఎక్కడ.. ఎందుకంటే..కొన్ని జిల్లాల్లోని రైతులు ఒకే కంపెనీకి చెందిన, ఒకే రకం పత్తి విత్తనాల కోసం డిమాండ్ చేస్తున్నారని మంత్రి తెలిపారు. అయితే ఆ రకం విత్తనాలు డిమాండ్ మేరకు లేకపోవడం వల్ల ఉన్న వాటిని రైతులందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో, ఒక్కొక్కరినీ వరుసలో నిల్చోబెట్టి ఆ రకానికి చెందిన పత్తి విత్తన ప్యాకెట్లు రెండేసి చొప్పున ఇచ్చామని ఆయన వివరించారు. అంతేతప్ప ఆ మార్కెట్లలోగానీ, ఆ జిల్లాల్లో గానీ పత్తి విత్తన ప్యాకెట్లలో ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు. రైతులు ఒకటే కంపెనీ కోసం పోటీ పడొద్దురైతులు కేవలం ఒకటే కంపెనీ, ఒకటే రకానికి చెందిన విత్తనాల కోసమే పోటీ పడకుండా మార్కెట్లో అందుబాటులో ఉన్న, గతంలో మంచి దిగుబడులు ఇచ్చిన రకాలను కూడా కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు. విత్తన చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని, ఈ సీజన్లో ఇప్పటి వరకు రూ.2.49 కోట్ల విలువైన 188.29 క్వింటాళ్ళ నకిలీ పత్తివిత్తనాలు స్వాధీనం చేసుకొని 33 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. 1.95 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాన్ని పంపిణీ చేస్తాంఈ వానాకాలంలో 109.15 కోట్ల సబ్సిడీ విలువతో 1.95 లక్షల క్వింటాళ్ళ పచ్చి రొట్ట విత్తనాన్ని పంపిణీ చేయాలని ప్రతిపాదించి, ఇప్పటివరకు 79,261 క్వింటాళ్ళు పంపిణీ చేశామని, అందులో 54,162 క్వింటాళ్ళు రైతులు కొనుగోలు చేశారని మంత్రి తుమ్మల తెలిపారు. ఎరువులకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని, యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, ఎంఓపీ, ఎస్ఎస్పీ ఎరువులను 12.28 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తన దుకాణం వద్ద మండుటెండను సైతం లెక్కచేయకుండా విత్తనాలను కొనుగోలు చేసేందుకు గంటల తరబడి బారులు తీరి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదే సమయంలో బుధవారం విత్తన దుకాణాల తనిఖీకి వచ్చిన కలెక్టర్ రాజర్షి షా రైతుల ఇబ్బందులను చూసి.. టెంట్లు ఏర్పాటు చేయాలని షాపు యజమానిని ఆదేశించారు. దీంతో అప్పటికప్పుడు టెంట్లు ఏర్పాటు చేయడంతో రైతులు కాస్త సేద తీరారు.–సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
ఎరువులు, విత్తనాల సరఫరాలో సమస్య రావొద్దు
సాక్షి, హైదరాబాద్: ఎరువులు, విత్తనాల సరఫరాలో ఎక్కడా కూడా రైతులకు ఆటంకం రాకుండా చూడాలని, ఎప్పటికప్పుడు దీనిపై సమాచారం సేకరించాలని అధికారులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. వానాకాలంలో ఇప్పటికే 6.26 లక్షల టన్నుల యూరియా, 0.76 లక్షల టన్నుల డీఏపీ, 3.84 లక్షల టన్నుల కాంప్లెక్స్, 0.29 లక్షల టన్నుల ఎంవోపీ ఎరువులను అందుబాటులో ఉంచామని వివరించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 50,942 క్వింటాళ్ల జీలుగు, 11,616 క్వింటాళ్ల జనుము, 236 క్వింటాళ్ల పిల్లి పెసర విత్తనాలు అందుబాటులో తెచ్చామన్నారు.మరో 30, 400 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. శుక్రవారం తెలంగాణ సచివాలయంలో రైతులకు సబ్సిడీపై సరఫరా చేస్తున్న పచి్చరొట్ట ఎరువుల విత్తనాల పంపిణీ, మార్కెట్లలో అందుబాటులో ఉంచిన పత్తి ప్యాకెట్లు, అమ్మకాలు, సన్నరకాల లభ్యతపై అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒకేసారి పచి్చరొట్ట విత్తనాలకు డిమాండ్ ఏర్పడిందని, అయినా సకాలంలో అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఆయా కంపెనీల గతేడాది బకాయిల విడుదలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నేడు వ్యవసాయ వర్సిటీలో విత్తనమేళా 13.32 లక్షల క్వింటాళ్ల సన్న రకాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. దీనిపై శనివారం రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీ ఆధ్వర్యంలో విత్తన మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సన్నసాగును ప్రోత్సహించడం తమ ప్రభుత్వ ఉద్దేశమని, దానికనుగుణంగా తొలివిడతగా వీటికి రూ. 500 బోనస్ ప్రకటించామని, అధికారులు దీనిపై రైతుల్లో అవగాహన కలి్పంచాలని ఆదేశించారు. త్వరలో రైతు సంఘాలతో సమావేశం త్వరలోనే రాష్ట్రస్థాయిలో వివిధ రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. సచివాలయంలో శుక్రవారం తుమ్మలతో అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వే‹Ùరెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వానాకాలం రైతు భరోసా, పంటల బీమా విధివిధానాలపై మంత్రితో చర్చించారు. -
బోనస్ అంటే తెలియనోళ్లు మొరుగుతున్నారు
ఖమ్మం వన్టౌన్: కేబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నామని, అందుకే సన్నాలు పండించే రైతులకు రూ.500 బోనస్ ప్రకటించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బోనస్ అంటే అర్థం తెలియని వారు కాంగ్రెస్పై మొరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో మంగళవారం నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం, జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన రాజీవ్గాంధీ వర్థంతి వేడుకల్లో పాల్గొని మంత్రి మాట్లాడారు. మా ప్రభుత్వం మూడు రోజుల్లోనే కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు భావించారని, అది సాధ్యం కాకపోవడంతో పొద్దున లేచింది మొదలు కాంగ్రెస్ పార్టీపై పడి ఏడుస్తున్నారన్నారు. ఎప్పుడు ఎవరి మీద ఏడవాలో తెలియని సన్నాసులు బీఆర్ఎస్ వాళ్లని పేర్కొన్నారు. పదేళ్ల పాటు వ్యవస్థలను నాశనం చేసిన వారు నీతులు చెబుతున్నారని విమర్శించారు. కాగా, ప్రతీ ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి గెలిపిస్తున్నారని.. ఈక్రమంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరారు. ప్రపంచ దేశాల్లో భారత్ను అగ్రస్థానంలో నిలబెట్టిన నేత రాజీవ్గాంధీ అని, ప్రపంచంలో అనేక సంస్థలకు భారతీయులే సీఈఓలుగా ఉండడానికి రాజీవ్ ఇచ్చిన స్ఫూర్తే కారణమని తెలిపారు. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
తడిసిన ధాన్యాన్నీ కొనుగోలు చేస్తాం
ఖమ్మం వన్టౌన్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షంతో వరి ధాన్యం తడిసిపోయిన నేపథ్యంలో రైతులు అధైర్య పడొద్దని.. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కిసాన్ కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంటున్నామని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ పూర్తిచేసి.. ఎంత మంది రైతులకు, ఎన్ని కోట్ల రుణమాఫీ చేశామనేది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలో చెబుతామని తెలిపారు. కాగా, రైతులకు దీర్ఘకాలికంగా ప్రయోజనం కలిగేలా పంటల బీమా పథ కాన్ని అమలు చేస్తూ, ప్రీమియం సైతం ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి చెప్పారు. ఇక విత్తన కంపెనీలతో ఇబ్బందులు లేకుండా రైతులకు విత్తనాలు అందేలా ప్రభుత్వం సహాయకారిగా నిలుస్తుందన్నారు. కాగా, ఆయిల్పామ్తో లాభాలు గడించే అవకాశమున్నందున రైతులు ఆ దిశగా దృష్టి సారించాలని సూచించారు. ఇక పంట నష్టపరిహారం సైతం త్వరలో అందిస్తామని, వచ్చే ఖరీఫ్ నుంచి పెంచిన ఎకరాకు రూ.15వేల చొప్పున రైతు భరోసా పంపిణీ ప్రారంభిస్తామని తుమ్మల తెలిపారు. కాగా, నల్లగొండలో ఎంపీ అభ్యర్థికి 5 లక్షల మెజార్టీ ఇస్తామని అక్కడి నేతలు చెబుతున్నందున, ఆ మెజార్టీ దాటేలా ఖమ్మం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనంలో ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
కరువుతో కేసీఆర్ రాజకీయాలు
సాక్షి, హైదరాబాద్: కరువు పరిస్థితులను రాజకీయం కోసం వాడుకుంటారా? అని మాజీ సీఎం కేసీఆర్ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిలదీశారు. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వ వైఫల్యంగా చూపాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నీటి నిర్వహణపై దృష్టి పెట్టకుండా, మంచినీటి కోసం పక్క రాష్ట్రాలను అభ్యర్థించాల్సిన అథోగతికి మీరు కారణం కాదా? అని ప్రశ్నించారు. కేవలం రైతుబంధు పేరిట మిగతా విత్తన సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ, యాంత్రీకరణ పథకం, డ్రిప్ స్ప్రింకర్లపై సబ్సిడీలన్నీ ఎత్తేసి రైతుల్ని కోలుకోలేనివిధంగా దెబ్బతీసింది మీరు కాదా? అని ప్రశ్నించారు. తొమ్మిదేళ్ల పరిపాలనలో ఏనాడైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ఒక్క రైతునైనా ఆదుకున్నారా? అని నిలదీశారు. కనీసం గత ఎన్నికల ముందు ప్రకటించిన రూ.10,000 అయినా నష్టపోయిన రైతులందరికి ఇచ్చారా? కేవలం మెదటి విడతగా రూ.150 కోట్లు మంజూరు చేసి, రెండో విడతగా ఏప్రిల్లో కురిసిన వడగళ్ల వానలకు నష్టపోయిన రైతులకు జీవో ఇచ్చి డబ్బు విడుదల చేయలేదని గుర్తు చేశారు. పంటల బీమా పథకాన్ని ఎత్తేసి, అంతకన్నా గొప్ప పథకాన్ని తెస్తామని ప్రగల్భాలు పలికి, రైతుల నోట్లో మట్టి కొట్టింది కేసీఆర్ కాదా? అని తుమ్మల నిలదీశారు. -
మిర్చి రైతులు నష్టపోవద్దు
సాక్షి, హైదరాబాద్: మిర్చి పంట భారీ ఎత్తున మార్కెట్లోకి వస్తోందనీ, ధర విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలంటూ మార్కెటింగ్ శాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకొంటామని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో 3.91 లక్షల ఎకరాలలో మిర్చి సాగుచేయగా ఇప్పటికే 94395 మెట్రిక్ టన్నుల మిర్చి మార్కెట్కు వచ్చిందని వివరించారు. ఈ యాసంగిలో దాదాపు 2 లక్షల ఎకరాలలో వేరుశనగ సాగు కాగా 1.92 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశామని తెలిపారు. ఇప్పటికే 93 వేల మెట్రిక్ టన్నులు అమ్మకానికి రాగా, స్వంత అవసరాలకు పోను ఇంకా మార్కెట్లకు 46 వేల టన్నుల వేరుశనగ వచ్చే అవకాశం ఉందని మంత్రి తుమ్మల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర అందించే విషయంలో గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా రైతులు నష్టపోయారని, ఈ పరిస్థితి రాకుండా ముందుస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయిందని మంత్రి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రైతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి: తుమ్మల జంగారెడ్డిగూడెం రూరల్ (ఏపీ): రైతాంగ సమస్యల పరిష్కారం కోసం అన్ని రాష్ట్రాలూ కలిసికట్టుగా ముందుకొచ్చి కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ రైతులు నిర్వహిస్తున్న నిరసనలను కేంద్ర ప్రభుత్వం త్వరగా అర్థం చేసు కుని అన్నదాతలకు అనుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన రి పోర్టు ఆధారంగా ఖర్చులకు ఒకటిన్నర రెట్లు రైతు కు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
తెరపైకి కొబ్బరి బోర్డు!
అశ్వారావుపేట రూరల్: రాష్ట్రంలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటు అంశం తెరపైకి రావడంతో రైతు ల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రంలో కొబ్బరి బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల్లో ఆశలు మొలకెత్తగా.. కేంద్రం స్పందిస్తుందా, లేదా అనే మీమాంస నెలకొంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా.. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్ కేంద్రంగా కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఉండేది. రాష్ట్ర విభజన సమయాన తెలంగాణలో సాగు తక్కువగా ఉందనే కారణంతో ఈ కార్యాలయాన్ని ఏపీకి మార్చారు. ఆనాటి నుంచి ఏపీ కొబ్బరి బోర్డు అధికారులే తెలంగాణలో కుడా కొబ్బరి సాగు విస్తరణ, అభివృద్ధి, రాయితీతోపాటు ఇతర సేవలందిస్తున్నారు. అయితే, తెలంగాణలో బోర్డు లేని కారణంగా కొబ్బరి రైతాంగానికి ఆశించిన స్థాయిలో సేవలు, రాయితీలు అందడం లేదనే చెప్పాలి. దీంతో కొన్నాళ్లుగా ఇక్కడ కూడా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇక్కడా వేలాది ఎకరాల్లో సాగు తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ఎక్కువగా తోటలు, కొబ్బరి నర్సరీలు ఉన్నాయి. నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేటలో కొన్నేళ్ల క్రితం దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఫలితంగా ఈ రెండు మండలాల్లో కొబ్బరి తోటలు అత్యధికంగా విస్తరించాయి. ప్రస్తుతం భద్రాద్రి జిల్లాలో 1,358 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 586 ఎకరాల్లో కొబ్బరి తోటలు సాగులో ఉన్నాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ తోటలు సాగులో ఉండగా, తెలంగాణలో ఇప్పటివరకు కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటు కాలేదు. ఫలితంగా సాగుదారులకు సేవలందక సలహాలు ఇచ్చేవారు కరువయ్యారు. బోర్డు లేని కారణంగా ఈ ప్రాంత రైతులకు రాయితీలు, ఇతర అంశాల్లో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.90 కోట్లు దక్కడం లేదని తెలుస్తోంది. మంత్రి తుమ్మల లేఖతో కదలిక? గతేడాది ఏప్రిల్లో కొబ్బరి అభివృద్ధిమండలి బోర్డు అధికారుల బృందం అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో పర్యటించింది. ఈసందర్భంగా రైతుల విజ్ఞప్తి మేరకు బోర్డు ఏర్పాటు విషయాన్ని ఉన్నతా ధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పా రు. కానీ ఆ తర్వాత ఈ అంశం మళ్లీ మరుగునపడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం, దమ్మపేట మండలానికి చెందిన మంత్రి తుమ్మలకు వ్యవసాయ శాఖ దక్కడంతో బోర్డు ఏర్పాటు విషయాన్ని స్థానిక రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు తుమ్మల తెలంగాణలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటుచేయాలని లేఖ రాయడంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. -
వరికి రూ. 500 బోనస్
సాక్షి, హైదరాబాద్: వచ్చే వానాకాలం సీజన్లో పండించే వరికి రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. జూన్లో నిర్వహించే ‘గ్లోబల్ రైస్ సమ్మిట్’ బ్రోచర్ ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సమ్మిట్ నిర్వాహకులు డాక్టర్ జానయ్య, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, కమిషనర్ గోపి, విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు, మార్కెటింగ్శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు వరి తక్కువ వేయాలని, అందుకు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలు సాగు చేసి, పంటల సాగులో సమతుల్యత పాటించాలన్నారు. వరితోపాటు అన్ని పంటలకు కూడా కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం మద్దతుధర ఇవ్వాలని కోరారు. వివిధ దేశాలకు వరి ఎగుమతులపై కేంద్రం విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు రాష్ట్రానికి ప్రతిబంధకంగా ఉన్నాయని, రైస్ పాలసీపై కేంద్రం పునరాలోచించుకోవాలన్నారు. కేరళ ప్రజలు దొడ్డు బియ్యం, కర్నాటక ప్రజలు సన్నబియ్యం, మరికొన్ని ఇతర రాష్ట్రాల్లో జనం చిట్టి ముత్యాలు వంటి రకాల బియ్యం వాడుతారని, ఆ ప్రకారం ఆయా రాష్ట్రాలకు తెలంగాణ నుంచి రైస్ అమ్ముకునేలా అవకాశం కల్పించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఎంత అవసరమైతే అంతమేరకు వరి సాగు చేయాలని, ఎగుమతులు పెంచడం వల్ల రాష్ట్రంలో అదనపు వరిని విక్రయించడానికి వీలుకలుగుతుందని పేర్కొన్నారు. ఆ మేరకు కేంద్రం ఆలోచించి తెలంగాణ రైతులకు మేలు చేయాలన్నారు. ఇప్పటికే పేదలకు ఇస్తు న్న రేషన్రైస్ ఎవరూ వాడుకోవడం లేదని తుమ్మల అభిప్రాయపడ్డారు. -
వ్యవసాయానికి రూ.1.33 లక్షల కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ. 1.33 లక్షల కోట్ల రుణాలు ఇచ్చేలా జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) రుణ ప్రణాళికను ఖరారు చేసింది. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ఇతర రంగాలు సహా మొత్తంగా రూ.2.80 లక్షల కోట్ల రుణాలకు పచ్చజెండా ఊపింది. ఇది గతేడాది రుణ ప్రణాళికతో పోలిస్తే రూ.94 వేల కోట్లు అదనం కావటం విశేషం. మంగళవారం మధ్యాహ్నం నగరంలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఈ రుణ ప్రణాళికతో కూడిన ఫోకస్ పేపర్ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విడుదల చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలకే పెద్దపీట వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల నుంచి భారీ చేయూతనే లభించే అవకాశం ఉంది. రూ.133587.86 కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు నాబార్డు సూచించింది. మొత్తం రుణ ప్రణాళికలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు పెద్దపీట వేయటం విశేషం. నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణ ప్రణాళికలో నాబార్డు ఖరారు చేసిన మొత్తం రూ.1,12,762 కోట్లు మాత్రమే కావటం గమనార్హం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖరారైన వ్యవసాయ రుణాల్లో.. పంటల సాగు, మార్కెటింగ్ కోసం రూ.81,478.02 కోట్లు, టర్మ్లోన్ల కింద రూ.27,664.91 కోట్లు, వ్యవసాయ రంగంలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రూ.5197.26 కోట్లు, వ్యవసాయ అనుంబంధ రంగాలకు రూ.19,247.67 కోట్ల రుణాలను ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించింది. వ్యవసాయ రంగం తర్వాత సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రుణాలను ఖరారు చేసింది. ఈ రంగానికి రూ.1,29,635.83 కోట్ల వరకు రుణాల రూపంలో ఇవ్వవచ్చని బ్యాంకర్లకు సూచించింది. బ్యాంకర్లు మరింత సాయానికి ముందుకు రావాలి: తుమ్మల దేశ వ్యవసాయ రంగంలో తెలంగాణకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా బ్యాంకర్లు మరింత ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం వ్యవసాయంపై ఫోకస్ చేస్తుండటాన్ని నాబార్డు, బ్యాంకర్లు గుర్తించాలని కోరారు. పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు వ్యక్తిగత రుణాలు ఇవ్వాలని సూచించారు. ఆ రంగంలో గేదెలపైనే ఎక్కువగా దృష్టిసారిస్తున్నారని, కానీ ఆవు పాల వృద్ధిని కోరుకుందామని, దీని వల్ల ఆరోగ్యంతోపాటు, మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రోత్సహించినట్టవుతుందని మంత్రి తుమ్మల సూచించారు. పామాయిల్ సాగుకు కూడా మరింత ప్రోత్సాహం అవసరమన్నారు. వరి సాగు విస్తృతంగా సాగుతోందని, కానీ సంప్రదాయ తృణ ధాన్యాల వృద్ధిపై రైతులు దృష్టిసారించాలని మంత్రి కోరారు. నాగార్జున గ్రామీణ బ్యాంకు రుణంతోనే నా తొలి నామినేషన్ తనకు వ్యవసాయం రంగం, అందుకు రుణాలిచ్చే గ్రామీణ బ్యాంకులతో మంచి అనుబంధం ఉందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. తాను సాగు కోసం నాగార్జున గ్రామీణ బ్యాంకు నుంచి రుణం తీసుకునేవాడినని, 1983 తొలి నామినేషన్ కోసం కూడా ఆ బ్యాంకు నుంచే రుణం తీసుకున్నట్టు వెల్లడించారు. రైతు బంధు నిధులను పెంచుతాం: రఘునందన్రావు రాష్ట్రంలో ప్రతి రెండున్నర వేల మంది రైతులకు ఒకటి చొప్పున ఉన్న రైతు వేదికలను ఆధునికీకరించటం ద్వారా వాటి వినియోగాన్ని పెంచి రైతులకు మరింత ఉపయోగకరంగా మారుస్తామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్రావు వెల్లడించారు. వాటిల్లో టూ వే ఆడియో విజువల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో క్రాప్ ఇన్స్రూెన్స్ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. రైతు భరోసా ద్వారా ప్రస్తుతం అందుతున్న రైతు బంధు నిధులను పెంచుతున్నట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వీలైనన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు నాబార్డు తీవ్రంగా కృషి చేస్తోందని, వాటి అవసరాలకు తగ్గట్టుగా రుణాలు అందేలా చర్యలు తీసుకుంటోందని ఆ సంస్థ సీజీఎం సుశీల చింతల పేర్కొన్నారు. ఆర్బీ డీజీఎం రాజేంద్రప్రసాద్, ఎస్బీఐ జీఎం, ఎస్ఎల్బీసీ కన్వీనర్ దేబాశీష్ మిత్ర తదితరులు పాల్గొన్నారు. 2024–25 సంవత్సరానికి వివిధ రంగాలకు నాబార్డు ఖరారు చేసిన రుణ ప్రణాళిక వ్యవసాయం, అనుబంధ రంగాల రూ.133587.86 కోట్లు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు రూ. 129635.83 కోట్లు ఎగుమతుల కోసం రుణాలు రూ. 451.67 కోట్లు విద్య రూ.2706.50 కోట్లు గృహనిర్మాణం రూ.10768.58 కోట్లు పునరుత్పాదక విద్యుత్తు రూ.566.61కోట్లు ఇతర రంగాలు రూ.2283.51 -
ప్రజలపై భారం మోపం
సాక్షి, హైదరాబాద్: ప్రజలపై భారం మోపకుండా ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి సారించి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. వార్షిక బడ్జెట్ 2024–25 ప్రతిపాదనల రూపకల్పనలో భాగంగా గురువారం సచివాలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తోకలిసి వ్యవసాయం, మార్కెటింగ్, చేనేత జౌళి, ఉద్యాన వన, రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార /ప్రజాసంబంధాల శాఖలతో సమీక్ష నిర్వహించారు. ఆస్తులు సృష్టించి, వాటితో వచ్చే ఆదాయా న్ని ప్రజలకు పంచడానికి కృషి చేయాలని అధికా రులకు దిశానిర్దేశం చేశారు. ఆరు గ్యారంటీల అమలు, గడువు ముగిసిన భూముల లీజుపై దృష్టి సారించాలన్నారు. అసైన్డ్ భూములపై నివేదిక ఇవ్వాలి.. గత ప్రభుత్వం ధరణిలో ‘కాస్తు’ కాలమ్ తొలగించడంతో పాటు ప్రభుత్వ, అసైన్డ్, మాన్యం, ఎండోమెంట్, కొన్ని పట్టా భూములను పార్ట్–బీలో పెట్టి రైతుల హక్కులను కాలరాసిందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏటా రెవెన్యూ సదస్సులు నిర్వహించి జమాబందీ చేసేవారని, 2014 తర్వాత ఈ విధానానికి స్వస్తి పలకడంతో రైతులు ఇబ్బంది పడ్డారని చెప్పారు. ధరణితో ప్రభుత్వ భూములు కొందరి చేతుల్లోకి వెళ్లాయని, వాటిని గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూశాఖను ఆదేశించారు. 2014 వరకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములు, గత ప్రభుత్వం వెనక్కి తీసుకున్న అసైన్డ్ భూములను ఏ అవసరాల కోసం వాడారు.. వెనక్కి తీసుకున్న భూముల్లో మిగిలి ఉన్న భూమి ఎంత? వంటి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. ఆపద్బంధు, పిడుగుపాటు మృతులకు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే పథకాలను గత ప్రభుత్వం అమలు చేయలేదని అధికారులు వివరించారు. కేంద్రం ఈ పదేళ్లలో రాష్ట్రంలో 1.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి మాత్రమే నిధులిచ్చిందని, 2023–24లో ఇళ్ల నిర్మాణ పథకాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసిందని మంత్రులకు తెలిపారు. 2024–25లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సిద్ధం చేసిన ప్రతిపాదనలను వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2లక్షల గాను 67 వేల ఇళ్లు పూర్తి చేశామని చెప్పారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం: నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా అరికట్టాలని, నిబంధనలు పాటించని కంపెనీలపై ఉక్కు పాదం మోపాలని మంత్రులు ఆదేశించారు. బతుకమ్మ చీరలు, విద్యా ర్థుల యూనిఫామ్ల తయారీపై ఆరా తీశారు. ఈ సమీక్షలో ఆర్థిక, రెవెన్యూ(విపత్తు) శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అర్వింద్ కుమా ర్, నవీన్మిత్తల్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆధ్వర్యంలో 5 పామాయిల్ పరిశ్రమలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పామాయిల్ సాగుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని.. ఆయిల్ పామ్ సాగు రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతాంగం ఆయిల్ పామ్ సాగువైపు మొగ్గుచూపేలా అధికార యంత్రాంగం దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం ఆయన సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మూడు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొత్తం 5 ఆయిల్ పామ్ పరిశ్రమలు నెలకొల్పే ఫైలుపై తొలి సంతకం చేశారు. రూ. 1,050 కోట్లతో ఈ పరిశ్రమలను స్థాపించనున్నారు. తర్వాత రాష్ట్రంలోని 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేలా రూ. 4.07 కోట్లతో సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని తీర్చిదిద్దేందుకు అవసరమైన రెండో ఫైలుపై సంతకం చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులకు తరచూ అవగాహన సదస్సులు నిర్వహించేందుకు వీలుగా రైతు వేదికలను తీర్చిదిద్దుతామన్నారు. సహకార వ్యవస్థలో పారదర్శకమైన పాలన అందించేందుకు వివిధ విభాగాలను పూర్తిగా కంప్యూటరీకరణ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా.. మంత్రి మూడో ఫైలుపై సంతకం చేశారు. ఈ సందర్భంగా గద్వాలకు చెందిన పట్టు పరిశ్రమశాఖ అధికారి జగన్నాథ్ కుమారుడు ఆశిష్ కుమార్కు కారుణ్య నియామకం కింద ఉద్యోగం కలి్పస్తూ నియామక పత్రం అందజేశారు. తర్వాత అధికారులతో తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో ఏడాదికి ఒకటి చొప్పున పామాయిల్ పరిశ్రమలను ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నెలకొల్పుతామన్నారు. పామాయిల్ సాగు విస్తరణకు ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లుల స్థాపన ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పామాయిల్ ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుతో రైతులకు ఎళ్లవేళలా మార్కెట్ అందుబాటులోకి వస్తుందన్నారు. సంప్రదాయ పంటలతో పోలిస్తే పామాయిల్ సాగుతో రైతులకు ఎకరాకు రూ. లక్ష వరకు ఆదాయం సమకూరుతుందన్నారు. అలాగే అంతరపంటలతో అదనపు ఆదా యం లభిస్తుందన్నారు. ఆయిల్ ఫెడ్ ఏటా 40 వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు పెంచేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తుమ్మల తెలిపారు. -
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మంత్రివర్గంలో త్రిమూర్తులు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగా... ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురికి మంత్రివర్గంలో చోటు లభించింది. ఉమ్మడి జిల్లా రాజకీయ చరిత్రలో ముగ్గురికి అవకాశం దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తర్వాత డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, ఆరో వరుసలో పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పదో వరుసలో తుమ్మల నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం జరిగింది. ఇందులో భట్టి, తుమ్మల దైవసాక్షిగా, పొంగులేటి పవిత్ర హృదయంతో ప్రమాణ స్వీకారం చేశారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం భట్టికి ఉన్నత పదవి అంతా అనుకున్నట్లే భట్టికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నత పదవి లభించింది. సీఎం పదవి కోసం భట్టి పోటీ పడినా.. చివరకు అధిష్టానం ఆయనను డిప్యూటీ సీఎం పదవితో సంతృప్తపరిచింది. జలగం వెంగళరావు తర్వాత ఉమ్మడి జిల్లాకు దక్కిన అత్యున్నత పదవి ఇదే. రేవంత్రెడ్డి తర్వాత అటు పార్టీ, ఇటు ప్రభుత్వంలో ప్రస్తుతం భ ట్టి కీలక నేతగా వ్యవహరించనున్నారు. గత ప్రభుత్వాల్లో పనిచేసిన అనుభవం ఉండటంతో భట్టి నేతృత్వాన ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయని అనుచర నేతలు పేర్కొంటున్నారు. వైఎస్ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన భట్టి 2009 నుంచి వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. ప్రజలకు శీనన్నగా.. మాజీ ఎంపీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రాజకీయాల్లో తన ప్రత్యేకతను చాటుకున్నారు. అతి తక్కువ కాలంలోనే మాస్ లీడర్గా ఎదిగి.. రాజకీయాలను శాసించే స్థాయి పొందారు. తొలుత కాంట్రాక్టర్గా పనిచేసిన పొంగులేటి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానంతో 2013 ఫిబ్రవరి 23న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన పొంగులేటి అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఖమ్మం ఎంపీగా గెలిచారు. ఆయనతోపాటు పార్టీ నుంచి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు, పొత్తులో భాగంగా భద్రాచలంలో సీపీఎం అభ్యర్థి సున్నం రాజయ్య గెలుపునకు కృషి చేశారు. పాలేరు ఉప ఎన్నికల సమయాన 2016 మే 3న బీఆర్ఎస్లో చేరిన పొంగులేటి ఆ తర్వాత జరిగిన పలు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం క్రియాశీలకంగా పనిచేశారు. తిరుగుబాటు చేసి.. ఏడేళ్లపాటు బీఆర్ఎస్లో కొనసాగిన పొంగులేటి శ్రీనివాస్రెడ్డి.. కేంద్ర రవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత పార్టీలో తనకు సముచిత స్ధానం దక్కలేదనే కారణంతో ఈ ఏడాది జనవరి 1న పార్టీపై తిరుగుబాటు చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తుండడంతో ఆయనను ఏప్రిల్ 10న బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. అనంతరం జూలైలో ఖమ్మంలో జరిగిన జనగర్జన బహిరంగ సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ సమక్షాన కాంగ్రెస్లో చేరిన పొంగులేటిని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్గా నియమించింది. ఉమ్మడి జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ‘తిరగబడదాం.. తరిమికొడదాం’ పేరిట ప్రచారం నిర్వహించడమేకాక ఉమ్మడి జిల్లాలో గడపగడపకు కాంగ్రెస్ను తీసుకెళ్లారు. తొలిసా రి ఎమ్మెల్యేగా తాజా ఎన్నికల్లో పాలేరు నుంచి గెలి చిన ఆయన మంత్రి పదవి దక్కించుకున్నారు. సముచిత గౌరవం ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయంలో అంతా తామై వ్యవహరించిన ముగ్గురు నేతలకు సముచిత గౌరవం దక్కింది. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన మొదటి రెండు ఎన్నికల్లో రాష్ట్రమంతటా బీఆర్ఎస్ సత్తా చాటినా ఇక్కడ మాత్రం కాంగ్రెస్కు అధిక స్థానాలు దక్కాయి. ఈసారి కూడా మెజార్టీ స్థానాలు దక్కడంలో భట్టి, పొంగులేటి, తుమ్మల కృషి ఉంది. వీరు తమ నియోజకవర్గాలే కాకుండా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రచారం చేస్తూ నాయకులను సమన్వయపరిచారు. దీంతో కార్యకర్తలు, నేతలు ఒకతాటిపైకి చేరగా కాంగ్రెస్ గెలుపు నల్లేరుపై నడకలా సాగింది. దీంతో ఈ ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం దక్కగా.. హైదరాబాద్లో జరిగిన ప్రమాణ స్వీకారానికి ఉమ్మడి జిల్లా నుంచి అనుచర నేతలు భారీగా తరలివెళ్లారు. మూడు ప్రభుత్వాల్లో మంత్రి జిల్లా రాజకీయ చరిత్రలో 40 ఏళ్ల ప్రస్థానం కలిగిన నేత తుమ్మల నాగేశ్వరరావు. తెలుగుదేశం, బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయనకు ప్రస్తుత కాంగ్రెస్ మంత్రివర్గంలోనూ స్థానం దక్కడం అరుదైన విషయంగా చెప్పుకోవాలి. 1985, 1995, 1996, 1999, 2001 ఏడాదిలో టీడీపీ హయాంలో చిన్ననీటి పారుదల శాఖ, ప్రొహిబిషన్, భారీ, మధ్యతరహా నీటి పారుదలశాఖ, ఎక్సైజ్, ఆర్అండ్బీ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014లో ఆర్అండ్బీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన మంత్రిగా పనిచేసిన సమయాన ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేశారు. 2018లో పాలేరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. ఈసారి బీఆర్ఎస్ టికెట్ కేటాయించకపోవడంతో కాంగ్రెస్లో చేరి ఖమ్మం నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్పై ఘన విజయం సాధించారు. దీంతో ఆయనకు మంత్రి పదవి దక్కింది. -
తుమ్మల గెలుపుతో ఏపీ రాజకీయాల్లో మలుపా?
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొద్ది రోజుల క్రితం ఒక కీలక ప్రకటన చేశారు. ఖమ్మంలో తన గెలుపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా మలుపు అవుతుందన్నారు. ఖమ్మం సరిహద్దు గ్రామాల నుంచి, ఖమ్మం నుంచి వచ్చిన టీడీపీ అభిమానుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. అంతకుముందు కూడా ఆయన ఖమ్మం టీడీపీ ఆఫీస్కు వెళ్లి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే ఇప్పుడు ఏకంగా టీడీపీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించి తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడారు. తనకు ఎన్టీ రామారావే మంత్రి పదవి ఇచ్చారని, కేసీఆర్కు కూడా తానే చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి ఇప్పించానని చెప్పారు. కేసీఆర్ తనకు పదవి ఇచ్చేదేంటని ప్రశ్నించారు. తనకు పదవులు ముఖ్యం కాదంటూనే తాను చేసిన సేవల గురించి కూడా చెప్పుకొచ్చారు. తన మెడలో వేసుకున్న పచ్చ కండువాను చూపుతూ, దీనివల్లే తాను పైకి వచ్చానన్నారు. ఇలాంటి విషయాలు ఎన్ని చెప్పినా ఫర్వాలేదు.. కానీ ఆయన గెలిస్తే ఏపీ రాజకీయాలపై ఎందుకు ప్రభావం పడుతుంది? అక్కడ ఎందుకు మలుపు వస్తుంది? అన్నదాని గురించి వివరించి ఉంటే బాగుండేది. కాంగ్రెస్ సభల్లో టీడీపీ జెండాలు తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీచేయకుండా దూరంగా ఉంది. దాంతో ఆ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తనదారి తాను చూసుకున్నారు. కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం కోసమే అలా చేశారని ఆయన రహస్యం చెప్పేశారు. దానిని నిజం చేస్తూ తుమ్మల మరికొందరు ప్రకటనలు చేయడం, టీడీపీ జెండాలు కూడా మెడలో వేసుకుని సభల్లో పాల్గొంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు, చంద్రబాబుకు శిష్యుడుగా పేరొందిన రేవంత్ రెడ్డి కూడా టీడీపీవారు మద్దతు ఇస్తే స్వాగతిస్తామన్నారు. అలాగే చంద్రబాబును ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కొన్నిసార్లు పొగుడుతూ తన స్వామి భక్తి చూపుతున్నారు. కోదాడలో జరిగిన కాంగ్రెస్ ర్యాలీలో కూడా టీడీపీ జెండాలు కనిపించాయి. ఇలా ఆయా చోట్ల ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ టీడీపీవారు కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఆయన ఓపెన్ గానే కాంగ్రెస్కు మద్దతు ఇచ్చి ఉండొచ్చు. గతసారి కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జనసమితితో పొత్తు పెట్టుకుని చంద్రబాబు ప్రచారం చేశారు. రాహుల్ గాం«దీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయినా జనం ఆదరించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గాలికి వదిలివేశారు. బీజేపీ కన్నెర్ర చేస్తుందని.. 2023 తెలంగాణ ఎన్నికల్లో కొత్త వ్యూహంతో ఎన్నికల్లో పోటీచేయకుండా చంద్రబాబు కాంగ్రెస్కు పరోక్షంగా సహకరిస్తున్నారు. నేరుగా కాంగ్రెస్కు అండగా ఉన్నానని చెబితే బీజేపీ ఎక్కడ కన్నెర్ర చేస్తుందో అన్న భయం కావచ్చు. తెలంగాణలో బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ గెలిస్తే తనకు ప్రయోజనం ఉంటుందని ఆయన ఆశిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇక్కడ చక్రం తిప్పి, ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్నది ఆయన ఆలోచన అని చాలా మంది భావిస్తున్నారు. మరోవైపు తన మిత్రుడో లేక వైసీపీ నేతలు విమర్శిస్తున్నట్లు ఆయన దత్తపుత్రుడో కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నారు. అంటే అటు బీజేపీతో కూడా రాయబారం జరపడానికి ఏర్పాటు చేసుకున్నారన్నమాట. ఈ విన్యాసాలు ఎన్ని చేసినా ఆయన ఇష్టం. కానీ తుమ్మల చేసిన ప్రకటనను పరిశీలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కనుక, ఏపీలో టీడీపీకి ఉపయోగపడతామని చెబుతున్నట్లు అనుకోవాలా? రాష్ట్ర విభజన తర్వాత తుమ్మల టీడీపీలో ఓడిపోయి రాజకీయంగా వెనుకబడితే కేసీఆర్ ఆయనను దగ్గరకు తీసి ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారు. పాలేరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికకు అభ్యర్థిని చేసి గెలిపించారు. కానీ సాధారణ ఎన్నికల్లో తుమ్మల ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో ఆయన హవా తగ్గింది. దాంతో ఆయన అసంతృప్తి చెంది కాంగ్రెస్ జెండా కప్పుకున్నారు. నాడు కేసీఆర్ను ఆకాశానికి ఎత్తి... తుమ్మల పదవులపై ఆసక్తి లేదంటూనే తనను ఆదరించిన బీఆర్ఎస్ను కాదని ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో దిగారు. గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఒకటి తప్ప అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. దానిని కూడా దృష్టిలో ఉంచుకునే తుమ్మల కాంగ్రెస్లోకి జంప్ చేసి ఉండాలి. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. 2018 ఎన్నికల సమయంలో తుమ్మల టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసినప్పుడు కేసీఆర్ను ఆకాశానికి ఎత్తుతూ ప్రసంగించిన వీడియో వింటే ఆశ్చర్యం కలుగుతుంది. కేసీఆర్ తెలంగాణను పచ్చని బంగారు రాష్ట్రంగా మార్చారంటూ గంభీరంగా ప్రసంగించారు. ఇప్పుడు అదే తుమ్మల కేసీఆర్ పాలన అంత దరిద్రపు పాలన చూడలేదని అంటున్నారు. అంతేకాదు, 2018లో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, జనసమితి పార్టీల కూటమిని మాయ కూటమిగా అభివర్ణించారు. తెలంగాణ అభివృద్ధికి, ప్రత్యేకించి ఖమ్మం అభివృద్ధిని అడ్డుకుంటున్న పార్టీగా టీడీపీని, అప్పట్లో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును విమర్శిస్తూ మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను, భద్రాచలం చుట్టుపక్కల ఉన్న ఐదు పంచాయతీలను అన్యాయంగా లాక్కున్న పార్టీ టీడీపీ అని ఆయన ధ్వజమెత్తారు. ఖమ్మం ప్రాజెక్టులకు వ్యతిరేకంగా 30 లేఖలు రాసిన సీఎం చంద్రబాబు అని ఆ రోజున ఆరోపించారు. ఈ రోజేమో టీడీపీ వల్లే తాను అది సాధించాను.. ఇది సాధించాను అంటూ స్పీచ్లు ఇస్తున్నారు. అదేదో చెప్పుకుంటే సరే అనుకుంటే, ఇప్పుడు ఏకంగా తన గెలుపు ఏపీ రాజకీయాలకు మలుపు అవుతుందని అంటున్నారు. అంటే ఏమిటి అర్థం? ఏపీలోని జగన్ ప్రభుత్వాన్ని తామంతా కలిసి ఇబ్బంది పెడతామని చెబుతున్నారా? గతంలో ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా కుట్ర చేసి ఆయనను పదవీచ్యుతుడిని చేసి చంద్రబాబుతో కలిసి అందలం ఎక్కిన అనుభవాన్ని గుర్తు చేసుకుని అలా ఏపీలో మళ్లీ చేయాలని ఆలోచిస్తున్నారా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందో, రాదో తెలియక ముందే తుమ్మల వంటి సీనియర్లు ఇలా మాట్లాడితే ఎలా విశ్లేషించాలి? కాంగ్రెస్లో చేరిన మాజీ టీడీపీ నేతలు వ్యూహాత్మకంగానే చంద్రబాబుతో సంబంధాలు కొనసాగిస్తూ, భవిష్యత్తు ఏపీ ఎన్నికల్లో ఆయనకు సహకరించాలని, అక్కడి వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని అనుకుంటున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. టీడీపీ అప్పట్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పెట్టిన పార్టీ. ఎన్టీఆర్ తన అల్లుడు చంద్రబాబు కాంగ్రెస్ నుంచి రాగానే, కొన్ని బాధ్యతలు అప్పగించి చివరికి ఆయన తన కొంప తానే ముంచుకున్నారు. ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో వేలు పెడితే... కొంతకాలం క్రితం వరకు కాంగ్రెస్ అంటేనే తుమ్మలకు పడేది కాదు. వారితో ఖమ్మం జిల్లాలో అనేక రాజకీయ పోరాటాలు చేశారు. చివరికి తానే కాంగ్రెస్లో చేరిపోయారు. ఆయన తన సొంత రాజకీయం కోసం ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో కూడా వేలుపెడతామని చెబితే ఆయనకే నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. పైగా చంద్రబాబుతో కాంగ్రెస్ కుమ్మక్కయిన సంగతి ఇట్టే తెలిసిపోతుంది. దీనివల్ల అంతిమంగా కాంగ్రెస్కు నష్టం జరుగుతుందో, లాభం జరుగుతుందో కానీ, ఇప్పటికైతే తుమ్మల చేసిన ప్రకటన ద్వారా వైసీపీ ప్రభుత్వం అప్రమత్తమవ్వాల్సిన అవసరాన్ని తెలియచేసింది. ఎన్టీఆర్ మాదిరి జగన్ అమాయకపు రాజకీయ నేత కాదు. ఆయన ఇప్పటికే అనేక డక్కాముక్కీలు తిన్న నేత. చంద్రబాబు వేసిన అనేక కుట్రలను ఛేదించిన నాయకుడు. తిరుగులేని ఆధిక్యంతో 151 సీట్లను గెలిచి ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి. తాను ఇచ్చిన హామీలను నెరవేర్చిన శూరుడు. చంద్రబాబో, తుమ్మలో, మరొకరో వేసే ఎత్తుగడలను జగన్ తేలికగానే తిప్పికొట్టగలరని వేరే చెప్పనవసరం లేదు. - కొమ్మినేని శ్రీనివాసరావు -
తెలంగాణలో ధర్మానికి అధర్మానికి ఎన్నికలు జరుగుతున్నాయి: అజయ్
-
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల ఇంట్లో పోలీసులు సోదాలు
-
తుమ్మలపై మంత్రి పువ్వాడ ఆగ్రహం
-
తుమ్మలపై పువ్వాడ అజయ్ హాట్ కామెంట్స్
-
తుమ్మల వర్సెస్ పువ్వాడ..
వారంతా సీనియర్ నాయకులే. అనేక యుద్ధముల ఆరితేరినవారే. పలుసార్లు విజయం సాధించినవారే. ఇప్పుడందరికీ తాజా ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా మారాయి. ఈ ఎన్నికల్లో ఓడితే వారి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందనే ఆందోళన కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కీలక నేతలకు తాజా ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయనే చెప్పాలి. ఓడినవారికి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కీలక నేతలకు ఈ ఎన్నికలు రాజకీయంగా డూ ఆర్ డై అనే చెప్పాలి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తున్నారు. గత ఎన్నికల్లో తుమ్మల పాలేరు నుంచి బీఆర్ఎస్ తరుపున పోటి చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి కూడ ఓడితే పొలిటికల్గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో గెలిచి తన 40 ఏళ్ల రాజకీయాలకు ఘనంగా వీడ్కోలు పలకాలనే ఉద్దేశ్యంతో గెలుపే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇవే చివరి ఎన్నికలు అని చెప్పి ప్రచారంకు వెళ్లుతున్నారు తుమ్మల. ఇక జిల్లాలో మరో కీలక నేత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. బీఆర్ఎస్ నుంచి ఖమ్మం అసెంబ్లీ బరిలో దిగారు. మూడవసారి గెలిచి ఖమ్మం గడ్డపై హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో దూకుడుగా ముందుకు వెళ్లుతున్నారు. అంతేకాదు తనకు ఇవే చివరి ఎన్నికలు కావచ్చని..ఈసారి గెలిస్తే మిగిలిపోయిన అభివృద్ది ఏమైనా ఉంటే పూర్తి చేస్తానని ఈ ఒక్కసారి తనను ఆశీర్వాదించాలని ఖమ్మం ప్రజలను కోరుతున్నారు. లోకల్ ఫీలింగ్ తీసుకు వస్తూ ఓటర్లకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో పొటీ చేసి ఓడిపోయి.. పక్క నియోజకవర్గంకు వెళ్ళి అక్కడా ఓడిపోయిన నేత ఇప్పుడు మళ్ళీ ఖమ్మం వచ్చారంటూ తుమ్మల నాగేశ్వరరావు పేరెత్తకుండా సెటైర్లు వేస్తున్నారు పువ్వాడ అజయ్. ఖమ్మం ప్రజలు విజ్ణతతో ఆలోచించాలని కోరుతున్నారు మంత్రి అజయ్ కుమార్. ఖమ్మం నియోజకవర్గంలో 2 వేల కోట్ల విలువైన అభివృద్ది పనులు చేశానని చెప్పుకుంటున్నారు. ఖమ్మం నియోజకవర్గం అటు తుమ్మలకు..ఇటు పువ్వాడకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారయని చెప్పాలి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు. మొదటి సారి అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి..పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఏమాత్రం తేడా వచ్చినా అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉండటంతో..పాలేరు నియోజకవర్గంలో విజయం కోసం తన సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు. ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. పొంగులేటికి తోడుగా ఆయన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కూడ పాలేరు ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వెళ్లుతున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందిన కందాల ఉపేందర్రెడ్డి తర్వాత గులాబీ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు కందాల బీఆర్ఎస్ తరపున పాలేరు బరిలో దిగారు. 2018లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన తుమ్మల నాగేశ్వరరావు ఓటమి చెంది...ఇప్పుడు కాంగ్రెస్లో చేరారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు..ఇప్పటికే మొదటి విడత ప్రచారం సైతం పూర్తి చేశారు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మరో సీనియర్ నేత, సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేస్లో ఉండే నేత భట్టి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి భారీ మెజారిటీతో విజయం సాధించాలనే లక్ష్యంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. మధిర నుంచి ఇప్పటికే మూడుసార్లు గెలిచిన విక్రమార్క నాలుగోసారి గెలవడం పెద్ద కష్టమేమీ కాదనుకుంటున్నారు. కాని భారీ మెజారిటీ సాధించడమే టార్గెట్గా పెట్టుకున్నారు. భట్టి విక్కమార్కకు గతంలో చేసిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బాగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. మరో వైపు మధిరలో భట్టిపై పోటీ చేసి ఇప్పటికి మూడుసార్లు ఓడిపోయిన ఖమ్మం జిల్లా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ కు ఈ ఎన్నికలు చావో రేవోగా మారాయి. మూడు సార్లు ఓడినా గులాబీ బాస్ నాలుగోసారి టిక్కెట్ ఇచ్చారు. ఈసారి కూడా కమల్ రాజ్ ఓడితే ఇక ఆయన రాజకీయ జీవితం ముగిసినట్లే అవుతుంది. అందుకే లింగాల కనకరాజ్ గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. నాలుగోసారైనా గెలిపించండని ప్రజల్ని ప్రాధేయపడుతున్నారు. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు సీనియర్ నేతలకు ఈ ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా తయారయ్యాయని చెప్పాలి. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీల్లోని ఆ నేతలు గెలుపు కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు. మరి ప్రజలు ఎవరిని అందలం ఎక్కిస్తారో చూడాలి. -
‘నేను ఎక్కడ నుంచి పోటీ చేసేది అధిష్టానం నిర్ణయిస్తుంది’
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ అధిష్టానం పోటీ చేయమన్న చోట నుంచే వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈరోజు(శనివారం) కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీని కలిసిన అనంతరం మీడియా చిట్చాట్లో పాల్గొన్నారు తుమ్మల. కాంగ్రెస్ అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడే పోటీ చేస్తా . పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకున్నాను. పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం స్థానాలలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తా. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సమిష్టిగా పనిచేయాలని రాహుల్ గాంధీ కోరారు’ అని తెలిపారు. సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
కాంగ్రెస్కు 78 సీట్లు ఖాయం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పదితో పాటు రాష్ట్రంలో 74 నుంచి 78 సీట్లు గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సీఎల్పీనేత మల్లు భట్టివిక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని లూటీ చేసిన బీఆర్ఎస్ ఒక వైపు, ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్న కాంగ్రెస్ ఒక వైపు ఎన్నికల బరిలో ఉన్నాయని ఆయన అన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లో చేరాక తొలిసారిగా సోమవారం ఖమ్మం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. ఖమ్మంలోని డీసీసీ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగగా.. తుమ్మలకు భట్టితో పాటు మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టి మాట్లాడారు. కల్వకుంట్ల కుటుంబం ఆగమాగం న్యాయం, ధర్మంతో పాటు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉన్నారని చెప్పారు. విజయభేరి సభలో ప్రకటించినట్లుగా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గ్యారంటీ కార్డులో చెప్పినవన్నీ అమలు చేస్తామని అన్నారు. చేవెళ్ల, వరంగల్ డిక్లరేషన్లు, రుణమాఫీ వంటి హామీలు కూడా మేనిఫెస్టోలో చేర్చనున్నామని తెలిపారు. ప్రతి మండలంలో 15 ఎకరాల విస్తీర్ణంలో అన్ని వసతులతో కూడిన అంతర్జాతీయ పాఠశాలలు నిర్మిస్తామని చెప్పారు. కాంగ్రెస్ సభలు, సమావేశాలు, పార్టీ గాలి చూసి కల్వ కుంట్ల కుటుంబం ఆగమాగం అవుతోందని ఎద్దేవా చేశారు. మళ్లీ మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతోందని విమర్శించారు. పొంగులేటి మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా గ్రూప్–1 పరీక్ష నిర్వహించిన కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల ఉసురు పోసుకుందని మండిపడ్డారు. సమావేశంలో తుమ్మలతో పాటు మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఓడినా కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు
ఖమ్మం మయూరిసెంటర్: ఖమ్మం నుంచి పోటీ చేసి తనపై ఓడిపోయిన వ్యక్తికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇచ్చారని, ఆ తర్వాత ఉప ఎన్నికల్లోనూ కష్టపడి గెలిపించారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో తాను తప్ప ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరూ గెలవలేదని గుర్తు చేశారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఒకసారి ఖమ్మం, మరోసారి పాలేరు వైపు పోదామనే ఆలోచన తనది కాదని, తాను ఖమ్మం నుంచే పోటీ చేస్తానని, మరోసారి ఆశీర్వదించాలని కోరారు. తనతో పాటు ఖమ్మం ఎంపీగా, లోక్సభా పక్ష నాయకులుగా నామా నాగేశ్వరరావుకు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా కొండబాల కోటేశ్వరరావుకు, ఖమ్మం మేయర్గా పునుకొల్లు నీరజకు.. ఇలా ఒకే సామాజికవర్గానికి చెందిన పలువురికి పదవులు ఇచ్చిన ఘనత కేసీఆర్కు దక్కుతుందన్నారు. తమకు ఎవరు మేలు చేశారో ఈ సామాజికవర్గం వారు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. -
ముహూర్తం ఫిక్స్.. కాంగ్రెస్లోకి తుమ్మల
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఖమ్మం రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు కాంగ్రెస్లో చేరికకు ముహూర్తం ఖరారైంది. పాలేరు టికెట్ విషయంలో తుమ్మలకు భరోసా లభించినట్లు సమాచారం. ఈ నెల 6న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో తుమ్మల హస్తం గూటికి చేరనున్నట్లు తెలిసింది. ‘తుమ్మలన్న రా.. కదిలిరా.. జనమంతా ప్రభంజనంలా నీ వెంటే’ అంటూ ఖమ్మం నగరంలో ఫ్లెక్సీ వెలిసింది. ఇప్పటికే కాంగ్రెస్లోకి రావాలని తుమ్మల నాగేశ్వరావును పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. తుమ్మల ఇంటికి వెళ్లిన పొంగులేటి తాజా పరిణామాలపై చర్చించారు. తుమ్మల ఇంటికి పొంగులేటి వెళ్లడం ఆసక్తికర పరిణామమే. ఎందుకంటే ఈ ఇద్దరూ బీఆర్ఎస్లోనే ఉన్నా.. ఇంతకాలం మాట్లాడుకోలేదు. అలాంటిది నాలుగేళ్ల తర్వాత ఈ ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకున్నారు. అదీ.. బీఆర్ఎస్ అసంతృప్తి నేపథ్యంతోనే కావడం గమనార్హం. ఎట్టిపరిస్థితుల్లో ఖమ్మం కంచుకోటను వదులుకోకూడదని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే బలమైన నేతలను ఒకే గూటికి తెచ్చి.. కలిసి పని చేయడం ద్వారా విజయం అందుకోవాలని భావిస్తోంది. మరో వైపు ఇవాళ తుమ్మలతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. చదవండి: ‘జమిలి’తో మరింత జోష్! -
సీతారామ ప్రాజెక్టు పూర్తయితే రాజకీయాలకు గుడ్బై
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల విడుదలను కళ్లారా చూశాకే రాజకీయాల నుంచి విరమిస్తానని... ఆ కోరిక నెరవేర్చుకునేందుకే ఎన్నికల్లో నిలబడుతున్నానని , ప్రజల కోరిక మేరకే నిర్ణయం ఉంటుందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. మాజీ మంత్రి తుమ్మలను ఖమ్మంలోని ఆయన స్వగృహంలో కలిశారు. అనంతరం తుమ్మల మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ హోదాలో పొంగులేటి తనను పార్టీలోకి ఆహ్వానించేందుకు వచ్చారన్నారు. తన రాజకీయ లక్ష్యమైన సీతారామ ప్రాజెక్టు పూర్తయ్యాక అధికారికంగా నీళ్లు వదిలి అదే వేదికపై అందరికీ ధన్యవాదాలు తెలిపి రాజకీయాల నుంచి విరమించాలనేది తన జీవిత కోరిక అని వ్యాఖ్యానించారు. అందుకోసమే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. బీఆర్ఎస్ పతనం మొదలైంది: శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పతనం మొదలైందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకటి, రెండు శాతం ఓట్లు కూడా లేని సమయాన కేసీఆర్ ఆహ్వానం మేరకు తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్లో చేరి జిల్లాను అభివృద్ధి పథాన నడిపించారని చెప్పారు. అయితే, బీఆర్ఎస్లో కొన్ని శక్తులు ఆయ న్ను అవమానాలు, అవహేళనలకు గురిచేసి బయటకు వెళ్లేలా చేశాయన్నారు. కాంగ్రెస్ పక్షాన మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. -
కాంగ్రెస్లోకి రండి
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆయన్ను పార్టీలోకి రావాలని టీపీసీసీ అధ్య క్షుడు రేవంత్రెడ్డి ఆహ్వానించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్లోని తుమ్మల నివాసానికి రేవంత్తోపాటు కాంగ్రెస్ నేతలు సుదర్శన్రెడ్డి, మల్లు రవి వెళ్లారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, సీఎం కేసీఆర్ వ్యవహారశైలి, ఖమ్మం జిల్లా రాజకీయ సమీకరణాలు, రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై తుమ్మలతో రేవంత్ బృందం చర్చించింది. ఖమ్మం జిల్లా రాజకీ య సమీకరణాల్లో భాగంగా పార్టీలోకి రావాలని, తగిన ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. రేవంత్ ఆహా్వనం నేపథ్యంలో తుమ్మల సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ఆయన ఏఐసీసీ నేతల సమక్షంలో కాంగ్రెస్లోకి వస్తారని చెబుతున్నారు. కాగా, తుమ్మల ఈసారి ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ పాలేరులో పోటీ సాధ్యం కాకుంటే ఖమ్మం అసెంబ్లీ నుంచి ఆయన బరిలో ఉంటారని, తుమ్మల ఎక్కడి నుంచి పోటీ చేసినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కు కొత్త బలం వస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఖమ్మం జిల్లా నేతలను దూరం పెట్టడంపై విమర్శలు... తుమ్మలతో భేటీకి పార్టీ ఖమ్మం జిల్లా నేతలను రేవంత్ దూరం పెట్టడం కాంగ్రెస్లో అంతర్గతంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి బదులు నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్రెడ్డి, పాలమూరుకు చెందిన మల్లు రవిని తీసుకెళ్లి తుమ్మలను పార్టీలోకి ఆహా్వనించడంపట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఈ ఎన్నికల్లో పోటీ చేస్తా
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘ప్రజల ఆత్మగౌరవం..అవసరం కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తా.. మీ అండ, బలగం ఉన్నంత కాలం దేనికీ తలవంచను.. నా రాజకీయ జీవితం మీ చేతుల్లోనే ఉంది.’అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బీఆర్ఎస్ ఇటీవల అసెంబ్లీ టికెట్ల జాబితా ప్రకటించగా, తుమ్మలకు స్థానం దక్కలేదు. అప్పటి నుంచి మనస్తాపంతో ఉన్న ఆయన శుక్రవారం తొలిసారి జిల్లాకు వచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల అనుచరులు వెయ్యికి పైగా కార్లు, ఇతర వాహనాల్లో వచ్చినాయకన్గూడెం వద్ద తుమ్మలకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ర్యాలీగా ఖమ్మంలోని గొల్లగూడెంలో ఉన్న ఆయన ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఆయన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. తనకు పదవి అలంకారం, అహంకారం, ఆధిపత్యం కోసం కాదని ప్రజల కళ్లలో చిరునవ్వు చూడటం కోసమేనని చెప్పారు. గత ఎన్నికల సందర్భంగా గోదావరి జలాలతో జిల్లా ప్రజల కాళ్లు కడిగి రాజకీయాల నుంచి విరమిస్తానని సీఎం కేసీఆర్కు చెప్పానని, అది నెరవేరాకే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని తెలిపారు. ప్రస్తు తం రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా.. ప్రజల ఆరాటం, అభిమానం చూశాక తనకు అవసరం లేకపోయినా.. జిల్లా కోసం, ప్రజల కోసం రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు. పాలేరు, వైరా, లంకాసాగర్, ఉభయ జిల్లాల్లోని రిజర్వాయర్లను నింపి రాజకీ యాల నుంచి విరమిస్తానని తుమ్మల వెల్లడించారు. తుమ్మల ఫొటోతో ప్రత్యేక జెండాలు ర్యాలీలో ప్రతీ వాహనానికి ప్రత్యేకంగా తుమ్మల ఫొటో ఉన్న తెల్లరంగు జెండాలు కట్టారు. ఎక్కడ కూడా కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు కానీ బీఆర్ఎస్ జెండాలు కానీ కనిపించలేదు. కొందరు తుమ్మల ఫొటో ఉన్న జెండాలతో పాటు కాంగ్రెస్ జెండాలు కూడా పట్టుకోవడం కనిపించింది. -
ఆరని అసమ్మతి 'జ్వాల'
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను ఇతర పార్టీల కంటే ముందే ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో అసమ్మతి జ్వాలలు చల్లారడం లేదు. ఒకరొకరుగా అసంతృప్త నేతలు బయటపడుతున్నారు. తమ అసమ్మతిని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించేందుకు సన్నద్ధమవుతున్నారు. మరికొందరు అసంతృప్తులు రహస్య భేటీలతో పార్టీ, అభ్యర్థులపై ఒత్తిడి పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంకొందరు పార్టీలో ఉంటామంటూనే అభ్యర్థులను మాత్రం మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. టికెట్ దక్కించుకున్న నేతలతో సయోధ్య కుదుర్చుకునేందుకు అసమ్మతి నేతలు ససేమిరా అంటుండటం చర్చనీయాంశంగా మారుతోంది. బీఆర్ఎస్ జెండా లేకుండా భారీ ర్యాలీగా పాలేరు టికెట్ ఆశించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆ పార్టీ అధినేత కేసీఆర్ రాయబారానికి మెత్తబడిన సూచనలు కనిపించడం లేదు. ఎంపీ నామా నాగేశ్వర్రావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్.భాస్కర్రావు రెండు రోజుల క్రితం తుమ్మలను కలసి కేసీఆర్ సందేశాన్ని అందించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లిన తుమ్మలకు.. ఆయన అనుచరులు జిల్లా సరిహద్దు నాయకన్గూడెం వద్ద భారీ స్థాయిలో స్వాగతం పలికారు. ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే ఎక్కడా బీఆర్ఎస్ జెండా కనిపించలేదు. తాను ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేయకూడదనుకున్నా.. ప్రజల స్పందన చూసి మనసు మార్చుకుంటున్నట్టు తుమ్మల ప్రకటించారు. అయితే ఏ పార్టీలో చేరేదీ వెల్లడించలేదు. నేడు అనుచరులతో మైనంపల్లి భేటీ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు శనివారం హైదరాబాద్ శివార్లలోని దూలపల్లిలో ఉన్న తన నివాసంలో అనుచరులతో భేటీ అవుతున్నట్టు ప్రకటించారు. తన కుమారుడు రోహిత్కు మెదక్ అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంపై ఆగ్రహించిన మైనంపల్లి.. మంత్రి హరీశ్రావుపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై కఠిన చర్యలు ఉంటాయని బీఆర్ఎస్ వర్గాలు ప్రకటించాయి. కేసీఆర్ ఏ తరహా నిర్ణయం తీసుకుంటారనేది ఇంకా తేలలేదు. మరోవైపు మైనంపల్లి పార్టీని వీడే పక్షంలో ప్రత్యామ్నాయంగా మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు విజయశాంతి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మర్రి రాజశేఖర్రెడ్డి, ఆకుల రాజేందర్ తదితరుల పేర్లు బీఆర్ఎస్ పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. ప్రగతి భవన్కు నేతల క్యూ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో చోటు దక్కని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహులు ప్రగతిభవన్కు క్యూకట్టారు. జర్మనీ పర్యటన ముగించుకుని వచ్చిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ శుక్రవారం మధ్యాహ్నం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. వేములవాడ టికెట్ను వేరేవారికి ప్రకటించిన నేపథ్యంలో చెన్నమనేని రమేశ్కు మరో రూపంలో అవకాశమిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి రమేశ్ను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ రంగ వ్యవహారాల సలహాదారుగా కేబినెట్ హోదాలో నియమిస్తున్నట్టుగా ప్రకటన వెలువడింది. అనంతరం రమేశ్ నివాసానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ వెళ్లి మాట్లాడారు. ► ఇక టికెట్ల కేటాయింపులో జనగామ, నర్సాపూర్లలో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి శుక్రవారం మరోమారు ప్రగతిభవన్కు వెళ్లి సీఎం కేసీఆర్ను కలిశారు. ► మరోవైపు బెల్లంపల్లి టికెట్ను తిరిగి దక్కించుకున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శుక్రవారం అకస్మాత్తుగా తన కార్యకలాపాలను రద్దు చేసుకుని ప్రగతిభవన్కు రావడం చర్చనీయాంశమైంది. ► టికెట్ దక్కని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, పెద్దపల్లి నేత నల్ల మనోహర్రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ను వీడుతున్నట్టు ప్రకటించారు. కోదాడ అసమ్మతి నేతలు శుక్రవారం హైదరాబాద్లో భేటీ అయ్యారు. ► రామగుండం, ఎల్బీనగర్, నాగార్జునసాగర్, పటాన్చెరు, మధిర, దేవరకొండ తదితర నియోజకవర్గాల్లోనూ అసమ్మతి ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇంకా పార్టీ నేతలకు అందుబాటులోకి రావడం లేదని సమాచారం. -
ఖమ్మం పాలిటిక్స్లో కలకలం
నాలుగున్నరేళ్లలో ఏం జరిగింది? ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేది అందరికీ తెలుసు. ఈరోజు బీఆర్ఎస్లో ఉన్నాం. కానీ పార్టీలో దక్కిన గౌరవం ఏమిటి? భవిష్యత్లో జరగబోతున్నది ఏమిటి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు నా టీం సిద్ధంగా ఉంది.. – మాజీ ఎంపీ పొంగులేటి గతంలో నన్ను దెబ్బకొట్టేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ప్రచారాలు చేశారు. మళ్లీ ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. డబ్బుతోనే అన్నీ సాధ్యం కావు. క్యారెక్టర్, గుణం అవసరం. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొన్ని విలువలు అవసరం.. – మంత్రి పువ్వాడ అజయ్ నా రాజకీయ ప్రస్థానంలో ముగ్గురు సీఎంల వద్ద మంత్రిగా పనిచేశాను. ఉమ్మడి జిల్లాకు నేనేం చేశానో, పాలేరు నియోజకవర్గానికి ఏం చేశానో అందరికీ తెలుసు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేను పాలేరు నుంచే పోటీ చేస్తా. నా వెంట నిలిచేవారికి అండగా ఉంటా.. – మాజీ మంత్రి తుమ్మల ..ఒకరు మాజీ ఎంపీ, మరొకరు మంత్రి, ఇంకొకరు మాజీ మంత్రి.. ముగ్గురూ ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలే.. జిల్లాలో అనుచరులు, అభిమానగణం ఉన్నవారే.. పార్టీలో, ప్రభుత్వంలో తమకు దక్కుతున్న ప్రాధాన్యంపై అసంతృప్తితో ఉన్నవారు ఇద్దరు, ఆ అసంతృప్తిని దీటుగా ఎదుర్కొని నిలబడాలన్న ఆలోచనతో ఉన్నవారు మరొకరు.. మొత్తానికి ఆధిపత్యం కోసమో, రాజకీయ భవిష్యత్తు కోసమో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏడాదిలోగా అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తమ కార్యచరణకు పదును పెట్టుకుంటున్నారు. నూతన సంవత్సర వేడుకలు వేదికగా అనుచరులతో సమావేశాలు పెట్టి బల ప్రదర్శన చేసుకున్నారు. ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం/ఖమ్మం మయూరి సెంటర్ తుమ్మల.. ఎన్నికల రిహార్సల్! మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా నూతన సంవత్సర వేడుకల పేరిట ఖమ్మం రూరల్ మండలంలో తన అనుచరగణం, కేడర్తో ఆత్మీయ సమ్మేళనంనిర్వహించారు. తాను పాలేరు నుంచే పోటీ చేస్తానంటూ ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన తుమ్మల.. ఈ కార్యక్రమంలో మరోసారి స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో ముగ్గురు సీఎంల వద్ద మంత్రిగా పనిచేశానని చెప్పారు. ఉమ్మడి జిల్లాకు ఏమేం చేశారో, పాలేరు నియోజకవర్గానికి ఏం చేశారో వివరించారు. అయితే ఈ కార్యక్రమం వచ్చే ఎన్నికలకు రిహార్సల్గా, బల ప్రదర్శనగా చెప్పవచ్చని ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల పాలేరు నియోజకవర్గంలో స్పీడ్ పెంచారని అంటున్నారు. నన్ను దెబ్బతీసే ప్రయత్నాలు ‘వాడవాడ పువ్వాడ’ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ గతంలో తనను దెబ్బకొట్టడం కోసం అనేక ప్రయత్నాలు జరిగాయని, రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ప్రచారాలు చేశారని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు. ఆయన ఆదివారం ఖమ్మంలో ‘వాడవాడ పువ్వాడ’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేరుగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరించనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు తనపై నేరుగా ఆరోపణలు చేయలేక కార్పొరేటర్లను తులనాడి, వారిపై విషప్రచారం చేసి తనకు నష్టం చేయాలని చూశారని పువ్వాడ ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. డబ్బుతోనే అన్నీ సాధ్యం కాదని, క్యారెక్టర్, గుణం అవసరమని పేర్కొన్నారు. ప్రజాజీవితంలో ఉన్నప్పుడు కొన్ని విలువలు అవసరమని.. ఆ విలువలకు కట్టుబడి ప్రజల అవసరాలు తీరుస్తూ ఎవరి దగ్గరా ఏమీ ఆశించకుండా సంక్షేమం, అభివృద్ధి విషయంలో ముందుకుపోతున్నానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో నా టీమ్ పోటీ చేస్తుంది బీఆర్ఎస్లో జరిగిన గౌరవం ఏమిటో ఆలోచించాల్సి ఉంది: పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కీలకనేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన ఖమ్మంలోని తన క్యాంప్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి పొంగులేటి అనుచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. గత నాలుగున్నరేళ్లలో ఏం జరిగింది, తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేది అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఈ రోజు బీఆర్ఎస్లో ఉన్నామని, కానీ ఆ పార్టీలో జరిగిన గౌరవమేంటి? భవిష్యత్లో జరగబోతున్న గౌరవం ఏమిటనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల ప్రేమ, అభిమానాలు పొందిన, పొందుతున్న ప్రతీ నాయకుడు ప్రజాప్రతినిధి కావాలని, అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు శీనన్న (తన) టీమ్ అంతా సిద్ధంగా ఉందని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు. ఎంపీగా గెలిచి.. బీఆర్ఎస్లో చేరి.. వైఎస్సార్సీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా అనుచరులు, అభిమానులను సంపాదించుకున్నారు. 2014లో ఎంపీగా గెలిచారు. వైరా, అశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. కానీ తర్వాతి రాజకీయ పరిణామాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ (టీఆర్ఎస్)లో చేరారు. ఈ క్రమంలో రాజకీయ జీవితం కొంత ఒడిదుడుకులకు లోనైంది. సిట్టింగ్ అయిన ఆయనను కాదని.. నామా నాగేశ్వరరావుకు గులాబీ పార్టీ టికెట్ దక్కింది. ఏదైనా నామినేటెడ్ పదవి వస్తుందని పొంగులేటి ఆశించినా ఫలితం రాలేదు. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకే చెందిన పువ్వాడ అజయ్కు ప్రాధాన్యం దక్కడం, తుమ్మల నాగేశ్వర్రావు తిరిగి పట్టుపెంచుకునే ప్రయత్నాలు చేయడంతో.. ఆయన భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టినట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. -
Telangana: టికెట్ లేకపోతే పార్టీలో ఎందుకుండాలి?
వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్లకే టికెట్లని గులాబీ దళపతి కేసిఆర్ ప్రకటించేశారు. మరోవైపు పాలేరులో ఎర్ర జెండా ఎగరేస్తామంటున్నారు తమ్మినేని వీరభద్రం. మరి పాలేరు నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంగతేంటి? ఆయన రాజకీయ భవిష్యత్తు ఏం కాబోతోంది? టిక్కెట్ దక్కే చాన్స్ లేని తుమ్మల ఖీఖ లోనే ఉంటారా? పార్టీ మారుతారా? తుమ్మల ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది? కారులో కష్టంగా ప్రయాణం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కీలక నేత తుమ్మల నాగేశ్వరరావు కారులో ఇబ్బందికరమైన ప్రయాణం చేస్తున్నారు. పార్టీలో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే పార్టీలో తుమ్మల ఒంటరి అయ్యారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సత్తుపల్లిలో జరిగిన ఎంపీ సన్మాన సభకు పార్టీ నుంచి ఆహ్వానం అందలేదని అందుకే హజరుకాలేదని తుమ్మల ఓపెన్ గానే చెప్పారు. పిలవకుండా వెళ్లడం కరెక్ట్ కాదన్నారు. ఈ ఘటనతోనే అర్థమవుతోంది, ఖమ్మం టిఆర్ఎస్ లో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయో? ఆ సభకు తుమ్మలను పిలవకపోవడంతో ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. పొమ్మనలేక పొగబెడుతున్నారా? ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఒత్తిడితోనే తుమ్మలను పిలవలేదని బహిరంగంగానే చెబుతున్నారు. ఇన్ని అవమానాల మధ్య పార్టీలో ఉండటం కష్టమని తుమ్మల అనుచరులు అంటున్నారు. ఇంకా నాన్చకుండా త్వరగా నిర్ణయం తీసుకోవాలని తుమ్మలకు చెప్పారట. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గాని పాలేరు పరిధిలో గాని జనవరి మాసంలో లక్ష మందితో భారీ బహిరంగ సభ పెట్టే ఆలోచనలో తుమ్మల ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల ఆఖరులోగా ఈ సభపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టిఆర్ఎస్ లో కొనసాగాలా వద్దా అన్న దానిపై సభలోనే స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సిట్టింగ్లకే సీట్లంటే ఎసరొచ్చినట్టేనా? 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో ఓడినప్పటినుంచీ కారులో తుమ్మల పొలిటికల్ జర్నీ ఇబ్బందికరంగా సాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరడంతో తుమ్మల ఇబ్బందులు మరింతగా పెరిగాయి. గత రెండేళ్ల నుంచి పాలేరులో జరిగే టిఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తుమ్మలకు ఆహ్వనాలు అందడంలేదు. ఏదో పార్టీలో ఉన్నారంటే ఉన్నారు అన్నట్లుగా తయారైంది పరిస్థితి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ లకే సీట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ఇటివల ప్రకటించిన నేపథ్యంలో.. టిక్కెట్పై ఎమ్మేల్యే కందాల ఉపేందర్ రెడ్డి ధీమాగా ఉన్నారు. అయితే టిఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల మధ్య పోత్తులు దాదాపు ఖారారు అయ్యాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో పాలేరు సీటు సీపీఎంకి కేటాయించాల్సి ఉంటుంది. మేం పోటీ చేస్తామంటున్న కామ్రేడ్స్ పాలేరులో ఎర్ర జెండా ఎగరవేస్తామని అక్కడ పోటీ చేద్దామనుంటున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బహిరంగంగానే చెప్పారు. ఇన్ని వ్యవహారాల మధ్య ఇక పార్టీలో ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని తుమ్మల డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. వాజేడులో జరిగిన ఆత్మీయ సభ వరకు ఉన్న ఈక్వేషన్స్..సత్తుపల్లిలో జరిగిన టిఆర్ఎస్ సభ తర్వాతి పరిస్థితులకు చాలా తేడా వచ్చిందని అంటున్నారు. ఇదిలా ఉంటే టిఆర్ఎస్ వర్గాలు మాత్రం తుమ్మల బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో టచ్ లో ఉన్నారని.. ఎప్పుడైనా పార్టీ మారే అవకాశం ఉన్నందునే.. పార్టీ పక్కన పెట్టిందంటూ ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారు. సత్తుపల్లి సభకు తుమ్మలను పిలకపోవడం కూడ ఇందులో బాగామేనన్న వాదన కూడా వినిపిస్తుంది. తుమ్మల విషయంలో టిఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు అర్థం అవుతోంది గనుక..ఇక తుమ్మల కూడా ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పొలిటకల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
తమ్మినేని కృష్ణయ్య హత్య.. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన తమ్ముళ్లు
సాక్షి, ఖమ్మం రూరల్: జిల్లాలోని తెల్దారుపల్లిలో ఇటీవల హత్యకు గురైన టీఆర్ఎస్ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య హత్యను ఎవరైనా సమర్థిస్తే వారు అంతరాత్మను మోసం చేసుకున్నట్లేనని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. పలువురు నాయకులతో కలిసి సోమవారం ఆయన కృష్ణయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఘాతుకానికి పాల్పడడం దురదృష్టకరమని పేర్కొన్నారు. హత్యకు పాల్పడిన వారిని కఠి నంగా శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారని.. ఈ విషయంలో పోలీసులు తమ బాధ్యతను పకడ్బందీగా నెరవేర్చి హంతకులకు శిక్ష పడేలా చూడాలని కోరారు. తద్వారా న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించాలని సూచించారు. ఏది ఏమైనా ఇలాంటి హత్యలను ప్రభుత్వం ప్రోత్సహించదని స్పష్టంచేశారు. హత్య కేసులో దోషులకు శిక్ష పడేంత వరకు తన శాయశక్తులా కృషిచేస్తానని తుమ్మల వెల్ల డించారు. తొలుత కృష్ణయ్య చిత్రపటం వద్ద నివాళులర్పించడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్ల మల వెంకటేశ్వరరావు, నాయకులు సాధు రమేష్రెడ్డి, మద్ది మల్లారెడ్డి, బండి జగదీష్, శాఖమూరి రమేష్, కనకమేడల సత్యనారాయణ, చిత్తారు సింహాద్రియాదవ్, వెంకట్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సీపీఎంకు కృష్ణయ్య సోదరుల రాజీనామా ఇటీవల దారుణ హత్యకు గురైన తెల్దారుపల్లికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య సోదరులు తమ్మినేని వెంకటేశ్వరరావు, బుచ్చయ్య సీపీఎం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, పదవులకు రాజీనామా చేశారు. ఈమేరకు సోమవారం తెల్దారుపల్లిలో వారు విలేకరులతో మాట్లాడారు. తమ సోదరుడితో పాటు తాము సీపీఎం అభివృద్ధికి అంకితభావంతో పనిచేశామని.. కానీ ఆ పార్టీ నాయకులే తమ సోదరుడిని హత్య చేయడం కలిచివేసిందని పేర్కొన్నారు. నలభై ఏళ్ల పాటు సీపీఎంలో కొనసాగిన కృష్ణయ్యను హత్య చేయడంతో తాము పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. సీపీఎం పార్టీ నేతలు చేసిన హత్యకు నైతిక బాధ్యతగా, తమ సోదరుడు కృష్ణయ్య కుటుంబానికి అండగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. -
తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు
-
సొంత పార్టీపై తుమ్మల కీలక వ్యాఖ్యలు
-
సీఎం పర్యటనకు జూపల్లి డుమ్మా
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ఖమ్మం: సీఎం కేసీఆర్ పర్యటనకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో కేసీఆర్ వెంట ఉన్న ఆయన ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్దన్రెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతర క్రమంలో బీరం టీఆర్ఎస్లో చేరడం.. ఆ తర్వాత కేసీఆర్కు జూపల్లి దూరం పెరిగినట్లు తెలుస్తోంది. మంగళవారం వనపర్తిలో కేసీఆర్ పర్యటనకు ఆయన డుమ్మా కొట్టడంపై పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తుమ్మల, పొంగులేటితో భేటీ సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో ఉండగా జూపల్లి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వచ్చి మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని కలవడం హాట్ టాపిక్గా మారింది. తుమ్మల గత ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. పొంగులేటి ఎంపీ టికెట్ ఆశించినా దక్కలేదు. అయితే, వీరిద్దరూ టీఆర్ఎస్లో పనిచేస్తున్నా పెద్దగా హడావుడి లేదు. తుమ్మల పూర్తిస్థాయిలో సొంత పనులు చూసుకుంటూ పాలేరు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. పొంగులేటి సైతం పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తాయనే ఊహాగానాల నేపథ్యంలో వీరికి పదవులు దక్కుతాయా.. లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సత్తుపల్లి సమీపంలోని వ్యవసాయక్షేత్రంలో తుమ్మలను జూపల్లి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. జూపల్లికి పార్టీలో పెద్దగా ప్రాధాన్యం లభించడంలేదనే ప్రచారం ఉన్న నేపథ్యంలో ఆయన తుమ్మలను కలవడం చర్చనీయాంశమైంది. వీరు రాజకీయ భవిష్యత్పై మాట్లాడుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత జూపల్లి ఖమ్మం చేరుకుని పొంగులేటితో సమావేశమయ్యా రు. ఈ భేటీలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్బాబు, పార్టీ నేత తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు. -
కొందరు కావాలనే ఓడించారు: తుమ్మల
సాక్షి, ఖమ్మం జిల్లా: గత ఏడాది కలిసి రాలేదని, కొందరు స్వార్థపరులు కావాలనే పని గట్టుకొని మనల్ని ఓడించారని మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. సత్తుపల్లిలో పాలేరు నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన శుక్రవారం సమావేశమయ్యారు. గంట పాటు అనుచరులు, కార్యకర్తలతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. (చదవండి: కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన ప్రకటన) రాజకీయాల్లో అటు పోట్లు, గెలుపు ఓటములు సహజం. ఓటమి గురించి ఆలోచించకుండా జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రాజకీయ కారణాలు ఎలా ఉన్న కొంత కాలం సర్దుకుని పోవాలన్నారు. తాత్కాలిక ఇబ్బందులు వచ్చిన కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటానని తెలిపారు. వేల మంది తన కోసం రావడం ఆనందం ఉందని, రాబోయే రోజుల్లో అండగా ఉంటానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కేసీఆర్ కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని అనుచరులకు తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.(చదవండి: ‘30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు’) -
తుమ్మలతో టీడీపీ ఎమ్మెల్యే భేటీ
సాక్షి, ఖమ్మం: మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావుతో అశ్వారావుపేట టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు భేటీ అయ్యారు. మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్లో చేరనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరి భేటికి ప్రాధాన్యత సంతరించికుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున మెచ్చా నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అయితే గత కొద్ది రోజులుగా వీరిద్దరు టీఆర్ఎస్లో చేరుతున్నారనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. దీనిపై సండ్ర కొంత సానుకూల సంకేతాలు ఇచ్చినప్పటికీ.. మెచ్చా మాత్రం ఈ వార్తను ఖండిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో విడుదల చేశారు. అయితే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చే బాధ్యతలను సీఎం తన సన్నిహితులకు అప్పగించినట్టు సమాచారం. తాజగా తమ్మలతో మెచ్చా భేటీ కావడంతో.. ఆయన టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
‘అందరికంటే ఎక్కువ బాధ నాకు ఉంది’
సాక్షి, ఖమ్మం : సత్తుపల్లిలో టీఆర్ఎస్ పార్టీ ఓటమిపై అందరికంటే తనకే ఎక్కువ బాధగా ఉందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో అందరినీ కలుపుకుని పోవాలని అనేక సార్లు సూచించినా.. కొంత మంది పట్టించుకోలేదని తెలిపారు. మూడు సంవత్సరాల్లో 30 సంవత్సరాల అభివృద్ది చేసి చూపించామన్నారు. అభివృద్ది అంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో మెజారిటీ సాధించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ సమావేశం రసాభాస సాక్షి, కరీంనగర్ : జిల్లా కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి విజయ రమణారావు.. డీసీసీ అధ్యక్షులు మృత్యుంజయంను దూషించిచటంతో ఒక్కసారిగా సమావేశం వేడెక్కింది. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సమక్షంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. డీసీసీ అధ్యక్షున్ని విమర్శించిన విజయ రమణారావుపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. -
టీఅర్ఎస్ గెలుపు తథ్యం : తుమ్మల
-
‘ప్రజల అభీష్టం మేరకే ఆనాడు పార్టీ మారాను’
సాక్షి, ఖమ్మం : ప్రజల అభీష్టం మేరకే ఆనాడు పార్టీ మారవలసివచ్చిందని ఆపద్ధర్మ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం సత్తుపల్లి పట్టణంలో నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్తుపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పిడమర్తి రవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. త్వరలో టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుతో సత్తుపల్లిలో సభ నిర్వహిస్తామని తెలిపారు. కార్యకర్తలు ఎన్నికలను నిర్లక్ష్యంగా తీసుకుంటే మరల రాబోయే కేబినేట్లో తను ఉండనని అన్నారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాల వల్లే సత్తుపల్లి నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. వ్యక్తుల కంటే వ్యవస్థ ముఖ్యం కాబట్టి కార్యకర్తలు ఆ విధంగా నడుచుకోవాలని సూచించారు. పదవులు కోరుకున్న నాయకులు అధిష్టానం ఆదేశాల ప్రకారం నడుచుకోవాలన్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు మట్ట దయానంద్తో కూడా చర్చలు జరిపామని చెప్పారు. తాను అవసరం కోసమో, అవకాశాల కోసమో రాజకీయాలను ఏనాడూ తార్పిడి చేయలేదని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడపాలంటే మరోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరముందన్నారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి నియోజకవర్గం కంటే సత్తుపల్లి నియోజకవర్గానికి అధిక ప్రాముఖ్యత ఉందని వ్యాఖ్యానించారు. -
ఇది కొత్త ఉత్సాహం
ప్రగతి నివేదన సభకు పదపదమంటూ రైతులు ఉత్సాహంగా బైలెల్లారు. నేతల ఫ్లెక్సీలతో అలంకరించుకున్న ట్రాక్టర్లు బండెనక బండి.. వేలాది బండ్లు అన్నట్లు జాతర మాదిరిగా తరలివెళ్లాయి. హోరెత్తిన తెలంగాణ పాటలు, డీజే మోతలతో ఉర్రూతలూగించాయి. ఎటుచూసినా ఇక్కడే నివేదన సభ.. అన్నట్లుగా ట్రాక్టర్ల సందడి కనిపించింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఖమ్మం నగరంలో సందడి నెలకొంది. కాగా.. టీఆర్ఎస్ కార్యకర్తల కోలాహలం నడుమ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ జెండా ఊపి ప్రదర్శనను ప్రారంభించారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్ నడపగా.. పక్కనే ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ తదితరులు కూర్చున్నారు. ఖమ్మం మయూరిసెంటర్ : రెండో తేదీన హైదరాబాద్లో జరిగే ప్రగతి నివేదన సభలో పాల్గొనేందుకు రైతులు వందలాది ట్రాక్టర్లలో తరలిరావడం, ఉత్సాహంగా ప్రదర్శన వెళుతుండడం కొత్త ఉత్సాహాన్నిస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మంజిల్లాకు చెందిన రైతులు 1890ట్రాక్టర్ల ద్వారా శుక్రవారం ప్రదర్శనగా బయలుదేరి వెళ్లారు. ఈ ర్యాలీకి ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ గుమ్మడికాయ కొట్టగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటి స్వయంగా ట్రాక్టర్ను నడిపి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ..రైతు కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో రూ.5లక్షల బీమాను వర్తించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాని ప్రారంభించారన్నారు. పెట్టుబడి కోసం ఎవరి వద్ద చేయి చాచకుండా ఎకరానికి రూ.4వేలు పెట్టుబడి సాయం చేస్తున్నారన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, మార్కెట్ల ను ఆధునీకరించడం, పంట ఉత్పత్తులను దాచుకునేందుకు గిడ్డంగులను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. రైతులకు తమ పార్టీ చేసిన మేలు గతంలో ఏ పార్టీ చేయలేదన్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా రైతులు తమవెంటే ఉంటారని తెలిపారు. అన్నదాతకు సేవలు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు వారే స్వచ్ఛందంగా తరలిరావడం గొప్ప కార్యక్రమం అన్నారు. భవిష్యత్లో రైతాంగానికి మరిన్ని మంచి కార్యక్రమాలు అందించేందుకు, సేవలు చేసేందుకు కేసీఆర్ను ఆశీర్వదించడానికి రైతులు ప్రగతినివేదనసభకు తరలి వెళ్తున్నారన్నారు. ఇంత భారీ ప్రదర్శనను నిర్వహిస్తున్న ఎంపీకి రాష్ట్ర పార్టీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రైతులు నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో యువత పాల్గొని అండగా నిలవాలన్నారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపేందుకే..: ఎంపీ పొంగులేటి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 2వ తేదీన కొంగరకలాన్లో జరిగే ప్రగతి నివేదన సభ ద్వారా తమకు సేవ చేసిన రైతుబాంధవుడికి కృతజ్ఞత తెలుపుకునేందుకే రైతులు స్వచ్ఛందంగా తరలివస్తున్నారన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 51నెలల్లో సాధించిన ప్రగతిని, ప్రజలకు చేసిన సేవలను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ద్వారా ప్రజల ముందు ఉంచుతారని తెలిపారు. 28 లక్షల మంది ఈ నివేదన సభలో పాల్గొనేలా ఏర్పాట్లు జరిగాయన్నారు.సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుకునేందుకు మంచి అవకాశం వచ్చిందంటూ జిల్లా రైతాంగం స్వచ్ఛందంగా నివేదన సభకు తరలివస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు పలు కారణాలతో రైతుల నుంచి డబ్బులు వసూలు చేశాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి చెల్లిస్తుందన్నారు. ఖమ్మం నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన సూర్యాపేట, నల్లగొండ మీదుగా ప్రగతినివేదన సభా ప్రాంగణానికి చేరుకుంటుందని, చివరలో తాను కూడా వీరితో కదలివెళ్తానని వివరించారు. రెండు రోజుల పాటు రైతులకు అవసరమైన వసతి, భోజన సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, మేయర్ పాపాలాల్, నల్లమల వెంకటేశ్వరరావు, సాధు రమేష్రెడ్డి, లింగాల కమల్రాజు, తాతా మధు, కమర్తపు మురళి, బొమ్మెర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్హెచ్ 161కి కేంద్రం అనుమతులు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో జాతీయ రహదారి 161 నిర్మాణానికి కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, భువనగిరి, చౌటుప్పల్ మధ్య 157 కి.మీ. మేర ఎన్హెచ్ 161 నిర్మాణానికి ఈ మేరకు అనుమతులు వచ్చాయని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. బుధవారం ఎంపీ జితేందర్రెడ్డితో కలసి ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలసి పలు జాతీయ రహదారులకు అనుమతుల మంజూరుపై ఆయన చర్చించారు. అలాగే చౌటుప్పల్, షాద్నగర్, కంది మధ్య 205 కి.మీ. జాతీయ రహదారికి సంబంధించి ఇప్పటికే డీపీఆర్లు సమర్పించామని, టెండర్లకు అనుమతులివ్వాలని కోరినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు దేశంలోని అన్ని జాతీయ రహదారులకు కలిపే యూనిక్ ప్రాజెక్టుగా పేరు తెచ్చుకుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ ప్రాజెక్టు విషయమై గతంలో కేంద్ర మంత్రిని కలిశారని వివరించారు. దీనిపై రాష్ట్ర అధికారులతో చర్చించి త్వరలోనే అనుమతులు మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు వివరించారు. మహబూబ్నగర్–జడ్చర్ల రోడ్డును నాలుగు లైన్ల రహదారిగా మార్చడంపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఇక సీఆర్ఎస్ కింద తెలంగాణకు రూ.వెయ్యి కోట్ల నిధులను విడుదల చేయాలని కోరినట్టు తెలిపారు. ‘మహా’గవర్నర్ విద్యాసాగర్రావును కలసిన తుమ్మల మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావును మంత్రి తుమ్మల మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న విద్యాసాగర్రావును కేజీ మార్గ్లోని మహారాష్ట్ర సదన్లో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఇరువురు చర్చించుకున్నారు. -
అభయ సీతారామ
సాక్షిప్రతినిధి, ఖమ్మం: సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో మరో ముందడుగేసింది. సాగునీటిపరంగా ఉమ్మడి జిల్లాకు వరప్రదాయనిగా భావిస్తున్న ప్రాజెక్టు విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చూపిన చొరవ ఫలితంగా అవసరమైన అటవీ అనుమతులకు రీజినల్ ఎంపవర్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చెన్నైలో శుక్రవారం పర్యావరణ, అటవీ అనుమతులపై రీజినల్ ఎంపవర్ కమిటీ సమావేశమైంది. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం వల్ల నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని, దీనికి పై అనుమతులు ఇవ్వాల్సిందిగా.. సీతారామ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ పూర్తి వివరాలతో కమిటీ ఎదుట పవర్పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. నిర్మాణాలు, కాల్వల తవ్వకం, పంప్హౌస్ల నిర్మాణం వంటి వివరాలను పూర్తిస్థాయిలో వివరించడంతోపాటు ప్రాజెక్టు నిర్మాణానికి మొదటి దశగా 1,531 హెక్టార్ల అటవీ భూమి అవసరమని, దీనికి ప్రత్యామ్నాయంగా కేంద్రానికి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల జిల్లాల్లో ప్రభుత్వ భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. భద్రాద్రి జిల్లాలోని పాల్వంచ, మణుగూరు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి అటవీ భూముల పరిధిలో ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ భూములు అవసరమని పేర్కొన్నారు. దీనిపై సంతృప్తి చెందిన రీజినల్ ఎంపవర్ కమిటీ ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ భూములు ఇచ్చేందుకు తమకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసి.. అటవీ అనుమతులు ఇవ్వాలని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్(ఎంఓఈఎఫ్) వారికి సిఫార్సు చేసింది. కమిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో కేంద్రం నుంచి అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది. భక్తరామదాసు రెండో దశ ప్రాజెక్టు ద్వారా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలానికి ఈనెల 12న సాగునీటిని విడుదల చేసిన మంత్రులు హరీష్రావు, తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా జరిగిన సభలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఒక కొలిక్కి వచ్చాయని.. ఇక తమ దృష్టి సీతారామ ప్రాజెక్టుపై సారిస్తామని, అటవీ పర్యావరణ అనుమతులు యుద్ధ ప్రాతిపదికన సాధిస్తామని ఘంటాపథంగా చెప్పారు. అనుమతుల అంశంపై సీఎం కేసీఆర్, మంత్రి హరీష్రావుతో తుమ్మల పలుమార్లు సమావేశం కావడం.. దీనిపై కేంద్రాన్ని ఒప్పించే బాధ్యతను సీఎం కేసీఆర్, మంత్రి హరీష్రావు తీసుకోవాలని తుమ్మల కోరడంతో ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మేరకు రాష్ట్రంలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల జిల్లాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి.. వాటిని కేంద్రానికి ఇవ్వడం ద్వారా ప్రత్యామ్నాయంగా అటవీ భూముల్లో ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరింది. ప్రాజెక్టుకు సంబంధించి మొదటి దశ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. పినపాక నియోజకవర్గం.. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలో గల దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.8వేల కోట్లు మంజూరు చేసింది. 115 కిలోమీటర్ల పరిధిలో పనులు చేపట్టేందుకు 8 ప్యాకేజీలుగా విభజించి ప్రభుత్వం టెండర్ ప్రక్రియను పూర్తి చేసింది. వీటిలో ఐదు ప్యాకేజీల్లో పనులు కొనసాగుతున్నాయి. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు, ములకలపల్లి మండలం పూసుగూడెం, కమలాపురం మండలాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పంప్హౌస్ల నిర్మాణం.. మరో రెండు ప్యాకేజీల్లో కాల్వల తవ్వకం చేపట్టారు. కాగా.. ఉమ్మడి జిల్లా రైతులకు ఉపయోగపడే సీతారామ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు త్వరితగతిన ఇవ్వాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరారు. వన్యప్రాణి బోర్డు అనుమతులపై దృష్టి.. సీతారామ సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ, అటవీ అనుమతులకు గ్రీన్సిగ్నల్ లభించగా.. ఇక కేంద్ర వన్యప్రాణి బోర్డు నుంచి అనుమతులపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఇందుకోసం హైదరాబాద్లో అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అధ్యక్షతన ఇటీవల రాష్ట్ర వన్యప్రాణి బోర్డు గవర్నర్ బాడీ సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రాష్ట్ర వన్యప్రాణి బోర్డు అనుమతించింది. వీటిని కేంద్ర వన్యప్రాణి మండలి అనుమతి కోసం నివేదించారు. ప్రాజెక్టు నిర్మాణానికి కిన్నెరసాని అభయారణ్యం ఎకో జోన్ నుంచి 442 హెక్టార్ల అటవీ ప్రాంతానికి వన్యప్రాణి మండలి అనుమతి తప్పనిసరిగా మారింది. దీంతో రాష్ట్రస్థాయి వన్యప్రాణి బోర్డులో అనుమతిస్తూ.. తుది అనుమతి కోసం కేంద్ర వన్యప్రాణి మండలికి ప్రతిపాదించారు. సీతారామ ప్రాజెక్టు పరిధిలో వన్యప్రాణి సంరక్షణ కోసం రూ.2.41కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వన్యప్రాణులు తిరిగేందుకు 12 అండర్ పాసెస్లను ప్రతిపాదిస్తున్నారు. ఎకో బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టనున్నారు. గడ్డి పెంపకం, సాసర్పిట్లు నిర్మించి వన్యప్రాణులకు నీటి వసతి కల్పించడం వంటి చర్యలు చేపట్టనున్నారు. -
అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
కూసుమంచి : ప్రజలకు ప్రభుత్వ పథకాలను వర్తింపజేయడం, గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం కూసుమంచి మండలంలో పర్యటించారు. పెరిక సింగారం గ్రామంలో రూ.9.80 కోట్లతో చేపట్టనున్న రహదారి విస్తరణకు, పెరికసింగారం, మల్లేపల్లి గ్రామాల్లో డబుల్బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలకు మంత్రి శంకుస్థానన చేశారు. కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. జక్కేపల్లి ఎస్సీ కాలనీలో రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ..ప్రజలకు ఇచ్చిన హామీ లన్నీ నెరవేరుస్తామన్నారు. అభివృద్ధి లక్ష్యంగానే ముందుకు సాగుతున్నామని, తమ కృషి లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జక్కేపల్లి కాలనీవాసులను మంత్రి సమస్యలు అడిగి తెలసుకు న్నారు. సీసీరోడ్లు, డ్రెయినేజీలు, విద్యుత్లైన్లు, శ్మశానంలో చేతిపంపులు కావాలని కోరగా వెంటనే సంబంధిత అధికారులను పిలిచి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీïబీ చైర్మన్ మువ్వా విజయ్బాబు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జెడ్పీ సీఈఓ మారుపాక నాగేష్, ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు వడ్త్యి రాంచంద్రునాయక్, సీడీసీ చైర్మన్ జూకూరి గోపాలరావు, ఆత్మకమిటీ చైర్మన్ మద్ది మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ బారి శ్రీనివాస్, సర్పంచ్లు అజ్మీర నాగమణి, బుర్రి నాగమణి, తాళ్లూరి రవి, ఎంపీటీసీ సభ్యులు బాణోతు వీరభద్ర మ్మ, జూకూరి విజయలక్ష్మి, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ విద్యాచందనతో పాటు పలుశాఖల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
'కార్పొరేటర్లను వదులుకునేందుకు సిద్ధం'
సాక్షి, ఖమ్మం: ఖమ్మం నగరపాలక సంస్థ కార్పొరేటర్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహానికి గురయ్యారు. పట్టణంలో కార్పొరేటర్లతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ల పనితీరుపై తుమ్మల అసహనం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లకు చెడ్డపేరు వస్తే ప్రభుత్వానికి చెడు పేరు వస్తుందన్నారు. ప్రజలకు మంచి పేరు తెచ్చేలా ప్రజా ప్రతినిధులు పని చేయాలన్నారు. ఖమ్మం కార్పొరేషన్ లో జరుగుతున్న అభివృద్ది సీఎం కేసీఆర్ సహా అందరూ మెచ్చుకుంటున్నారని తెలిపారు. ప్రజల దయతో గెలిచిన తాము ప్రజల కోసం పని చేయాలన్నారు. పద్దతి మార్చుకోని కార్పొరేటర్లు సహించేది లేదని హెచ్చరించారు. ఒకటి రెండు సీట్లను వదులుకోవడానికైనా తాము సిద్ధమన్నారు. ఖమ్మం ఎమ్మెల్యే సీటు వచ్చే ఎన్నికలలో భారీ మెజారిటీ తో గెలిపించాలన్నారు. ఎక్కడా గ్రూపులు ఉండవని అందరూ కేసీఆర్ మనుషులేనని స్పష్టం చేశారు. -
లోకేష్లా అడ్డదారిన అధికారంలోకి రాలేదు
కల్లూరు(ఖమ్మం): తెలంగాణలో టీడీపీ నేతలు ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారంటూ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లా కల్లూరు, టేకులపల్లిలో 220/132/33 కేవీ విద్యుత్ ఉప కేంద్రాలను, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగదీష్రెడ్డి మాట్లాడుతూ పక్క రాష్ట్రానికి ఏజెంట్లుగా పనిచేస్తున్న వారిని ప్రజలే తరిమికొడతారని చెప్పారు. కేసీఆర్ పిల్లలు లోకేష్ లాగా అడ్డదారిన అధికారంలోకి రాలేదు.. ఉద్యమం చేసి జైళ్లకు పోయి ప్రజాప్రతినిధులుగా గెలిచారని చెప్పారు. దేశ చరిత్రలో మెనిఫెస్టో అమలు చేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమే.. దీనిపై బహిరంగ చర్చకు సిద్దమా అని నిలదీశారు. కమ్యూనిస్టు ద్రోహి తమ్మినేని వీరభద్రం అంటూ వాళ్ల పార్టీ కూడా ప్రజల గురించి ఆలోచించలేదు.. వీరభద్రం పార్టీ బెంగాల్ను ఇరవయ్యేళ్లు పాలించినా ఇంకా జనం రోడ్ల మీదే ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆడబిడ్డకు కళ్యాణలక్ష్మి ద్వారా రూ.75 వేలు కట్నంగా కేసీఆర్ ఇస్తున్నారు అని జగదీష్రెడ్డి చెప్పారు. సత్తుపల్లికి ఏం కావాలన్నా చేస్తా: రాజకీయాలకు పనికి రాని వాళ్ళు మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయంటూ రైతులకు 24 గంటలు విద్యుత్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రణాళిక రూపొందిస్తున్నారన్నారు. భూసేకరణ చట్టానికి వారం రోజుల్లో సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేయించారన్నారు. తనను పాతికేళ్లు తల్లిలా మోసిన సత్తుపల్లి నియోజకవర్గానికి ఏం కావాలన్నా చేస్తానని తుమ్మల హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, జెడ్పీ చైర్ పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్మీనారాయణ, డీసీసీబి చైర్మన్ మువ్వా విజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా కేంద్రాల్లో కొత్త కలెక్టరేట్ భవనాలు
రూ.1,032 కోట్లతో నిర్మాణం: మంత్రి తుమ్మల సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సమీకృత జిల్లా పరిపాలన కార్యాలయ భవనాలను రూ.1,032 కోట్లతో నిర్మించనున్నట్లు రోడ్లు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. 21 కొత్త జిల్లా కేంద్రాలతోపాటు ఏడు పాత జిల్లా కేంద్రాల్లో వీటిని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త కలెక్టరేట్ భవనాలపై నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)లో రోడ్లు భవనాల శాఖ అధికారులతో మంగళవారం మంత్రి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్నగర్, వరంగల్ అర్బన్, ఆదిలాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, కొత్తగూడెం, కామారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రూ.388.50 కోట్లతో లక్షన్నర చదరపు అడుగుల వైశాల్యంలో.. వికారాబాద్, జనగామ, భువనగిరి, సిరిసిల్ల, నిర్మల్, సూర్యాపేట, మెదక్, నాగర్కర్నూలు, పెద్దపల్లి, వనపర్తి, జగిత్యాల, వరంగల్ రూరల్, మంచి ర్యాల, గద్వాల, ఆసిఫాబాద్, మహబూబాబాద్, భూపాలపల్లిల్లో రూ.525 కోట్లతో 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కలెక్టరేట్ భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. కొత్తగా ఏర్పడ్డ జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, డీఆర్ఓలు, ఇతర అధికారుల కోసం రూ.118.50 కోట్లతో భవనాలు నిర్మిస్తున్నామన్నారు. -
ప్రతి ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడీ కేంద్రం
జూన్లోగా చర్యలు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల ఆదేశం సాక్షి, హైదరాబాద్: ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ఈ మేరకు జూన్లోగా చర్యలు పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు. మంగళవారం న్యాక్ కార్యాలయంలో మహిళా, శిశు సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి తుమ్మల సమీక్షించారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడీ కేంద్రం ఉండాలని, ఇందుకు 2 గదులు కేటాయించాలన్నారు. ఇప్పటికే మంజూరై, నిర్మాణాలు పూర్తికాని అంగన్వాడీ కేంద్రాలను సమీప ప్రాథమిక పాఠశాలల్లో నిర్మించా లన్నారు. అవసరం లేని అంగన్వాడీ కేంద్రాలను గుర్తించాలని, ఇందుకు స్థానిక తహసీల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఆ శాఖ సంచాలకుడు విజయేందిరను ఆదేశించారు. మహిళా, శిశు సంక్షేమశాఖలోని ఖాళీలపై నివేదిక ఇవ్వాలని, వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో నిధులను తీసుకురావాలని, ఇందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. -
డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన తుమ్మల
ఖమ్మం: ఖమ్మం రూరల్ మండలంలోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దత్తత గ్రామమైన మద్దులపల్లిలో రూ.1.38 కోట్లతో నిర్మించిన 22 డబుల్ బెడ్రూం ఇళ్లను ఉగాది పర్వదినం సందర్భంగా బుధవారం ఉదయం ప్రారంభించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇళ్లను ప్రారంభించి సామూహిక గృహ ప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లోకేశ్కుమార్ పాల్గొన్నారు. కాగా సత్తుపల్లి నియోజకవర్గం లంకపల్లిలో కూడా 28 గృహాలను ఏప్రిల్ తొలివారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. -
రూ.14వేల కోట్లతో రోడ్లు, వంతెనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రూ.14వేల కోట్లతో పెద్ద ఎత్తున రహదారులు, వంతెనల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. బుధవారం శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొత్తం 9,900 కిలోమీటర్ల మేర రోడ్లు, 709 వంతెనలు నిర్మాణాన్ని చేపట్టామన్నారు. ఈ ఏడాది రూ.3,200 కోట్లతో 3,220 కి.మీ.రోడ్లు, 87 వంతెనలను పూర్తి చేశామన్నారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో పరిపాలన కార్యాలయ భవనాల కోసం 913 కోట్లను కేటాయించామన్నారు రాబోయే రెండేళ్లలో అన్ని రకాల రహదారులను పూర్తి చేస్తామన్నారు. ► రెండేళ్లలో ఎల్ఈడీ లైట్లు: జూపల్లి సాక్షి, హైదరాబాద్: మరో రెండేళ్లలో అన్ని గ్రామాల్లో ఎల్ఈడీ లైట్లను అమరుస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ పద్దుపై జరిగిన చర్చలో భాగంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. వరంగల్ జిల్లా గంగదేవిపల్లి, సిద్ధిపేట జిల్లా ఇబ్రహీం పూర్, హాజీపూర్ లాంటి ఆదర్శ గ్రామాలను ప్రజలు స్వయంగా తీర్చిదిద్దుకున్న తీరును అన్ని గ్రామాలు అనుసరించాలన్నారు. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌసల్ యోజన కింద 37,311 మంది యువతకు శిక్షణ ఇచ్చినట్టు వెల్లడించారు. 18,580 కిలోమీటర్ల మేర రూ. 4,636 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడుతున్నట్టు వెల్లడించారు. -
హైవేలను అనుసంధానిస్తూ ఓఆర్ఆర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాలకు కొత్తగా జాతీయ రహదారులు మంజూరైన నేపథ్యంలో వాటికి మరోవైపు రోడ్ల నిర్మాణం చేపట్టి ఔటర్ రింగు రోడ్లు (ఓఆర్ఆర్)గా తీర్చిదిద్దనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మంగళవారం శాసనసభలో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించారు. జాతీయ రహదారులతో అనుసంధానం చేయడం ద్వారా ప్రధాన పట్టణాలకు రింగు రోడ్లు సమకూరుతాయన్నారు. రూ.223.35 కోట్లతో చేపడుతున్న గజ్వేల్ రింగు రోడ్డు పనులు మొదలయ్యాయని, రూ.209 కోట్లతో చేపట్టనున్న ఖమ్మం రింగు రోడ్డు డీపీఆర్ సిద్ధమైం దని, రూ.96.70 కోట్లతో చేపట్టనున్న మహబూబ్నగర్ రింగురోడ్డు నిర్మాణ సంస్థ ఖరారైందని వెల్లడించారు. మహబూబ్నగర్కు మరోపక్క జాతీయ రహదారితో దీన్ని రింగు రోడ్డుగా మారుస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డికి సంబంధించి జాతీయ రహదారి మినహా శంకర్పల్లి–కంది మధ్య రాష్ట్ర నిధులతో పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. జనగామను కూడా అదే పద్ధతిలో అనుసంధానించనున్నట్లు తెలిపారు. -
విడతలవారీ కరెంటే నయం!
►నిరంతర విద్యుత్ వల్ల బావుల్లో నీరు అడుగంటుతోంది: తుమ్మల ► విడతలవారీగా అంటే సీఎం కేసీఆర్ ఒప్పుకోరు: మంత్రి జగదీశ్రెడ్డి సాక్షి, హైదరాబాద్: ‘తొమ్మిది గంటలు నిరంత రాయంగా కరెంటు ఇవ్వ డం వల్ల మా ప్రాంతంలో మెట్ట పంటలకు నష్టం జరుగుతోంది. అవసరానికి మించి నీళ్లు ఇవ్వడం వల్ల పామాయిల్ తోటల దిగు బడి కూడా తగ్గుతోంది. అందుకే మా ప్రాంత రైతుల కోరిక మేరకు తొమ్మిది గంటలు కాకుండా రెండు, మూడు విడతల్లో కరెంటు ఇవ్వాలని కోరుతున్నా..’ అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి స్పందిస్తూ సీఎం ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితుల్లో తొమ్మిది గంటలు నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వాల్సిందే. ఒకవేళ రైతులు గట్టిగా డిమాండ్ చేస్తే.. ఒకే ఫీడర్ కింద ఉన్న రెండు, మూడు గ్రామాల రైతులు, గ్రామ పంచాయతీలు తీర్మానం చేసి ఇస్తే విడతలవారీగా సరఫరాకు ఆలోచన చేస్తాం’ అని పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలోని మంత్రి ఈటల రాజేందర్ చాంబర్లో ఈ ఇద్దరు మంత్రుల మధ్య విద్యుత్ సరఫరాపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ మంత్రులు విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఆటోమేటిక్ స్టార్టర్ల వల్ల మోటార్లు పూర్తిగా ఆన్లోనే ఉంటున్నాయని, దీంతో అవసరానికి మించి నీటిని తోడేస్తున్నాయని, ఫలితంగా భూగర్భ జలమట్టం పడిపోతోందని తుమ్మల అన్నారు. తెలంగాణలోని చాలాప్రాంతాల్లో నిరంతర కరెంటు వల్ల బావుల్లో నీరు అడుగంటిపోతోందని, తిరిగి ఊరడానికి సమయం పడుతోందని, విడతల వారీగా కరెంటు ఇస్తే రైతు లకు వెసులుబాటు ఉంటుందని తుమ్మల నాగేశ్వర్రావు విశ్లేషించారు. విడతలవారీగా అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరని, అయినా, రైతులు చెబుతున్న సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళతామని జగదీశ్రెడ్డి అన్నారు. కరెంటు కోత పెట్టాల్సిన పరిస్థితులు తెలంగాణలో లేవని చెప్పారు. 2004 మార్చి నాటికి ఇప్పటికీ కరెంటు డిమాండ్ పెరిగినా, ఎలాంటి సమస్య తలెత్తలేదని, ఇక, ఇప్పుడు ఏపీ కరెంటు కూడా అవసరం లేదని, ఇతర ప్రాంతాల కంటే ఏపీ కరెంటు ధర ఎక్కువని అన్నారు. ఇప్పటికీ పది గంటలపాటు నిరంతరాయంగా కరెంటు ఇవ్వగలు గుతామని, వచ్చే ఏడాదయితే ఇరవై నాలుగు గంటలూ పవర్ ఇవ్వొచ్చని వారు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని మంత్రి జగదీశ్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
దయనీయంగా రైతుల పరిస్థితి
► కాంగ్రెస్ సభపై మంత్రి తుమ్మల వ్యాఖ్యలు సరికావు ► సీఎల్పీ ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్రెడ్డి ఖమ్మం: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సీఎల్పీ ఉపనాయకుడు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి ఆరోపించారు. మంగళవారం స్థానిక డీసీసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలేరులో జరిగిన సభ కాంగ్రెస్ ఆవేదనసభ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొనడం సరికాదన్నారు. మద్దతు ధర రాక రైతులు ఆందోళన చెందుతున్నారని, నాలుగో విడత రుణమాఫీ రాకపోవడంతో బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని, జిల్లాలో ఇప్పటి వరకు 60 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని సెంట్రల్ ఇంటిలిజెన్స్ అధికారులు నివేదిక ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్పై ఆరోపణలు చేస్తున్న మంత్రి తుమ్మల రైతులు ఆనందంగా ఉన్నారని ఎక్కడ చెప్పిం చినా ఏ శిక్షకైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. రైతు బడ్జెట్ను ప్రత్యేకంగా ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షు డు అయితం సత్యం, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బండి మణి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్నాయుడు, మైనారిటీ సెల్ నాయకులు ఎం.డి.పజల్, రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభం
⇒ రాష్ట్రంలో మొదటిది ప్రారంభించిన తుమ్మల ⇒ హాజరైన కడియం, చందూలాల్ పరకాల: రాష్ట్రంలో మొట్టమొదటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గురువారం వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశం తో ఈ క్యాంపు కార్యాలయాలను నిర్మించా రు. కార్యాలయ నిర్మాణానికి రూ.కోటి నిధులు మంజూరు చేయగా స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శ్రద్ధ తీసుకొని రూ.69 లక్షల ఖర్చుతో నివాసం, కార్యాలయ భవన పనులను ఐదు నెలల్లోనే పూర్తి చేయించారు. 2,800 గజాల స్థలంలోని 4,530 చదరపు అడుగుల్లో అధునాతన సౌకర్యాలతో భవనా న్ని రెండంతస్తుల్లో నిర్మించారు. కార్యక్ర మంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్పీకర్ సిరికొండ మదుసుదనాచారి, పర్యాటక, గిరిజన శాఖ మంత్రి అజ్మీరా చందులాల్ ప్రారంభించారు. ఈ సందర్భం గా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లా డుతూ పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనం బాగుందని కొనియా డారు. ఇలాంటి భవనాలనే రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణాలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాల యాలకు నిధులు మంజూరు చేశారని చెప్పారు. కార్యక్రమంలో ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్రావు, గొర్రెలు, మేకల పెంపకదారుల ఫెడరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్, ఎంపీలు పసునూరి దయాకర్, సీతారాంనాయక్, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర నిధులు పూర్తిస్థాయిలో రాబడదాం
‘మహిళాభివృద్ధి’ సమీక్షలో తుమ్మల సాక్షి, హైదరాబాద్: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు కేంద్రం నుంచి రావాల్సిన ప్రతీ పైసా రాబట్టేలా చర్యలు తీసుకో వాలని మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదే శించారు. నిధుల విడుదలలో జాప్యం జరిగితే ఢిల్లీ వెళ్లి అక్కడి అధికారులపై ఒత్తిడి తీసుకు రావాలని సూచించారు. శుక్రవారం తన చాంబర్లో మహిళాభి వృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్, కమిషనర్ విజయేందిర తదిత రులతో ఆయన సమావేశం నిర్వ హించారు. కేంద్ర బడ్జెట్కు అనుగుణంగా మహి ళాభివృద్ధి శాఖ బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాలని, ఈమేరకు కేంద్ర గణాంకాలను విశ్లేశించి ప్రణాళిక తయారు చేయాలని తుమ్మల సూచించారు. మహి ళా శక్తి కేంద్రాలు, తల్లుల పౌష్టికాహారం, క్రెచ్ పథకం, బేటీ బచావో’–బేటీ పడావో, మహిళల భద్రతకు కేంద్రం ప్రాధాన్యం ఇచ్చిందని, వీటిద్వారా రాష్ట్రానికి సుమారు రూ.వెయ్యి కోట్లు వచ్చే అవకాశముందని అన్నారు. -
ఘనంగా రామదాసు జయంత్యుత్సవాలు
భద్రాచలం/నేలకొండపలి: శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో భక్త రామదాసు 384వ జయంత్యుత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో తాళ్లూరి రమేశ్బాబు, శ్రీ చక్ర సిమెంట్ అధినేత నేండ్ర గంటి కృష్ణమోహన్, సంగీత విద్వాంసుడు మల్లాది సూరిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. మరోవైపు యాదగిరిగుట్ట (యాదాద్రి) తరహాలోనే భద్రాద్రి అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నేలకొండపల్లిలోని భక్తరామదాసు ధ్యాన మందిరంలో మూడు రోజుల పాటు జరగనున్న రామదాసు జయంత్యుత్సవాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. -
శాసనమండలి ప్రశ్నోత్తరాలు...
ప్రశ్నోత్తరాల సమయాన్ని వృథా చేయొద్దు మండలి చైర్మన్ స్వామిగౌడ్ సాక్షి. హైదరాబాద్: శుక్రవారం శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా తొలుత ప్రశ్నోత్తరాల సమయంలో మరే ఇతర అంశంపై చర్చకు ఆస్కారం లేదని మండలి చైర్మన్ స్వామిగౌడ్ స్పష్టంచేశారు. సమయాన్ని ఏ మాత్రం వృథా చేయొద్దని, అనుకున్న సమయంలో ప్రశ్నోత్తరాలు పూర్తి చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే గంటా ఇరవై నిముషాల వ్యవధిలోనే ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఆయా అంశాలపై అధికార, విపక్ష సభ్యులు వేసిన ప్రశ్నలపై మంత్రులు సమాధానాలిచ్చారు. అవి సంక్షిప్తంగా... వచ్చే జూన్ నాటికి డిజిటల్ క్లాసులు: కడియం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హైస్కూళ్లు, రెసిడెన్షియల్, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో వచ్చే జూన్ (2017) నాటికి డిజిటల్ క్లాసులను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. అలాగే ప్రైమరీ స్కూళ్లలోనే అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి, అంగన్వాడీలు, ప్రీప్రైమరీలను జోడించి వాటి ద్వారా ఎన్రోల్మెంట్ పెంచేందుకు చర్యలు చేపట్టాలనే ఆలోచనతో ఆయన తెలిపారు. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనంపై పరిశీలన.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని కడియం శ్రీహరి తెలిపారు. అన్ని అంశాలను పరిశీలించి ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్నారు. రైతుల దశ మారుతుంది: పోచారం స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం కేంద్రం పంటలకు ధరలు కల్పిస్తేనే రైతుల భవిష్యత్ మారుతుందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరకు అనుగుణంగానే రాష్ట్రంలో చెల్లిస్తున్నామన్నారు. ఈ ధరను నిర్ణయించే అధికారం రాష్ట్రానికి లేదని చెప్పారు. ఎలాంటి మార్పు ఉండదు: జూపల్లి ఎన్నికైన జిల్లా పరిషత్ల కాలపరిమితి ముగిసే వరకు కొత్తగా ఏర్పడిన జిల్లాలకు అనుగుణంగా కొత్త జిల్లా పరిషత్లను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని పంచాయతీరాజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొత్తగా జిల్లాల విభజన జరిగినా గతంలోని పాత జిల్లా పరిషత్ల పరిధిలోకే ఆ జిల్లాలు కూడా వస్తాయని, విధులు, నిధులు, ఇతర విషయాల్లోనూ ఎలాంటి మార్పు లేదని స్పష్టంచేశారు. అనుకున్న విధంగా భద్రాద్రి ప్లాంట్: జగదీశ్రెడ్డి భద్రాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ను అనుకున్న విధంగా పూర్తిచేసి 2017–18లో ఉత్పత్తి దశకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. ఈ విద్యుత్ ప్లాంట్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వృద్ధాశ్రమాల ఏర్పాటుకు యత్నం: తుమ్మల వృద్ధాశ్రమాలు లేని జిల్లాల్లో వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని రోడ్లు, భవనాలు, మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు. తండాల అభివృద్ధి బోర్డు ప్రతిపాదన లేదు ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ గిరిజన తండాల అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. దీనిని సీఎం దృష్టికి తీసుకెళతానని చెప్పారు. -
15నుంచి ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు
హైదరాబాద్: హైటెక్స్లో ఈనెల 15వ తేదీ నుంచి ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు నిర్వహించనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నిర్మాణంలో నూతన పద్ధతులు, పర్యావరణం, రోడ్ల భద్రత, ప్రమాదాల నివారణపై ఈ సదస్సులో చర్చిస్తామన్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దేశ, విదేశీ ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. కాగా, 338 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం ఆమోదం తెలిపిందని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
మంత్రి పర్యటనకు గైర్హాజరు.. అధికారిని సస్పెండ్
అశ్వరావుపేట(ఖమ్మం): రాష్ట్ర మంత్రి పర్యటనకు హాజరుకాని ప్రభుత్వ అధికారినిపై సస్పెన్షన్ వేటు పడింది. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలంలో శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పర్యటించారు. ఈ పర్యటనకు ఐసీడీఎస్ సీడీపీఓగా విధులు నిర్వహిస్తున్న అన్నపూర్ణ అనే ఉద్యోగిని గైర్హాజరయ్యారు. దీంతో ఆగ్రహించిన మంత్రి సీడీపీఓను సస్పెండ్ చేయాలని కలెక్టర్ రాజీవ్కు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అర్థరాత్రి మంత్రి, మేయర్ తనిఖీలు
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగుతున్న రోడ్డు పనులను ఆర్అండ్బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మేయర్ బొంతు రామ్మోహన్ శుక్రవారం అర్థరాత్రి స్వయంగా పరిశీలించారు. కూకట్పల్లి వైజంక్షన్ నుంచి మియాపూర్ వరకు వేస్తున్న తారు రోడ్డు పనుల్లో నాణ్యతను వారు తనిఖీలు చేశారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని జాతీయ రహదారి అభివృద్ధికి రూ.28 కోట్లను కేటాయించినట్లు తెలిపారు.