
ఎంసెట్ లీక్ పై ఆధారాలున్నాయి: రేవంత్రెడ్డి
ప్రభుత్వంలో అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి.. మంత్రుల మీద, అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఈ నిర్వాకానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఫిర్యాదులు అందినా మంత్రి కడియం, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి స్పందించకపోవడమే లీకేజీ వెనుక సీఎం కుటుంబ సభ్యుల హస్తం ఉందనడానికి నిదర్శనమన్నారు. విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగిస్తేనే దోషులు తేలుతార న్నారు. లీకేజీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంత్రి లక్ష్మారెడ్డిపైన విచారణ జరపాలన్నారు.