చేప పిల్లల స్కామ్‌పై విచారణ జరపాలి | Mallu ravi demand enquiry on Nursery scam | Sakshi
Sakshi News home page

చేప పిల్లల స్కామ్‌పై విచారణ జరపాలి

Published Tue, Jan 31 2017 3:25 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

చేప పిల్లల స్కామ్‌పై విచారణ జరపాలి - Sakshi

చేప పిల్లల స్కామ్‌పై విచారణ జరపాలి

టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి
సాక్షి, హైదరాబాద్‌: చెరువులలో చేపపిల్లలు వేసే పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, ఈ స్కామ్‌పై ప్రత్యేక విచారణ జరిపించాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్‌ చేశారు. గాంధీభన్ న్లో సోమవారం ఆయన మాట్లాడుతూ తక్కువ చేపపిల్లలు వేసి, ఎక్కువ లెక్కలు చూపించడం ద్వారా కాంట్రాక్టర్లు, అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేశారు.

వ్యవసాయ రంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్లక్ష్యం వల్లనే రైతులు సంక్షోభంలో కూరుకుపోయారని,  యాసంగి పంట కాలంలో సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయిందన్నారు. కరువు నివారణ చర్యలు చేపట్టకపోవడం, రైతు వ్యతిరేక విధానాలతో సీఎం కేసీఆర్‌ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తున్నారని మల్లు రవి ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement