విజయపురి కాలనీ రోడ్ నెంబర్-2లో ప్రశాంతి(24) అనే వివాహిత ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది.
చైతన్యపురి పరిధిలోని విజయపురి కాలనీ రోడ్ నెంబర్-2లో ప్రశాంతి(24) అనే వివాహిత తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.