ఓయూసెట్-2016 నోటిఫికేషన్ను ఓయూ పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ గోపాల్రెడ్డి సోమవారం విడుదల చేశారు.
హైదరాబాద్ : ఓయూసెట్-2016 నోటిఫికేషన్ను ఓయూ పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ గోపాల్రెడ్డి సోమవారం విడుదల చేశారు. అభ్యర్థులు ఏప్రిల్ 13 నుంచి మే 7 వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఓయూతో పాటు తెలంగాణ వర్సిటీ, పాలమూరు, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల్లోని క్యాంపస్ కళాశాలలు, అనుబంధ, ప్రైవేటు పీజీ కాలేజీల్లో 2016-17 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంసీజే, ఎంఎల్ఐసీ, ఐదేళ్ల పీజీ కోర్సులు, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.