
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రత లు పడిపోతున్నా యి. దీంతో చలి తీవ్రత మరింత పెరిగింది. గత 24 గంటల్లో ఆదిలాబాద్లో 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్లో సాధారణం కంటే 6 డిగ్రీలు తక్కువగా 8 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత రికార్డు అయింది. భద్రాచలంలో ఏకంగా 8 డిగ్రీలు తక్కువగా 9 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మంలో 7 డిగ్రీలు తక్కువగా, రామగుండంలో 5 డిగ్రీలు తక్కువగా 10 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హన్మకొండ, హైదరాబాద్, నిజామాబాద్లలో 12 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. హకీంపేట, నల్లగొండల్లో 13 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబ్నగర్లో 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు పూర్వ ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో తీవ్ర చలిగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.