
నిర్బంధానికి పరాకాష్ట
శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ను తెల్లవారుజామున అరెస్టు
మెడికల్ కాలేజీపై ఎలాంటి హామీ ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రగతి భవన్లో, ఫాంహౌజ్లో గడుపుతూ ప్రజల మధ్యకు రావడానికి భయపడుతున్నారని దుయ్యబట్టారు. సిరిసిల్లలో దళితులపై పోలీసులతో థర్డ్ డిగ్రీని ప్రయోగించి చిత్రహింసలకు గురిచేసిన మంత్రి కేటీఆర్ ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. బాధిత దళితులను దొంగచాటుగా వేములవాడలో పరామర్శించి నక్క వినయాలు ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.