ఆ గుండెల్లో నువ్వు పదిలం | You are permanent in there hearts | Sakshi
Sakshi News home page

ఆ గుండెల్లో నువ్వు పదిలం

Published Fri, Sep 2 2016 2:25 AM | Last Updated on Mon, Aug 20 2018 4:17 PM

ఆ గుండెల్లో నువ్వు పదిలం - Sakshi

ఆ గుండెల్లో నువ్వు పదిలం

సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ.. ఈ మాట వినగానే మొదట గుర్తొచ్చే పేరు వైఎస్సార్! ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని నిరుపేదల ముంగిట నిలిపిన ఈ పథకం లక్షలాది మంది బతుకుల్లో వెలుగులు నింపింది. ఆరిపోతున్న జీవితాలకు ఆయువు పోసింది. గుండెకు పడిన చిల్లులను ఉచితంగా పూడ్చింది. 2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ కింద ఇప్పటివరకు తెలంగాణలో 14.72 లక్షల మంది పేదలకు శస్త్రచికిత్సలు చేశారు. అందుకు వైఎస్ హయాం నుంచి ఇప్పటివరకు రూ.3,858 కోట్లు ఖర్చు చేశారు. పథకం ప్రారంభమైన 2007-08లో తెలంగాణలో 7,105 మందికి శస్త్రచికిత్సలు చేశారు.

అందుకు నాటి ప్రభుత్వం రూ.31.12 కోట్లు ఖర్చు చేసింది. 2008-09 నుంచి పథకం పేదలకు మరింత దగ్గరైంది. ఆపరేషన్ల సంఖ్య పెరిగింది. 2008-09లో ఏకంగా 86,287 శస్త్రచికిత్సలు నిర్వహించారు. అందుకు వైఎస్ ప్రభుత్వం రూ.261.15 కోట్లు వెచ్చించింది. 2009-10లో ఆపరేషన్ల సంఖ్య 1.29 లక్షలకు చేరింది. తెలంగాణ ఏర్పడ్డాక 2014-15లో 2.36 లక్షల మందికి, 2015-16లో 2.60 లక్షల మందికి ఆపరేషన్లు నిర్వహించారు. ఈ పథకం కింద గుండె, ఊపిరితిత్తులు, కాలేయం వంటి అవయవ మార్పిడులను కూడా చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. క్యాన్సర్‌లో కీలమైన నాలుగు శస్త్రచికిత్సలకు కూడా అవకాశం కల్పించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement