సిరియాలో మరోసారి హింస రాజుకుంది. గురువారం జరిగిన పేలుళ్లలో 19 మంది మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సిరియా మధ్య రాష్ట్రం హామ్స్లో జబురిన్, అక్రాద్ అల్-డఫ్నీ పట్టణాల మధ్య రోడ్డుపై పేలుడు పదార్థాలను అమర్చి రెండు బస్సులు, ఓ కారును పేల్చివేశారు. ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థ ఒకటి ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ దుర్ఘటనకు కారకులు ఎవరన్న విషయం తెలియరాలేదు. రెణ్నెళ్ల కిత్రం సిరియా దళాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశించాయి. తిరుగుబాటు దారుల కీలక స్థావరాల్ని స్వాధీనం చేసుకున్నాయి.
సిరియాలో పేలుళ్లు: 19 మంది మృతి
Published Thu, Sep 19 2013 5:05 PM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM
Advertisement
Advertisement