రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు పేలి 6గురు మృతి | 8 killed as WW II bomb explodes | Sakshi
Sakshi News home page

రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు పేలి 6గురు మృతి

Published Wed, Apr 2 2014 3:46 PM | Last Updated on Sat, Sep 2 2017 5:29 AM

8 killed as WW II bomb explodes

70 ఏళ్ల క్రితం విసిరిన బాంబు అది. ఇన్నేళ్ల తరువాత పేలింది. థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో రెండో ప్రపంచ యుద్ధం నాటి నుంచి పేలకుండా ఉన్న ఒక బాంబు బుధవారం పేలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. మరో 18 మంది గాయపడ్డారు.


బ్యాంకాక్ లో ఒక ఇంటిని నిర్మాణం చేస్తూండగా ఈ భారీ బాంబు దొరికింది. ఆ స్థలం యజమాని దీన్ని పాత సామాన్ల వ్యాపారికి అమ్మేశాడు. ఆ వ్యాపారి దీన్ని తన గోడౌన్ లోకి తీసుకువెళ్లి, తెరిచేందుకు ప్రయత్నించాడు. దానికోసం గ్యాస్ కట్టర్ ని ఉపయోగించాడు. అంతే  ... ఆ బాంబు హఠాత్తుగా పేలింది. ఈ సంఘటనలో భారీ నష్టం సంభవించింది. పరిసరాల్లో ఉన్న ఇతర భవనాలు కూడా పగుళ్లు చూపాయి.


'ఇన్నేళ్లయిపోయింది కదా.. ఈ బాంబు పేలుతుందని అనుకోలేదు.' అన్నాడు తుక్కు కంపెనీ యజమాని.


రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబులు, ఆయుధాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా దొరుకుతూ ఉంటాయి. రెండేళ్ల క్రితం జర్మనీకి చెందిన ఒక టన్ను బరువున్న పేలని బాంబు ఫ్రాన్స్ అడవుల్లో దొరికింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement