
న్యూయార్క్ : అమెరికాలో ఓ తెలుగు మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ సంఘటన నార్త్ కరోలినాలో ఆదివారం చోటుచేసుకుంది. గజం వనిత(38) అత్తింటి వేధింపులు తాళలేక కొంతకాలంగా హైదరాబాద్లోని నాగోల్ సాయినగర్లో నివాసముంటున్న తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. అయితే జులై నెలలో నార్త్ కరోలినాలోని భర్త వద్దకు తిరిగివెళ్లిపోయింది. ఆ తర్వాత 2 నెలలనుంచి తల్లిదండ్రులతో కాంటాక్ట్లోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం వనిత తల్లిదండ్రులకు ఆమె సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం అందింది.
అత్తింటి వేధింపులు భరించలేకే వనిత మృతి చెందినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావాలంటూ వేడుకుంటున్నారు. ఘటన జరిగిన అనంతరం ఆమె భర్త రాచకొండ శివకుమార్ను అదుపులోకి తీసుకున్న కరోలినా పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment