ఇండో-పాక్ జాతీయ భద్రతా సలహాదారుల భేటీ | india-pak National security consultant meet at bangkok | Sakshi
Sakshi News home page

ఇండో-పాక్ జాతీయ భద్రతా సలహాదారుల భేటీ

Published Sun, Dec 6 2015 7:08 PM | Last Updated on Sun, Sep 3 2017 1:36 PM

ఇండో-పాక్ జాతీయ భద్రతా సలహాదారుల భేటీ

ఇండో-పాక్ జాతీయ భద్రతా సలహాదారుల భేటీ

ఇండియా, పాకిస్థాన్ దేశాల మధ్య జాతీయ భద్రతా సలహాదార్ల కీలక భేటీ ఆదివారం బ్యాంకాక్లో జరిగింది.

బ్యాంకాక్: భారత్, పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదార్ల కీలక సమావేశం ఆదివారం బ్యాంకాక్లో జరిగింది. దాదాపు నాలుగు గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రెండు దేశాలకు సంబంధించిన కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా టెర్రరిస్టుల కార్యకలపాలు, జమ్ము కశ్మీర్, శాంతి-భద్రతల సమస్యలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇండియా, పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదార్లు అజిత్ దోవల్, నసీర్ జంజ్వా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

గత వారం పారిస్ పర్యటనలో ఇరు దేశాల ప్రధానులు మోదీ, నవాజ్ షరీఫ్ కలసిన సంగతి తెలిసిందే. ఈ భేటీ అనంతరం ఇరు దేశాల జాతీయ భద్రత సలహాదారుల సమావేశం జరిగింది. వీరిద్దరూ మరోసారి భేటీ అయ్యే అవకాశముంది. భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మంగళవారం పాక్లో పర్యటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.  ఈ సమావేశాలను స్వాగతిస్తామని జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement