టర్కీ బయల్దేరిన ప్రధాని మోదీ | Narendra modi leaves for turkey | Sakshi
Sakshi News home page

టర్కీ బయల్దేరిన ప్రధాని మోదీ

Published Sat, Nov 14 2015 8:29 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

Narendra modi leaves for turkey

లండన్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల బ్రిటన్ పర్యటన ముగించుకుని టర్కీ బయల్దేరారు. టర్కీ రాజధాని అంకారాలో జరగబోయే 20 సదస్సులో ఆయన పాల్గొంటారు.  రెండు దేశాలతో ధ్వైపాక్షిక సంబంధాల పటిష్టత కోసం చర్చలు జరుపనున్నట్టు సమాచారం.

 

కాగా బ్రిటన్‌లో పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ,  బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్‌తో లంచ్, వాంబ్లే స్టేడియంలో ఎన్నారైలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించిన విషయం తెలిసిందే.  ఇక మూడోరోజు మోదీ జాగ్వర్‌ లాండ్‌రోవర్‌ ప్లాంట్‌ను సందర్శించారు. అనంతరం ఆయన టర్కీకి బయల్దేరారు. ఈ నెల 16వ తేదీ వరకూ మోదీ విదేశీ పర్యటన కొనసాగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement