
లండన్ : కరోనా మహమ్మారి సెగ బ్రిటన్ రాజకుటుంబాన్ని తాకింది. ప్రిన్స్ చార్లెస్(71)కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ప్రిన్స్ చార్లెస్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన స్కాట్ల్యాండ్లోని తన నివాసంలో స్వీయ నిర్భందంలో ఉన్నారని క్లారెన్స్ హౌస్ అధికార ప్రతినిధి తెలిపారు. కాగా, చార్లెస్ భార్య కమిల్లాకు కరోనా నెగటివ్ వచ్చిందన్నారు. మరోవైపు బ్రిటన్లో ఇప్పటివరకు 8077 కేసులు నమోదు కాగా.. 422 మంది మృత్యువాతపడ్డారు.