భయంతో.. తమను తాము పేల్చుకున్నారు ! | Terrorists suicide blast himself in Bangladesh | Sakshi
Sakshi News home page

భయంతో.. తమను తాము పేల్చుకున్నారు !

Published Tue, Nov 28 2017 5:01 PM | Last Updated on Tue, Nov 6 2018 8:35 PM

Terrorists suicide blast himself in Bangladesh  - Sakshi

ఢాకా(బంగ్లాదేశ్‌): భద్రతా సిబ్బంది చుట్టుముట్టారని తీవ్రవాదులు తమని తాము పేల్చేసుకున్నారు. భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో ఉన్న చపాయినవాబ్‌జంగ్‌ జిల్లాలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 30వ తేదీ నుంచి డిసెంబర్‌ 2వ తేదీ వరకు దేశంలో పోప్‌ ప్రాన్సిస్‌ పర్యటన నేపథ్యంలో భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ గాలింపు చర్యలో భాగంగా ఒక గుడిసెను చుట్టుముట్టారు.

భద్రతా సిబ్బంది హెచ్చరిచటంతో: లోపల ఉన్న వారిని లొంగిపోవాలని భద్రతా సిబ్బంది హెచ్చరించారు. గుడిసెలో ఉన్న వారు తమను తాము పేల్చేసుకున్నారు. ఫలితంగా గుడిసెతోపాటు ముగ్గురు వ్యక్తులు కాలి బూడిదయ్యారు. భారత సరిహద్దుల్లో పద్మానది ఒడ్డున ఈ ప్రాంతానికి ఈ ముగ్గురూ పదిహేను రోజుల క్రితం వచ్చారని.. పక్షులపై పరిశోధనలు చేస్తున్నట్లు పరిచయం చేసుకున్నారని స్థానికులు తెలిపారు.

ఉగ్రవాదుల సమాచారం: ఇది వరకూ దొరికిపోయిన ఉగ్రవాదులు అందించిన సమాచారం ఆధారంగా తీవ్రవాదుల స్థావరాన్ని గుర్తించినట్లు భద్రతా అధికారులు తెలిపారు. ఆ ప్రాంతం నుంచి రెండు పిస్టళ్లు, మూడు గ్రెనేడ్లు, 8 డిటొనేటర్లు, పేలుడు సామాగ్రి తయారీలో వాడే పదార్థాలు పెద్ద మొత్తంలో లభించాయి. ఈ ఘటనకు సంబంధించి భవన యజమాని భార్య నజ్మా బేగం, ఆమె తల్లి మినారా బేగం, తండ్రి, ఖుర్షీద్‌లను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement