యశ్‌ చోప్రా అవార్డు అందుకున్న ఆశా | Asha Bhosle honoured with Yash Chopra Memorial award | Sakshi
Sakshi News home page

యశ్‌ చోప్రా అవార్డు అందుకున్న ఆశా

Feb 18 2018 12:45 AM | Updated on Feb 18 2018 12:45 AM

Asha Bhosle honoured with Yash Chopra Memorial award - Sakshi

ఆశా భోంస్లే, విద్యాసాగర్‌ రావు, టి.సుబ్బ్బరామిరెడ్డి, రేఖ

లెజండరీ సింగర్‌ ఆశా భోంస్లేకు ప్రతిష్టాత్మక యశ్‌ చోప్రా మెమోరియల్‌ అవార్డును టి.సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్‌ శుక్రవారం ముంబైలో ప్రదానం చేసింది. ఏడు దశాబ్దాల సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో ఆశా భోంస్లే 20 భాషల్లో దాదాపుగా 11వేల పాటలు పాడి ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఆమెకు యశ్‌ చోప్రా అవార్డు ప్రదానం చేయడం ఆనందంగా ఉందన్నారు టీయస్సార్‌.

ఈ కార్యక్రమంలో టి. సుబ్బరామిరెడ్డి, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు, నటి జయప్రద, బాలీవుడ్‌ నటి రేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశా భోంస్లేకు రేఖ అభినందనలు తెలిపి, పాదాభివందనం చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. 2012లో చనిపోయిన యశ్‌ చోప్రా జ్ఙాపకార్థం టి. సుబ్బరామిరెడ్డి, అను రంజన్, శశి రంజన్‌లు నెలకొల్పిన ఈ అవార్డును ఇదివరకు లతా మంగేష్కర్, అమితాబ్‌ బచ్చన్, రేఖ, షారుక్‌ ఖాన్‌ అందుకున్నారు. ఈ అవార్డుతో పాటు 10 లక్షల నగదు కూడా అందజేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement