
ప్రేమ జల్లులు...
జీవా, త్రిష జంటగా ఐ అహ్మద్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘ఎండ్రెండ్రుమ్ పున్నగై’.
జీవా, త్రిష జంటగా ఐ అహ్మద్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘ఎండ్రెండ్రుమ్ పున్నగై’. ఈ చిత్రం ‘చిరునవ్వుల చిరుజల్లు’గా తెలుగులో విడుదల కానుంది. ఈ సందర్భంగా అనువాద నిర్మాత జాని మాట్లాడుతూ -‘‘ఇదొక అందమైన ప్రేమకథ. తమిళంలో అఖండ విజయం సాధించిందీ సినిమా. జీవా నటన, త్రిష, ఆండ్రియా అందచందాలు, మది ఛాయాగ్రహణం, హ్యారిస్ జైరాజ్ సంగీతం, సంతానం కామెడీ ఈ చిత్రానికి ప్రధాన బలాలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెల 21న సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: మాస్టర్ ఎం.డి రౌత్, నిర్మాణం: ఆర్.ఎ.ఆర్ట్ ప్రొడక్షన్స్.