Jeeva
-
పూర్వీకుల ఆత్మల్ని కలుసుకున్నారా..? 'అగత్యా' హారర్ ట్రైలర్
ఫాంటసీ హారర్ చిత్రం ‘అగత్యా’(Aghathiyaa) నుంచి అదిరిపోయే ట్రైలర్ విడుదలైంది. జీవా(jeeva), అర్జున్ సర్జా(arjun sarja) హీరోలుగా, రాశీ ఖన్నా హీరోయిన్గా నటించిన పాన్ ఇండియా మూవీని ప్రముఖ గీత రచయిత పా.విజయ్ దర్శకత్వం వహించారు. డా.ఇషారి కె.గణేశ్, అనీశ్ అర్జున్దేవ్ నిర్మాతలు. ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఫిబ్రవరి 28న విడుదల కానుంది.‘అగత్యా’ నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్ను చాలా ఆసక్తిగా కట్ చేశారు. సుమారు 120 సంవత్సరాల కిందట బతికిన ఆత్మలని మీరు ఇప్పుడు కలుసుకోబోతున్నారంటూ మొదలైన ట్రైలర్ చివరి వరకు ఎంగేజ్ చేస్తుంది. వందల ఏళ్ల కిందటి కథతో ప్రస్తుత జనరేషన్లోని ఓ యువ జంటకు మధ్య సంబంధం ఏమిటనేది దర్శకుడు చూపించనున్నాడు. గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో రూపొందిన ఈ చిత్రం మన సంస్కృతి, అనుబంధాలను దర్శకుడు బలంగా చెప్పారు. అద్భుతమైన సీజీ వర్క్తో భారీ బడ్జెట్తో నిర్మించారు. సినిమాపై మంచి అంచనాలు పెట్టుకునేలా ట్రైలర్ ఉంది. -
డేట్ చేంజ్
జీవా(jeeva), అర్జున్ సర్జా(arjun sarja) హీరోలుగా, రాశీ ఖన్నా హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘అగత్యా’(agatya). ప్రముఖ పాటల రచయిత పా. విజయ్ కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మించిన ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నేడు విడుదల కావాల్సింది.అయితే జనవరి 31 నుంచి ఫిబ్రవరి 28కి విడుదలని వాయిదా వేసినట్లు ప్రకటించారు మేకర్స్. ‘‘గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో రూపొందిన చిత్రం ‘అగత్యా’. మన సంస్కృతి, అనుబంధాలను దర్శకుడు బలంగా చెప్పారు. అద్భుతమైన సీజీ వర్క్తో భారీ బడ్జెట్తో తెరకెక్కింది. వీఎఫ్ఎక్స్ కోసం మరికొంత టైమ్ కేటాయించాలని భావించి, విడుదల వాయిదా వేశాం’’ అని యూనిట్ పేర్కొంది. -
'జీవా, అర్జున్' థ్రిల్లర్ సినిమా.. అదిరిపోయే సాంగ్ రిలీజ్
కోలీవుడ్ నటుడు జీవా, అర్జున్ సర్జా నటిస్తున్న తాజా చిత్రం అగత్యా నుంచి రెండో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో ఈ చిత్రం రానుంది. జీవా నటించిన గత చిత్రం బ్లాక్ కూడా మంచి విజయం అందుకుంది. ఇప్పుడు అగత్యా అనే సినిమాతో తమిళం, తెలుగు, హిందీ ప్రేక్షకులను ఆయన పలకరించనున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి 'నేలమ్మ తల్లి' అంటూ సాగే పాట విడుదలైంది. అయితే, ఈ సాంగ్లో యాక్షన్ కింగ్ అర్జున్ను హైలెట్ చేస్తూ ఉంది.వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్న ఈచిత్రానికి ప్రముఖ గీత రచయిత పా.విజయ్ కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇందులో నటి రాశీఖన్నా నాయకిగా నటించగా యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది అద్భుతమైన సీజీ వర్క్తో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ కథా చిత్రం అని నిర్మాత ఐసరి గణేష్ ఇప్పటికే పేర్కొన్నారు. ఇందులో మన సంస్కృతి, మానవ అనుబంధాలు ఉంటాయని చెప్పారు. (ఇదీ చదవండి: విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వ్యాఖ్యలు.. యూట్యూబర్స్పై కేసు నమోదు)మార్వెల్ చిత్రాల తరహాలో ఒక కొత్త ప్రపంచాన్ని సష్టించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించాలన్నదే తమ భావన అన్నారు. ఆ విధంగా వెర్సెస్ డెవిల్స్ అనే ఇతివత్తంతో రూపొందించిన చిత్రం ఇదన్నారు. అవేంజర్స్ తరహాలో ప్రేక్షకులను వేరే ప్రపంచానికి తీసుకెళ్లే ఊహాత్మక కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. అనీష్ అర్జున్ దేవ్కు చెందిన వామ్ ఇండియా సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించినట్లు చెప్పారు. -
సీక్రెట్ సాంటాతో టాప్ హీరోయిన్ బెస్ట్ క్రిస్మస్.. (ఫోటోలు)
-
సజీవ సమాధికి స్వామీజీ యత్నం
మద్దూరు: ఓ స్వామీజీ ఐదురోజులు సమాధికి ప్రయత్నించగా.. విషయం తెలుసుకున్న పోలీసులు నిలువరించారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రెనివట్లలో ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. రెనివట్ల గ్రామానికి చెందిన సత్యానందస్వామి అలియాస్ హనుమంతు కొద్దిరోజులుగా వీరబ్రహ్మేంద్రస్వామి భక్తుడిగా చెలామణి అవుతున్నాడు. ఈయన భార్య ఏడాది క్రితం పొలంలో ఎద్దు పొడవడంతో మృతిచెందింది. దీంతో ఆమెకు పొలంలోనే సమాధి కట్టించి పూజిస్తున్నాడు.అక్కడే ఆశ్రమం ఏర్పాటు చేసుకొని కొంతమందిని శిష్యులుగా చేసుకున్నాడు. శుక్రవారం అమావాస్య రోజున ‘తాను ఐదు రోజులు సమాధిలోకి వెళతానని.. బయట అఖండభజనలు చేయాలని’ భక్తులకు చెప్పి సమాధిలోకి వెళ్లాడు. ఆదివారం ఉదయం విషయం పోలీసులకు తెలియడంతో డీఎస్పీ లింగయ్య ఆధ్వర్యంలో అక్కడకు చేరుకొని సమాధిలో ఉన్న స్వామీజీని బయటకు రప్పించారు. అనంతరం డాక్టర్ స్వామీజీకి వైద్య పరీక్షలు చేయగా, ఆర్యోగం నిలకడగా ఉంది. కొన్నేళ్ల క్రితం స్వగృహంలోనే ఒక అమావాస్య రోజు హనుమంతు మౌనదీక్ష చేపట్టారు. ఈ క్రమంలోనే కర్ణాటక చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు వస్తుండటంతో సొంత పొలంలోనే జీవ సమాధి కోసం ఒక ఆలయం నిర్మించినట్టు గ్రామస్తులు చెప్పారు. -
మహానేత వైఎస్ఆర్, వైఎస్ జగన్లపై రూపొందిన బయోపిక్
-
'యాత్ర 2'లో ఆ భావోద్వేగాలే చూపించాను: డైరెక్టర్ మహి
‘‘యాత్ర 2’లోని పాత్రలు ఎవర్నీ కించపరిచేలా ఉండవు. ఏ పార్టీనీ విలన్గా చూపించలేదు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిగారి మరణం తర్వాత ఇచ్చిన మాట కోసం (ఓదార్పు యాత్ర) కొడుకుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు చేసిన భావోద్వేగ ప్రయాణాన్ని మాత్రమే చూపించాను’’ అన్నారు దర్శకుడు మహి వి. రాఘవ్. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో మహి వి. రాఘవ్ తెరకెక్కించిన ‘యాత్ర’ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ‘యాత్ర 2’. వైఎస్ఆర్ పాత్రను మమ్ముట్టి చేయగా, ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా, వైఎస్ భారతీ రెడ్డి పాత్రలో కేతకీ నారాయణ్ నటించారు. త్రీ ఆటమ్ లీవ్స్, వి సెల్యూలాయిడ్తో కలసి శివ మేక నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో మహి వి. రాఘవ్ మాట్లాడుతూ– ‘‘మమ్ముట్టిగారు, జీవా, కేతకి, శివ మేక, నేను, సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్, కెమెరామేన్ మది.. ఇలా యూనిట్ అందరి వల్లే ‘యాత్ర 2’ బాగా వచ్చింది. జీవా అద్భుతమైన నటుడు. జగన్ అన్న పాత్రకి న్యాయం చేయగలడనే నమ్మకంతో ఎంచుకున్నాను. తెలుగు రాకపోయినా డైలాగ్స్ నేర్చుకుని అంకితభావంతో చేశాడు. ‘యాత్ర 2’ కథ, ప్రారంభం, ముగింపు అందరికీ తెలిసి ఉండొచ్చు. కానీ సినిమాను ఎలా తీశాం, ఏ భావోద్వేగాలతో నడిపించామన్నది ఎవరికీ తెలియదు. టీజర్, ట్రైలర్లో చూసిన ఇలాంటి ఎన్నో ఎమోషనల్ సీన్స్, ప్రజలకు తెలియని ఎన్నో అంశాలు సినిమాలో ఉంటాయి. ఈ మూవీలో వైఎస్ఆర్గారి మరణానికి సంబంధించిన కారణాలు చూపించలేదు. జగన్గారు ఢిల్లీ పెద్దలను ఎదిరించడం, సీఎం అయిపోవడం అనేది నా కథ కాదు. ఒక పాత్రని హీరో చేయడం కోసం ఇంకో పాత్రను తక్కువ చేసి చూపించాల్సిన అవసరం లేదు. మనమంటే గిట్టనివారు మనపై రాళ్లు వేస్తుంటారు.. బురద జల్లుతుంటారు.. అలాంటి వారిని పట్టించుకోకపోవడమే మంచిది’’ అన్నారు. జీవా మాట్లాడుతూ– ‘‘మహీగారు నాకు కథ చెప్పి, వైఎస్ జగన్గారి పాత్ర అన్నప్పుడు షాక్ అయ్యాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి నాకు అవగాహన లేదు. కానీ జగన్గారి పాత్ర చేయడం బాధ్యతగా అనిపించింది. జగన్గారు ఎలా మాట్లాడతారు? ఎలా నడుస్తారు? అని వీడియోలు చూసి తెలుసుకున్నాను. మహీగారు ఈ పాత్రకు నన్ను ఓకే చేయడానికే చాలా టైమ్ తీసుకున్నారు. తొలి సన్నివేశం ఆయన ఓకే చెప్పడంతో నాకు పెద్ద ఉపశమనం అనిపించింది. నేను ఇప్పటివరకూ వైఎస్ జగన్గారిని కలవలేదు.. కలిసే చాన్స్ వస్తే వదులుకోను. ‘యాత్ర 2’ విడుదల తర్వాత జగన్గారు మమ్మల్ని పిలిచి, అభినందిస్తారనే నమ్మకం ఉంది. ‘యాత్ర 2’ చేస్తున్నప్పుడు ప్రతిపక్షాల నుంచి నాకెలాంటి బెదిరింపు కాల్స్ రాలేదు. అయితే ‘యాత్ర’ చేస్తున్నప్పుడు మీకేమైనా అలాంటి కాల్స్ వచ్చాయా? అని మమ్ముట్టిగారిని అడిగాను. ‘మనం యాక్టర్స్.. ఇది క్రియేటివ్ స్పేస్.. దీన్ని కేవలం సినిమాలానే చూడు’ అని ఆయన చెప్పారు. ఈ మూవీలోని ‘చూడు నాన్నా’ పాట తీస్తున్నప్పుడు చాలా ఎమోషన్కు లోనయ్యాను. పులివెందులలో షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడి ప్రజల ప్రేమ, అభిమానం మరచిపోలేను. నా కెరీర్లో ‘యాత్ర 2’ తప్పకుండా ఓ మైలురాయిగా నిలుస్తుందని కచ్చితంగా చెప్పగలను’’ అన్నారు. కేతకీ నారాయణ్ మాట్లాడుతూ– ‘‘నేను మరాఠీ, హిందీ సినిమాలు చేశాను. తెలుగులో ‘యాత్ర 2’ నా మొదటి చిత్రం. తొలిసారి ఓ రియల్ పాత్ర చేశాను. పాత్రకు తగ్గ భావోద్వేగాలు పండించాను. పులివెందులలో షూటింగ్ చేసినప్పుడు అక్కడి మహిళలు నన్ను హత్తుకుని ఆ΄్యాయతతో మాట్లాడారు. అప్పుడు ఆ పాత్రలోని ఇంటెన్సిటీ నాకు అర్థమైంది’’ అన్నారు. -
నేను విన్నాను...
‘‘నా బిడ్డకు పుట్టుకతోనే చెవుడు ఉందన్నా.. చెవుడు వల్ల మాటలు కూడా రావు. ఏదో మిషన్ పెడితే వినపడి మాటలు వస్తాయని డాక్టర్లు చెప్పినారు.. అన్నా.. మాకంత స్తోమత లేదు (ఓ పాత్రధారి). మన రాష్ట్రానికి ఉన్న బడ్జెట్కి ఒక మనిషి మీద నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం.. ఐ డోంట్ థింక్.. ఇట్స్ రైట్ సార్ (మరో పాత్రధారి)... నువ్వు చెప్పింది కరెక్ట్నే అయ్యా.. నాకు అర్థమైంది. కానీ మనం చేయలేమనే మాట ఈ పాపకు అర్థమయ్యేలా చెప్పు (మమ్ముట్టి) అనే సీన్తో మొదలైంది ‘యాత్ర 2’ సినిమా టీజర్. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులు, పేదల కోసం వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర 2’. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాద యాత్ర ఆధారంగా రూపొందిన ‘యాత్ర’కు సీక్వెల్గా ‘యాత్ర 2’ వస్తోంది. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముట్టి, వైఎస్ జగన్ పాత్రలో జీవా నటించారు. మహి. వి. రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. జగన్ రెడ్డి కడపోడు సార్.. శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాకా.. వాళ్లు నాశనమైపోతారు అని తెలిసినా.. శత్రువుకి తలవంచరు సార్ (శుభలేక సుధాకర్) ఎన్నికలైపోయాక జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీని పోగొట్టుకోలేనన్నా.. ఈ క్రెడిబిలిటీ లేని రోజు.. మా నాయనా లేడు.. నేనూ లేను, నేను విన్నాను... నేనున్నాను (జీవా) అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. -
Yatra 2 Movie Trailer: ‘యాత్ర 2’ ట్రైలర్ వచ్చేసింది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర'. ఈ సినిమాకు సీక్వెల్గా 'యాత్ర 2' ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' ఉంటుంది. (చదవండి: యాత్ర 2' ట్రైలర్.. అంచనాలు పెంచేస్తున్న ఈ డైలాగ్స్) వైఎస్సార్, ఆయన తనయుడి జీవితంలో జరిగిన యథార్థంగా జరిగిన సంఘటనలే ఆధారంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ మహీ వి. రాఘవ్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డిపాత్రలో మమ్ముట్టి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపాత్రలో జీవా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన యాత్ర-2 టీజర్, సాంగ్స్ సినీ ప్రేక్షకులతో పాటు వైఎస్సార్ అభిమానుల గుండెలను తాకాయి. తాజాగా యాత్రా 2 నుంచి ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘పుట్టుకతోనే చెవుడు ఉంది అన్న.. చెవుడు వల్ల మాటలు కూడా రావు. ఏదో మిషిన్ పెడితే వినబడి మాటలు వస్తాయని డాక్టర్లు చెప్పారు. అన్నా.. మాకు అంత స్థోమత లేదు’ అని ఓ సామాన్యురాలు తన కూతురికి గురించి సీఎం వైఎస్సార్(మమ్ముట్టి)కి చెప్పే సీన్తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. వైఎస్సార్ మరణం.. జగన్ ఓదార్పు యాత్రకు అడ్డుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ చేసే కుట్రలు.. పార్టీ పెట్టిన తర్వాత జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి వచ్చిన మద్దతు..ఇవన్నీ ట్రైలర్లో హృదయాలను హత్తుకునేలా చూపించారు. ఇక చివర్లో ఓ అంధుడు ‘నువ్వు మా వైఎస్సార్ కొడుకువు అన్నా..మాకు నాయకుడిగా నిలబడు అన్నా’అని అనగా..నేను విన్నాను..నేను ఉన్నాను’ అని జగన్(జీవా) చెప్పే డైలాగ్తో ఎమోషనల్గా ట్రైలర్ ముగిసింది. దేశంలో ఇప్పటి వరకు ఎందరో ప్రముఖలు జీవితాలపై బయోపిక్లుగా పలు చిత్రాలు వచ్చాయి.. వాటంన్నింటికీ దక్కని క్రేజ్ యాత్ర సీక్వెల్ చిత్రాలకు దక్కింది. ఇంతలా యాత్ర-2కు ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దేశంలోనే అత్యంత ఆదరణ ఉన్న ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ గారు ఒకరు.. అంతే కాకుండా ఆయనొక అగ్రెసివ్ రాజకీయ నాయకుడు, మాస్ లీడర్, ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీకి అధినేత.. అంతలా ఇమేజ్ ఉన్న నాయకుడి గురించి తీసే బయోపిక్ను అంతే స్థాయిలో పొయెటిక్గా తెరమీదకు తీసుకురావడం డైరెక్టర్ మహి కే సాధ్యమైంది. ఆందుకే ఆయన నిజ జీవితాన్ని మరొకసారి వెండితెరపై చూసేందుకు కోట్ల మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. -
యాత్ర-2 నుంచి ఎమోషనల్ సాంగ్ రిలీజ్
యాత్ర -2 నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ తెలుగు ప్రేక్షకుల గుండెలను తాకింది. ఆ టీజర్తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా నుంచి 'చూడు నాన్న' వీడియో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర'. ఈ సినిమాకు సీక్వెల్గా యాత్ర-2 ఫిబ్రవరి 8న విడుదల కానుంది. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' ఉంటుంది. తాజాగా ఈ సినిమా నుంచి వీడియో సాంగ్ రిలీజ్ అయింది. 'చూడు నాన్న' అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ప్రముఖ గేయరచయిత భాస్కరభట్ల ఈ పాటకు అద్భుతమైన సాహిత్యం అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఎమోషన్స్తో కూడిన సంగీతాన్ని అందించారు. ఈ పాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాత్రలో జీవా తనదైన నటనతో మెప్పించారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఈపాట ఉండటంతో అందరినీ మెప్పిస్తుంది. తండ్రి మరణంతో మొదటిసారి ప్రజల్లో అడుగుపెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకే వేలాదిగా జనాలు వచ్చారు. ఆ సమయంలో జరిగిన కొన్ని ఘటనలను పాటలో చూపించారు డైరెక్టర్ మహి వి రాఘవ్. -
మార్కెటింగ్ స్కామ్ నేపథ్యంలో ‘గ్యాంగ్ స్టర్’
గ్రానైట్ స్లాబులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ వ్యాపార రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నిర్మాత వేలు మురుగన్. ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్ స్టర్’. రామ్ ప్రభ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి నెలలో తెలుగు, తమిళ్, హిందీ భాషలలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వేలు మురుగన్ మాట్లాడుతూ మార్కెటింగ్ స్కామ్ అనే నూతన పాయింట్ పై సినిమా అంతా నడుస్తుంది. ఇప్పటి వరకు ఇలాంటి పాయింట్ పై సినిమా రాలేదని చెప్పాలి. ఇందులో హీరోలు ఎవరు? విలన్స్ ఎవరు? అనేది క్లైమాక్స్ వరకు తెలియదు. ప్రతి పాత్ర ఎంతో ఇంట్రస్టింగ్ గా క్యూరియాసిటీ కలిగించే విధంగా ఉంటుంది. దర్శకుడు రామ్ ప్రభ సినిమాను ఎంతో ఇంట్రస్టింగ్ గా తెరకెక్కించారు. ప్రజిన్ పద్మనాభన్ , జీవా మరియు విజయ్ విశ్వ ముఖ్య పాత్రలో నటించారు. అలాగే సాయిధన్య, మోహన సిద్ధి, షాలిని హీరోయిన్స్ గా పరిచయం చేస్తున్నాం. ముగ్గురు కూడా అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంటారు. ఆర్టిస్టులందరూ తమ పాత్రలకు తగ్గట్టుగా పోటీపడుతూ నటించారు. కచ్చితంగా ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ గ్యాంగ్ స్టర్ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది అనడంలో సందేహం లేదు’ అన్నారు. -
Yatra 2 Teaser: రిలీజైన 'యాత్ర 2' టీజర్
'యాత్ర 2' సినిమా టీజర్ వచ్చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. అయితే ఏయే సంఘటనల ఆధారంగా తీశారనేది మొన్నటివరకు కాస్త సందేహం ఉండేది. తాజాగా వచ్చిన టీజర్తో సినిమాపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అలానే అంచనాలు కూడా పెరిగిపోయాయి. టీజర్లో ఏముంది? వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి (మమ్ముట్టి) కొడుకుగా వై.ఎస్.జగన్ (జీవా) రాజకీయాల్లోకి రావటానికి కారణమేంటనే అంశాన్ని చిన్నహార్ట్ టచింగ్ సన్నివేశంతో చూపించారు. అలానే తండ్రి లాంటి నాయకుడిని కోల్పోయినప్పుడు వారిని ఓదార్చటానికి ఓదార్పు యాత్ర చేద్దామంటే నాటి రాజకీయ నాయకులు ఎలాంటి అడ్డంకులు సృష్టించారనే విషయాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఆ అడ్డంకులని జగన్ ఎలా అధిగమించారు? తిరుగులేని ప్రజా నాయకుడిగా ఎలా ఎదిగారనేదే 'యాత్ర 2' సినిమా. (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా) గూస్బంప్స్ సీన్స్ ఈ టీజర్లో ఓ చోట.. 'ఉన్నదంతా పోయినా పర్లేదని తెగించినా.. జగన్ లాంటోడితో యుద్ధం చేయడం మనకే నష్టం మేడమ్' అని సోనియాగాంధీతో ఓ పాత్రధారి చెప్పే సీన్.. 'చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్న.. కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలన్న' అనే మరో సీన్.. 'నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని' అని అసెంబ్లీలో జగన్ పాత్రధారి చెప్పే సీన్స్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. టీజర్ ఇలా ఉందంటే సినిమా అంతకుమించి ఉండబోతుందనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా 'యాత్ర 2' సినిమా తీశారు డైరెక్టర్ మహి వి రాఘవ. నారా చంద్రబాబు నాయుడు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాత్రలో సుజానె బెర్నెర్ట్, వై.ఎస్.భారతి పాత్రలో కేతకి నారాయణన్ నటించారు. ఈ ఫిబ్రవరి 8న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. (ఇదీ చదవండి: OTT Releases This Week: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు!) -
టీజర్ రెడీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం ‘యాత్ర’. ఈ సినిమాకు సీక్వెల్గా ‘యాత్ర 2’ ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ‘యాత్ర 2’ ఉంటుంది. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డిపాత్రలో మమ్ముట్టి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపాత్రలో జీవా నటిస్తున్నారు. మహీ వి. రాఘవ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టీజర్ను ఈ నెల 5న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించి, ఓ కొత్త పోస్టర్ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ‘‘ఒక మనిషి, లక్షల సమస్యలు.. అయినా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి’’ అంటూ ‘యాత్ర 2’ టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్ను షేర్ చేసింది యూనిట్. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్తో కలిసి శివ మేక ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
యాత్ర 2 టీజర్ వచ్చేస్తోంది!
‘యాత్ర’మూవీకి సీక్వెల్గా ‘యాత్ర 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహి వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటిస్తున్నారు. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం వైఎస్. జగన్మోహన్రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. (చదవండి: కన్నీళ్లు తెప్పిస్తున్న చిన్నారుల బాధ.. భారీ సాయం చేసిన హీరో) ఈ ఏడాది ఫిబ్రవరి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్లో స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. ఇప్పటికే హీరో జీవా లుక్తో పాటు వైఎస్ భారతీ పాత్ర పోషిస్తున్న మరాఠీ నటి కేతకి నారాయణన్ లుక్ని కూడా రిలీజ్ చేశారు. ఇక త్వరలోనే ఈ సినిమా టీజర్ని విడుదల చేయబోతున్నారు. జనవరి 5న యాత్ర 2 టీజర్ రాబోతుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ.. మమ్ముట్టి, జీవాలకు సంబంధించిన కొత్త పోస్టర్ని విడుదల చేసింది. View this post on Instagram A post shared by Mahi V Raghav (@mahivraghav) -
Yatra 2: పవర్ఫుల్ డైలాగ్తో సీఎం జగన్ లుక్ రిలీజ్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ యాత్ర. ఈ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న చిత్రం యాత్ర 2. ఇందులో వైఎస్సార్ తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని చూపించబోతున్నారు. గురువారం (డిసెంబర్ 21) వైఎస్ జగన్ బర్త్డేను పురస్కరించుకుని యాత్ర 2 నుంచి ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. 'నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్ రాజశేఖరరెడ్డి కొడుకుని' అని పవర్ఫుల్ డైలాగ్ను పోస్టర్లో జత చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా వైఎస్ జగన్ పాత్రలో జీవా నటిస్తున్నారు. 'యాత్ర' ఫేమ్ మహి వి రాఘవ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్న ‘యాత్ర 2’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 8న థియేటర్లలో విడుదల చేయనున్నారు. They thought it was his end, and he knew it was just the beginning! Wishing @ysjagan garu a very Happy birthday. Cant wait to tell your story to the world through our lens.#Yatra2 in cinemas from Feb 8, 2024.#HBDYSJagan #LegacyLivesOn #Yatra2OnFeb8th pic.twitter.com/oo51ZKUEVR — Mahi Vraghav (@MahiVraghav) December 21, 2023 Rule 1. A character is defined by what he does and not what he speaks Rule 2. A true test of a character is revealed in a crisis Both these rules apply not only in screen writing but even in real life. @ysjagan is born out of a crisis and lives by his actions, not words.… pic.twitter.com/UOhDouAH5c — Mahi Vraghav (@MahiVraghav) December 21, 2023 చదవండి: PVR మల్టీప్లెక్స్లను బాయ్కాట్ చేసిన సలార్.. కారణం 'డంకీ' సినిమానే -
Yatra 2 Movie: పవర్ఫుల్ డైలాగ్తో వైఎస్ భారతి లుక్ రిలీజ్
యాత్ర’ ఫేమ్ మహి వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘యాత్ర 2’. ఇందులో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటిస్తున్నారు. వైఎస్సార్ పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన సూపర్హిట్ మూవీ ‘యాత్ర’కి కొనసాగింపుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు మహి. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం వైఎస్. జగన్మోహన్రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి పాత్రలో మరాఠీ నటి కేతకి నారాయణన్ నటిస్తోంది. నేడు(డిసెంబర్ 9) వైఎస్ భారతి పుట్టినరోజు. ఈ సందర్భంగా యాత్ర 2 మూవీలో ఆమె క్యారెక్టర్ లుక్ పోస్టర్ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్పై ‘నిజమేన్నా మా ఇంట్లో ఆడవాళ్లకి రాజకీయాలు, వ్యాపారాలు నేర్పించలేదు. అట్లానే మాకు కష్టం, సమస్య వస్తే భయపడి వెనుతిరిగి చూడటం కూడా నేర్పించలేదు.’ అని భారతి పాత్ర చెప్పే పవర్ఫుల్ డైలాగ్ని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. యాత్ర’ చిత్రాన్ని ఫిబ్రవరి 8, 2019లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు ‘యాత్ర 2’ ని కూడా అదే తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు, 2024 ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. A resilient force behind the rise of a leader! Presenting @KetakiNarayan as #YSBharathi from #Yatra2. In cinemas from 8th Feb, 2024.#HBDYSBharathiGaru #Yatra2OnFeb8th #LegacyLivesOn @ShivaMeka @MahiVraghav @vcelluloidsoffl @3alproduction pic.twitter.com/KdhUuB47wA — Mahi Vraghav (@MahiVraghav) December 9, 2023 -
యాత్రలో జర్మనీ నటి సుజానే
‘యాత్ర’ ఫేమ్ మహి వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘యాత్ర 2’. ఇందులో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటిస్తున్నారు. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక నిర్మిస్తున్న ‘యాత్ర 2’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ సినిమాలో సోనియా గాంధీ పాత్రని జర్మనీ నటి సుజానే బెర్నెర్ట్ పోషిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను మంగళవారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మహి వి. రాఘవ్ మాట్లాడుతూ–‘‘యాత్ర’కి కొనసాగింపుగా ‘యాత్ర 2’ రూపొందుతోంది. వైఎస్ జగన్గారు ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ ఘటనలను ఈ చిత్రంలో చూపిస్తున్నాం. ‘యాత్ర 2’ని 2024 ఫిబ్రవరి 8న రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మధి, సంగీతం: సంతోష్ నారాయణన్. -
ఒక్కటి గుర్తు పెట్టుకోండి!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో దర్శకుడు మహి వి.రాఘవ్ తెరకెక్కించిన చిత్రం ‘యాత్ర’. వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి నటించారు. 2019 ఫిబ్రవరి 8న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘యాత్ర 2’ మూవీని తెరకెక్కిస్తున్నారు మహి వి.రాఘవ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలోని కొన్ని ఘటనల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో వైఎస్ జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటిస్తున్నారు. ‘యాత్ర’లో వైఎస్ఆర్ పాత్ర పోషించిన మమ్ముట్టి ‘యాత్ర 2’ లోనూ అదే పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలోని వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ను మేకర్స్ విడుదల చేశారు. ‘నేనెవరో ఇంకా ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ, ఒక్కటి గుర్తు పెట్టుకోండి... నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని’ అనే అనే డైలాగ్స్ ఫస్ట్ లుక్ పోస్టర్లో ఉన్నాయి. మహి వి.రాఘవ్ మాట్లాడుతూ–‘‘వైఎస్ జగన్గారు ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ ఘటనల నేపథ్యంలో ‘యాత్ర 2’ రూపొందుతోంది. ఈ సినిమాని 2024 ఫిబ్రవరి 8న రిలీజ్ చేస్తాం’’ అన్నారు. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యులాయిడ్పై శివ మేక నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మధి, సంగీతం: సంతోష్ నారాయణన్. -
Yatra 2 Update: ఒక్కటి గుర్తు పెట్టుకోండి!
‘నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు.. కానీ, ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని’ అంటూ ‘యాత్ర 2’ సినిమా పోస్టర్ని విడుదల చేసింది చిత్రయూనిట్. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్గా డైరెక్టర్ మహీ వి. రాఘవ్ తెరకెక్కించిన ‘యాత్ర’ (2019) సినిమా మంచి విజయం అందుకుంది. ‘యాత్ర’ కి సీక్వెల్గా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయోపిక్తో ‘యాత్ర 2’ ఉంటుందని మహీ వి.రాఘవ్ గతంలోనే ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నెల 8న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ‘యాత్ర 2’ అప్డేట్ ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే వారం ముందే అప్డేట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది చిత్రయూనిట్. మహీ వి.రాఘవ్ దర్శకత్వంలో వి.సెల్యులాయిడ్పై శివ మేక నిర్మించనున్న ఈ సినిమాని 2024 ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నట్లు ఓ పోస్టర్ని విడుదల చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో 2009 నుంచి 2019 వరకు జరిగిన ఘటనల నేపథ్యంలో ‘యాత్ర 2’ కథ సాగుతుంది. ఇందులో జగన్ పాత్రలో ‘రంగం’ మూవీ ఫేమ్ జీవా నటించనున్నారు. ఆగస్టు 3 నుంచి ‘యాత్ర 2’ షూటింగ్ మొదలవుతుంది. -
వైఎస్ జగన్ పాత్రలో జీవా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు జీవా నటించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్తో ‘యాత్ర’ (2019) సినిమాని తెరకెక్కించిన దర్శకుడు మహీ వి. రాఘవ్ ప్రస్తుతం ‘యాత్ర 2’కి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ‘రంగం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో జీవాను జగన్ మోహన్ రెడ్డి పాత్రకు సంప్రదించారు మహీ. ఈ చిత్రంలో నటించడానికి జీవా సుముఖత వ్యక్తపరిచారు. ఇక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో 2009 నుంచి 2019 వరకు జరిగిన ఘటనల నేపథ్యంలో ‘యాత్ర 2’ కథ సాగుతుంది. జగన్ పాదయాత్ర నుంచి ప్రారంభమై సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఈ సినిమా ముగుస్తుంది. ప్రస్తుతం ప్రీ ్ర΄÷డక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 3న మొదలవుతుంది. 2024 ఫిబ్రవరిలో ‘యాత్ర 2’ సినిమా విడుదల కానుంది. కాగా మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహించిన ‘సిద్దా లోకం ఎలా ఉంది నాయనా?’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. -
లక్నో కోర్టు ఆవరణలో గ్యాంగ్స్టర్ హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లక్నో సివిల్ కోర్టు ఆవరణలో పట్టపగలే దారుణం జరిగింది. గ్యాంగ్స్టర్ సంజీవ్ మహేశ్వరి జీవా దారుణ హత్యకు గురయ్యాడు. లాయర్ దుస్తుల్లో వచ్చిన షూటర్లు కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనలో ఒక పోలీసు, ఓ మైనర్ బాలిక గాయపడ్డారని, నిందితుడిని అక్కడికక్కడే పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ క్రిమినల్ కేసులో జీవాను కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకొచ్చిన సమయంలో ఈ ఘటన జరిగిందని లక్నో పోలీస్ కమిషనర్ ఎస్బీ శిరాద్కర్ తెలిపారు. కాల్పులు అనంతరం కోర్టు ఆవరణలో పోలీసులను భారీగా మోహరించారు. గాయపడిన కానిస్టేబుల్, బాలికను ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా, కానిస్టేబుల్ ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. వివాదాస్పద నేత ముక్తార్ అన్సారీకి అనుచరుడైన జీవా (48) ముజఫర్నగర్ జిల్లా వాసి. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్రాయ్, మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బ్రహ్మ్ దత్తా ద్వివేది హత్య కేసులో నిందితుడు. మరో 24 కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు. 1997 ఫిబ్రవరిలో ఫరూఖాబాద్ జిల్లాలో ద్వివేది హత్యకు గురయ్యాడు. ద్వివేదితోపాటు అతని గన్మెన్ హత్య కేసులో ట్రయల్కోర్టు జీవాను దోషిగా నిర్ధారించింది. జీవిత ఖైదు విధించింది. కోర్టు ఆవరణలోనే కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులకు వ్యతిరేకంగా న్యాయవాదులు ఆందోళనకు దిగారు. శాంతిభద్రతల పరిరక్షణలో, భద్రతా ఏర్పాట్లో్ల విఫలమయ్యాయని ఆరోపించారు. -
సీక్వెల్కు సిద్ధమవుతున్న జీవా
నటుడు జీవా తాను ఇంతకుముందు నటించిన సూపర్హిట్ చిత్ర సీక్వెల్కు సిద్ధమవుతున్నారు అనేది తాజా సమాచారం. ఈయన 2009లో కథానాయకుడిగా నటించిన చిత్రం శివ మనసుల శక్తి. రాజేష్ ఎం దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. ప్రేమ, వినోదం ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ చిత్రం యువతకు విపరీతంగా నచ్చేసింది. కాగా ఇటీవల నటుడు జీవాకు సరైన హిట్ పడలేదనే చెప్పాలి. దీంతో మళ్లీ శివ మనుషుల శక్తి చిత్రానికి సీక్వెల్ రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. జీవా ప్రస్తుతం గీత రచయిత పా.రంజిత్ దర్శకత్వంలో చారిత్రక కథా చిత్రంలో నటిస్తున్నారు. అదేవిధంగా దర్శకుడు రాజేష్ ప్రస్తుతం జయం రవి కథానాయకుడుగా చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత రాజేష్ నటుడు జీవా కథానాయకుడుగా శివ మనసుల శక్తి చిత్రానికి సీక్వెల్ను రూపొందించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా దీనికి నటుడు జీవా నిర్మాతగా వ్యవహరించనున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్బీ.చౌదరి ఈయన తండ్రి అన్నది తెలిసిందే. తాజాగా నటుడు జీవా కూడా సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించనున్నట్లు సమాచారం. -
కనిపించని ‘జీవా’
సాక్షి, హైదరాబాద్: బ్రాండెడ్ మంచినీటి సీసాల వినియోగంతో సాలీనా రూ.కోట్లలో అవుతున్న వ్యయాన్ని నియంత్రించడంతోపాటు అదనపు ఆదాయాన్ని పొందే ఉద్దేశంతో ఎంతో ఘనంగా ప్రారంభించిన ఆర్టీసీ సొంత నీటి బ్రాండ్ ఎక్కడా కానరావడం లేదు. జీవా బ్రాండ్ను ఆర్టీసీ నెలన్నర క్రితం ఎంతో అట్టహాసంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంజీబీఎస్లో కార్పొరేట్ పద్ధతిలో ఆ బ్రాండ్ను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు ఆరు నెలలు శ్రమించి రెండు సంస్థలతో ఒప్పందం చేసుకుని ఈ నీటిని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఆర్టీసీ కృషి చేసింది. కానీ ఇప్పటివరకు ఇటు బస్టాండ్లలో కాని, ఆర్టీసీ బస్సుల్లో కానీ ఎక్కడా అది కనిపించటం లేదు. ఇప్పటికీ ప్రైవేటు బ్రాండెడ్ నీటినే వినియోగిస్తున్నారు. భారీగా వ్యయం చేయటంతోపాటు ప్రసార మాధ్యమాల ద్వారా ముమ్మరంగా ప్రచారం జరిగి ప్రజల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొన్న తర్వాత ఆ బ్రాండ్ కనిపించకపోవటం విశేషం. ♦ కేవలం బస్టాండ్లలోని దుకాణాల్లోనే కాకుండా క్రమంగా, మార్కెట్లోని ఇతర దుకాణాల్లో కూడా అందుబాటులోకి తెచ్చేలా చూడాలని నిర్ణయించారు. కానీ మార్కెట్లోని దుకాణాల్లో కాదు కదా కనీసం ఆర్టీసీ బస్సుల్లో కూడా అవి కనిపించడం లేదు. ఇక ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్భవన్లో అధికారులకు కూడా అవి అందుబాటులో లేకుండా పోయాయి. బస్సులు, ఆర్టీసీ కార్యాలయాల్లో ప్రైవేట్ బ్రాండ్ నీళ్లే.. ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు ఉచితంగా 500 మి.లీ. వాటర్ బాటిళ్లను అందిస్తారు. ఆర్టీసీ సొంతంగా జీవా పేరుతో నీటిని మార్కెట్లోకి తీసుకురావటంతో, ఇక బస్సుల్లో అవే నీళ్లు పంపిణీ జరుగుతాయని ప్రచారం చేసింది. కానీ తాజాగా బస్సుల్లో పంపిణీకి ఓ బడా బ్రాండెడ్ నీటి సీసాలు పెద్ద ఎత్తున డిపోలకు చేరాయి. ఇంతకాలం స్థానికంగా తయారయ్యే ఓ బ్రాండ్ సీసాలు పంపిణీ జరుగుతుండగా, తాజాగా ఓ అంతర్జాతీయ కంపెనీకి చెందిన బ్రాండ్ సీసాలు డిపోలకు చేరాయి. ప్రైవేటు బ్రాండెడ్ కంపెనీ నుంచి నీటి సీసాల కొనుగోలుకు సాలీనా రూ.5 కోట్ల వరకు ఖర్చవుతున్నట్టు సమాచారం. డిమాండ్ ఉన్నా కానరావడం లేదు.. ♦ ప్రకాశం, కాంతి అన్న అర్ధంలో వినియోగించే జీవా (జెడ్ఐవీఏ) అన్న హిబ్రూ భాష నుంచి పుట్టిన పేరును ఖరారు చేసిన ఆర్టీసీ ఆ నీటి సీసాల డిజైన్లో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇప్పటి వరకు ఏ కంపెనీ వినియోగించని రీతిలో డైమర్ కటింగ్స్ డిజైన్ ఉన్న సీసా ఆకృతిని ఎంపిక చేసింది. చూడగానే ఆకట్టుకునేలా ఉన్నందున, ఆర్టీసీ బ్రాండ్ తోడు కావటంతో సాధారణ ప్రజలు కూడా దాని మన్నికపై నమ్మకంతో కొనే అవకాశం ఏర్పడుతుందని దీంతో ఈ నీటి విక్రయాల ద్వారా సాలీనా రూ.20 కోట్ల ఆదాయం పొందే వీలుందని ఆర్టీసీ అంచనా వేసింది. ప్రస్తుతం వేసని ప్రారంభం కావటంతో వాటర్ బాటిళ్ల విక్రయం ఊపందుకుంది. ఆర్టీసీ ప్రయాణికులు బస్టాండ్లలో నీటి సీసాలు కొని బస్కెక్కుతున్నారు. ఇలా మంచి డిమాండ్ ఉన్న సమయంలో కూడా ఆర్టీసీ నీళ్లు కనిపించడం లేదు. తయారీ కంపెనీల నిర్వాకంతోనే.. ఎంతో గొప్పగా జీవా బ్రాండ్ను ప్రారంభించినప్పటికీ, ఆ నీటిని, సీసాలను రూపొందించేందుకు ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల నిర్వాకం వల్లనే సమస్యలు తలెత్తాయని సమాచారం. సీసాల ఆకృతి గొప్పగా ఉన్నప్పటికీ, వాటి నాణ్యత అత్యంత తీసికట్టుగా ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆ బ్రాండ్పై చెడ్డపేరు వస్తుందనే వాటి మార్కెటింగ్ను ఆపేసినట్టు తెలిసింది. నాణ్యమైన సీసాలు, నీళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాతనే ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. -
కొత్త సినిమా ప్రకటించిన హీరో జీవా
తమిళసినిమా: మంచి కథా చిత్రాలను నిర్మిస్తున్న సంస్థగా పేరుపొందిన సంస్థ పొటాన్షియల్ స్టూడియోస్. మాయ, మానగరం, మాన్స్టర్, టాణాక్కారన్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించిన సంస్థ ఇది. తాజాగా నటుడు జీవా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం నిర్మాణంలో ఉంది. ఇందులో జీవాకు సంబంధించిన పార్ట్ పూర్తి అయింది. త్వరలోనే తుది షెడ్యూల్ నిర్వహించనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని తెలిపారు. కాగా ఇదే సంస్థలో జీవా హీరోగా మరో చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నటి తాన్య రవిచంద్రన్ నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు సెల్వరాఘవన్ శిష్యుడు మణికంఠన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దీనికి గోకుల్ ఫినాయ్ చాయాగ్రహణం, నివాస్ కే.ప్రసన్న సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర పూజ కార్యక్రమాలను బుధవారం ఉదయం చెన్నైలో నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు అందించారు. కాగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ను త్వరలోనే ప్రారంభించి చెన్నై పరిసర పరిసర ప్రాంతాల్లో నిర్వహించినట్లు దర్శకుడు తెలిపారు. చదవండి: అందుకే నా ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచాను: శ్రియ ఆసక్తికర వ్యాఖ్యలు ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ ఆత్మహత్య -
తొలి సినిమా డైరెక్టర్తో రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
Senior Heroine Malavika Re Entry With Director Sundar C Movie: ప్రముఖ డైరెక్టర్, దివగంత ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన 'చాలా బాగుంది' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ మాళవిక. శ్రీకాంత్, నవీన్ హీరోలుగా నటించిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాలతో అలరించిన మాళవిక కొన్నాళ్లకు సినిమాలకు దూరమైంది. 1999లో సుందర్. సి డైరెక్షన్లో అజిత్ హీరోగా 'ఉన్నై తేడి' మూవీతో కోలీవుడ్కు పరిచయమైంది మాళవిక. తర్వాత 2007లో సురేష్ మేనన్ అనే వ్యక్తిని వివాహమాడి వైవాహిక జీవితానికే పరిమితమైంది. ఇప్పుడు తాజాగా ఆమె మళ్లీ వెండితెరపై సందడి చేయనుంది. చదవండి: 'పేరెంట్స్ కోప్పడ్డారు..ఆ సినిమా చేసినందుకు బాధపడుతున్నా' కోలీవుడ్కు ఏ డైరెక్టర్తో పరిచయమైందో ఆయన దర్శకత్వంలోనే మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుంది మాళవిక. ఈ సినిమాలో ఆమె 'మంగమ్మ' అనే పాత్రలో అలరించనుంది. ఇందులో మాళవికకు జోడిగా దర్శకుడు మనోబాలా కనిపించనున్నారు. హీరోలుగా జై, జీవా, శ్రీకాంత్ నటిస్తున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్, రైజా విల్సన్, ఐశ్వర్య దత్తా హీరోయిన్లుగా సందడి చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్లో పాల్గొన్న మాళవిక ఫొటోలను సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం విడుదల చేసింది. ఇంకా ఈ సినిమాకు టైటిల్ ఖరారు కాలేదు. షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. pic.twitter.com/VoZNpvLkRx — Manobala (@manobalam) April 2, 2022 చదవండి: ఆమె బయోపిక్లో నటించాలనుంది: మాళవిక మోహనన్ -
Rangam: జీవా ప్లేస్లో శింబు, ఫొటోలు వైరల్
సూర్య, తమన్నా జంటగా నటించిన చిత్రం 'అయాన్'. తెలుగులో వీడొక్కడే పేరుతో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా దర్శకుడు కేవీ ఆనంద్కు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఈ సక్సెస్ను ఎంజాయ్ చేస్తూనే ఆ వెంటనే 'కో' సినిమాను ప్రకటించాడు ఆనంద్. ఇది తెలుగులో 'రంగం' పేరుతో విడుదై సెన్సేషనల్ హిట్ సాధించింది. అయితే ఇక్కడో ఆసక్తికర విషయమేంటంటే ఇందులో మొదట హీరోగా అనుకుంది జీవాను కాదు శింబును! శింబుతో 'కో' సినిమా తీస్తున్నట్లు చిత్రయూనిట్ అధికారంగా ప్రకటించింది. అంతే కాదు, ఇంకొన్ని రోజుల్లో షూటింగ్ మొదలవుతుంది అనుకుంటున్న సమయంలో శింబు-కార్తీక నాయర్లపై ఫొటోషూట్ కూడా నిర్వహించారు. ఇక సినిమా పట్టాలెక్కే సమయానికి మాత్రం శింబు ఆ సినిమా నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. దీంతో దర్శకుడు శింబు ప్లేస్లో యంగ్ హీరో జీవాను తీసుకోవాల్సి వచ్చింది. అయితే అనుకున్నదానికంటే ఎక్కువగా అఖండ విజయం సాధించిన ఈ సినిమా రిలీజై దాదాపు పదేళ్లు దాటిపోయింది. ఈ సమయంలో తాజాగా శింబు-కార్తీక ఫొటోషూట్కు సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. అసలేం జరిగిందంటే.. 'కో' సినిమా చేసేందుకు శింబు రెడీ అన్నాడు. కాకపోతే హీరోయిన్గా కార్తీకకు బదులు తమన్నా కావాలని అడిగాడట. కానీ ఆ సమయంలో వరుస సక్సెస్లు అందుకుంటూ పెద్దమొత్తంలో పారితోషికం అందుకుంటున్న మిల్కీ బ్యూటీని ఈ ప్రాజెక్టుకు ఒప్పించడం అంత తేలిక కాదని అభిప్రాయపడ్డారు దర్శకనిర్మాతలు. తమన్నా కోరినంత రెమ్యుననరేషన్ ఇచ్చేంత భారీ బడ్జెట్ తమ వద్ద లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో దర్శకుడు, హీరో మధ్య బేధాభిప్రాయాలు ఏర్పడటంతో శింబు ప్రాజెక్ట్ నుంచి సైడ్ అయినట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. చేసేదేం లేక దర్శకుడు కూడా మరో మంచి నటుడు కోసం వెతుకుతుండగా జీవా కంటపడ్డాడు. అలా అతడికి కో మూవీలో చాన్స్ రాగా అది జీవా కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమా రెండు దక్షిణాది ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు, మూడు విజయ్, రెండు సీమా, నాలుగు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకోవడం విశేషం. చదవండి: Anushka Shetty: వైరలవుతున్న స్వీటీ ఫొటో సీఎం స్టాలిన్ను కలిసిన సూర్య ఫ్యామిలీ... కోటి విరాళం -
క్రిస్మస్కి 83
కరోనా కారణంగా సినిమా విడుదల తేదీలన్నీ అయోమయ పరిస్థితుల్లో పడిపోయాయి. సినిమా థియేటర్స్ ప్రారంభానికి అనుమతి ఇవ్వడంతో కొత్త తేదీలను, పండగ సీజన్లను టార్గెట్ చేసి తమ చిత్రాల విడుదల తేదీలను లాక్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ నేపథ్యంలోనే ‘83’ విడుదల తేదీని ఖరారు చేశారు. 1983 క్రికెట్ ప్రపంచకప్ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘83’. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రను రణ్వీర్ సింగ్ చేశారు. ఇతర ముఖ్య పాత్రల్లో దీపికా పదుకోన్, జీవా నటించారు. ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్కు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. -
వెలుగులోకి ‘83’ నాటి ఆసక్తికర సంఘటన
న్యూఢిల్లీ: దర్శకుడు కబీర్ ఖాన్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రం 83. ఇది 1983లో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సారథ్యంలో భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ సాధించిన నిజమైన కథ చుట్టూ తిరుగుతుంది. ఇక చిత్రంలో కపిల్దేవ్ పాత్రలో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అప్పటి భారత జట్టు ఎలాంటి మలుపుల మధ్య ప్రపంచ కప్ సాధించిందో.. ఆ సమయంలో చోటు చేసుకున్న అనుకోని సంఘటనలు వంటి ఆసక్తికర అంశాలను, వాస్తవాలను ఈ సినిమా ద్వారా దర్శకుడు తెరపై చూపించనున్నారు. ఈ క్రమంలో తాజాగా 1983 క్రికెట్ జట్టు గురించి ఓ ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చింది. జూన్ 20, 1983.. ఆరోజు జరిగిన గ్రూప్ మ్యాచ్లను దాటి టీమిండియా ముందుకు వెళ్తుందని జట్టు సభ్యులేవరికీ ఆశలు లేవు. గ్రూప్ దశలోనే భారత్ ఇంటి దారి పడుతుందేమోనని టోర్నీ మధ్యలోనే జట్టు తిరిగి వెళ్లేందుకు టిక్కెట్లను బుక్ చేసుకుంది. ఇంకా చెప్పాలంటే జట్టులోని కొందరు ఆటగాళ్లు ఆ మధ్యే వివాహం చేసుకున్నారు. గ్రూప్ మ్యాచ్లు ముగిసిన వెంటనే వారి భార్యలతో సెలవులు ప్లాన్ చేసుకుని.. జూన్ 20 రాత్రి న్యూయార్క్ చుట్టేయడానికి టిక్కెట్లను కూడా బుక్ చేసుకున్నారు. మరో ఆసక్తికర విషయం ఏటంటే అప్పటికే జూన్ 22 నుంచి సెమీ ఫైనల్స్ షెడ్యూల్ కూడా ఖరారవడం గమనార్హం. (కపిల్దేవ్కు నిజమైన అభినందన దక్కలేదు) ఇక ఈ టోర్నమెంట్లో భారత్ అంచనాలకు మించి ప్రదర్శన ఇస్తుందని.. సెమీ ఫైనల్స్ చేరుకుంటారని ఎవరూ ఊహించలేదు. కనీసం జట్టు సభ్యులు కూడా. ఇక ఆ రోజు అందరి ఊహలను తలకిందులు చేస్తూ టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరచడమే కాకుండా మొత్తం టోర్నమెంట్ను గెలుచుకుని క్రికెట్ చరిత్రలో తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుని భారత క్రికెట్ చరిత్రలో చీరస్మరనీయమైన రోజును సంపాదించింది. అయితే 1983కి ముందేప్పుడూ కూడా క్రికెట్ ప్రపంచ కప్ విజయాల పట్టికలో భారతదేశ పటం లేదు. ఇక భారత్ సెమీ ఫైనల్స్ చేరి కప్ సాధింస్తుందని ఎవరూ ఊహించలేదు. కాగా కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరచి విజయం వైపు పరుగులు తీస్తుంటే స్టేడియంలో నెలకొన్న ఉత్కంఠ.. కప్ గెలవడంతో జట్టు సభ్యుల్లో మొదలైన భావోద్యేగం, అభిమానుల ఆనంద కేకలను దర్శకుడు తెరపై చూపించబోతున్నాడు. ఇక రిలయన్స్ ఎంటర్టైనమెంట్, ఫాంటమ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్లో దర్శకుడు కబీర్ ఖాన్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొనె కపిల్ భార్య పాత్ర నటిస్తున్నారు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. -
ధోనికి జీవా మేకప్
న్యూఢిల్లీ: ధనాధన్ ఆటతో క్రికెట్కు దూరమైన ధోని అభిమానులకు ఓ పాత వీడియో కొంత ఊరటనిస్తోంది. అతని గారాల తనయ జీవాతో తను తీర్చుకునే అచ్చట, ముచ్చట సామాజిక మాధ్య మాల్లో ధోని పంచుకుంటాడు. అయితే ధోనికి జీవా మేకప్ వేసే ఈ వీడియో మాత్రం అతను షేర్ చేయ లేదు. అతని మేకప్ ఆర్టిస్ట్ సప్న భవ్నానీ ఈ పాత వీడియోను పోస్ట్ చేసింది. జీవా తన చిట్టిపొట్టి చేతులతో తండ్రికి మెరుగులు దిద్దింది. ‘అందరికీ ముద్దొచ్చే మేకప్ ఇది. దీంతో నా ఉద్యోగానికి (మేకప్ ఆర్టిస్ట్) త్వరలోనే ఎసరొచ్చేలా ఉంది! మహి... మిస్ యూ దోస్త్’ అని ట్వీట్ చేసింది. ఇదిలావుండగా మాయదారి మహమ్మారి ప్రాణాల్ని తోడేస్తోంది. అలాగే ఎందరో ఆశల్ని చిదిమేస్తోంది. ఇప్పుడు ధోని అభిమానుల పట్ల అదే పని చేసింది. గత ప్రపంచకప్ సెమీస్ తర్వాత మాజీ కెప్టెన్ మహి మళ్లీ బరిలోకి దిగలేదు. కనీసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అయినా ఆడలేకపోతాడా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. కానీ కరోనా వైరస్ లీగ్ను జరగనివ్వడం లేదు. -
బంజార టైటిల్ మార్పు
అమృత, ట్వింకిల్ కపూర్, తేజేష్ వీర, హరీష్ గౌలి, జీవా, జీవీ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బంజార’. ‘క్షుద్ర’ ఫేమ్ నాగుల్ దర్శకత్వం వహించారు. వర్కింగ్ యాంట్స్ ప్రొడక్ష¯Œ ్స పతాకంపై కోయ రమేష్ బాబు, దేవభక్తుని నవీన నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ నెలలో విడుదలకానుంది. తాజాగా ‘బంజార’ టైటిల్ని మార్చనున్నట్లు రమేష్ బాబు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ హారర్గా తెరకెక్కిన చిత్రమిది. ఇటీవల విడుదలైన మా టీజర్ కొన్ని వర్గాల వారి మనోభావాలను దెబ్బతీసేలా ఉందని మా దృష్టికి వచ్చింది. కథలో భాగంగానే ఆ టైటిల్ను పెట్టాం. ‘బంజార’ పేరుపై వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి వారి అభిప్రాయాలను, మనోభావాలను గౌరవించి త్వరలోనే టైటిల్ మార్చే ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికే అన్ని మాధ్యమాల నుండి టీజర్ని తొలగించాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ, కెమెరా: వెంకట్. -
నాకు హీరోలకన్నా విలన్స్ అంటేనే ఇష్టం
‘‘స్టాలిన్ అనేది నా ఫేవరెట్ పేరు. స్టాలిన్ రష్యన్ నియంత. ‘స్టాలిన్’ పేరుతో చిరంజీవిగారు సినిమా చేశారు. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత ‘స్టాలిన్’ అనే పేరుని వింటున్నాను. ఈ చిత్రం టైలర్ చాలా బావుంది’’ అని దర్శకుడు రామ్గోపాల్ వర్మ అన్నారు. జీవా, రియా సుమన్, నవదీప్ ముఖ్య పాత్రల్లో రతిన శివ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘సీరు’. తెలుగులో ‘స్టాలిన్’ టైటిల్తో వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్, నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్, క్విట్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామ్గోపాల్ వర్మ మాట్లాడుతూ – ‘‘జీవా చాలా ఈజ్తో నటించాడు. ఇందులో నవదీప్ లుక్ (నవదీప్ది విలన్ పాత్ర) విభిన్నంగా కనిపిస్తోంది. నాకు హీరోలకన్నా విలన్స్ అంటేనే ఇష్టం. దర్శకుడు సినిమాను బాగా హ్యాండిల్ చేశారు’’ అన్నారు. ‘‘జీవా తండ్రి ఆర్.బి. చౌదరిగారి బ్యానర్లో రాజశేఖర్గారు సింహరాశి, గోరింటాకు వంటి పెద్ద హిట్ సినిమాలు చేశారు. వాళ్ల నాన్నగారి పేరు నిలబెట్టాలని జీవా మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు. ‘రంగం’ కంటే ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలి’’ అన్నారు జీవితా రాజశేఖర్. ‘‘మొదటి నుంచి తెలుగు ప్రేక్షకులతో నాకు మంచి అనుబంధం ఉంది. నన్ను ‘రంగం’ నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. వర్మగారి సినిమాలంటే నాకు ఇష్టం. ఆయన దగ్గర డైరెక్షన్ నేర్చుకోవాలని అనుకున్నాను. త్వరలో స్ట్రయిట్ తెలుగు సినిమా చేయాలనుకుంటున్నాను’’ అన్నారు జీవా. ‘‘తెలుగు ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా కథ రాశాను. మంచి సందేశం ఇవ్వబోతున్నాం’’ అన్నారు రతిన శివ. ‘‘తెలుగు ప్రేక్షకులకు తెలుగు, తమిళం అనే భేదాలు ఉండవు. అన్ని భాషల చిత్రాలను ఆదరిస్తారు. తొలిసారి ఇందులో పూర్తి స్థాయి విలన్ పాత్రలో నటించాను’’ అన్నారు నవదీప్. ‘‘నట్టి ఫ్యామిలీకి ఈ సినిమా మంచి విజయం తీసుకురావాలి’’ అన్నారు టి. అంజయ్య. ‘‘మంచి పాయింట్తో ఈ సినిమా తెరకెక్కింది. భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు నట్టికుమార్. ఈ కార్యక్రమంలో హీరోయిన్ రియా సుమన్, నిర్మాతలు దామోదర ప్రసాద్, నట్టి కరుణ, నట్టి క్రాంతి, వేల్స్ శ్రవణ్, శివ బాలాజీ, మధుమిత పాల్గొన్నారు. -
పాట విని రణ్వీర్ డాన్స్ చేశారు
చెన్నై : సీరు చిత్రంలోని పాటను బాలీవుడ్ నటుడు రణ్ వీర్సింగ్ అడిగి మరీ విని డాన్స్ చేశారని నటుడు జీవా చెప్పారు. ఈయన నటించిన తాజా చిత్రం సీరు. వేల్స్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మించిన ఇందులో నటుడు వరుణ్ ముఖ్య పాత్రలో నటించారు. టాలీవుడ్ నటుడు నవదీప్ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రంలో జీవాకు జంటగా రియా సుమన్ నటించింది. ఈ బ్యూటీకిదే తొలి తమిళ చిత్రం. నటి గాయత్రీ కృష్ణన్, చాందిని ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రతన్శివ దర్శకత్వం వహించారు. డీ.ఇమాన్ సంగీతాన్ని అందించిన సీరు చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 7వ తేదీన విడుదల కానుంది. చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ల్యాబ్లో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. నిర్మాత ఐసరి గణేశ్ మాట్లాడుతూ సీరు తమ సంస్థతో రూపొందిన నాల్గో చిత్రమన్నారు. సీరు చిత్రం కూడా సక్సెస్ అవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు రతన్శివ చెప్పిన కథ నచ్చిందన్నారు. ఆయన చెప్పిన కథను అద్భుతంగా తెరపై ఆవిష్కరించినట్లు చెప్పారు. తన చిత్రం అయినా నచ్చక పోతే చెప్పే స్తానన్నారు. ఈ చిత్రం తన మనసుకు హత్తుకుందన్నారు. చిత్రం కోసం జీవా చాలా శ్రమించినట్లు చెప్పా రు. నటుడు వరుణ్ ఈ చిత్రం కోసం తనను మార్చుకున్నాడని అన్నా రు. మంచి కథా చిత్రాలనే అందించాలన్నది తమ లక్ష్యం అని నిర్మాత ఐసరి గణేశ్ పేర్కొన్నారు. నటుడు జీవా మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిత్రం నిర్మించడం కంటే దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడం పెద్ద విషయంగా మారిందన్నా రు. ఇక్కడ చాలామంది మీడియా ప్రతినిధులు ఉన్నారని, చిత్రం బాగోలేకపోతే సంకటంగా ఉంటుందని అన్నారు. అయితే చాలామంచి విషయాలు జరుగుతున్నాయన్నారు. మనసుకు చాలా సంతోషంగా ఉందన్నారు. సీరు చిత్రంలో తాను కేబుల్ టీవీ ఆపరేటర్గా నటించినట్లు చెప్పారు. చిత్ర కథనం హట్టహాసంగా ఉంటుందన్నారు. దర్శకుడు రతన్శివ కథ చెప్పడంతో దిట్ట అని అన్నారు. ఆయన ఎవరినైనా కథ చెప్పి ఓకే అనిపించగలరని అన్నారు. ఇది పక్కా కమర్శియల్ కథా చిత్రంగా ఉంటుందన్నా రు. బాలీవుడ్ నటు డు రణ్వీర్సింగ్ 83 చిత్ర ప్రమోషన్ కోసం చెన్నైకి వచ్చినప్పుడు సీరు చిత్రంలోని కచేరి కచేరి అనే పాటను అడిగి మరీ విని ఆ పాటుకు డాన్స్ చేశారని చెప్పారు. అంతేకాకుండా సంగీత దర్శకుడు డీ.ఇమాన్ను అభినంధించారని తెలిపారు. ఈ చిత్రానికి డీ.ఇమాన్ సంగీతం పక్కా బలమని పేర్కొన్నారు. తనకు ఇందులోని వాసూకీ అనే పాట చాలా నచ్చిందన్నారు. నటి చాందిని నటించిన సన్నివేశాలు బాగా వచ్చాయన్నా రు. సీరు చిత్రంలో నటుడు వరుణ్ నటించిన పాత్రలో ఆయన్ని వద్దని తాను ముందు చెప్పానన్నారు. కారణం అది చాలా రష్ పాత్ర అని, అందులో వరుణ్ నటించి అదరగొట్టారని కితాబిచ్చారు. నటి రియా సుమన్ ఇంతకు ముందు జిప్సీ చిత్రం అడిషన్లో పాల్గొన్నట్టు చెప్పిందని, అయితే తను హీరోయిన్గా నటించిన ఈ చిత్రమే జిప్సీ కంటే ముందు విడుదల కానుందని జీవా అన్నారు. కార్యక్రమంలో దర్శకుడు రతన్శివ, నటి చాందిని, వరుణ్, డీ.ఇమాన్ తదితర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
‘స్టాలిన్’ ప్రీ రిలీజ్ వేడుక
-
క్రికెట్ అంటే చాలా ఇష్టం, అందుకే ఆ సినిమాలో..
సాక్షి, చెన్నై : క్రికెట్ క్రీడ అంటే ఇష్టం, అందుకే 83 చిత్రంలో నటించాను అని యువ నటుడు జీవా పేర్కొ న్నారు. 1983లో ప్రపంచ విజేతగా భారత క్రికెట్ జట్టు అ ప్పటి కెప్టెన్ కపిల్ దేవ్ సా రథ్యంలో నిలిచిన ఇతివృత్తంతో తెరకెక్కుతు న్న హిందీ చిత్రం 83. కబీర్ ఖాన్ తెరకెక్కిస్తున్న ఈ చి త్రం హిందీతో పాటు, తమిళం, తెలుగు వంటి ఇతర భాషల్లోనూ రూపొందుతోంది. కాగా కపిల్ దేవ్గా బాలీవుడ్ స్టార్ హీరో రణ వీర్సింగ్ నటి స్తుండగా, కృష్టమాచార్య శ్రీకాంత్గా నటుడు జీవా నటిస్తున్నారు. ఇందులో నటి దీపికా పడుకోణె నాయకిగా నటిస్తోంది. ఈ చిత్రం సమ్మర్ స్పె షల్గా ఏప్రి ల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా జీవా ఈ చిత్రంలో పాటు చీరు అనే మరో తమిళ చిత్రంలోనూ నటించారు. ఈ చిత్రం 7వ తేదీన తెరపైకి రానుంది. నటుడు జీవా తో ఇంటర్వ్యూ.. ప్ర:తొలిసారిగా 83 చిత్రంలో బాలీవుడ్కు ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆ అనుభవం గురించి? జ: నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆ చిత్రంలో నటించడానికి అంగీకరించాను. అయితే అందులో కృష్టమాచార్య శ్రీకాంత్ పాత్రలో నటించడానికి చాలా శిక్షణ తీసుకున్నాను. అనంతరం ధర్మశాలలో 6 నెలలు క్రికెట్ క్రీడకు ప్రాక్టీస్ చేశాను. ఈ చిత్రం కోసం 17 కిలోల బరువు తగ్గాను. ఆ తరువాత యుకేలో షూటింగ్ చేశాం. అక్కడ రణ్వీర్సింగ్, దీపికాపదుకునే చిత్ర యూనిట్తో కలిసి పనిచేయడం సరి కొత్త అనుభవం. చిత్రం చాలా రియలిస్టిక్గా ఆసక్తిగా ఉంటుంది. షూటింగ్ సమయంలో సచిన్, గవాస్కర్, కపిల్దేవ్, శ్రీకాంత్ వంటి స్టార్ క్రీడాకారులతో కలిసే అదృష్టం కలిగింది. ప్ర: ఇకపై హిందీలో నటిస్తారా? జ: హిందీలో నటించాలనేవుందీ? మనం ఇక్కడ చేసిన మంచి కథలను అక్కడ రీమేక్ చేసేలా ఉంటే చాలు. హీరోగా కాకుండా, 83 చిత్రంలో మాదిరి పాత్రలైతే నటించడానికి సిద్ధమే. ప్ర: త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న చీరు చిత్రం గురించి? జ: చీరు మంచి కటుంబకథా చిత్రంగా ఉంటుంది. ప్ర: మీకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అక్కడ చిత్రాలు చేయాలన్న ఆసక్తి లేదా? ప్ర: ఉంది. ప్రస్తుతం నటిస్తున్న చీరు చిత్రాన్ని తెలుగులోనూ అనువాదం చేసి విడుదల చేస్తున్నాం. కాగా నేను హీరోగా తమిళం, తెలుగు భాషల్లో ఒక చిత్రం చేయడానికి నాన్న (ఆర్బీ.చౌదరి) సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో ఒక మంచి సంప్రదాయం ఉంది. అక్కడ ఒక చిత్రం బాగుంటే దాని గురించి ఇతర నటులను అడిగినా బాగుంది అని చెబుతారు. ఇక్కడ అలా కాదు. ప్ర: మీరు నటించిన జిప్పీ విడుదలలో జాప్యం గురించి? జ: జిప్సీ చిత్రం చాలా బాగా వచ్చింది. సెన్సార్ సమస్యలు, ఆర్థిక సమస్యలు కారణంగా విడుదలలో జాప్యం జరుగుతోంది.అయితే సెన్సార్ సమస్యలను అధిగమించింది.త్వరలోనే విడుదల కానుంది. -
అందరివాడు
ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షమవుతాడు స్టాలిన్. చెడుపై అతను ఎలా పోరాటం చేశాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘స్టాలిన్’. అందరివాడు అనేది ఉపశీర్షిక. ‘రంగం’ ఫేమ్ జీవా హీరోగా రియా సుమన్, గాయత్రీకృష్ణ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నవదీప్ విలన్ పాత్ర చేశారు. రతిన శివ దర్శకుడు. తమిళ నిర్మాణ సంస్థ వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్తో కలిసి తెలుగు సంస్థలు నట్టిస్ ఎంటర్టైన్మెంట్ప్, క్విటీ ఎంటర్టైన్మెంట్స్ తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాయి. తమిళంలో ‘సీరు’ పేరుతో రూపొందింది. రెండు భాషల్లోనూ ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నిర్మాతలు డాక్టర్ ఇషారి కె. గణేష్, నట్టి కరుణ, నట్టి క్రాంతి మాట్లాడుతూ– ‘‘రంగం’ తర్వాత ఆ స్థాయిలో ఉండే మాస్ సినిమా ఇది. స్టాలిన్ పాత్రను జీవా అద్భుతంగా చేశారు. విలన్ పాత్రలో నవదీప్ ఒదిగిపోయారు. 15 కోట్ల బడ్జెట్తో రూపొందించాం. వచ్చే నెల 2న హైదరాబాద్లో ఆడియో ఫంక్షన్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీ సాయి, పాటలు: వెన్నెలకంటి, భువనచంద్ర, గురుచరణ్, సంగీతం: డి.ఇమ్మాన్, కెమెరా: ప్రసన్నకుమార్. -
శ్రీకాంత్గా నటించడం ఓ వరం
చెన్నై: ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు కృష్ణమాచారి శ్రీకాంత్గా నటించడం వరం అని యువ నటుడు జీవా పేర్కొన్నారు. పూర్వ భారత క్రికెట్ క్రీడా జట్టు కెప్టెన్ కపిల్దేవ్ బయోపిక్ను 83 పేరుతో చిత్రంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. 1983లో కపిల్దేవ్ కెప్టెన్సీలో ప్ర పంచకప్ను సాధించిన జట్టులో కృష్ణమాచారి శ్రీ కాంత్ భాగస్వామ్యం ఎంతో ఉందన్నది అందరికీ తెలిసిందే. తమిళనాడుకు చెందిన ఆయన ఒక క్రికె ట్ క్రీడాకారుడిగా తమిళనాడుకు పేరు తీసుకొచ్చారు. కాగా ఈ 83 చిత్రంలో కృష్ణమాచారి శ్రీ కాంత్ పాత్రలో నటుడు జీవా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆ పాత్రకు నటుడు జీవాను ఎంచుకోవ డం గురించి చిత్ర దర్శకుడు కబీర్ఖాన్ తెలుపుతూ చిత్రంలో కృష్ణమాచారి శ్రీకాంత్ గురించి ఆ లోచించగా ఆయన చలాకీతనం, వేగం, బ్యాటింగ్లో తనదైన స్టైల్ ప్ర ధానాంశాలు అనిపించాయన్నారు. అదేవిధంగా 1983లో ప్రపంచకప్ ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్న 83 చిత్రంలో అప్పటి జట్టులో ఉన్న వారి పాత్రల్లో నటులను ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు తెలిపారు. అప్పుడు కృష్ణమా చారి శ్రీకాంత్ పాత్రలో ఎవరిని నటింపజేయాలన్న విషయంలో ఆయన మా దిరి చలాకీగా ఉండే నటుడి కోసం అన్వేషించగా నటుడు జీవా బాగా నప్పుతారని భావించామన్నారు. జీవాలోనూ మంచి క్రికెట్ క్రీడాకారుడు ఉండటంతో 83 చిత్రానికి మరింత బలం చేకూరిందని చెప్పారు. కాగా కృష్టమాచారి శ్రీకాంత్ బ్యాటింగ్ స్టైల్ ను అనుచరించడం కోసం జీవా చాలా శిక్షణ తీసుకున్నట్లు చెప్పారు. ఆ పాత్రలో జీవా కచ్చితంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారని దర్శకుడు అన్నారు. కాగా కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో నటించడం గురించి జీవా మాట్లాడు తూ క్రికెట్ క్రీడ అంటే తనకు చిన్న వయసు నుంచే ఇష్టం అన్నారు. అలాంటిది 83 చిత్రంలో కృష్ణమా చారి శ్రీకాంత్ పాత్రలో నటించే అవకాశం వెతుక్కుంటూ రావడంతో పట్టరాని ఆనందం కలిగిందన్నారు. తన జీవితంలో రెండు లక్ష్యాలు ఒకే సా రి నెరవేరుతున్నట్లు భావన కలిగిందని అన్నా రు. నటుడు అయిన తరువాత తనకు ఇష్టమైన రంగం క్రికెట్ అని పేర్కొన్నారు. క్రికెట్ క్రీడ వి ధి విధానాలను తమిళనాడులో పరిచయం చే సింది కృష్ణమాచారి శ్రీకాంత్నేనని అన్నారు. అలాంటి పాత్రలో నటించడం తనకు వరం లాంటిదని జీవా పేర్కొన్నారు. ఈ పాత్రకు తనను ఎంపిక చేసిన దర్శకుడు కబీర్ ఖాన్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాన ని అన్నారు. ఇక ఇండియాలో అత్యంత ప్రతిభావంతుడైన నటుడు రణ్వీర్సింగ్తో కలసి ఈ చిత్రంలో నటించడం మరచిపోలేని అనుభవంగా పేర్కొన్నా రు. కాగా 83 చిత్రం సమ్మర్ స్పెషల్గా ఏప్రిల్ 20న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. -
‘జీవా చూడండి ఏం చేసిందో.. అచ్చం అలాగే’
తల్లీదండ్రులు తమ పిల్లలు హీరోలా ఫోజ్లు ఇచ్చిన, వారిలా డైలాగ్స్ చెప్పినా వారిని చూసి తెగ ఆనందపడిపోతుంటారు. అలా వారిని హీరో లుక్లో కనింపించేలా తయారు చేసి అచ్చం హీరోలాగే ఉన్నాడు అంటూ మురిసిపోతుంటారు. అలాగే మన భారత క్రికెట్ జట్టు మాజీ సారధి ఎంఎస్ ధోని కూడా కుతురు జీవా స్టైల్కు మురిసిపోతూ.. ఇన్స్టాగ్రామ్లో ఓ ఫొటో షేర్ చేసాడు. శనివారం జరిగిన ఏల్లే బ్యూటీ ఆవార్డు ఫంక్షన్లో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ధరించిన లాంటి సన్గ్లాసస్నే జీవా కూడా పెట్టుకుంది. రణ్వీర్ లాగే ఫోజ్ ఇచ్చిన జీవా ఫోటోను ధోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ‘రణ్వీర్ ఫొటో చూడగానే జీవా ఏం చేసిందో చూడండి.. అచ్చం అలాంటి గ్లాసెస్నే పెట్టుకుని, రణ్వీర్ లాగే ఫోజ్ ఇచ్చింది’ అంటూ ఆ ఫొటోకు కామెంట్ పెట్టాడు. ఈ ఫోటోకి ఇప్పటి వరకు 22 లక్షలకు పైగా లైకులు, 15 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. అలాగే ‘చాలా ముద్దుగా ఉంది, ఈ పోస్ట్ చూసిన రణ్వీర్ ఎలా స్పందిస్తారో చూడాలి’ అంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. కాగా జీవా ఫోటో చూసిన రణ్వీర్ సింగ్ ‘హహ్హహ్హ.. చాలా స్టైలీష్ జీవా అంటూ కామెంట్’ చేశాడు. View this post on Instagram Ziva was like why is he wearing my glasses then she goes upstairs to find hers and finally says my glasses r with me only.kids r different these days.at four and a half I won’t have even registered that I have similar sunglasses.next time she meets Ranveer I am sure she will say I have the same glasses as urs A post shared by M S Dhoni (@mahi7781) on Oct 7, 2019 at 6:15am PDT -
వీడే సరైనోడు
జీవా, నయనతార జంటగా రూపొందిన తమిళ చిత్రం ‘తిరునాళ్’ తెలుగులో విడుదల కానుంది. కోకా శిరీష సమ్పణలో నోవా సినిమాస్ పతాకంపై నిర్మాత జక్కుల నాగేశ్వరరావు ‘వీడే సరైనోడు’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఏడాదికి దాదాపుగా 150 చిన్న సినిమాలు విడుదల అవుతుంటాయి. అందులో 30 వరకు డబ్బింగ్ సినిమాలు వస్తుంటాయి. ఈ డబ్బింగ్ చిత్రాలు పెద్ద చిత్రాలకు పునాదులు లాగా ఉంటాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి’’ అన్నారు నిర్మాత ప్రసన్నకుమార్. ‘‘సినిమా విడుదలకు మంచి డేట్ కుదిరింది. నయనతార, జీవా నటన చిత్రానికి అదనపు ఆకర్షణ’’ అన్నారు నిర్మాత మోహన్ వడ్లపట్ల. ‘‘మంచి కథాంశంతో రూపొందిన చిత్రం ఇది’’ అని చిత్రనిర్మాత జక్కుల నాగేశ్వరరావు అన్నారు. -
జీవా కొత్త చిత్రం చీరు
విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటున్న నటుడు జీవా. ఆదిలో రామ్ కట్రదు తమిళ్ వంటి వైవిధ్య కథా చిత్రాల్లో నటించి నటుడిగా తానేమిటో నిరూపించుకున్న నటుడు జీవా. ఆ తరువాత పూర్తి కమర్శియల్ కథా చిత్రాలకు మారిపోయారు. ఆ తరువాత కుటుంబ కథా చిత్రాలు, హాస్యంతో కూడిన హర్రర్ కథా చిత్రాల్లో నటించి సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఈయన సినిమాల విషయంలో వేగం పెంచారు. అవును ఈయన ఇప్పుడు పలు చిత్రాల్లో నటిస్తున్నారు. జీవా నటించిన గొరిల్లా చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. బ్యాంకు రాబరీ ఇతివృత్తంతో కూడిన వినోద భరిత కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందననే తెచ్చుకుంది. కాగా జీవా నటించిన మరో చిత్రం జిప్సీ. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. నటుడు అరుళ్నిధితో కలిసి కళత్తిల్ సందిప్పోమ్ అనే కమర్శియల్ కథా చిత్రంలో నటిస్తున్నారు. దీన్ని ఆర్బీ.చౌదరి తన సూపర్గుడ్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్నారు. జీవా హీరోగా నటిస్తున్న మరో చిత్రానికి రెక్క చిత్రం ఫేమ్ రత్నశివ దర్శకత్వం వహిస్తున్నారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరిగణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్ర టైటిల్ను, ఫస్ట్లుక్ పోస్టర్ను స్వాతంత్య్రదినోత్సవాన్ని పురష్కరించుకుని బుధవారం విడుదల చేశారు. కాగా ఈ చిత్రానికి చీరు అనే పేరును ఖరారు చేశారు.ఆ పోస్టర్లో చాలా సీరియస్గా ఉన్న జీవా ఫొటోను చూస్తుంటే చీరు చిత్రం పూర్తిగా కమర్శియల్ అంశాలతో కూడిన మాస్ కథా చిత్రంగా ఉంటుందని అనిపిస్తోంది. చీరు చిత్ర పోస్టర్కు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. సోషల్ మీడియాలో గంటల వ్యవధిలోనే వైరల్ అయింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను యూనిట్ వర్గాలు వెల్లడించకపోయినా, సంగీతాన్ని డి.ఇమాన్, ఛాయాగ్రహణం ప్రసన్న అందిస్తున్నారని, చీరు చిత్రాన్ని అక్టోబర్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంస్థ నిర్మించిన కోమాలి చిత్రం గురువారం తెరపైకి వచ్చింది. -
సరైనోడు వీడే
జీవా, నయనతార జంటగా తమిళంలో రూపొంది, ఘన విజయం సాధించిన ఓ చిత్రాన్ని ‘వీడే సరైనోడు‘ పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. కోకా శిరీష సమర్పణలో నోవా సినిమాస్ పతాకంపై జక్కుల నాగేశ్వరావు ఈ చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేస్తున్నారు. జక్కుల నాగేశ్వరావు మాట్లాడుతూ – ‘‘గ్రామీణ, నగర నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే చిత్రమిది. జీవా నటన, నయనతార గ్లామర్ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. ప్రస్తుతం సెన్సార్ పూర్తయింది. ఈనెల 8న పాటలు విడుదల చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీకాంత్ దేవా, సహ నిర్మాతలు: మాస్టర్ కోకా లోహితా„Š – మాస్టర్ కోకా నిశ్చల్ సాయికృష్ణ. -
గొరిల్లా సాయం
హీరోలకు సహాయం చేసే జంతువులు ప్రధాన పాత్ర పోషించిన పలు సినిమాలు గతంలో విజయవంతమయ్యాయి. కాకపోతే గతంలో ఏనుగులు, కుక్కలు, కోతులు, పాములు హీరోలకు సహాయం చేసే పాత్రల్లో నటించి, మెప్పించగా ఇప్పుడు గొరిల్లా వంతు వచ్చింది. ‘రంగం’ ఫేమ్ జీవా హీరోగా, ‘అర్జున్రెడ్డి’ ఫేమ్ శాలినీపాండే హీరోయిన్గా గొరిల్లా ముఖ్య పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గొరిల్లా’. డాన్ శాండీ దర్శకత్వం వహించారు. సంతోషి సమర్పణలో గంగా ఎంటర్టైన్మెంట్స్, ఆల్ ఇన్ వన్ సంస్థల నిర్మాణంలో గంగా శబరీశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలకానుంది. శబరీశ్ రెడ్డి మాట్లాడుతూ–‘‘బ్యాంక్ను కొల్లగొట్టే బృందానికి గొరిల్లా చేసిన సహాయం ఏంటి? అసలు బ్యాంకులను వారు ఎందుకు కొల్లగొడుతున్నారు? అనే పాయింట్తో తెరకెక్కిన చిత్రమిది. ఇండియన్ స్క్రీన్ మీద తొలిసారి గొరిల్లా యాక్ట్ చేసింది మా సినిమాలోనే. శిక్షణ పొందిన గొరిల్లాను మా సినిమా కోసం తీసుకున్నాం’’అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్యామ్. సి.యస్, కెమెరా : ఆర్.బి.గురుదేవ్. -
పంత్కు హిందీ నేర్పిస్తున్న జీవా ధోనీ
-
పంత్కు పాఠాలు నేర్పిస్తున్న జీవా
భారత క్రికెట్ మాజీ సారథి, మహేంద్ర సింగ్ ధోనీ గారాల కూతురు జీవాకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. క్యూట్ ఎక్స్ప్రెషన్తో ముద్దు ముద్దు మాటలతో కోట్ల మందిని తన అభిమానులుగా మార్చేసుకుంది జీవా ధోనీ. తాజాగా జీవా ధోనీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్కు జీవా హిందీ నేర్పిస్తూ తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఫ్యాన్స్ను ఆకట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియా వైరల్గా మారింది. -
నాకు కెమెరామెన్కు ఎలాంటి లింకూ లేదు
సినిమా: నాకు ఆయనతో సంబంధం అంటగడతారా అని మండి పడుతోంది నటి నిక్కీగల్రాణి. ఇటీవల కథానాయకిగా వెనుక పడ్డ ఈ అమ్మడు అబ్బే అదేం లేదు నేను బిజీగానే ఉన్నాను అని అంటోంది. కలగలప్పు–2, చార్లీచాప్లిన్–2 చిత్రాల తరువాత ఈ అమ్మడు నటించిన కీ చిత్రం 12న తెరపైకి రానుంది. ఇందులో జీవాతో రోమాన్స్ చేసింది. ఈ సందర్భంగా నిక్కీగల్రాణితో చిట్చాట్ ప్ర: చిత్రం పేరు కీ అనగానే మీకేమనిపించింది? జ:సాధారణంగా కీ అంటే తాళం కప్పకు వాడే చెవి అని అని అనుకున్నాను. అయితే దర్శకుడు చెప్పింది వేరు. మనం ఏ పని చేసినా మంచి జరగవచ్చు, లేదా చెడూ జరగవచ్చునని, దానికే కీ అని అర్థం అన్నారు. కథ విన్న తరువాత నాకూ కీ అనేదానికి అర్థం తెలిసింది. ప్ర: కీ చిత్రంలో మీ పాత్ర గురించి? జ: నేనిందులో దియా అనే యువతిగా నటించాను. ఈ నాగరిక కాలంలో మనం రకరకాల ఆధునిక సెల్ఫోన్లను వాడుతున్నాం. ఒక హ్యాకర్ ద్వారా మన జీవితాలు ఎలా బాధింపునకు గురవుతాయని చెప్పే చిత్రంగా కీ ఉంటుంది. మొబైల్ ఫోన్లు వాడే ప్రతివారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పే చిత్రంగా ఇది ఉంటుంది. ప్ర:జీవాతో నటించిన అనుభవం? జ: జీవాతో కలిసి నటించడం చాలా సంతోషం. మేమిద్దం కలిసి నటించిన మొదటి చిత్రం ఇది. అయితే కలగలప్పు–2 చిత్రం ముందుగా విడుదలైంది. జీవా నేను చాలా జాలీగా ఉంటాం. షూటింగ్లో గొడవ పడుతూనే ఉంటాం. అదే విధంగా ఇతరులను ఆట పట్టిస్తాం. షూటింగ్లో అంత జాలీగా ఉంటుంది. ప్ర:చిత్ర దర్శకుడు కలీస్ గురించి? జ: కొత్త దర్శకుడు కలీస్. చాలా జాగ్రత్తగా ఈ కథను ఎంచుకున్నారు. అంతకంటే బాగా తెరకెక్కించారు. అదే విధంగా దీనికి విశాల్ చంద్రశేఖర్ చాలా మంచి సంగీతాన్ని అందించారు. ఇందులో నాకు జీవాకు ఒక డ్యూయోట్ పాట ఉంది. అది మా ఇద్దరికీ చాలా నచ్చిన పాట. ప్ర: హీరోయిన్లను అందంగా చూపించడానికి ఛాయాగ్రాహకులతో లింక్ పెట్టుకుంటారంటారు. అదే విధంగా మీరూ లింక్ పెట్టుకున్నారా? జ: నాకు కెమెరామెన్కు ఎలాంటి లింకూ లేదు. నేను నా పని చేస్తాను. ఆయన తన పని చేసుకుంటారు. అందుకే తెరపై చూస్తున్నప్పుడు సన్నివేశాలు అందంగా ఉంటాయి. అందుకు కెమెరామెన్లతో లింకు పెట్టుకోవలసిన అవసరం ఉండదు. అలా అనడం కూడా సరికాదు. ప్ర: చిత్రాలను ఎంచుకునేటప్పుడు మీరు తీసుకునే శ్రద్ధ గురించి ? జ: చిత్రం అన్ని వర్గాల వారిని అలరించాలని నేను భావిస్తున్నాను.ముఖ్యంగా అందులో నా పాత్రకు ప్రాధాన్యత ఉండాలి. అలాంటి కథలకే అధిక ప్రాముఖ్యతనిస్తాను. -
పొలిటికల్ సినిమా కాదు
‘‘ముఖ్యమంత్రిగారూ మీరు మాటిచ్చారు’ రాజకీయ సినిమా కాదు.. చక్కని కుటుంబ కథా చిత్రం. ‘రక్తకన్నీరు’ టైటిల్ బలంగా ఉన్నా సినిమా వినోదాత్మకంగా ఉంటుంది. అలా మా టైటిల్ని చూసి ఇది పొలిటికల్ సినిమా అనుకోవద్దు. చాలా గొప్ప కామెడీ ఉంటుంది’’ అని నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి అన్నారు. బాబూమోహన్, పోసాని, జీవా, అలీ, నవీనారెడ్డి ముఖ్య తారలుగా పోసాని కృష్ణమురళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ముఖ్యమంత్రిగారూ మీరు మాటిచ్చారు’. పి.రత్నాకర్, భీమనాదం భరత్, శ్రీధర్ చల్లా నిర్మించారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ సినిమా టైటిల్ని ప్రకటించారు. పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్కి వంద కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామంలో ఈ సినిమా షూటింగ్ చేశాం. టైటిల్ ఏంటన్నది సినిమా పూర్తయ్యే వరకు నిర్మాతలకు కూడా తెలియదు. అలాంటిది ‘ఫలానా టైటిల్తో పోసాని ఓ సినిమా తీశారు, అది చంద్రబాబునాయుడుగారిని అన్పాపులర్ చేసేలా ఉంది’ అని ఎవరో ఓ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్కి ఫిర్యాదు చేశారు. అతను ఫిర్యాదులో పేర్కొన్న టైటిల్కి, మా టైటిల్కి చాలా తేడా ఉంది. ‘ముఖ్యమంత్రిగారూ మీరు మాటిచ్చారు’ అన్నది చాలా పాజిటివ్ టైటిల్. ఇందులో చంద్రబాబు గురించి బ్యాడ్గా ఉంటే ఏపీలో నన్ను కూడా బ్యాన్ చేయండి. ఆయన్ని విమర్శించడానికి నేను ఈ సినిమా చేయలేదు. ఇందులో ఆయన పేరు, గెటప్, ఆలోచనలు ఏవీ ఉండవు. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి, హరికృష్ణ, బాలకృష్ణగార్ల పాత్రలు కూడా ఉండవు. ‘మేనిఫెస్టో’ అంశాలపై మాత్రమే చర్చించాం. ఇది ఓ రాష్ట్రానికి సంబంధించిన కథ కాదు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందే కథ. ప్రజాస్వామ్యం, ప్రజల క్షేమం గురించి తీశాం. కులం, డబ్బు, మందుని చూసి కాకుండా నిజాయతీగా సేవ చేసేవాడికి ఓటెయ్యండి అని చెబుతున్నాం. దీనికి, బాబుకి ఏంటి సంబంధం? అవినీతి, వెన్నుపోటు పొడిచినవాళ్లు భయపడాలి. కానీ, బాబు అలాంటివి చేయలేదు కదా? నిజాయతీపరుడు కదా? మరెందుకు ఉలిక్కిపడుతున్నారు. నేను ఇండస్ట్రీకి వచ్చింది సినిమాలు చేసుకొని బతకడానికి. ఈ సినిమాకి, బాబుగారికి ఏ సంబంధం లేదు. ఇందులో 2రీళ్లు రాజకీయాలుంటే, మిగిలిన 12 రీళ్లు వినోదం ఉంటుంది. ఫ్యామిలీ డ్రామా, రైతు సమస్యలు, నిరుద్యోగం, ప్రేమికుడి మోసం... ఇలాంటి అంశాలని చూపించాం. ఒకర్ని టార్గెట్ చేయడానికి ఈ సినిమా తీయలేదు. ఈ సినిమాకి కథ, మాటలు నేను రాయలేదు. నా కొడుకు పోసాని ఉజ్వల్ రాశాడు. వాడికిది తొలి సినిమా. ప్రస్తుతం హంగేరీలో ‘మీడియా సైన్స్’ అనే కోర్సు చేస్తున్నాడు. కొత్తగా ఉంటుంది, బాగుంటుంది సినిమా తీయమని చెప్పి ఈ కథ నా చేతిలో పెట్టాడు. నా కొడుక్కి చంద్రబాబు గురించి ఏం తెలుసండి? వాడి వయసు 20ప్లస్. కానీ, ఆలోచనల్లో నాకంటే పదేళ్లు ముందుంటాడు’’ అన్నారు. నటుడు, దర్శక–నిర్మాత ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘పోసాని నమ్మింది ధైర్యంగా, ముక్కుసూటిగా చెబుతాడు. ఆయన రచనా శైలికి సెల్యూట్. పాలించేవారెవరైనా ఆడిన మాట తప్పకూడదు. ప్రజల పట్ల పాలకులకు భయం, భక్తి ఉండాలి. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజలకిచ్చిన మాట తప్పొద్దు. ఎవరో ఏదో ఫిర్యాదు చేశారని అమరావతికి రండి అంటూ చెప్పొద్దని నేను ఎన్నికల కమిషన్కి విజ్ఞప్తి చేస్తున్నా. మేము ప్రజల పక్షం. మాకు సెన్సార్ బోర్డు ఉంది. ఏదైనా అభ్యంతరాలుంటే కట్స్ చెబుతారు. మమ్మల్ని అమరావతి పిలిచించి సంజాయిషీ అడగకండి’’ అన్నారు. అలీ మాట్లాడుతూ– ‘‘చెన్నైలో పరుచూరి బ్రదర్స్ వద్ద అసిస్టెంట్గా చేసిన పోసాని అన్న ‘పోలీస్ బ్రదర్స్’ సినిమాతో రచయితగా మారారు. హరికృష్ణ, కృష్ణగార్లతో పాటు ఇండస్ట్రీలోని కమెడియన్లందర్నీ పెట్టి ‘శ్రావణమాసం’ సినిమా తీశారు. ఆ చిత్రం ఫ్లాప్ అయినా ఏ ఒక్కరికీ ఒక్క రూపాయి కూడా లేదనకుండా ఆస్తులు అమ్మి మరీ చెల్లించిన గొప్ప మనసున్న వ్యక్తి’’ అన్నారు. బాబూమోహన్ మాట్లాడుతూ– ‘‘ఈ మధ్య సినిమాల్లో నటించడం లేదు. ఎందుకు? అని అందరూ అడుగుతుంటే, మంచి పాత్ర వస్తే చేస్తానని చెబుతున్నా. పోసాని మన సినిమా చేయాలనగానే మంచి పాత్ర దొరికిందనుకున్నా’’ అన్నారు. -
నటుడు జీవా, శ్రీలక్ష్మీ డ్యూయెట్
చింతనిప్పుల్లాంటి కళ్లు, రౌద్రంగా కనిపించే ముఖంతో ప్రతినాయకుడి వేషాల్లో జీవించే జీవ, హాస్యనటి శ్రీలక్ష్మితో కలిసి ఆడిపాడారు. బంతిపూల తోటలో ఇద్దరూ ఒక్కటిగా యుగళగీతం ఆలపించారు. ఈ సన్నివేశాలను స్థానికులు ఎగబడి చూశారు. గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామం సమీపంలో నిన్న (మంగళవారం) పూలతోటలో ‘పండుగాడి ఫొటో స్టూడియో’ షూటింగ్లో నెలకొన్న సందడి ఇది. గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మాతగా, పెదరావూరు ఫిలిం స్టూడియో పతాకంపై ఆలీ, రిషిత హీరో హీరోయిన్లుగా దిలీప్రాజా దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. గత రెండు నెలలుగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ జరపుకుంటోంది. పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో తీసే సినిమాగా రిజిస్ట్రర్ అయిన తొలి సినిమాగా గుర్తింపుతో పాటు, ప్రభుత్వ అనుమతులను చిత్ర యూనిట్ పొందింది. ఇంకా ఈ చిత్రంలో సీనియర్ నటులు వినోద్ కుమార్, బాబూమోహన్, సుధ, దేవి తదితరలు నటిస్తున్నారు. -
నన్ను జైలుకు పంపాలని చూస్తున్నారు!
తమిళసినిమా: దర్శకుడు రాజుమురుగన్ తనను జైలుకు పంపాలని చూస్తున్నారని గీత రచయిత యుగభారతి పేర్కొన్నారు. అసలు విషయం ఏమిటంటే కూక్కూ, జోకర్ వంటి సంచలన కథా చిత్రాలను తెరకెక్కించిన రాజుమురుగన్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం జిప్సీ. జీవా కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలోని వెరీ వెరీ బ్యాడ్ అనే సింగిల్ సాంగ్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ల్యాబ్లో జరిగింది. ఇది సమకాలీన రాజకీయాలను ఆవిష్కరించే పాటగా ఉండడంతో విడుదలైన కొద్ది సేపటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో గీత రచయిత యుగభారతీ మాట్లాడుతూ దర్శకుడు రాజుమురుగన్ను తాను బాగా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నానన్నారు. అయితే ఆయన మాత్రం తనను జైల్లోకి నెట్టాలని చూస్తున్నట్లుందని పేర్కొన్నారు. అది ఈ చిత్రంలోని వెరీ వెరీ బ్యాడ్ పాటతోనో, మరో చిత్రంలో పాటతో జరుగుతుందో తెలియదన్నారు. ఇకపోతే ఈ పాటలో చెప్పిన విషయాలతోనే జిప్సీ చిత్రం సాగుతుందని యుగభారతి తెలిపారు. అనంతరం చిత్ర కథానాయకుడు జీవా మాట్లాడుతూ ఒక గ్రామీణ గాయకుడు దేశం అంతా చుట్టొస్తాడన్నారు. అలా గడించిన అనుభవాలతో విప్లవాత్మకమైన గాయకుడిగా మారతాడన్నారు. అతను ఎందుకలా మారతాడన్నదాని వెనుక ఒక ప్రేమ కథ ఉంటుందని దర్శకుడు రాజుమురుగన్ చెప్పిన ఒన్లైన్ స్టోరీ తనకు బాగా నచ్చిందన్నారు. అదేవిధంగా తన పాత్ర చిత్రీకరణ అందరినీ ఆశ్చర్యపరుస్తుందని అన్నారు. ఈ చిత్ర కథలో వాస్తవాలు ఉంటాయని జీవా అన్నారు. -
అక్కినేని అన్నపూర్ణమ్మ
అమ్మ పాత్రలనగానే గుర్తొచ్చే నటీమణుల్లో అన్నపూర్ణమ్మ ఒకరు. క్యారెక్టర్ నటిగా పలు పాత్రలు చేసిన ఆమె ప్రధాన పోషిస్తున్న తాజా చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’. ఇప్పటివరకూ దాదాపు సాఫ్ట్ క్యారెక్టర్స్లో కనిపించిన అన్నపూర్ణమ్మ ఇందులో పవర్ఫుల్ పాత్ర చేస్తున్నారు. ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎం.ఎన్.ఆర్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నర్రా శివనాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు. మాస్టర్ రవితేజ టైటిల్ రోల్ చేస్తున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ అమరావతి పరిసర ప్రాంతాల్లో పూర్తయ్యింది. ఈ సందర్భంగా నిర్మాత చౌదరి మాట్లాడుతూ– ‘‘పల్లెటూరిలో ఎవరికి ఏం జరిగినా రచ్చబండ దగ్గర పంచాయితీ చేస్తారు. ఈ రచ్చబండకు అక్కినేని అన్నపూర్ణమ్మ పెద్ద దిక్కుగా వ్యవహరిస్తారు. ఆమెకు ధీటుగా ఎదురెళ్లే వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు పాత్రలో సీనియర్ నటుడు బెనర్జీ నటిస్తున్నారు. హీరోయిన్గా అర్చన నటిస్తుండగా, జీవ, రఘుబాబు, కారుమంచి రఘు, తాగుబోతు రమేశ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు చేస్తున్నారు’’ అని చెప్పారు. -
ఆ బయోపిక్లో విజయ్ దేవరకొండ లేడట..!
అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ సృష్టించిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్లో కూడా విజయ్కి మంచి క్రేజ్ రావటంతో బాలీవుడ్ ఎంట్రీపై కూడా కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కపిల్ దేవ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘83’ సినిమాలో విజయ్ అతిథి పాత్రలో కనిపించనున్నాడన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ విషయంపై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చారు. 83లో విజయ్ దేవరకొండ నటించటం లేదని తెలుస్తోంది. బాలీవుడ్కు ఎంట్రీ ఇస్తే హీరోగానే ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్న విజయ్, కపిల్ బయోపిక్ ఆఫర్కు నో చెప్పటంతో ఆ పాత్రకు తమిళ యువ కథానాయకుడు జీవాను తీసుకున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతల్లో ఒకరైన విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. -
కృష్ణమాచారిగా...
భారతదేశానికి క్రికెట్లో తొలి ప్రపంచ కప్ సాధించి పెట్టిన ఘనత కపిల్దేవ్, అండ్ టీమ్కి దక్కుతుంది. 1983లో జరిగిన క్రికెట్ ప్రపంచకప్ పోటీల్లో ఇండియాని విశ్వవిజేతగా నిలిపి భారతీయులంతా గర్వపడేలా చేశారు. ఆ మధుర క్షణాల్ని, అప్పటి ఇండియా టీమ్ కెప్టెన్ కపిల్దేవ్ బయోపిక్ని బాలీవుడ్లో తెరపైకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ‘ఏక్ థా టైగర్’ ఫేమ్ కబీర్ ఖాన్ దర్శకత్వంలో ‘1983’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కపిల్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటిస్తున్నారు. 1983 ప్రపంచ కప్లో పాల్గొన్న ఇతర ఆటగాళ్లలో కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా ఒకరు. తమిళనాడుకు చెందిన శ్రీకాంత్ ఓపెనర్గా బరిలోకి దిగి చక్కని ఆటతీరును ప్రదర్శించేవారు. ‘1983’ చిత్రంలో ఆయన పాత్రలో టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ నటించనున్నారంటూ గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా శ్రీకాంత్ పాత్రలో హీరో జీవా నటించనున్నారట. తమిళనాడుకు చెందిన శ్రీకాంత్ పాత్రలో తమిళ హీరో అయితేనే బాగుంటుందని భావించిన చిత్రవర్గాలు జీవాని సంప్రదించడంతో ఆయన గ్రీన్సిగ్నల్ ఇచ్చారట. అంతేకాదు.. ఈ పాత్ర కోసం కృష్ణమాచారి శ్రీకాంత్ వద్ద ఆయన క్రికెట్లో శిక్షణ తీసుకుంటుండటం విశేషం. -
జీవాకి జోడీగా..
‘రంగం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో జీవా. ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చారు మలయాళ బ్యూటీ మంజిమా మోహన్. ఈ ఇద్దరూ ఇప్పుడు ఓ తమిళ సినిమా కోసం జోడీ కడుతున్నారు. ఈ చిత్రాన్ని జీవా సోదరుడు, హీరో జితన్ రమేశ్ నిర్మిస్తుండటం విశేషం. సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘మాప్పిళై సింగం’ సినిమా ఫేమ్ రాజశేఖర్ దర్శకత్వం వహించనున్నారు. శింబు హీరోగా నటించిన ‘అచ్చమ్ ఎన్బదు మడమయడా’ సినిమాతో కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన మంజిమా మోహన్ ఆ తర్వాత మరో రెండు తమిళ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు జీవాకి జోడీగా నటించేందుకు ఆమె గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ‘‘జీవా, అరుళ్ని«థి కలిసి నటించనున్న మల్టీస్టారర్ చిత్రంలో జీవాకి జోడీగా మంజిమ నటిస్తారు. స్నేహం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ నెల 13న షూటింగ్ ప్రారంభించనున్నాం’’ అని జితన్ రమేశ్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: అభినందన్. -
జీవాతో జత కుదిరింది!
జీవాతో నటి మంజిమామోహన్కు జత కుదిరింది. ‘అచ్చం ఎంబదు మడమయడా’ చిత్రంలో శింబుతో కలిసి కోలీవుడ్కు పరిచయమైన మాలీవుడ్ బ్యూటీ మంజిమామోహన్. ఈ తరువాత రెండు మూడు చిత్రాల్లో నటించినా ఈ అమ్మడి కెరీర్ ఇక్కడ వేగం పుంజుకోలేదనే చెప్పాలి. అయితే మాతృభాషతో పాటు తెలుగు వంటి ఇతర భాషల్లోనూ నటిస్తున్న మంజిమామోహన్ తాజాగా ఒక మల్టీస్టారర్ చిత్రంలో నటించే అవకాశం వరించింది. యువ నటులు జీవా, అరుళ్నిధి కలిసి నటించనున్న చిత్రంలో ఈ బ్యూటీ నటించనుంది. దీనికి రాజశేఖర్ దర్శకత్వం వహించనున్నారు. దీన్ని సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై నటుడు జిత్తన్ రమేశ్ నిర్మించనున్నారు. ఈ క్రేజీ చిత్రం గురించి ఆయన తెలుపుతూ మాప్పిళై సింగం చిత్ర ఫేమ్ రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని తెలిపారు. ఇది స్నేహం ఇతివృత్తంగా తెర పై ఆవిష్కరించనున్న కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇంతకు ముందు తమ సంస్థలో విజయ్ హీరోగా స్నేహం నేపథ్యంలో ఫ్రెండ్స్ చిత్రాన్ని నిర్మించామని, ఇది ఆ తరహాలో సాగే కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఇందులో జీవాకు జంటగా నటి మంజిమామోహన్ను ఎంపిక చేసినట్లు తెలిపారు. అరుళ్నిధి సరసన నటించే నటి ఎంపిక జరుగుతోందని అన్నారు. చిత్రాన్ని డిసెంబర్ 13న ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇందులో మీరు కూడా నటిస్తున్నారా అన్న ప్రశ్నకు తాను ప్రొడక్షన్నే చూసుకుంటున్నానని చెప్పారు. ఈ చిత్రానికి యువన్శంకర్రాజా సంగీతాన్ని, అభినందన్ ఛాయాగ్రహణం అందించనున్నారు. కాగా ప్రస్తుతం జీవా గొరిల్లా, జిప్సీ చిత్రాలను పూర్తి చేసి కీ చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా అరుళ్నిధి పుహళేంది ఉనుమ్ నాన్ చిత్రంతో పాటు భారత్ నీలకంఠన్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేస్తున్నారు. ఇక నటి మంజిమామోహన్ దేవరాట్టం చిత్రంలో నటిస్తోంది. -
వైరల్: ధోని ట్రైనింగ్తో స్టన్నింగ్ క్యాచ్
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్గా ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. తన కూతురు జీవాతో జరిగే సరదా సన్నివేశాలు ఎప్పటికప్పుడు సోషల్మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. తాజాగా ఇంటి ఆవరణలో తన పెంపుడు కుక్కలకు క్యాచ్ ప్రాక్టీస్ చేపించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ‘నా పెట్ డాగ్స్తో గడిపిన క్షణాలు వెలకట్టలేనివి. వాటికి ట్రైనింగ్ ఇవ్వడం, క్యాచ్ ప్రాక్టీస్ చేపించడం చాలా అనందంగా ఉంది’ అంటూ ధోని పేర్కొన్నాడు. కొద్ది రోజుల క్రితం తన కూతురు జీవాతో జరిగిన సరదా సన్నివేశాన్ని వీడియో తీసి పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ఈ వీడియోలో జీవా ఆడుకుంటూ ఉండగా ధోని భార్య సాక్షి "జీవా.. నాన్న మంచోడా చెడ్డోడా? అని అడగ్గా.. మంచోడు(గుడ్) అని బదులిచ్చింది. ఆ తర్వాత మీరందరూ మంచివారు. మీ అందరూ (బిగ్గరగా)" అని జీవా బదులిచ్చింది. ఇక టెస్టులకు గుడ్బై చెప్పిన జార్ఖండ్ డైనమెట్ పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. ఇంగ్లండ్తో వన్డే, టీ20 సిరీస్ అనంతరం ఖాళీ సమయం దొరకడంతో కుంటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. A bit of hugging,training, catching practice and getting unconditional love in return.priceless A post shared by M S Dhoni (@mahi7781) on Aug 24, 2018 at 12:41am PDT Very smart A post shared by M S Dhoni (@mahi7781) on Aug 21, 2018 at 3:28am PDT -
చింపాంజీ.. వెరీ చిలిపి
స్టూడెంట్ గ్యాంగ్, రౌడీ గ్యాంగ్, కామెడీ గ్యాంగ్.. ఇలా డిఫరెంట్ గ్యాంగ్ల గురించి వింటాం. సినిమాల్లో చూస్తాం. మరి.. గొరిల్లా గ్యాంగ్ పవర్ ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం ‘గొరిల్లా’ సినిమా చూడాల్సిందే. కొత్త దర్శకుడు డాన్ శాండీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జీవా, షాలినీ పాండే, యోగిబాబు, రాధా రవి, సతీష్, వివేక్ ప్రశన్న, రాజేంద్రన్ ఈ గొరిల్లా గ్యాంగ్ సభ్యులు. ‘గొరిల్లా’ ఫస్ట్ లుక్ను శుక్రవారం విడుదల చేశారు. ‘విక్రమ్వేదా’ ఫేమ్ శ్యామ్ సీఎస్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ‘‘చింపాజీలు చాలా తెలివైనవి. అవి చేసే చిలిపి చేష్టలకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలో చింపాంజీ ఓ మేజర్ క్యారెక్టర్ చేసింది. యాక్షన్ అండ్ కామెడీ సీన్స్ తీయడానికి చింపాజీకి నాలుగు నెలలు ముందే ట్రైనింగ్ ఇప్పించాం. సినిమా విడుదల తర్వాత మంచి ప్రయత్నం చేశామని ఆడియన్స్ మెచ్చుకుంటారన్న నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
వారితో రొమాన్సే చాలు !
తమిళసినిమా : ఇప్పటికీ హీరోలతో రొమాన్సే చాలనుకుంటున్నాను అంటోంది నటి నిక్కీగల్రాణి. కోలీవుడ్లో గ్లామరస్ హీరోయిన్గా పేరొందిన ఉత్తరాదిభామ ఈ జాణ. డార్లింగ్, కలగలప్పు–2 చిత్రాలతో తమిళ సినీరంగంలో సక్సెస్ఫుల్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నిక్కీగల్రాణికి ఇటీవల నటించిన పక్కా చిత్రం నిరాశపరచింది. ప్రస్తుతం కీ, చార్లిన్చాప్లిన్–2 చిత్రాల్లో నటిస్తోంది. ప్రభుదేవాకు జంటగా చార్లిన్ చాప్లిన్–2 చిత్ర షూటింగ్ను పొల్లాచ్చిలో పూర్తి చేసుకుని చెన్నైకి తిరిగి వచ్చిన నిక్కీగల్రాణితో చిన్న ఇంటర్వ్యూ.. ప్ర: ప్రేమ, రొమాన్స్లాంటి పాత్రలతో పాటు యాక్షన్ కథా పాత్రల్లో నటించాలన్న ఆసక్తి లేదా? జ: నిజం చెప్పాలంటే నేను కథ, నా పాత్ర బాగుండాలన్న కోణంలోనే ఆలోచిస్తాను. అందులో ప్రేమ, రొమాన్స్, సెంటిమెంట్, యాక్షన్ సన్ని వేశాలు ఉన్నాయా అన్నది ఆలోచించను. నచ్చిన కథా చిత్రాలను ఎంచుకుని నటించడం వల్లే వరుసగా అవకాశాలతో ముందుకు సాగుతున్నాను. ప్ర: ప్రస్తుతం హీరోయిన్కు ప్రాముఖ్యత ఉన్న కథలను తయారు చేసుకుంటున్న క్రియేటర్స్ అధికం అవుతున్నారు. అలాంటి కథా చిత్రాల్లో నటించే ఆలోచన ఉందా? జ: ప్రస్తుతానికి అలాంటి కథా చిత్రాల్లో నటించాల్సిన అవసరం నాకు లేదు. మరొ కొన్నేళ్లు నేను హీరోహీరోయిన్ల చుట్టూ తిరిగే ప్రేమకథా చిత్రాల్లోనే నటించాలని కోరుకుంటున్నాను. నా చుట్టూ తిరిగే కథా చిత్రాలు ఇప్పుడే అవసరం అనుకోవడం లేదు. మరి కొన్ని ఏళ్లు హీరోలతో రొమాన్స్ చేసే పాత్రల్లో నటించి, ఆ తరువాత మీరంటున్న ఆ హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల గురించి ఆలోచిస్తాను. ప్ర: ప్రస్తుతం నటిస్తున్న కీ, చార్లిన్ చాప్లిన్ 2 చిత్రాల గురించి? జ: నిజం చెప్పాలంటే జీవాకు జంటగా నటించడానికి అంగీకరించింది కీ చిత్రంలోనే. అయితే ఆ తరువాత ఒప్పుకున్న కలగలప్పు–2 చిత్రం ముందుగా తెరపైకి వచ్చింది. కీ చిత్రంలో గ్రాఫిక్స్కు ప్రాధాన్యత ఉండడంతో ఆ చిత్ర విడుదల్లో జాప్యానికి కారణం అని నా అభిప్రాయం. ఇందులో చలాకీగా ఉండే యువతిగా నటిస్తున్నాను. నాకు ఏది అనిపిస్తే అది చేసే పాత్ర. ఆ తరువాత జరిగే పరిణామాల గురించి ఆలోచించని పాత్ర. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ చిత్రంలో నటించాను. చిత్ర విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇక చార్లిన్ చాప్లిన్–2 చిత్రం గురించి చెప్పాలంటే ఈ చిత్రానికి సంబంధించి ఇంకా ఒక్క పాటనే చిత్రీకరించాల్సి ఉంది. దర్శకుడు శక్తిచిదంబరం, ప్రభుదేవా వంటి జాలీ అయిన కాంబినేషన్లో నటిస్తున్నాను. చిత్ర షూటింగ్ పండగ వాతావరణంలో సాగింది. షూటింగ్ అంతా చాలా సరదాగా సాగింది. ఇందులో నా పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. ప్ర: నెరుప్పుడా, పక్కా చిత్రాలు ఆశించిన విధంగా సక్సెస్ కాలేదు.దీనికి మీ స్పందన? జ: చిత్రం విజయం సాధింస్తుందని భావించే 100 శాతం శ్రమిస్తాం. అలాంటి చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందక పోతే బాధే కదా. అయితే దేశవ్యాప్తంగా ఏడాదికి 500లకు పైగా చిత్రాలు విడుదలవుతున్నాయి. అందులో నా చిత్రం ఒకటి అని సరిపెట్టుకుంటాను. -
గొరిల్లాతో గోల గోల!
విహారయాత్రకు వెళ్లినప్పుడు అడవిలో గొరిల్లాను చూస్తే భయపడతాం. అదే జూలో చూస్తే అది ఏం చేస్తుందా? అని ఆసక్తికరంగా గమనిస్తాం. మరి... అదే గొరిల్లా సినిమాల్లో ఓ కీలక పాత్ర చేస్తే ఎలా ఉంటుంది? అనేది కొన్ని సినిమాల్లో చూశాం. ఇప్పుడు మేము మళ్లీ కొత్తగా చూపించబోతున్నాం అంటున్నారు ‘గొరిల్లా’ మూవీ టీమ్. డాన్ శాండీ దర్శకత్వంలో తమిళ యాక్టర్ జీవా హీరోగా నటించిన చిత్రం ‘గొరిల్లా’. ఈ సినిమాలో తన వంతు షూటింగ్ను కంప్లీట్ చేశారీ హీరో. మరి.. ‘గొరిల్లా’ సినిమాలో నాయకా నాయికలు జీవా, షాలినీ పాండేలు గొరిల్లాతో ఏ విధంగా గోల గోల చేశారనేది థియేటర్లో బొమ్మపడితే కానీ తెలియదు. ఈ సినిమా షూటింగ్ కోసం మార్చిలో థాయ్లాండ్ కూడా వెళ్లింది చిత్రబృందం. ‘రంగం, మాస్క్’ వంటి డబ్బింగ్ సినిమాల ద్వారా జీవా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ‘గొరిల్లా’ను కూడా తెలుగులో విడుదల చేయాలనుకుంటున్నారట. -
నవవధువు ఆత్మహత్యాయత్నం
అన్నానగర్: చెన్నై సమీపంలో మంగళవారం వివాహం జరిగిన రెండో రోజే యువతి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం విషమ పరిస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చెన్నై, కేకే.నగర్ శివలింగపురానికి చెందిన జీవా (24). అతని పైఇంట్లో నివసిస్తున్న ప్రియాంక (21) ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను పెద్దలు వ్యతిరేకించారు. ఈ స్థితిలో గత 20వ తేదీన జీవా, ప్రియాంక ఇంటి నుంచి వెళ్లి వివాహం చేసుకున్నారు. అనంతరం దంపతులు జీవా ఇంటికి వెళ్లారు. అతని అమ్మ కామాక్షి చెబుతూ మీరు పెళ్లి చేసుకున్న ముహూర్తం మంచిది కాదు. మూడు నెలల తరువాత బంధువులను పిలిచి వివాహం ఘనంగా జరిపిస్తానని చెప్పింది. జీవాను ప్రియాక మెడలో ఉన్న తాళి విప్పమని చెప్పింది. దీని ప్రకారం జీవా భార్య మెడలో తాళిని విప్పాడు. తరువాత ప్రియాంకను ఆమె తల్లిదండ్రుల వద్దకు పంపారు. ఈ స్థితిలో మంగళవారం ప్రియాంక తన భర్త జీవాకు ఫోన్ చేసింది. అతను ఫోన్ తీయకపోవడంతో మనస్తాపం చెందిన ప్రియాంక ఇంట్లో ఉన్న కిరోసిన్ను శరీరంపై పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె తల్లిదండ్రులు మంటలను ఆర్పి కేకేనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. 40 శాతం కాలిన గాయాలతో ఉన్న ఆమెను డాక్టర్లు కీల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. దీనిపై కేకే.నగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
హారర్ కామెడీతో ‘వస్తా’
భానుచందర్, జీవా, అదిరే అభి, ఫణి ముఖ్య తారలుగా జంగాల నాగబాబు దర్శకత్వంలో మెట్రో క్రియేషన్స్ పతాకంపై దమిశెల్లి రవికుమార్, మొహ్మద్ ఖలీల్ నిర్మించిన ‘వస్తా’ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ‘‘హారర్ కామెడీ చిత్రమిది. చిన్న చిత్రాలుగా విడుదలై పెద్ద విజయాలను సొంతం చేసుకున్నాయి హారర్ కామెడీ చిత్రాలు. ఆ నమ్మకంతోనే ఈ సినిమా చేశాం. ఈ నెలలోనే పాటలను విడుదల చేస్తాం. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన భానుచందర్ సహకారం మరువలేనిది’’అన్నారు నిర్మాతలు. రఘువర్మ, నాగేంద్ర, అబ్దుల్ రజాక్, రేణుక తదితరులు నటించిన ఈ సినిమాకు కెమెరా: వాసిరెడ్డి సత్యానంద్. సహ నిర్మాత: రేలంగి కనకరాజు. -
వీరే ‘మహా’ మార్చ్ సారథులు
దాదాపు 50 వేల మంది రైతులు, ఆదివాసీలు.. మండుటెండలో రోజుకు దాదాపు 30 కిలో మీటర్ల చొప్పున ఆరురోజులు నడక.. దారిలోనే అన్నపానీయాలు, ఆరుబయటే విశ్రాంతి.. సోలార్ ప్యానెళ్లతో సెల్ఫోన్ల చార్జింగ్.. ముంబై చేరుకుని, ప్రభుత్వం నుంచి హామీలు పొంది విజయవంతంగా ముగిసిన ఉద్యమం.. మహారాష్ట్ర రైతుల మహా మార్చ్. ఈ మొత్తం పాదయాత్రలో ఎక్కడా చిన్న అపశ్రుతి లేదు. హింసాత్మక ఘటనలు లేవు. అసాంఘిక శక్తుల అలజడులు లేవు. ఇతరులు ఇబ్బందిపడ్డ సందర్భాలు లేవు. ఏ సందర్భంలోనూ క్రమశిక్షణ తప్పలేదు. పైగా, ట్రాఫిక్ సమస్యతో ముంబైలో పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు కష్టం కలగకుండా చూడటం కోసం రాత్రంతా నడిచి, ఆజాద్ మైదాన్కు చేరుకున్న మంచితనం. ఇంత ప్రణాళికాబద్ధంగా, క్రమశిక్షణతో సాగిన ఉద్యమ సారథులు ఎవరు? సూత్రధారులు ఎవరు? జీవా పాండు గావిట్ – సీపీఎం ఎమ్మెల్యే నాసిక్ జిల్లాలోని కాల్వన్ నియోజకవర్గానికి గావిట్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుత మహారాష్ట్ర శాసనసభలో కమ్యూనిస్టు పార్టీలకు చెందిన ఏకైక ఎమ్మెల్యే ఈయనే. అంతేకాదు కాల్వన్ నుంచి ఆయన ఏడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. గిరిజన తెగకు చెందిన గావిట్కు నిరాడంబరుడిగా పేరుంది. రైతు పాదయాత్రకు వ్యూహ రచన చేసింది ఈయనే. తరాల నుంచి సాగుచేస్తున్న అటవీ భూములను తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు ఎక్కువ సంఖ్యలో మార్చ్లో పాల్గొనడానికి కారణం కూడా గావిట్ అని చెబుతారు. అశోక్ ధావలే – ఏబీకేఎస్ అధ్యక్షుడు రైతుల పోరాటానికి నేతృత్వం వహించింది అఖిల భారతీయ కిసాన్ సభ (ఏబీకేఎస్). సీపీఎం అనుబంధ సంస్థ అయిన ఏబీకేఎస్కు అశోక్ ధావలే ఇటీవలే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈయన సామాజిక కార్యకర్త గోదావరి పారులేకర్ సిద్ధాంతాలను గట్టిగా నమ్ముతారు. 1993 నుంచి ఠాణే, పాల్ఘర్ జిల్లాల్లో రైతు సమస్యలపై ధావలే పోరాటాలు సాగిస్తున్నారు. దశాబ్దం క్రితం రాయ్గఢ్లో ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)కి భూసేకరణను, తాజాగా ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు, ముంబై–నాగపూర్ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టులకు భూసేకరణను కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అజిత్ నవ్లే – ఏబీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి 2017 జూన్లో రైతుల చేత ఆందోళనలు చేయించి ప్రభుత్వం రైతు రుణమాఫీని ప్రకటించేలా చేయడంలో అజిత్ నవ్లే పాత్ర ఎంతో కీలకం. అప్పట్లో రైతులు సంపూర్ణ రుణ మాఫీ, కనీస మద్దతు ధర పెట్టుబడి కన్నా కనీసం ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు. నగరాలు, పట్టణాలకు పండ్లు, కూరగాయల సరఫరాను నిలిపివేస్తామని కూడా రైతులు అప్పట్లో హెచ్చరించారు. ఆ తర్వాత రైతు రుణ మాఫీ విధి విధానాలు ఎలా ఉండాలో నిర్ణయించేందుకు ప్రభుత్వం ఓ కమిటీని నియమించి అజిత్ను కూడా అందులో సభ్యుడిగా చేర్చింది. కానీ తన మాటకు విలువ లేకపోవడంతో ఆయన కమిటీ నుంచి వైదొలిగి అప్పటి నుంచి మండల, జిల్లా స్థాయిల్లో రైతుల పోరాటాలను నడుపుతున్నారు. విజూ కృష్ణన్– ఏబీకేఎస్ సంయుక్త కార్యదర్శి కేరళకు చెందిన, ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ) పూర్వ విద్యార్థి అయిన విజూ కృష్ణన్ పాత్ర కూడా రైతు పాదయాత్ర విజయవంతం కావడంలో కీలకమైనది. 1946లో కేరళలోని కన్నూర్ సమీపంలోని కరివేల్లూరు అనే గ్రామంలో రైతులు బ్రిటిష్ వారి సామ్రాజ్య, భూస్వామ్య విధానాలపై తిరుగుబాటు చేశారు. విజూ కృష్ణన్ కూడా అదే గ్రామానికి చెందిన వారు. రైతుల కష్టాలు, సమస్యల గురించి వింటూ ఆయన పెరిగారు. కరివేల్లూరు రైతుల తిరుగుబాటు జరిగిన దాదాపు 70 ఏళ్ల తర్వాత దాదాపు అలాంటి డిమాండ్లతోనే మహారాష్ట్ర రైతులు ఉద్యమిస్తుండటం ఆయనను వారికి దగ్గర చేసింది. రైతులు వారి హక్కుల కోసం పోరాడేలా విజూ వారిలో స్ఫూర్తిని నింపారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
చింపాంజీతో జీవా
తమిళసినిమా: చింపాంజీతో కలిసి వినోదాల విందునివ్వడానికి నటుడు జీవా సిద్ధం అవుతున్నారు. ఆయనతో వర్ధమాన నటి శాలినిపాండే జోడి కడుతోంది. కీ చిత్రంతో త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతున్న నటుడు జీవా తాజా చిత్రానికి రెడీ సిద్ధం అయిపోతున్నారు. ఆల్ ఇన్ పిక్చర్స్ పతాకంపై విజయరాఘవేంద్ర హైయస్ట్ కామెడీ థ్రిల్లర్ కథతో భారీ వ్యయంతో నిర్మించినున్న ఈ చిత్రానికి గోరిల్లా అనే టైటిల్ను నిర్ణయించారు. తెలుగు చిత్రం అర్జున్రెడ్డి ఫేమ్ శాలినిపాండే నాయకిగా నటించనున్న ఇందులో నిజ చింపాంజీ టైటిల్ పాత్రలో నటించనుంది. దీనికి డాన్శాండి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ చింపాంజీలు చాలా తెలివిగా, జాలీగా ఉండడానికి కారణం వాటి అల్ల రితనమేనన్నారు. అలాంటి ఇతివృత్తంతో రూపొందించనున్న చిత్రం గెరిల్లా అని వివరించారు. ఇందులో జీవా, శాలినిపాండే హీరోహీరోయిన్లుగా నటించనుండగా థాయ్లాండ్కు చెందిన చింపాంజీ ముఖ్య పాత్రలో నటించనుందని తెలిపారు. ఈ చింపాంజీకి థాయ్లాండ్లోని సాముట్ అనే సంతు శిక్షణ కేంద్రంలో నాలుగు నెలల పాటు శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. హాలీవుడ్ చిత్రాలు హెంగోవర్–2, ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ వంటి చిత్రాల్లో నటించిన చింపాంజీలు ఈ కేంద్రంలోనే శిక్షణ పొందాయన్నది గమనార్హం. గెరిల్లా చిత్రం పూర్తి వినోదాత్మకంగానూ, అదే సమయంలో చాలా థ్రిల్లింగ్గానూ ఉంటూ ఆబాలగోపాలాన్ని అలరించే విధంగా ఉంటుందని అన్నారు. ముఖ్యంగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని అన్నారు. చిత్ర షూటింగ్ను జనవరిలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీనికి విక్రమ్వేదా చిత్రం ఫేమ్ శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారని తెలిపారు. -
ఇప్పుడు క్రైమ్!
ఫుల్గా లవ్ చేసింది. అర్జున్ రెడ్డిని పీకల్లోతు ప్రేమించింది. ఇప్పుడు జీవీ ప్రకాశ్కుమార్ని ఫుల్గా లవ్ చేస్తోంది. అవును మరి.. తెలుగులో షాలినీపాండే ఫస్ట్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ లవ్స్టోరీ అని తెలిసిందే. ఇప్పుడు తమిళంలో చేస్తోన్న ‘100% లవ్’ రీమేక్ కూడా లవ్స్టోరీయే. ఇందులో జీవీ ప్రకాశ్కుమార్ సరసన నటిస్తోంది షాలిని. ఇప్పుడు షాలిని క్రైమ్ వైపు టర్న్ తీసుకుందని కోలీవుడ్ సమాచారం. జీవా∙హీరోగా డాన్ సాండీ దర్శకత్వంలో విజయేంద్ర వర్మ నిర్మాణంలో తమిళంలో ఓ సినిమా రూపొందనుంది. ఇందులో షాలినీపాండేని కథానాయికగా ఎంపిక చేశారు. ఇది క్రైమ్ నేపథ్యంలో సాగే కామెడీ డ్రామా అన్నది కోలీవుడ్ టాక్. ‘‘మా సినిమాలో బిగ్ సర్ప్రైజ్ ఉంది. అదేంటనేది ఇప్పుడే చెప్పను. జనవరిలో షూట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు దర్శకుడు. ‘‘ స్క్రిప్ట్లో ఉన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆధారంగా జీవాను తీసుకున్నాం. ఫ్రెష్ అండ్ యంగ్ టాలెంట్ ఉన్న అమ్మాయిని హీరోయిన్గా తీసుకోవాలని షాలినీ పాండేని ఎంపిక చేశాం’’ అన్నారు నిర్మాత. -
అవకాశాల బాటలో అర్జున్రెడ్డి హీరోయిన్
సాక్షి, సినిమా: టాలీవుడ్లో తొలి సినిమా అర్జున్రెడ్డితోనే సంచలన విజయాన్ని అందుకున్న జైపూర్ బ్యూటీ శాలినిపాండే. ఆ సినిమా విజయం ఈ అమ్మడిని కోలీవుడ్కు పరిచయం చేసేసింది. తెలుగులో ఘనవిజయం సాధించిన 100 % లవ్ రీమేక్ ద్వారా కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన శాలినిపాండే ఈ చిత్రంలో జీవీ. ప్రకాశ్కుమార్తో రొమాన్స్ చేస్తోంది. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్గా ఏప్రిల్లో విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం నటి సావిత్రి జీవిత చరిత్రతో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న నడిగైయార్ తిలగంలో ముఖ్య పాత్రను పోషిస్తోంది. అదే విధంగా మరో తెలుగు చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా కోలీవుడ్లో మూడో చిత్రానికి రెడీ అవుతోంది. ఇందులో నటుడు జీవాకు జంటగా నటించనుంది. ఇది జీవీకు 29వ చిత్రం. దీనికి డాన్ శాండి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆల్ ఇన్ ఫిక్చర్స్ పతాకంపై విజయ రాఘవేంద్ర భారీ బడ్జెట్లో నిర్మించనున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ నటుడు జీవా ఇప్పటి వరకూ నటించనటువంటి వైవిధ్యంతో కూడిన కామెడీ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా శాలినిపాండే పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుందని తెలిపారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. విక్రమ్వేదా చిత్రం ఫేమ్ శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారని చెప్పారు. మొత్తం మీద నటి శాలినిపాండే కోలీవుడ్లో మూడో చిత్రానికి సిద్ధం అయిపోతోంది. -
సందడి సందడిగా
హైదరాబాద్లోని ఫైనల్ షెడ్యూల్తో సందడి కంప్లీట్ అయ్యింది. కానీ సినిమాలో యాక్టర్స్ చేసిన సందడి థియేటర్లో ప్రేక్షకులను ఏ లెవెల్లో నవ్విస్తుందో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగక తప్పదు. జీవా, జై, శివ, నిక్కీ గల్రానీ, కేథరిన్ ముఖ్య తారలుగా సుందర్.సి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కలకలప్పు–2’. ఐదేళ్ల క్రితం సుందర్. సి దర్శకత్వంలోనే వచ్చిన ‘కలకలప్పు’ చిత్రానికి ఇది సీక్వెల్. చిత్రీకరణ పూర్తయింది. వచ్చే ఏడాది మొదట్లో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘కలకలప్పు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. థియేటర్లో ప్రేక్షకులు హాయిగా నవ్వుకునేలా సుందర్ తెరకెక్కించారు. లవ్లీ టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు హీరో జీవా. ఇంతకీ కలకలప్పు అంటే ఏంటో తెలుసా? సందడి అని అర్థం. ఇక్కడున్న ఫొటోలో తారలు ఎలా సందడి చేశారో చూస్తున్నారుగా. షూటింగ్ చివరి రోజు స్టిల్ ఇది. సినిమాలో డబుల్ సందడి ఉంటుందట. -
అర్జున్ రెడ్డి చిత్రం దశ మార్చేసింది..!
ఒక సక్సెస్ హీరోయిన్ శాలిని పాండేను టాలీవుడ్ నుంచి కోలీవుడ్కు పరిచయం చేసేసింది. అర్జున్రెడ్డి సినిమా ఆమె దశను మార్చేసింది. రంగస్థల నటి అయిన శాలిని నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత అక్కడ మహానటి సావిత్రి జీవిత్ర చరిత్రగా తెరకెక్కుతున్న మహానది చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాక తెలుగులో విజయాన్ని సాధించిన 100% లవ్ చిత్ర తమిళ రీమేక్లో తమన్నా పాత్రను చేసే లక్కీఛాన్స్ను కొట్టేసింది. ఈ బ్యూటీ కోలీవుడ్లో స్థిరపడాలని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై శాలిని స్పందిస్తూ.. అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత తెలుగులో చాలా అవకాశాలు వస్తున్నాయి. అయితే నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకుంటానని పేర్కొంది. తమిళంలో మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటున్న మాజ నిజమేనని ఆమె చెప్పింది. 100% కాదల్ చిత్రం పూర్తి అయిన తర్వాత జీవాతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతుందనే కోలీవుడ్ వర్గాల సమాచారం. -
డేంజరస్ గేమ్!
‘రంగం’ ఫేమ్ జీవా, నిక్కి గల్రాని, అనైనా సోఠీ ముఖ్య పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘కీ’. రాజేంద్రప్రసాద్, సుహాసిని కీలక పాత్రధారులు. కలీస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కృష్ణ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర ఫిలింస్ తెలుగులో విడుదల చేస్తున్నాయి. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. రెండు వైపులా పదునైన కత్తిలా ఉన్న టెక్నాలజీతో ఈ రోజుల్లో ఉపయోగం ఎంత ఉందో, నష్టం కూడా అంతే ఉంది. కంప్యూటర్ను హ్యాక్ చేసి ఎదుటివారిని బెదిరిస్తుంటారు. ఆ నష్టం ఎంతంటే ఎదుటివారు ప్రాణాలు తీసుకునేంతగా ఉంటుంది. ఇటీవల బ్లూవేల్ గేమ్ ఆడి ఎంతో మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. బ్లూవేల్ కంటే ప్రమాదకరమైన ఆటను మనం ఆడుతున్నాం. అదేంటో సినిమాలోనే చూడాలి. ‘అర్జున్రెడ్డి’ సినిమా దర్శకుడు సందీప్రెడ్డి వంగా విడుదల చేసిన టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. త్వరలోనే తెలుగు, తమిళ భాషల్లో ఒకేరోజు సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
జీవా పుట్టిన విషయం రైనాకే తెలుసు..
సాక్షి, న్యూఢిల్లీ: భారత సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని 2015 ప్రపంచకప్కు ముందే తండ్రైన విషయం తెలిసిందే. అయితే కూతురు జీవా పుట్టిన విషయం ధోనికి బ్యాట్స్మెన్ సురేష్ రైనా ద్వారా తెలిసిందంటా.. రాజ్దీప్ సర్దేశాయ్ రాసిన ‘డెమోక్రసీ ఎలెవన్: ది గ్రేట్ ఇండియన్స్ క్రికెట్ హిస్టరీ’ పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అంతేకాకుండా జీవా పుట్టిన శుభావార్తను రైనా ద్వారా ధోనికి తెలియజేసినట్లు పుస్తకంలో పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని పుస్తక పబ్లిషర్ జగ్గర్నాట్ బుక్స్ ‘ 2015 ప్రపంచకప్లో ధోని తండ్రైన విషయాన్ని సాక్షి.. ధోని మొబైల్ తీసుకెళ్లకపోవడంతో, రైనా మొబైల్ ద్వారా తెలియజేసింది’. అని ట్వీట్ చేసింది. When @msdhoni becm a father arnd 2015 World Cup, he wasn’t carryg a mobile. His wife sent an SMS thru @ImRaina to inform him! #RajdeepsBook — Juggernaut Books (@juggernautbooks) 20 October 2017 ధోని భార్య సాక్షి ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో జీవాకు జన్మనిచ్చింది. ఆ సమయంలో ధోని పూర్తిగా ప్రపంచకప్పై ధృష్టి సారించాడు. అప్పటికే టీమిండియా ఆస్ట్రేలియాలో వార్మప్ మ్యాచ్లు ఆడుతోంది. బిడ్డ పుట్టిన విషయం తెలిసినా కూడా ధోని రాలేని పరిస్థితి. అప్పట్లో ఈ విషయంపై ధోనిని ప్రశ్నిస్తే.. కూతురు పుట్టిందని తెలిసింది. తల్లి బిడ్డ క్లేమంగా ఉన్నారు. దేశం కోసం పనిచేస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా వేచి ఉండక తప్పదు. ఎందుకంటే ప్రపంచకప్ చాలా ముఖ్యమైనదని పేర్కొన్నాడు. ఇక ఈ టోర్నిలో భారత్ సెమీస్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి నిష్క్రమించిన విషయం తెలిసిందే. -
ఆ రాత్రి ఏం జరిగింది?
కాళరాత్రికి బలైంది ఎవరు? అసలు ఆ రాత్రి ఏం జరిగింది? అనేది ప్రజెంట్ సస్పెన్స్ అంటున్నారు దర్శకుడు పీఆర్ బాబు. ఆయన దర్శకత్వంలో వి.జె.వై.ఎస్.ఆర్. ఆర్ట్స్ సంస్థనిర్మించనున్న చిత్రం ‘కాళరాత్రి’. శాలినీ సింగ్ కథానాయిక. తనుజా, జి. శ్రీనివాస్, వై. శేషిరెడ్డి సహ నిర్మాతలు. ‘ఐస్క్రీమ్’ ఫేమ్ సత్య కాశ్యప్ స్వరకర్త. ‘‘ఈ నెల 27న షూటింగ్ప్రారంభిస్తాం. రాంజగన్, జీవా, జాకీ తదితరులు నటించే ఈ చిత్రంలో ఒక ప్రముఖ సీనియర్ నటి ప్రధాన పాత్రలో నటిస్తారు. ఇప్పటికి నాలుగు పాటలను రికార్డ్ చేశాం’’ అన్నారు పీఆర్ బాబు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్. -
కోలీవుడ్ లో సమంత రికార్డ్
అభిమానుల మనస్సును చూరగొన్న సమంత ఈ ఏడాది కోలీవుడ్ మోస్ట్ సెన్షేషనల్ సెలబ్రిటీగా నిలిచారు. ప్రముఖ మెకాఫే సంస్థ ఏటా కోలివుడ్ నటీనటులపై ఆన్ లైన్ సర్వే నిర్వహిస్తూ అభిమానుల ఇష్టాఇష్టాలను వెల్లడిస్తోంది. అందులో భాగంగా 11వ వార్షిక మెకాఫే మోస్ట్ సెన్షేషనల్ సెలబ్రిటీస్ 2017 సర్వేను చేపట్టి వివరాలను వెల్లడించింది. అందులో తమిళ నటుల్లో సంచలన సెలబ్రిటీగా 8.89 శాతంతో ప్రథమ స్థానంలో సమంతా నిలిచారు. జీవా (8.61శాతం), తాప్సీ(7.78శాతం), శివకార్తికేయన్ (7.50శాతం), ధనుష్(7.36) తరువాతి వరుస స్థానాల్లో నిలిచినట్లు మెకాఫే ఆర్ అండ్ డీ ఆపరేషన్స్ హెడ్ వెంకట్ కృష్ణపూర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. గతేడాది మెకాఫే సర్వేలో ప్రథమ స్థానంలో నిలిచిన నిక్కీ గల్రాణీ స్థానాన్ని ఈ ఏడాది సమంతా దక్కించుకుంది. -
ఇద్దరు భామల కనువిందు
తమిళసినిమా: ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకే చిత్రంలో నటిస్తే, అదీ తమ అందాలతో కుర్రకారును కనువిందు చేయడానికి ఎంతదాక అయినా వెళ్లడానికి రెడీ అనే బ్యూటీస్ అయితే ఆ చిత్రం కచ్చితంగా కలర్ఫుల్గా ఉంటుంది. ఇక సుందర్.సీ వంటి వినోదాన్ని పండించే దర్శకుడు ఆ చిత్రాన్ని మలిస్తే ఇక ప్రేక్షకులకు కావలసినంత ఎంటర్టెయిన్మెంట్కు కొదవే ఉండదు. కరెక్ట్గా అలాంటి చిత్రం తెరకెక్కడానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇంతకు ముందు సుందర్.సీ దర్శకత్వం వహించిన కలగలప్పు చిత్రం కోలీవుడ్ తెరపై మంచి సందడి చేసింది. అంతే కాదు అంతకు ముందు మార్కెట్ డల్ అయిన నటులు విమల్, శివ, నటీమణులు అంజలి, ఓవియలకు విజయోత్సాహాన్నిచ్చిన చిత్రం అది. కాగా ఆ చిత్రానికి సీక్వెల్ను తెరకెక్కించడానికి దర్శకుడు సుందర్.సీ సిద్ధం అయ్యారు. అయితే ఈ సారి మరింత పెద్ద కాస్టింగ్తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. విమల్, శివలకు బదులు ఇందులో జీవా, జైలను హీరోలుగా ఎంచుకున్నారు. ఇక ఓవియ, అంజలి స్థానంలో అందాల భామలు నిక్కీగల్రాణి, క్యాథరిన్ ట్రెసాలను ఎంపిక చేసుకున్నట్లు తాజా సమాచారం. ఈ కలగప్పు–2 చిత్రాన్ని సుందర్.సీ అక్టోబరులో ప్రారంభించనున్నారని తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారిక పూర్వకంగా వెల్లడించే అవకాశం ఉంది. -
పేదరికమే కట్టేసింది!
బతుకుఛిద్రం అవును, వాళ్లిద్దరినీ పేదరికమే కట్టేసింది. ప్రపంచంలో అన్నింటికంటే క్రూరమైనది ఏదంటే.. అది పేదరికమే. పేదరికం అంత క్రూరంగా ఉంటుందా? రాజస్థాన్లోని ఉమేశ్, జీవాలను చూస్తే అవునని చెప్పక తప్పదు. ఉమేశ్కి ఎనిమిదేళ్లు. రాజస్థాన్లోని కోల్యారి గ్రామం. గడచిన ఐదేళ్లుగా అతడు జీవిస్తున్నది పశువుల పాకలోనే, ఆవుల పక్కనే. మరో కుర్రాడు జీవాకి పదకొండేళ్లు. ఉదయ్పూర్కి దగ్గర్లోని బయాడి గ్రామం. అతడిని చెట్టుకి కట్టేసి పొలంలో పని చేసుకుంటాడు అతడి తండ్రి హుర్మారామ్. ఈ పిల్లలిద్దరికీ మతిస్థిమితం లేదు. ఎప్పుడు స్తబ్దుగా ఉంటారో, ఎప్పుడు మితిమీరిన ఉత్సాహంతో పరుగులు తీస్తారో ఊహించడం కష్టమే. అలాంటి పిల్లలను ఇరవై నాలుగ్గంటలూ కనిపెట్టుకుని ఉండడం ఒక మనిషికి సాధ్యమయ్యే పని కాదు. ఇంట్లో వాళ్లు వంతుల వారీగా పంచుకుంటే తప్ప సాధ్యం కానేకాదు. కన్న బిడ్డలను కడుపులో పెట్టుకుని సాకాలని ఎవరికుండదు? ఇలాంటి బిడ్డలనైతే మరీ ఎక్కువగా చూసుకోవాలి. మరి ఇలా కనిపెట్టుకుని చూడడానికి అమ్మానాన్న ఉంటేనే కదా! ఉమేశ్ తండ్రి భగవతి లాల్, తల్లి మనుదేవి హెచ్ఐవితో పోయారు. నానమ్మ, తాతే దిక్కు. వాళ్లకు వయసైపోయింది. అయితే ఆ కట్టేసేదేదో ఇంట్లోనే ఒక పక్కన కట్టేస్తే... ఇంట్లోనే ఆడుకుంటూ, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతాడు కదా అంటే... నిజమే. కానీ ఉమేశ్కి ఒకటి, రెండు అవసరాలకు బయటకు వెళ్లడమూ తెలియదు. ఇంట్లోనే చేస్తే శుభ్రం చేసే ఓపిక ఆ ముసలివాళ్లకు లేదు. అందుకే ఉమేశ్ ఆవు పక్కన మరో గుంజకు బంధీ అయ్యాడు. ఆవు చేసినట్లే అక్కడే అన్నీ చేస్తున్నాడు. కట్టు విప్పితే పరుగులు పెట్టి పారిపోతాడని, అతడిని పట్టుకుని రావడం తన వల్ల అయ్యే పని కాదని, అందుకే కట్టేయక తప్పడం లేదంటోంది 75 ఏళ్ల నానమ్మ పీపీ బాయ్. ఉమేశ్ పుట్టడం బాగానే పుట్టాడని, మూడేళ్ల వరకు బాగానే ఉన్నాడని, తల్లిదండ్రులు మరణించిన తర్వాత అతడిలో విపరీత ప్రవర్తన మొదలైందంటోందామె. వైద్యం చేయించాలంటే డబ్బులేదని కన్నీళ్ల పర్యంతమైంది పీపీబాయ్. జీవాకి పోలియోతోపాటు బుద్ధిమాంద్యం కూడ. ఎక్కడ వదిలితే ఎటు వెళ్లిపోతాడో తెలియదు. ఎక్కడ నుంచి జారిపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడో ఊహించలేం. గతంలో జరిగాయి కూడా. అందుకే చెట్టుకి కట్టేసి పొలం పనులు చేసుకుంటున్నాననంటాడు హుర్మారామ్. ఆ రాష్ట్ర చైల్డ్వెల్ఫేర్ కమిటీ ప్రతినిధుల జోక్యంతో ఉమేశ్, జీవాలు ఇటీవల విడుదలయ్యారు. అధికారులు వాళ్లను రెస్క్యూ హోమ్కి తరలించారు. ఇలాంటి పిల్లలను కట్టేయడం నేరమని వారిని మందలించారు అధికారులు. వారి మేధోపరిణతికి తగ్గట్లుగా వ్యవహరిస్తూ అన్ని విషయాలనూ తెలియచెప్పాలని కౌన్సెలింగ్ ఇచ్చారు. నిజానికి కౌన్సెలింగ్ ఇవ్వాల్సింది ఆ పేద తండ్రికి, నానమ్మకు కాదు. దేశంలో ఇంకా పోలియోను తరిమి కొట్టలేని పాలకులకు, హెచ్ఐవి బాధితుల పిల్లలకు సరైన పునరావాసం కల్పించలేని ప్రభుత్వానికి. -
మిత్రద్వయం కలిస్తే ఆ కిక్కే వేరప్పా
తమిళసినిమా: స్టార్ మిత్రద్వయం కలిసి నటిస్తే ప్రేక్షకులకు కలిగే ఆ కిక్కే వేరప్పా. చాలా కాలం తరువాత కోలీవుడ్లో మల్టీస్టారర్ చిత్రాల హంగామా మొదలైంది. ఇప్పటికే ముగ్గురు స్టార్స్ కలిసి ఒక చిత్రం చేస్తున్నారు. అందులో ఒక స్టార్ ప్రభుదేవా మోగాఫోన్ పట్టగా మరో ఇద్దరు స్టార్స్ విశాల్, కార్తీలు కథానాయకులుగా నటిస్తున్నారు. కరుప్పురాజా వెళ్లైరాజా అనే టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే నిర్మాణంలో ఉంది. కాగా తాజాగా మరో మిత్రద్వయం ఆర్య, జీవా కలిసి నటించడానికి రెడీ అవుతున్నారన్నది తాజా వార్త. ఆర్య, జీవా మధ్య మంచి స్నేహసంబంధాలున్నాయి.వీరిద్దరూ ఒకరి చిత్రాల్లో మరొకరు అతిథిగా కనిపించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఇద్దరూ కలిసి నటిస్తే కచ్చితంగా ఆ చిత్రంపై అంచనాలు నెలకొంటాయని చెప్పవచ్చు. ఇంతకు ముందు నాన్, అమరకావ్యం, యమన్ వంటి చిత్రాలను తెరకెక్కించిన జీవాశంకర్ తాజాగా తెరకెక్కిండానికి సన్నాహాలు చేస్తున్న చిత్రం ఇది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ను లైకా సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం ఇందులో నటించనున్న ఇతర తారాగణం, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
యాక్షన్ థ్రిల్లర్
నవీన్, జీవా, మధు, సుమన్ శెట్టి ముఖ్య తారలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘డేర్’. ప్రవీణ్ క్రియేషన్స్ పతాకంపై కె. కృష్ణ ప్రసాద్ దర్శకత్వంలో ఎన్. రామారావు నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు. నిర్మాత మాట్లాడుతూ – ‘‘పాటలు, వినోదం సినిమాకు హైలైట్. సీనియర్ నటులతో పాటు కొత్తవారూ నటించారు. త్వరలో ఆడియో, సినిమా రిలీజ్కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘పూర్తి యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన సినిమా ఇది. నవీన్ కొత్తవాడైనా బాగా నటించాడు. జీవా, సుమన్ శెట్టి పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అన్నారు కృష్ణప్రసాద్. ‘‘హీరోగా నాకిది తొలి సినిమా. కథ–కథనం ఆసక్తిగా ఉంటాయి’’ అన్నారు నవీన్. నటి సాక్షి, పాటల రచయిత సదా చంద్ర, మాటలు రచయిత రాఘవ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దంతు వెంకటే, సంగీతం: ఇ.ఆర్ నరేన్, సమర్పణ: ఎన్. కరుణాకర్ రెడ్డి. -
జీవాకు జంటగా నిక్కీగల్రాణి
నటుడు జీవా బ్యూటీ నిక్కీగల్రాణితో కలిసి కీ అంటున్నారు. నటుడు జీవాకు ఇప్పుడు ఒక మంచి విజయం చాలా అవసరం. ప్రస్తుతం ఆయన సంగిలి బుంగిలి కదవై తోర చిత్రంలో నటిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. తాజాగా మరో చిత్రంలో నటించేస్తున్నారు. దీని పేరు కీ. ఇందులో నటి నిక్కీగల్రాణి నాయకిగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో ఆర్జే.బాలాజీ, పద్మసూర్య, రాజేంద్రప్రసాద్, సుహాసిని, మనోబాలా, మీరాకృష్ణన్ నటిస్తున్నారు. ఇంతకు ముందు స్నేహం ఇతివృత్తంతో నాడోడిగళ్, క్రీడా నేపథ్యంలో ఈటీ, హర్రర్ కథా చిత్రంగా మిరుదన్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన గ్లోబల్ ఇన్ఫోటెయిన్మెంట్ సంస్థ అధినేత ఎస్.మైఖెల్ రాయప్పన్ ప్రస్తుతం శింబు హీరోగా అన్భానవన్ అసరాధవన్ అడంగాధవన్ చిత్రాన్ని భారీ ఎత్తున్న నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే జీవా కథానాయకుడిగా కీ చిత్రాన్ని ప్రారంభించారు. ఏప్రిల్ 21వ తేదీన ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు సైలెంట్గా మొదలయ్యాయి. ఒకే షెడ్యూల్లో చిత్రీకరణ జరుపుకుని ఈ 20వ తేదీకీ పూర్తి చేసుకోనున్న ఈ చిత్రం ద్వారా సెల్వరాఘవన్ శిష్యుడు కలీస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం, అనీష్ తరుణ్కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. -
దెయ్యం అంటే చాలా భయమంటా..
కోలీవుడ్లో కొంత కాలంగా హారర్ కథల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమిళంలో విడుదల అవుతున్న ఎలాంటి హారర్ చిత్రం అయినా సరే విజయం సాధిస్తుండడం విశేషం. ఈ వరుసలో తాజాగా మరో హారర్ చిత్రం తెరపైకి రానుంది. బాక్స్ స్టార్ స్టూడియోస్, అట్లి ఏ ఫార్ ఆపిల్ సంస్థలు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘సంగిలి బుంగిలి కదవ తొర‘. జీవా, శ్రీదివ్య, సూరి నటిస్తుండగా, కమల్హాసన్ సహాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఐక్ కొత్త దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విశాల్ చంద్రశేఖరన్ సంగీతంలో శింబు, అనిరుద్, జీవీ ప్రకాష్, గంగై అమరన్, ప్రేమ్జీ వంటి ఐదుగురు సంగీత దర్శకులు పాటలు పాడారు. ఈ చిత్ర ఆడియో ఇటీవల సత్యం థియేటర్లో విడుదల చేశారు. విభిన్న హారర్, కామెడీ కథాంశంతో రూపొందిన ఈ చిత్ర ఆడియోను కమల్హాసన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అట్లీ మాట్లాడుతూ.. ఇదే సత్యం థియేటర్లో తన తొలి చిత్రం ‘రాజారాణి’ ఆడియో విడుదల జరిగిందన్నారు. రూపాన్ని చూసి ‘ఎవరినీ వీడేమి చేస్తాడులే..’ అని ఊహించరాదన్నారు. ఆ విధంగా తలచకుండా ఆర్.మురుగదాస్ సార్ అవకాశం ఇచ్చినందువల్లే ఇప్పుడు దర్శకుడిగా ఇక్కడ నిలుచోని ఉన్నట్టు తెలిపారు. చాలా కథలు విని, వాటిలో నుంచే ఈ ‘సంగిలి బుంగిలి కదవ తొర’ చిత్రాన్ని ఎంపిక చేసుకున్నట్లు చెప్పారు. తనకు దెయ్యం అంటే చాలా భయమని, అందువల్లనే ఇటువంటి దెయ్యం చిత్రాన్ని ఎంపిక చేసుకున్నట్టు చిత్ర నిర్మాత, దర్శకుడు అట్లి అన్నారు. -
ఎంతవరకు?
కలువ కళ్ల పిల్ల కాజల్ అగర్వాల్ ఇప్పుడు మాంచి జోరు మీదున్నారు. మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన ‘ఖైదీ నంబర్ 150’ సంక్రాంతికి విడుదల కానుంది. ప్రస్తుతం తేజ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో రానా సరసన నటిస్తున్నారు. తమిళంలో రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. ఆ మధ్య ‘జనతా గ్యారేజ్’లో చేసిన ప్రత్యేక పాట ద్వారా తెరపై కనిపించారామె. ఇయర్ ఎండింగ్లో మరోసారి తెరపై కనిపించనున్నారు. జీవా, కాజల్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘కవలై వేండాం’ని ‘ఎంతవరకు ఈ ప్రేమ’ పేరుతో డి.వెంకటేష్ ఈ నెల 30న విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘ఇది మంచి కామెడీ ఎంటర్టైనర్. జీవా, కాజల్ మధ్య రొమాంటిక్ సీన్స్ యువతను ఆకట్టు కుంటాయి. ఈ చిత్రాన్ని తమిళ్, తెలుగులో ఒకేసారి విడుదల చేయా లనుకున్నాం. కానీ, తెలుగులో సెన్సార్ సకాలంలో పూర్తి కాకపోవడంతో కుదర లేదు. తమిళంలో లానే తెలుగులోనూ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
24న కవలైవేండామ్
యువ నటుడు జీవా, కాజల్అగర్వాల్ జంటగా నటించిన కవలైవేండామ్ చిత్రం గురువారం తెరపైకి రానుంది. ఇంతకు ముందు కో, యామిరుక్క భయమే పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆర్ఎస్.ఇన్ఫోటెరుున్మెంట్ సంస్థ అధినేత ఎల్రెడ్.కుమార్ నిర్మించిన తాజా చిత్రం కవలైవేండామ్. జీవా, కాజల్అగర్వాల్ హీరోహీరోరుున్లుగా నటించిన ఇందులో నటి సునైనా, ఆర్జే.బాలాజీ, మరుుల్సామి, బాలశరవణన్, మనోబాల, శ్రుతి రామకృష్ణన్, మధుమిత ముఖ్య పాత్రలను పోషించారు. ఇంతకు ముందు ఇదే నిర్మాణ సంస్థలో యామిరుక్క భయమే వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు డీకే రెండో చిత్రం ఇది. చిత్రం గురించి ఆయన తెలుపుతూ జీవితం చాలా చిన్నది. దాన్ని ఎలాంటి చింతా లేకుండా గడపాలన్న కాన్సెప్ట్తో రూపొందించిన చిత్రం కవలైవేండామ్ అని చెప్పారు. ఇందులో కథానాయకుడిగా నటించిన జీవా తన పాత్రకు ప్రాణం పోశారనే చెప్పాలి. పాత్రలను అంకిత భావంతో నటించడం వల్లే తమిళ చిత్రపరిశ్రమలో ప్రముఖ హీరోగా రాణిస్తున్నారన్నారు. తన అద్భుతమైన నటనతో ఈ చిత్రానికి సరికొత్త కలర్ను తీసుకొచ్చారన్నారు. ఇక నటి కాజల్అగర్వాల్కు నటనై ఆసక్తి, ప్రేమే ఆమెకు అజిత్, విజయ్ వంటి ప్రముఖ కథానాయకులతో నటించే అవకాశాలను అందిస్తున్నాయన్నారు. జీవా, కాజల్అగర్వాల్ జంట ఈ చిత్రానికి చాలా ఎస్సెట్ అని పేర్కొన్నారు. అదే విధంగా మనసుకు హత్తుకునే పాటలు, కడు రమ్యమైన కథాంశం కవలైవేండామ్ చిత్రానికి పక్కా బలం అన్నారు. లియోన్ జేమ్స్ చాలా మంచి సంగీతాన్ని అందించారని, అభినందన్ చాయాగ్రహణం చిత్రానికి మరింత వన్నెను తీసుకొచ్చిందని తెలిపారు.కవలైవేండామ్ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు దర్శకుడు డీకే వెల్లడించారు. -
నా మనసుకి దగ్గరైన చిత్రమిది - కాజల్
‘జీవా, కాజల్ అగర్వాల్ జంటగా డీకే దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘కవలై వేండాం’. ఈ చిత్రాన్ని ‘ఎంతవరకు ఈ ప్రేమ’ పేరుతో డి.వెంకటేశ్ తెలుగులో విడుదల చేస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను హీరో రాహుల్ రవీంద్రన్, సినిమా ట్రైలర్ను నిర్మాత మల్కాపురం శివకుమార్ విడుదల చేశారు. డి.వెంకటేశ్ మాట్లాడుతూ- ‘‘కామెడీ ఎంటర్టై నర్గా తెరకెక్కిన చిత్రమిది. ‘భలే భలే మగాడివోయ్’, ‘పెళ్లిచూపులు’ తరహాలో ఉంటుంది. సినిమా సూపర్హిట్ అవుతుందని ‘వెన్నెలకంటి’గారు చెప్పడం మరింత సంతోషాన్నిస్తోంది’’ అన్నారు. జీవా మాట్లాడుతూ- ‘‘డీకే నాకు స్నేహితుడు. ‘రంగం’ చిత్రానికి కో-డెరైక్టర్గా పనిచేశాడు. డీకే చెప్పిన కథ నచ్చడంతో వెంటనే చేశా. అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘జీవా మంచి కోస్టార్. నా మనసుకు బాగా దగ్గరైన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులూ చూసేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని కాజల్ అగర్వాల్ చెప్పారు. -
సీక్వెల్ కాదు!
జీవా, తులసీ నాయర్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘యాన్’. సినిమాటోగ్రాఫర్ రవి కె.చంద్రన్ దర్శకుడిగా పరిచయ మైన ఈ చిత్రాన్ని ‘రంగం -2’గా నిర్మాత ఎ.ఎన్.బాలాజీ తెలుగులోకి రిలీజ్ చేస్త్తున్నారు. సంగీత దర్శకుడు హ్యారీస్ జైరాజ్ స్వరపరిచిన పాటల్ని త్వరలో విడుదల చేయనున్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘రంగం’ చిత్ర విజయంలో హ్యారీస్ జైరాజ్ సంగీతం కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రానికీ మంచి పాటలు కుదిరాయి. వెన్నెలకంటి సాహిత్యం అందించారు. ‘రంగం’కి ఇది సీక్వెల్ కాదు’’ అన్నారు. నాజర్, జయప్రకాశ్, ఊర్మిళ నటించిన ఈ చిత్రానికి సమర్పణ: జస్రాజ్ ప్రొడక్షన్స్. -
దిగులు పడొద్దు!
‘రంగం’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కథానాయకుడు జీవా, కలువ కళ్ల పిల్ల కాజల్ జంటగా తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘కవలై వేండామ్’. అంటే.. దిగులు పడొద్దు అని అర్థం. డీకే దర్శకత్వంలో ‘రంగం’ చిత్ర నిర్మాత ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రాన్ని డీవీ సినీ క్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేష్ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఇటీవల విడుదలైన ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకా తెలుగులో టైటిల్ నిర్ణయించలేదు. అక్టోబర్లో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. బాబీ సింహా, శృతి రామకృష్ణన్, సునయన, మంత్ర తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. -
ఆయనకు ఆ హీరోయిన్లే కావాలట!
మార్కెట్ను చేజార్చుకున్న నటీనటులు, దర్శకులు మళ్లీ పుంజుకోవాలంటే వారికి ఒక బలమైన ఆధారం అవసరం అవుతుంది. అది హీరోయిన్ కావచ్చు మరెవరైనా కావచ్చు. ఆ మధ్య నటుడు జీవా వరుస అపజయాలతో సతమతం అయ్యారు. ఎలాగైనా కోల్పోయిన తన స్థానాన్ని తిరిగి సంపాదించుకోవాలన్న దృఢ నిర్ణయంతో చేసిన చిత్రం తిరునాళ్. ఈ చిత్రంలో తనకు జంటగా నయనతారను కోరి మరీ ఎంపిక చేసుకున్నారు. అందుకు కారణం ఆమె క్రేజ్ను వాడుకోవాలన్న ప్రయత్నమేనన్న ప్రచారం జరిగింది. ఏదైతేనేం జీవా తిరునాళ్ చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. తదుపరి కవలై వేండామ్ చిత్రంలో కూడా స్టార్ నాయకి కాజల్అగర్వాల్ను ఎంచుకున్నారు. జీవా మిత్రుడైన ఆర్యకు కూడా అలాంటి టాప్ హీరోయిన్ అవసరం అయ్యారిప్పుడు. ఈయనకు ఇటీవల సరైన హిట్స్ లేవన్నది గమనార్హం. ప్రస్తుతం కడంబన్ అనే చిత్రంలో నటిస్తున్న ఆర్య తదుపరి అమీర్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అయితే దర్శకుడిగా అమీర్ మార్కెట్ డౌన్లో ఉంది. ఆదిభగవాన్ చిత్రం తరువాత ఆయన మరో చిత్రం చేయలేదు. కథానాయకుడిగా మొదలెట్టిన పేరంబు కొండ పెరియవర్గళే చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ మెగాఫోన్ పట్టి ఆర్య హీరోగా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో హీరోయిన్ కోసం వేట మొదలైంది. ఆర్యకు జంటగా నయనతార, అనుష్క, తమన్నాలలో ఒకరిని ఎంపిక చేయాలన్న ప్రయత్నంలో ఉన్నారని తెలిసింది. అయితే వారు అనుకుంటున్న హీరోయిన్లు అందరూ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. మరో విషయం ఏమిటంటే కోలీవుడ్లో హీరోయిన్ల హీరోగా ప్రచారం పొందిన ఆర్యతో నటించడానికి ఈ ముద్దుగుమ్మల్లో ఎవరు ముందుకొస్తారన్నది ఆసక్తిగా మారింది.