వాస్తవ సంఘటనల ఆధారంగా క్రైం నేపథ్యంలో శ్రీనివాసరాజు దర్శకత్వంలో కన్నడం,
వాస్తవ సంఘటనల ఆధారంగా క్రైం నేపథ్యంలో శ్రీనివాసరాజు దర్శకత్వంలో కన్నడం, తెలుగు భాషల్లో రూపొందిన ‘దండుపాళ్యం’కి సీక్వెల్ రూపొందనుంది. శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సీక్వెల్ రియలిస్టిక్గా ఉంటుందని దర్శక-నిర్మాతలు తెలిపారు. ‘‘ఇటీవల ఉపేంద్రతో నేను చేసిన ‘శివమ్’ చిత్రం ‘బ్రహ్మన్న’గా తెలుగులో విడుదల కానుంది’’ అని దర్శకుడు చెప్పారు. ఈ సీక్వెల్కు కెమెరా: వెంకట్ ప్రసాద్, సంగీతం: అర్జున్ జన్య.