
రోడ్డెక్కిన బయ్యర్లు...
‘లింగ’ చిత్రం నష్టం వ్యవహారంలో కథా నాయకుడు రజనీకాంత్ జోక్యం చేసుకోవాలని బయ్యర్లు డిమాండ్ చేశారు. తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు చెందిన బయ్యర్లు శనివారం చెన్నైలో ఒక రోజు నిరాహారదీక్ష చేశారు. ఈ చిత్రానికి నిర్మాతను, దర్శకుణ్ణి నిర్ణయించింది రజనీకాంతే కాబట్టి, ఆయన జోక్యం చేసుకోవాలని వారు కోరారు.