
లాంగ్ గ్యాప్ తరువాత టాలీవుడ్ తెర మీద వచ్చిన పక్కా మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మూడు రోజుల్లోనే సేఫ్ జోన్లోకి ఎంటర్అయిపోయింది. తొలి మూడు రోజుల్లో ఈ సినిమా 36 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు.
ఈ రోజు కూడా కలెక్షన్లు భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీంతో తొలి వారాంతానికే ఇస్మార్ట్ శంకర్ 50 కోట్ల మార్క్ను చేరుకునే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. చాలా కాలం తరువాత పూరి జగన్నాథ్ బిగ్ హిట్ సాధించటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో షియాజీ షిండే, ఆశిష్ విద్యార్థిలు కీలక పాత్రలో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment