iSmart Shankar
-
డబుల్ ఇస్మార్ట్ సాంగ్ గురించి పూరికి నాకు గొడవ అయింది !!
-
నేను ఒళ్లు దగ్గర పెట్టుకుని చేసిన సినిమా ఇది: పూరి జగన్నాథ్
‘‘ఈ మధ్య సోషల్ మీడియాలో, బయట ఓ ట్రెండ్ చూస్తున్నాను. అరే... నీకిది నచ్చిందా? అని అడిగితే... వాళ్లకు నచ్చుతుందేమో... వీళ్లకు నచ్చుతుందేమో అని తోటివారిపైకి తోస్తున్నారు. ముందు మనకు నచ్చిందా? అని చూసుకోవాలి. మీకు నచ్చింది మీరు చేయండి. పక్కోడి గురించి, పకోడీల గురించి పట్టించుకుంటే పనులు జరగవు. సాధారణంగా నేను సలహాలివ్వను. నా అనుకున్నవాళ్లు అడిగితే ఇస్తా. మీ అందర్నీ (ఫ్యాన్స్) నా వాళ్లుగా ఫీలై ఇస్తున్నాను’’ అని రామ్ అన్నారు.హీరో రామ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. వీరి కాంబినేషన్లోనే 2019లో వచ్చిన హిట్ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందింది. ఈ చిత్రంలో కావ్యా థాపర్ హీరోయిన్గా నటించగా, సంజయ్ దత్, అలీ కీలక పాత్రల్లో నటించారు. పూరి జగన్నాథ్, ఛార్మీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా వరంగల్లో జరిగిన ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ మాట్లాడుతూ– ‘‘హీరోలు బుల్లెట్స్లాంటివారు. పేల్చే గన్ బాగుంటే బుల్లెట్ చాలా స్పీడ్గా వెళ్తుంది. పూరీగారిలాంటి గన్ ప్రతి ఒక్క యాక్టర్కి కావాలి. ఛార్మీ కౌర్గారు లేకపోతే ‘డబుల్ ఇస్మార్ట్’ లేదు. ఆమె ఓ ఫైటర్. బాస్ లేడీ అని పిలుస్తాను.‘డబుల్ ఇస్మార్ట్’ రేంజ్కి తగ్గట్లు, ప్రేక్షకుల అంచనాలను మించేలా మణిశర్మగారు మ్యూజిక్ ఇచ్చారు’’ అని అన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘రామ్ లేకపోతే ఇస్మార్ట్ శంకర్ లేడు. సంజయ్ దత్గారు మా సినిమాలో యాక్ట్ చేసి, కొత్త కలర్ తీసుకొచ్చారు. నా నిర్మాణసంస్థకు ఛార్మీ కౌర్ ఓ బలం. నా దగ్గర రూపాయి లేకపోయినా నాకోసం ఎవరన్నా నిలబడ్డారంటే అది విషురెడ్డి. హిట్ సినిమా తీసినప్పుడు చాలామంది ప్రశంసిస్తారు. నా ఫ్లాప్ సినిమా విడుదలైన వారానికి విజయేంద్రప్రసాద్గారు ఫోన్ చేసి, ‘సార్... నాకో హెల్ప్ చేస్తారా?’ అన్నారు. ఆయన కొడుకే పెద్ద డైరెక్టర్.. రాజమౌళి. అలాంటిది ఆయన నన్ను హెల్ప్ అడుగుతున్నారేంటి? అనుకున్నా. ‘తర్వాతి సినిమా ఎప్పుడు చేస్తున్నారు? చేసే ముందు ఆ సినిమా కథ నాకోసారి చెప్తారా? మీలాంటి దర్శకులు ఫెయిల్ కావడం చూడలేను. చిన్న చిన్న తప్పులేవో ఉంటుంటాయి. తీసే ముందు నాకోసారి చెప్పండి’ అన్నారు. నేను భావోద్వేగానికి గురయ్యాను. అయితే ‘డబుల్ ఇస్మార్ట్’ కథను విజయేంద్రప్రసాద్గారికి చెప్పలేదు. తెలిసిన పనే కదా... ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ సినిమా తీశా’’ అని తెలిపారు పూరి జగన్నాథ్. ‘‘ఇస్మార్ట్ శంకర్’ను ఆదరించినట్లే ‘డబుల్ ఇస్మార్ట్’నూ ఆదరించండి’’ అన్నారు ఛార్మీ. పూరీ కనెక్ట్స్ సీఈవో విషు రెడ్డి, అలీ తదితరులు పాల్గొన్నారు. -
డబుల్ ఇస్మార్ట్ని ఎంజాయ్ చేస్తారు: సంజయ్ దత్
‘‘తెలుగు సినిమా డైనమిక్స్ని మార్చిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ సార్. ‘డబుల్ ఇస్మార్ట్’లో నన్ను భాగం చేసి, బిగ్ బుల్గా చూపిస్తున్న ఆయనకి థ్యాంక్స్. రామ్తో పని చేయడంతో చాలా మజా వచ్చింది. ‘డబుల్ ఇస్మార్ట్’ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు’’ అని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అన్నారు. రామ్ పోతినేని, కావ్యా థాపర్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 15న ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ విడుదల చేస్తోంది.మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీలోని ‘బిగ్ బుల్...’ అంటూ సాగే పాటని ముంబైలో జరిగిన ఈవెంట్లో విడుదల చేశారు. భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించిన ఈ పాటని పృధ్వీ చం, సంజన కల్మంజే పాడారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ– ‘‘డబుల్ ఇస్మార్ట్’తో ఉత్తరాది ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది. సంజయ్ దత్గారితో పని చేయడం గౌరవంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘సంజయ్ బాబాకి నేను బిగ్ ఫ్యాన్ని. ఆయన ‘డబుల్ ఇస్మార్ట్’ చేయడం చాలా హ్యాపీగా ఉంది’’ అని పూరి జగన్నాథ్ చె΄్పారు. ఈ వేడుకలో ఛార్మీ, కావ్యా థాపర్, పూరి కనెక్ట్స్ సీఈవో విష్, నటుడు అలీ మాట్లాడారు. -
ఫైట్స్ చేయడం సవాల్గా అనిపించింది: కావ్యా థాపర్
‘‘నేనిప్పటివరకూ వైవిధ్యమైన పాత్రలు చేశాను. తొలిసారి ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంలో యాక్షన్ సీన్స్ చేశాను. మొదటిసారి ఫైట్స్ చేయడం, పాటల్లో ఫుల్ జోష్తో డ్యాన్స్ చేసే అవకాశం రావడం సవాల్గా అనిపించింది’’ అని హీరోయిన్ కావ్యా థాపర్ అన్నారు. రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 15న ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా కావ్యా థాపర్ పంచుకున్న విశేషాలు. పూరి జగన్నాథ్గారి దర్శకత్వంలో నటించాలని ఉండేది. ‘ఇస్మార్ట్ శంకర్’కి ఆడిషన్ ఇచ్చాను కానీ కుదరలేదు. ‘డబుల్ ఇస్మార్ట్’కి నా ఆడిషన్స్ నచ్చి పూరి సార్, ఛార్మీగారు చాన్స్ ఇచ్చారు. ఇప్పుడు డబుల్ ఫన్, ఎంటర్టైన్మెంట్ ఉండే ఈ సినిమాలో అవకాశం రావడం మరింత హ్యాపీగా ఉంది. పూరీగారు గొప్ప డైరెక్టర్. ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా బోల్డ్ అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే చిన్న అమాయకత్వం కూడా ఉంటుంది. రామ్గారితో సాంగ్ షూట్లో ఫస్ట్ డే మార్నింగ్ సిక్ అయ్యాను. చాలా ఎనర్జీ, పవర్ కావాల్సిన సాంగ్ అది. అయినా సెట్కి వెళ్లాను. ఛార్మీగారు హాస్పిటల్కి తీసుకెళ్లారు. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. మూడు రోజుల తర్వాత డబుల్ ఎనర్జీతో డిస్చార్జ్ అయ్యాను... నా బెస్ట్ డ్యాన్స్ ఇచ్చాను. మణిశర్మగారు లెజండరీ కంపోజర్. ఆయన సాంగ్స్కి డ్యాన్స్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ‘డబుల్ ఇస్మార్ట్’ నేరుగా హిందీలో రిలీజ్ కావడం చాలా ఎగ్జయిటింగ్గా ఉంది. నాకు యాక్షన్ రోల్స్, అడ్వంచరస్ మూవీస్ చేయాలని ఉంది. ప్రస్తుతం గోపీచంద్గారితో ‘విశ్వం’ చిత్రంలో నటిస్తున్నాను. మరికొన్నిప్రాజెక్ట్స్ చర్చల్లో ఉన్నాయి. -
డబ్బింగ్ డన్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తొలిసారి తెలుగులో పూర్తి స్థాయి పాత్ర పోషించిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన హిందీ వెర్షన్ డబ్బింగ్ని పూర్తి చేశారు సంజయ్ దత్. హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్ ’(2019)కి సీక్వెల్గా ఇదే కాంబినేషన్లో ‘డబుల్ ఇస్మార్ట్’ రూ΄÷ందింది. ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్గా చేశారు. పూరి కనెక్ట్స్పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 15న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. -
టార్గెట్ పంద్రాగస్ట్.. గెలుపు జెండా ఎగరేసేది ఎవరు?
వరుసగా సెలవులు వస్తే సినిమాలకు పండగే పండగ. ఆగస్ట్ రెండో వారం అలాంటి పండగే కానుంది. ఆగస్ట్ 15 గురువారం... స్వాతంత్య్ర దినోత్సవం కాబట్టి గవర్నమెంట్ హాలిడే. ఆ రోజుతో పాటు శుక్ర, శని, ఆదివారాల వసూళ్లు రాబట్టుకోవచ్చు. సోమవారం రక్షా బంధన్... అది కూడా కలిసొస్తుంది. అందుకే పంద్రాగస్ట్ టార్గెట్గా థియేటర్స్లో గెలుపు జెండా ఎగురవేయడానికి కొందరు నిర్మాతలు తమ చిత్రాలను ఆ తేదీన విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.మిస్టర్ బచ్చన్ రెడీరవితేజ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్గా కనిపిస్తారని తెలుస్తోంది. పనోరమా స్టూడియోస్, టీ సిరీస్ల సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14 లేదా 15న థియేటర్స్లోకి రానుందని సమాచారం.కేజీఎఫ్ కథకేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తంగలాన్’. 18వ శతాబ్దం నేపథ్యంలో పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్ హీరోగా నటించారు. పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్బుదురై ఇతర లీడ్ రోల్స్లో నటించారు. ఈ సినిమాను జనవరి 26న విడుదల చేయాలనుకున్నారు. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో విడుదల కాలేదు. అలా వాయిదా పడి ఫైనల్గా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. కేజీఎఫ్లోని బంగారం కోసం జరిగే అక్రమ తవ్వకాలకు, అక్కడి ఓ గిరిజన తెగకు ఉన్న సంబంధం ఏంటి? అనేది ఈ చిత్రం ప్రధానాంశం. ఇందులో ఆ తెగ నాయకుడిగా విక్రమ్ కనిపిస్తారు. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం తెలుగులోనూ ఆగస్ట్ 15నే రిలీజ్ కానుంది. డబుల్ ఎనర్జీపంద్రాగస్ట్కు థియేటర్స్లోకి వచ్చేందుకు డబుల్ ఎనర్జీతో రెడీ అయ్యాడు ‘డబుల్ ఇస్మార్ట్’. హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కింది. సీక్వెల్లో కావ్యా థాపర్ హీరోయిన్గా నటించగా, సంజయ్ దత్, అలీ కీలక పాత్రధారులు. పూరి జగన్నాథ్, ఛార్మీ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఓ సీబీఐ ఆఫీసర్ మెమొరీని ఓ సైన్స్ చిప్ సాయంతో కిరాయి హంతకుడు శంకర్ (రామ్) మొదడులోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. ఆ తర్వాత శంకర్ జీవితం ఏ విధంగా ప్రభావితమైంది? అనే కోణంలో ‘ఇస్మార్ట్ శంకర్’ కథ సాగిన విషయం తెలిసిందే. ఈ కథకు కొనసాగింపుగా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ఉంటుందని తెలుస్తోంది.చిన్న కథ కాదు‘అమ్మ టెన్త్ ఫెయిల్... కొడుకు ఫిఫ్త్ ఫెయిల్... చిన్న కథ కాదు..’ అనే డైలాగ్ ‘35: చిన్న కథ కాదు’ సినిమాలోనిది. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ఇది. నంద కిశోర్ ఈమాని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రసాద్ (విశ్వతేజ్), సరస్వతి (నివేదా థామస్) భార్యాభర్తలు. వీరి కొడుక్కి 35 పాస్ మార్కులు కూడా రావు. దీంతో వాళ్ల కుటుంబం కాస్త నిరాశకు లోనవుతుంది. నిజంగా... 35 పాస్ మార్కులు ముఖ్యమా? ఆ ఊర్లోని మాస్టర్ (ప్రియదర్శి) వల్ల సరస్వతి కొడుకు పడిన ఇబ్బందులు ఏంటి? అనే అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. రానా దగ్గుబాటి సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.స్ఫూర్తిదాయక పోరాటం కీర్తీ సురేష్ నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రఘుతాత’. తన గ్రామం కోసం కయల్విళి అనే ఓ యువతి చేసే స్ఫూర్తిదాయక పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. సుమన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ బేనర్ నిర్మించింది. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్పై మరో అప్డేట్ రాలేదు. మరి.. ఆగస్టు 15 బరిలో కీర్తీ సురేష్ ‘రఘుతాత’ సినిమా ఉంటుందా? లేదా అనేది చూడాలి. ఈ తమిళ చిత్రం తెలుగు, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది. మేం ఫ్రెండ్సండి....మేం ఫ్రెండ్సండి అంటూ థియేటర్స్లోకి వస్తున్నారు కార్తీక్, సబ్బు, హరి. మరి... వీళ్ల కథ ఏంటి? అనేది ఆగస్టు 15న థియేటర్స్లో తెలియనుంది. ఈ చిత్రంలో కార్తీక్గా నార్నే నితిన్, అతని ప్రేయసి పల్లవి పాత్రలో నయన్ సారిక, సుబ్బుగా రాజ్కుమార్ కసిరెడ్డి, హరిగా అంకిత్ నటించారు. ప్రేమ, స్నేహం అంశాల మేళవింపుతో అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు. పుష్ప వాయిదా పడటంవల్లేనా?‘పుష్ప’ ఫ్రాంచైజీలో హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప: ది రూల్’ సినిమా రానుంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కావాల్సింది. అయితే క్వాలిటీ విషయంలో రాజీ పడాలనుకోవడం లేదని, అందుకే విడుదలను వాయిదా వేశామని యూనిట్ పేర్కొంది. ఆ తర్వాత ‘పుష్ప: ది రూల్’ను డిసెంబరు 6న విడుదల చేస్తామని ప్రకటించింది. ఆగస్టు 15కి ‘పుష్ప’ రాకపోవడంవల్ల, లాంగ్ వీకెండ్, రక్షాబంధన్ ఫెస్టివల్ కూడా కలిసొచ్చి తమ సినిమాలకు లాభాలు వస్తాయని ఆయా చిత్రయూనిట్లు ఆలోచన చేసి ఆగస్టు 15ను టార్గెట్గా చేసుకుని ఈ సినిమాలను రిలీజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 15కి ఇంకా సమయం ఉంది. సో... ఈ విడుదల జాబితా ఇంకా పెరిగే చాన్స్ ఉంది. -
ఇస్మార్ట్ శంకర్కు ఐదేళ్లు.. రామ్ పోతినేని స్పెషల్ పోస్ట్!
టాలీవుడ్ మాస్ హీరో రామ్ పోతినేని-పూరి జగన్నాధ్ కాంబోలో వస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ డబుల్ ఇస్మార్ట్. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో కావ్యా థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు.అయితే 2019 జూలై 18 ఇస్మార్ట్ శంకర్ రిలీజైన సంగతి తెలిసిందే. ఈ మాస్ యాక్షన్ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ను షేక్ చేసింది. రూ.20 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ విడుదలై 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రామ్ స్పెషల్ పోస్టర్ను పంచుకున్నారు. 'ఫైవ్ ఇయర్స్ ఆఫ్ మెంటల్ మాస్ మ్యాడ్నెస్.. ఇస్మార్ట్ శంకర్' అంటూ పోస్ట్ చేశారు. ఆగస్టు 15న డబుల్ మ్యాడ్నెస్ను ఎంజాయ్ చేయండి అంటూ ట్వీట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 5 Years for this Mental Mass Madness! #iSmartShankar Let’s Celebrate this Double Madness on 15th of August! -USTAAD #DoubleiSmart SHANKAR pic.twitter.com/0pSbqTkX6N— RAm POthineni (@ramsayz) July 18, 2024 -
గుమ్మడికాయ కొట్టారు
‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాకు గుమ్మడికాయ కొట్టారు హీరో రామ్. 2019లో హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన హిట్ ఫిల్మ్ ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్గా వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. కావ్యా థాపర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్, అలీ, గెటప్ శ్రీను కీలక పాత్రధారులు.ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని, పోస్ట్ప్రోడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయని చిత్రయూనిట్ ప్రకటించింది. సో.. షూటింగ్ పూర్తయిన సందర్భంగా ‘డబుల్ ఇస్మార్ట్’ యూనిట్ గుమ్మడికాయ కొట్టింది. పూరి కనెక్ట్స్ బ్యానర్లో పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. -
కౌంట్డౌన్ స్టార్ట్
హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. వీరిద్దరి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ (2019) కి సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందుతోంది. కావ్యా థాపర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్గా నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ‘‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందుతోంది. ఆగష్టు 15న సినిమాని విడుదల చేయనున్నాం. సినిమా రిలీజ్కి సరిగ్గా 50 రోజులు ఉంది. అందుకే 50 రోజుల కౌంట్డౌన్ను మార్క్ చేస్తూ రామ్ స్పెషల్ పోస్టర్ను విడుదల చేశాం. మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీ టైటిల్ సాంగ్ షూట్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ పాటకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మా సినిమా విడుదల కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
తేదీ తార్ మార్
వచ్చేస్తున్నా అంటూ ఓ డేట్ చెప్పారు. అయితే ఆ డేట్కి కాకుండా కాస్త లేట్గా వస్తా అంటున్నారు. చెప్పిన డేట్కన్నా ముందే వస్తా అంటున్నవారూ ఉన్నారు. ఈ మధ్య కొన్ని తెలుగు చిత్రాల విడుదల తేదీలు తారుమారయ్యాయి. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ అలా వాయిదాలు పడి, ఫైనల్లీ ఈ 27న థియేటర్స్కి వస్తోంది. ఇలా రిలీజ్ డేట్ను తారుమారు చేసుకున్న కొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం. దేవర.. ఓ పెద్ద కథ ‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ‘దేవర’ సినిమాని ప్రకటించినప్పుడే విడుదల తేదీ (2024 ఏప్రిల్ 5న)ని కూడా ప్రకటించారు మేకర్స్. కానీ కథ పెద్దది కావడంతో ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లుగా ఆ తర్వాత పేర్కొన్నారు. అయితే చిత్రీకరణ ప్లాన్ చేసిన ప్రకారం జరగకపోవడంతో తొలి భాగం విడుదలను అక్టోబరు 10కి వాయిదా వేశారు.కానీ కాస్త ముందుకి వస్తున్నాడు ‘దేవర’. సెప్టెంబరు 27న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. ముందుగా ప్రకటించిన మరో సినిమా సెప్టెంబరు 27న రాకపోవడంతో ఈ తేదీకి ‘దేవర’ రావడానికి రెడీ అయ్యాడట. కల్యాణ్రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా జాన్వీ కపూర్ తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయం కానున్నారు. పుష్పరాజ్... సీన్ రిపీట్ ‘పుష్ప’ ఫ్రాంచైజీ తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ 2021 డిసెంబరు 17న విడుదలై, మంచి విజయం సాధించింది. హీరో పుష్పరాజ్గా టైటిల్ రోల్ చేసిన అల్లు అర్జున్కి ఉత్తమ జాతీయ నటుడి అవార్డుని తెచ్చిపెట్టింది ఈ చిత్రం. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రష్మికా మందన్నా కథానాయిక. ఇక తొలి భాగం సాధించిన విజయంతో జోష్గా మలి భాగం ‘పుష్ప: ది రూల్’ను ఆరంభించారు. కొంత చిత్రీకరణ తర్వాత ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ అనుకున్న సమయానికి చిత్రీకరణ పూర్తి కాలేదు.క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేక ‘పుష్ప: ది రూల్’ రిలీజ్ను ఆగస్టు 15 నుంచి డిసెంబరు 6కు వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ‘పుష్ప: ది రైజ్’ను కూడా తొలుత 2021 ఆగస్టు 13న విడుదల చేయాలనుకున్నారు. కానీ డిసెంబరులో విడుదల చేశారు. అలాగే ‘పుష్ప 2: ది రూల్’ని 2024 ఆగస్టు 15న రిలీజ్ చేయాలనుకుని డిసెంబరు 6కి మార్చారు. తొలి భాగానికి జరిగిన సీన్ రిపీట్ అయింది. మైత్రీమూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ రెడీ ‘ఇస్మార్ట్ శంకర్’గా హీరో రామ్లోని మాస్ యాంగిల్ని ఓ రేంజ్లో చూపించారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ చిత్రం 2019లో విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ‘ఇస్మార్ట్ శంకర్’ కథలో సీక్వెల్కు స్కోప్ ఉండటంతో రామ్తోనే ‘డబుల్ ఇస్మార్ట్’ను ప్రకటించారు పూరి. ఈ సినిమా ప్రకటించిన రోజునే 2024 మార్చి 18న రిలీజ్ చేయనున్నట్లు కూడా వెల్లడించారు. కానీ విడుదల కాలేదు. ఆ తర్వాత జూలైలో విడుదల కావొచ్చనే ప్రచారం సాగింది. ఈ మూవీ చిత్రీకరణ అనుకున్నట్లుగా సాగలేదట. దీంతో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను ఆగస్టు 15న రిలీజ్కి రెడీ చేస్తున్నట్లుగా తాజాగా ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మాతలు. ముందుకు రానున్న లక్కీ భాస్కర్‘మహానటి’, ‘సీతారామం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ఈ హీరో ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ‘లక్కీ భాస్కర్’ని సెప్టెంబరు 27న విడుదల చేస్తున్నట్లుగా ఇటీవల ప్రకటించారు. కానీ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా అదే తేదీకి తెరపైకి రానుంది. ‘లక్కీ భాస్కర్’ సినిమా నిర్మాతల్లో ఒకరైన సూర్యదేవర నాగవంశీ ‘దేవర’ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను తీసుకున్నారట.దీంతో ఒకే రోజు ఒకే బ్యానర్ నుంచి రెండు సినిమాల విడుదల ఎందుకని భావిస్తున్నారట నాగవంశీ. ఈ నేపథ్యంలో ‘లక్కీ భాస్కర్ను కాస్త ముందుగానే ఆగస్టులో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారని భోగట్టా. అయితే ఆగస్టు 15న ఇప్పటికే రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’, కీర్తీ సురేష్ ‘రఘుతాత’ సినిమాలు ఉన్నాయి. సో.. ‘లక్కీ భాస్కర్’ ఏ తేదీన వస్తాడో చూడాలి. ఇక దుల్కర్ సూపర్ హిట్ మూవీ ‘సీతారామం’ 2022 ఆగస్టు తొలివారంలో విడుదలైంది. ఈ సెంటిమెంట్ని అనుసరించి, ‘లక్కీ భాస్కర్’ని కూడా ఆగస్టు తొలి వారంలో రిలీజ్ చేస్తారా? అనే చర్చ కూడా జరుగుతోంది.ఈ కోవలోనే మరికొన్ని సినిమాల రిలీజ్ డేట్లు ముందుకు, వెనక్కు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఇస్మార్ట్ మ్యూజిక్
‘డబుల్ ఇస్మార్ట్’ మ్యూజిక్ సిట్టింగ్స్ జోరందుకున్నాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. ఈ విషయాన్ని ‘ఎక్స్’లో షేర్ చేసి, ‘డబుల్ ఇస్మార్ట్’ అప్డేట్ను వెల్లడించింది చిత్రబృందం. ‘ఇస్మార్ట్ శంకర్’కు సంగీతం అందించిన మణిశర్మనే సీక్వెల్కూ సంగీతం అందిస్తున్నారు. గతంలోనూ పూరి–మణిశర్మ కాంబినేషన్లో ‘పోకిరి’ వంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా క్లైమాక్స్ పోర్షన్స్ చిత్రీకరణ కోసం దాదాపు 7 కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా సమాచారం. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను మార్చి 18న విడుదల చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయన్నది ఫిల్మ్నగర్ తాజా కబురు. -
డబుల్ ఇస్మార్ట్కు మణిశర్మ స్వరాలు
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ (2019) సూపర్హిట్గా నిలిచింది. ప్రస్తుతం రామ్, పూరి కాంబినేషన్లో ‘ఇస్మార్ట్ శంకర్’ కి సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. కాగా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చనున్నట్లు చిత్రయూనిట్ శనివారం వెల్లడించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి, చిరుత, ఇస్మార్ట్ శంకర్’ వంటి హిట్ సినిమాలకు మణిశర్మ సంగీతం అందించిన సంగతి గుర్తుండే ఉంటుంది. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ వచ్చే ఏడాది మార్చి 8న విడుదల కానుంది. -
ముంబైలో డబుల్ ఇస్మార్ట్
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. తాజాగా రామ్, పూరి కాంబినేషన్లోనే ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కుతోంది. ఇందులో సంజయ్ దత్ కీలక ΄ాత్రధారి. ఈ సినిమా కోసం ముంబైలో రామ్ ΄ాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘‘స్కంద’ కోసం బరువు పెరిగిన రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం బరువు తగ్గి, సిక్స్ ΄్యాక్తో మేకోవర్ అయ్యారు’’ అని యూనిట్ పేర్కొంది. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 8న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. -
ఇస్మార్ట్ యాక్షన్
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన తొలి చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. 2019లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్గా రామ్, పూరీల కాంబినేషన్లోనే ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం రూపొందుతోంది. హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా గురువారం పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా హీరో రామ్, కీలక పాత్ర చేస్తున్న సంజయ్ దత్తో పూరి జగన్నాథ్ ఉన్న వర్కింగ్ స్టిల్ను రిలీజ్ చేశారు. పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 18న రిలీజ్ కానుంది. -
ఈ రెండు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్..
-
ఐదు భాషల్లో డబుల్ ఇస్మార్ట్
హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా షురూ అయింది. పూరి కనెక్ట్స్పై పూరి జగన్నాథ్, చార్మి నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారంప్రారంభమైంది. ‘ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్’ అంటూ రామ్ డైలాగ్ చెప్పిన తొలి సీన్కి చార్మి క్లాప్ ఇవ్వగా, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ‘‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూ΄పొందుతోంది. పూరి జగన్నాథ్ చాలా పెద్ద స్పాన్ ఉన్న కథ రాశారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపొందనుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ కంటే ఈ సినిమాలో రామ్ని మాసియర్ క్యారెక్టర్లో చూపించబోతున్నారు పూరి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 2024 మార్చి 8న ‘డబుల్ ఇస్మార్ట్’ని రిలీజ్ చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సీఈఓ: విషు రెడ్డి. -
పూరి 'ఇస్మార్ట్ శంకర్' వచ్చేస్తున్నాడు.. ఈసారి బాలీవుడ్ హీరోయిన్
2019లో పూరి జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' భారీ హిట్ అందుకుంది. ఆ సినిమా మాస్ ఆడియన్స్ను ఎంతగానో మెప్పించి వారిద్దరికీ బ్లాక్ బస్టర్గా నిలించింది. ఈ సినిమా సీక్వెల్ సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. తాజాగా దానికి సంబంధించిన ఓ ఇస్మార్ట్ అప్డేట్ను చిత్ర యూనిట్ షేర్ చేసింది. లైగర్ రిజల్ట్ తనను తీవ్రంగా బాదించినా మళ్లీ తన మార్క్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు పూరి. తనలో ఉన్న ప్రత్యేకత ఇదేనని చెప్పవచ్చు. హీరోలకు ఏ మాత్రం తగ్గని ఫ్యాన్ బేస్ పూరికి ఉంది. (ఇదీ చదవండి: 61 ఏళ్ల వ్యక్తితో శృంగారం.. రియాక్ట్ అయిన హీరోయిన్) నేడు జులై 10న ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగినట్లు యూనిట్ తెలిపింది. అందుకు సంబంధించిన పలు షేర్ చేసింది. జులై 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. దీనికి ‘డబుల్ ఇస్మార్ట్’ అనే టైటిల్ను కన్ఫామ్ చేసిన విషయం తెలిసిందే. 2024 మార్చి 8న డబుల్ ఇస్మార్ట్ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే రామ్- బోయపాటి కాంబోలో భారీ యాక్షన్ మూవీ 'స్కంద' చేస్తున్నాడు. దీనిని సెప్టెంబర్ 15న పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తున్నారు. అది హిట్ అయితే డబుల్ ఇస్మార్ట్ కి డబుల్ కిక్ ఇవ్వడమే కాకుండా.. లైగర్తో నష్టపోయిన పూరి బౌన్స్ బ్యాక్ ఇవ్వడం ఖాయం. బాలీవుడ్ హీరోయిన్ రామ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. మరోక హీరోయిన్గా మీనాక్షి చౌదరిని తీసుకున్నారని సమాచారం. మణిశర్మ సంగీతం అందిస్తుండగా ఛార్మి, పూరి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. With the blessings of Lord Shiva 🔱 Ustaad @ramsayz & Dashing Director #PuriJagannadh's#DoubleISMART Pooja ceremony commenced 🪔 Shoot Begins on July 12th❤️🔥 Mass Action Entertainer at the cinemas on MARCH 8th, 2024💥@Charmmeofficial @IamVishuReddy pic.twitter.com/Kj9vDRHiIg — Puri Connects (@PuriConnects) July 10, 2023 (ఇదీ చదవండి: అల్లర్ల మధ్య హోటల్లో బిక్కుబిక్కుమంటూ గడిపిన ఊర్వశి!) -
ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్గా డబుల్ ఇస్మార్ట్!
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన ‘ఇస్మార్ట్ శంకర్’ (2019) సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లోనే ఈ సినిమాకు సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం రానుంది. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. నేడు (మే 15) రామ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆదివారం ‘డబుల్ ఇస్మార్ట్’ని ప్రకటించి, ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 8న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ‘‘అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, హై బడ్జెట్తో ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం తెరకెక్కనుంది. ఈసారి రెట్టింపు మాస్, రెట్టింపు వినోదాన్ని ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
తగ్గని ‘ఇస్మార్ట్ శంకర్’ హవా.. రామ్ పోతినేని సరికొత్త రికార్డు
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన మాస్ మసాలా చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ హవా ఇంకా తగ్గట్లేదు. యూట్యూబ్లో ఈ మూవీ దూసుకెళ్తోంది. తాజాగా 200మిలియన్ల(20 కోట్లు) మార్క్ను దాటేసి సత్తా చాటింది. 2019లో విడుదలైన ఈ మూవీ హిందీ వెర్షన్ని గతేడాది ఫిబ్రవరిలో యూట్యూబ్లో పెట్టారు. టాలీవుడ్ ప్రేక్షకుల మాదిరే బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి కూడా ఇస్మార్ట్ శంకర్కి నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటివరకు 1.9మిలియన్ల లైకులలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఆన్లైన్లో డబ్బింగ్ సినిమాల ద్వారా 20 కోట్ల పైగా వ్యూస్ తెచ్చుకోవడం హీరో రామ్కు ఇది నాలుగోసారి. సౌత్ ఇండియా నుంచి నాలుగు సినిమాలను 200 మిలియన్ల వ్యూస్కు చేర్చిన తొలి హీరోగా రామ్ ఘనతను దక్కించుకొన్నారు .మొత్తానికి ఇస్మార్ట్ హీరో రామ్ నటనకు ఇపుడు సౌత్ ప్రేక్షకులే కాదు.. నార్త్ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారని యూట్యూబ్ రికార్డులే తెలియజేస్తున్నాయి. -
Ram Pothineni: ఆ ఘనత సాధించిన ఏకైక సౌత్ హీరో రామ్ ఒక్కడే
సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ఎంతో కష్టపడుతూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకునన హీరో రామ్ పోతినేని. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేస్తూ ఎనర్జిటిక్ స్టార్గా పేరు సంపాదించుకున్నాడు. యాక్టింగ్తో పాటు స్టయిల్ను, ఎనర్జీని జోడించి వెండితెరపై కిర్రాక్ పుట్టించే యంగ్ హీరోల్లో రామ్ఒకరు. నేడు (మే 15) రామ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. రామ్ పోతినేని మే 15, 1988న మురళీ పోతినేని, పద్మశ్రీ దంపతులకు జన్మించారు. ప్రముఖ సినీ నిర్మాత ‘స్రవంతి’రవికిశోర్ తమ్ముడే మురళీ పోతినేని. పెదనాన్న అడుగుజాడల్లో నడుస్తూ.. సినిమాలపై వైపు వచ్చాడు. 2002లో తమిళంలో తెరకెక్కిన అడయాళం అనే షార్ట్ ఫిలిమ్తో రామ్ తన యాక్టింగ్ కెరీర్ని ప్రారంభించారు. ఆ తర్వాత వైవీఎస్ చౌదరీ దర్శకత్వం వహించిన దేవదాస్(2006) సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. తొలి సినిమాలోనే రామ్ అదరగొట్టాడు. తన నటన, డ్యాన్స్కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా హిట్తో రామ్కి తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి. అయితే రామ్ మాత్రం కథలను ఆచితూచి ఎంచుకున్నాడు. రెండో చిత్రం ‘జగడం’ప్లాపును మూట గట్టుకున్నప్పటికీ.. రామ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత 2008లో శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘రెడీ’చేసి బాక్సాఫీస్ వద్ద సత్తాచాటాడు. అయితే ఆ తర్వాత రామ్కి పెద్దగా హిట్లు లభించలేదు. అతను నటించిన ‘మస్కా’, ‘రామరామ కృష్ణకృష్ణ’, ‘ఎందుకంటే ప్రేమంట’, ‘ఒంగోలు గిత్త’, ‘మసాలా’, ‘పండగ చేస్కో’, ‘హైపర్’, ‘హలో గురు ప్రేమ కోసమే’ తదితర సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించాయి. ఇక 2019లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా గ్రాండ్ సక్సెస్ని మూటగట్టుకుంది. ఈ సినిమా తొలి రోజే రూ.10 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను, 8 కోట్లకు పైగా షేర్ను సాధించడం విశేషం. ఈ చిత్రం ద్వారా తన బాక్సాఫీస్ పవర్ను 100 కోట్ల చేర్చాడు ఈ ఇస్మార్ట్ హీరో. అంతే కాదు ఈ సినిమాను డబ్ చేసి హిందీలో వదిలితే.. సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాదాపు 100 మిలియన్ల వ్యూస్తో అదరగొట్టింది. అంతేకాకుండా హిందీలోకి డబ్ చేసిన ఆయన నాలుగు చిత్రాలు 100 మిలియన్ల వ్యూస్ను నమోదు చేసుకోవడం ఓ రికార్డు. దక్షిణాది సినీ పరిశ్రమలో నాలుగు సినిమాలను 100 మిలియన్ల వ్యూస్కు చేర్చిన తొలి హీరోగా ఘనతను దక్కించుకొన్నారు. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఈ ఏడాది ‘రెడ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో అతను తొలిసారిగా ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమా అతని కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇలాగే సినీ కేరీర్ రామ్ దూసుకెళ్తూ మరిన్ని రికార్డుకు క్రియేట్ చేయాలని ‘సాక్షి’ తరపున ఆయనకు బర్త్డే విషెష్ అందజేస్తుంది. -
బాలీవుడ్కి ఇస్మార్ట్ శంకర్
పూరి జగన్నాథ్ – రామ్ కాంబినేషన్లో వచ్చిన మాస్ మసాలా చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. సంచలనాత్మక విజయం సాధించిన ఈ సినిమా హిందీలో రీమేక్ కానుందని సమాచారం. రామ్ పోషించిన పాత్రలో బాలీవుడ్ యాక్టర్ రణ్వీర్ సింగ్ కనిపించనున్నారట. ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలో ఉందని తెలిసింది. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారో ఇంకా ప్రకటించలేదు. ఈ హిందీ రీమేక్ను పూరి జగన్నాథే దర్శకత్వం వహించే అవకాశం ఉందని ఓ టాక్. -
పవర్ స్టార్ నుంచి ‘గడ్డి తింటావా?’
సంచలనాలకు చిరునామా, వివాదాలకు కేరాఫ్.. దర్శకుడు రామ్గోపాల్ వర్మ. ఆయన తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పవర్ స్టార్: ఎన్నికల ఫలితాల తర్వాత కథ’. ఇందులో అచ్చంగా హీరో పవన్ కల్యాణ్ను పోలిన వ్యక్తి హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి "గడ్డి తింటావా?" పాట నేడు సాయంత్రం ఐదు గంటలకు విడుదల కానుంది. ఇక ఈ పాటలో హీరో తన గేదెలు, మొక్కలను ఉద్దేశిస్తూ పాడతాడని ఆర్జీవీ పేర్కొన్నారు. పనిలో పనిగా వర్మ ‘పవర్ స్టార్’ సినిమాలో ఓ క్యారెక్టర్ అంటూ... అతడు ఎవరి పోలికతో అయినా ఉన్నాడా అంటూ ట్వీట్ చేశారు. A character from POWER STAR ..Does he resemble anyone ??? pic.twitter.com/qVKa0nNSlb — Ram Gopal Varma (@RGVzoomin) July 19, 2020 సెటైరికల్ మూవీగా కనిపిస్తోన్న ఈ సినిమా ట్రైలర్ జూలై 22న ఉదయం 11 గంటలకు విడుదల కానుంది. అయితే ఓ కండీషన్! 25 రూపాయలు చెల్లించిన తర్వాతే ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో ట్రైలర్ను చూసే అవకాశం ఉంటుంది. ఇలా ట్రైలర్ చూసేందుకు డబ్బులు వసూలు చేస్తోన్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. జూలై 25న ఉదయం 11 గంటలకు ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో సినిమా విడుదల కానుంది. ఇక ఇప్పటికే 'పవన్ కళ్యాణ్' సినిమా నుంచి విడుదలైన పలు చిత్రాలు సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే. (బ్రేకింగ్ న్యూస్) పూరీకి ఆర్జీవీ కంగ్రాట్స్.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ విడుదలై శనివారం(జూలై 18)తో ఏడాది అవుతోంది. ఈ సందర్భంగా పూరీ ట్విటర్లో తన ఆనందాన్ని పంచుకున్నారు. "సరిగ్గా ఏడాది క్రితం ఈరోజు ఒక పండుగ వాతావారణం ఉండేది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్బస్టర్ అవడానికి నిర్మాత చార్మీ ఎంతగానో శ్రమించారు. అలాగే హీరోయిన్లు నిధి అగర్వాల్, నభాటేష్తో పాటు టీమ్ అందరికీ నా ధన్యవాదాలు" అంటూ రాసుకొచ్చారు. దీనిపై వర్మ స్పందిస్తూ "మీకు, చార్మీకి శుభాకాంక్షలు. మీ తర్వాతి సినిమా కూడా మరింత బ్లాక్బాస్టర్ అవాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు. (‘ఇస్మార్ట్’ విజయం మా ఆకలిని తీర్చింది) -
‘ఇస్మార్ట్’ విజయం మా ఆకలిని తీర్చింది
‘‘సినిమా విడుదలై ఏడాది అయిన సందర్భంగా మేం ఏ సెలబ్రేషన్స్ చేయటంలేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందున అందరం ఇంటిపట్టునే ఉంటున్నాం. హీరో రామ్ ఫ్యాన్స్ కూడా కరోనా గైడ్ లైన్స్ పాటిస్తూ, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు చార్మి. రామ్ హీరోగా నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి కనెక్ట్స్పై రూపొందిన ఈ చిత్రానికి చార్మి ఓ నిర్మాత. శనివారం (జులై 18)తో ఈ సినిమా విడుదలై ఏడాది అవుతోంది. ఈ సందర్భంగా చార్మి చెప్పిన విశేషాలు. రామ్, పూరి జగన్నాథ్ ► పూరీగారితో పాటు టీమ్ అందరం సక్సెస్ కోసం ఎంతో ఎదురుచూశాం. సక్సెస్ అనే ఆకలి తీరాలనుకున్నాం. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్బస్టర్ విజయాన్ని అందించి మా ఆకలిని తీర్చారు పూరి. ఈ సినిమా కథను రామ్ కోసమే రాశారు పూరీగారు. ఆయన కథ చెప్పినప్పుడు రామ్ ఏ ఎనర్జీతో ఉన్నారో షూటింగ్ జరుగుతున్నంత సేపు అదే ఎనర్జీ, అదే పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నారు. రామ్ హీరోగా పూరీగారి దర్శకత్వంలో మరో సినిమా ఉంటుంది. అది ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెలా, మరో సినిమానా అనేది ఇప్పుడే చెప్పలేను. ► విజయ్ దేవరకొండతో చేస్తున్న ప్యాన్ ఇండియా చిత్రానికి ‘ఫైటర్’ టైటిల్నే ఫిక్స్ చేశాం. మిగతా భాషలన్నింటికీ కలిపి ఒకే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నాం. ఇకనుంచి మా బ్యానర్లో ప్యాన్ ఇండియా సినిమాలు తీయాలనుకుంటున్నాం. ► ఓటీటీకి కంటెంట్ క్రియేట్ చేయడానికి మా పూరి కనెక్ట్స్ సంస్థ కూడా ప్రిపేర్ అవుతోంది. భవిష్యత్లో రెగ్యులర్ సినిమాలతో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్కి కూడా సినిమాలు చేసుకుంటూ వెళతాం. దాదాపు అన్ని స్క్రిప్ట్లు పూరీగారు రాసినవే ఉంటాయి. ఓటీటీపై రూపొందించే చిత్రాల ద్వారా కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నాం. ► ఈ లాక్డౌన్ టైమ్లో పూరీగారికి రైటింగ్ తప్ప వేరే వ్యాపకమే లేదు. నాలుగు నెలలుగా పూరీగారు రైటింగ్ సైడే దృష్టి పెట్టారు. భవిష్యత్లో పూరి కనెక్ట్స్ నుంచి హృదయానికి ఆనందం ఇచ్చే కథలను ప్రేక్షకులు చూడబోతున్నారు. నటిగా ఎన్నో సినిమాలు చేశాను కానీ, ఇప్పుడు నటించాలనే ఇంట్రస్ట్ లేదు. మా పూరి కనెక్ట్స్ ద్వారా మంచి సినిమాలు తీసే ప్లానింగ్లో ఉన్నాం. మరో పదేళ్లకు సరిపడా ప్రొడక్షన్ను ఎలా ప్లాన్ చేయాలి, ఎలాంటి కథలు చేయాలనే ప్లాన్స్ జరుగుతున్నాయి. -
‘ఇస్తా.. మొత్తం తిరిగి ఇచ్చేస్తా’
నిన్న హీరో రామ్ పోతినేని పుట్టిన రోజు. అభిమానులు, సహ నటులు సోషిల్ మీడియా వేదికగా రామ్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే లాక్డౌన్ నేథ్యంలో అభిమానులు తన పుట్టిన రోజుకు వేడుకలకు దూరంగా ఉండాలంటూ రామ్ పిలుపునిచ్చారు. ఇక తమ అభిమాన హీరో పిలుపు మేరకు అభిమానులు బర్త్డే వేడుకలకు దూరంగా ఉన్నారు. కానీ రామ్ పేరు మీద పూజలు, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించారు. తన మీద ఇంత అభిమానం చూపుతున్న ఫ్యాన్స్కు రామ్ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.(అదే మీరు నాకిచ్చే అసలైన కానుక : రామ్) ‘మీరో చాలా మంది తినకుండా, రాత్రంతా నిద్రపోకుండా ఉన్నారని విన్నాను. మీరు నా మీద చూపిస్తోన్న ప్రేమకు గర్వంగా ఫీలవుతున్నాను. మీ లాంటి అభిమానలను కలిగి ఉండటం నిజంగా నా అదృష్టం. ఇస్తా.. మొత్తం తిరిగిచ్చేస్తా. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను’ అంటూ రామ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రామ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రంలోని ‘డింఛక్’ అనే మాస్ సాంగ్ గ్లింప్స్ను విడుదల చేశారు. ఈ పాటను మణిశర్మ కంపోజ్ చేయగా సాకేత్, కీర్తనలు పాడారు. To my dearest fans, I’ve heard that many of you haven’t eaten or slept all night💔.. just to show me the kind of love you have for me to the entire World!..I’m truly touched & blessed to have all of you! ISTA! MOTHAM TIRIGICHESTA! 🔥 Cuz I.. Love you all more..❤️#RAPO pic.twitter.com/9GPuIJYrnL — RAm POthineni (@ramsayz) May 15, 2020 -
‘ఇస్మార్ట్ శంకర్’.. హవా మామూలుగా లేదు!
‘ఇస్మార్ట్ శంకర్’ హవా ఇంకా తగ్గలేదు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్లో గతేడాది వచ్చిన ఈ సినిమా యూట్యూబ్లో దూసుకుపోతోంది. తాజాగా 100 మిలియన్ల(10 కోట్లు) మార్క్ను దాటేసి సత్తా చాటింది. ఫిబ్రవరి 16న యూట్యూబ్లో పెట్టిన హిందీ వెర్షన్కు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటివరకు 10 లక్షలకు పైగా లైకులు కూడా తెచ్చుకుంది. ఆన్లైన్లో డబ్బింగ్ సినిమాల ద్వారా 10 కోట్ల వ్యూస్, 10 లక్షలకు పైగా లైకులు తెచ్చుకోవడం హీరో రామ్కు ఇది నాలుగోసారి. ఈ ఘనత సాధించిన మొదటి హీరో రామ్ అని చిత్రయూనిట్ పేర్కొంది. కాగా, ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలోని దిమాక్ ఖరాబ్ వీడియో సాంగ్ కూడా ఇటీవల 100 మిలియన్ వ్యూస్ మార్క్ని దాటింది. ఈ సందర్భంగా అభిమానులకు హీరో రామ్ ధన్యవాదాలు తెలిపారు. కాగా, కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆయన నటించిన ‘రెడ్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను ఏప్రిల్ 9 విడుదల చేయాలనుకున్నారు. కరోనా సంక్షోభం కారణంగా లాక్డౌన్ ప్రకటించడంతో విడుదల వాయిదా పడింది. (100 మిలియన్ మార్కును దాటిన 'ఇస్మార్ట్' పాట) -
100 మిలియన్ మార్కును దాటిన 'ఇస్మార్ట్' పాట
'ఇస్మార్ట్ శంర్' ..ఈ సినిమా థియేటర్స్లో ఎన్ని కలెక్షన్లు రాబట్టిందో యూట్యూబ్లోనే అంతే సెన్సేషన్ క్రియేట్ చేసింది. బరాత్ అయినా, కాలేజీ ఫంక్షన్ అయినా ఈ సినిమా పాటలు ఉండాల్సిందే. గతేడాది సెప్టెంబర్లో విడుదలైన దిమాక్ ఖరాబ్ వీడియో సాంగ్ విడుదలైన నాటి నుంచే యూట్యూబ్ని షేక్ చేసింది. తాజాగా ఈ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ మార్క్ని దాటింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్లో రామ్, నిధి అగర్వాల్ నభా నటాషాలు తమ డ్యాన్స్తో అలరించారు. పూరీ జగన్నాథ్, రామ్ కలయికలో వచ్చిన ఈ చిత్రం ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ని మెస్మరైజ్ చేసింది. 11 ఏళ్లుగా సరైన బ్లాక్ బస్టర్ లేని పూరీకి , హీరో రామ్కి ఈ సినిమా మంచి బూస్టప్ ఇచ్చింది. రామ్ కెరీర్లోనే తొలిసారి 40 కోట్ల షేర్కు చేరువగా వచ్చిన సినిమా ఇది.సరైన హిట్ కోసం చూస్తున్న వారికి ఇస్మార్ట్ శంకర్తో బ్లాక్ బస్టర్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం పూరీ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. -
‘ఇస్మార్ట్ శంకర్’.. ఇరగదీస్తుండు!
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్లో గతేడాది వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా హవా ఇంకా కొనసాగుతోంది. వరుస పరాజయాల నుంచి పూరి జగన్నాథ్ను బయటపడేసి భారీ కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా యూట్యూబ్లోనూ సత్తా చాటుతోంది. ఫిబ్రవరి 16న యూట్యూబ్లో పెట్టిన హిందీ వెర్షన్కు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. నాలుగు రోజుల్లో 50 మిలియన్ల వ్యూస్ (5 కోట్లకు పైగా) దక్కించుకుని దూసుకుపోతోంది. 8.6 లక్షల లైకులతో ప్రేక్షకాదరణ కొనసాగుతోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ హిందీ వెర్షన్ను ఆదిత్య మూవీస్ యూట్యూబ్లో విడుదల చేసిన 24 గంటల్లోనే 2 కోట్ల వ్యూస్, 5 లక్షల లైకులు దక్కించుకోవడం విశేషం. శివరాత్రికి స్పెషల్ షోలు కాగా, శివరాత్రి సందర్భంగా ‘ఇస్మార్ట్ శంకర్’ మరోసారి ధియేటర్లలో సందడి చేయనున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్లోని పలు ధియేటర్ల ప్రత్యేక షోలు ప్రదర్శించనున్నారు. ఆర్టీసీ క్రాస్రోడ్స్తో పాటు పలు ప్రాంతాల్లో స్పెషల్ షోలు ఉంటాయని ‘పూరి కనెక్ట్స్’ ట్విటర్ ద్వారా వెల్లడించింది. మరోవైపు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ‘ఫైటర్’ సినిమాను పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో హిందీ తెరకు పరిచయమైన అనన్య పాండే హీరోయిన్గా నటించనుంది. (చదవండి: విజయ్ దేవరకొండతో అనన్యా పాండే) -
ఇస్మార్ట్ శంకర్ ‘రెడ్’ ప్రారంభం
‘ఇస్మార్ట్ శంకర్’తో ఎనర్జటిక్ హీరో రామ్ పోతినేని బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. అయితే ఆ సినిమా విడుదలై వందరోజులు పూర్తయినప్పటికీ మరో సినిమాను ఆనౌన్స్ చేయలేదు. అయితే దీపావళి కానుకగా తన కొత్త సినిమాను ప్రకటించాడు రామ్. తనకు ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ వంటి హిట్ చిత్రాలను అందించినటువంటి కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా రెండ్రోజుల క్రితం ఈ సినిమాకు ‘రెడ్’అనే టైటిల్ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశాడు. తాజాగా ఆ చిత్ర షూటింగ్ బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్, బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్ చార్మి, తదితరులు హాజరయ్యారు. పూజాకార్యక్రమాలు నిర్వహించిన అనంతరం హీరో రామ్పై పూరి తొలి క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించాడు. కాగా, ఇది రామ్కు 18వ చిత్రం. కృష్ణ పోతినేని సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రామ్ పెదనాన్న ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. ఇక రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. రామ్ సరసన నటించే హీరోయిన్ను ఇంకా ఫైనల్ చేయలేదని చిత్ర యూనిట్ పేర్కొంది. అంతేకాకుండా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. ఇక ఇప్పటివకే విడుదలైన ఫస్ట్ లుక్లో రామ్ రఫ్గా కనిపించాడు. అంతేకాకుండా రామ్ లుక్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా, ‘రెడ్’ సినిమా తమిళంలో సూపర్ హిట్ అందుకున్న ‘తడమ్’కు రిమేక్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ మొదటిసారి ద్విపాత్రాభియం చేస్తున్నట్టు సమాచారం. మరి ‘రెడ్’ చిత్రంతో రామ్ మరో సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి. ఇదిలా ఉంటే, కిశోర్ తిరుమల ఈ ఏడాది ‘చిత్రలహరి’ సినిమాతో హిట్ అందుకున్నారు. ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ను మళ్లీ ట్రాక్పైకి తీసుకొచ్చారు. ఇప్పుడు రామ్తో ముచ్చటగా మూడోసారి పనిచేస్తున్నారు. మరి హ్యాట్రిక్ సాధిస్తారో లేదో చూడాలి. రీఎంట్రీ ఇవ్వనున్న శృతిహాసన్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘కాటమ రాయుడు’ తర్వాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు శృతి హాసన్. ఆ సినిమా వచ్చి రెండేళ్లు కావస్తున్నా మరే తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. తాజాగా రవితేజ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనుంది ఈ కోలీవుడ్ బ్యూటీ. డాన్ శీను, బలుపు వంటి బ్లాక్ బస్టర్ హిట్లనందించిన గోపిచంద్ మలినేని దర్వకత్వంలో రవితేజ ఓ సినిమా తీయబోతున్నారు. ఇది రవితేజకు 66వ చిత్రం కావడం విశేషం. అయితే ఈ సినిమాకు సంబంధించిన రీసెంట్ అప్డేట్ ప్రకారం ఈ చిత్రంలో రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటించనుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా శృతిహాసన్ సైతం ట్విటర్ వేదికగా స్పందిస్తూ ఈ సినిమా షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం రవితేజ ‘డిస్కోరాజా’షూటింగ్ శరవేగంగా జరపుకుంటోంది. వీఐ ఆనంద్ దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Welcoming ..the multi talented actress @shrutihaasan on board 😊👍👍 #RT66 pic.twitter.com/Coym47HUDF — Gopichand Malineni (@megopichand) October 30, 2019 -
మెర్సిడెస్ బెంజ్తో ‘ఇస్మార్ట్’ హీరోయిన్
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' బాక్సాఫీస్ను షేక్ చేసిన విషయం తెలిసిందే. హీరో రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచి కలెక్షన్ల మోత మోగించింది. అంతేకాకుండా చాలా రోజుల తర్వాత పూరి గెలుపు ట్రాక్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన నిధి అగర్వాల్, నభా నటేష్లు ప్రస్తుతం వారి కెరీర్లో దూసుకపోతున్నారు. అయితే ప్రధానంగా యూత్ కి హార్ట్ బీట్ ని పెంచే హీరోయిన్గా నభా నటేష్ మారింది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్తో ఈ బెంగుళూరు భామ కెరీర్ టాప్ గేర్కి పడింది. ‘నన్నుదోచుకుండువటే’లో సిరి, ‘ఇస్మార్ట్ శంకర్’ చాందిని పాత్రలతో శభాష్ అనిపించుకున్న నభా ఇప్పుడు తెలుగు పరిశ్రమలో ట్రేడింగ్ హీరోయిన్గా బిజీ అయింది. సాయిధరమ్ తేజ్ తో ‘సోలో బ్రతుకే సో బెటర్’ మాస్ మహారాజ్ రవితేజతో ‘డిస్కో రాజా’ వంటి ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్తో ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది. రవితేజతో నటిస్తున్న ‘డిస్కో రాజా’ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. అంతేకాకుండా నభా పలు ఈవెంట్స్లలో స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తోంది. తన ప్రజెన్స్కి ఏ వేదిక మీద అయినా స్పెషల్ అట్రాక్షన్ గా మారుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఈవెంట్ కి అయినా నభా ఫస్ట్ ఆప్షన్ అయ్యింది. తాజాగా మెర్సిడస్ బెంజ్ కారుతో దిగిన ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ పిక్స్ లో నభా లుక్స్ కుర్రకారును పిచ్చెక్కిస్తున్నాయి. అంతేకాకుండా తన సోషల్ మీడియా ఫాలో వర్స్కి గ్రాటిట్యూడ్ చెబుతూ ఈ పిక్స్ ని షేర్ చేసుకుంది నభా నటేష్. -
పూరీకి విమర్శకులు ఉండరు.. అభిమానులే ఉంటారు
‘‘ఎవరు సినిమా తీస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే హిట్ వస్తుందో అతనే ఇస్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఆయన డైలాగ్స్, డైరెక్షన్, టైటిల్స్ అన్నీ ఒక బ్రాండ్. హీరో క్యారెక్టర్స్ సృష్టించడంలో మేధావి’’ అన్నారు దర్శకులు కాశీవిశ్వనాథ్. సెప్టెంబర్ 28 దర్శకుడు పూరి జగన్నాథ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా దర్శకత్వ విభాగంలో 30 మంది సభ్యులకు 50 వేల చొప్పున 15 లక్షలు సహాయం చేశారు పూరి జగన్నాథ్, చార్మి. శనివారం ‘హెల్పింగ్ హ్యాండ్’ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకత్వ శాఖలోని 30 మందికి చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా చార్మీ మాట్లాడుతూ – ‘‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ముందు ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడ్డాం. ఎవ్వరికీ ఆ విషయం చెప్పలేదు. ఆ సమయంలో రామ్ మమ్మల్ని నమ్మారు. ‘పూరీగారి సినిమాలో నటించాలి’ అనే ఒక్క కారణంతో వచ్చి సినిమా చేశారు. అతనికి చాలా థ్యాంక్స్. మేం బ్యాడ్ ఫేజ్లో ఉన్నప్పుడు కూడా ‘డబ్బులు వస్తాయి.. పోతాయి. మళ్లీ వస్తాయి.. పోతాయి. వాటి గురించి ఆలోచించకూడదు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ కష్టపడదాం’ అని మా అందరిలో ధైర్యం నింపేవారు పూరీగారు. మాకు కుదిరితే ప్రతి ఏడాది పూరీగారి పుట్టినరోజున ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘ఇతరులను చూసి పోటీ ఫీల్ అవ్వడు, ఈర్ష్య పడడు పూరి. ఆయనకు విమర్శకులు ఉండరు. అభిమానులే ఉంటారు. దర్శకులకు సహాయం చేయాలనే ఆలోచన రావడం అభినందనీయం. ఎన్నో కుటుంబాల ఆశీస్సులు వీళ్ళతో ఉంటాయి’’ అన్నారు కాశీ విశ్వనాథ్. ‘‘పూరీగారు ఇండస్ట్రీలో ఒక కెరటం. పడటం తెలుసు. పడి లేవటం తెలుసు. ఎవరైనా సక్సెస్ వస్తే స్వీట్స్ పంచుతారు. ఆయన సహాయాన్ని అందిస్తున్నారు. ఈ సంప్రదాయం కొనసాగాలి’’ అన్నారు దర్శకుల సంఘం సభ్యులు సుబ్బారెడ్డి. ‘‘పూరి అంటేనే పాజిటివిటీ. ఆయనకు వరుసగా 24 హిట్స్ రావాలి. 24 శాఖల వారికి సహాయపడాలని కోరుకుంటున్నాను. దాసరిగారిని ఓ సందర్భంలో మీ వారసుడు ఎవరని అడిగితే పూరి జగన్నాథ్ అని చెప్పారు’’ అన్నారు జర్నలిస్ట్ ప్రభు. ‘‘గతంలో దాసరిగారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేవారు. పూరీగారు ఈ సహాయాలను ఇలానే కొనసాగించాలి. చార్మీగారికి ధన్యవాదాలు’’ అన్నారు రాంప్రసాద్. ‘‘జగ్గు (పూరి), నేను కలసి పెరిగాం. తనకి మనుషులను, మొక్కలను, జంతువులను ప్రేమించడం తెలుసు. తనో అడవి. అప్పుడప్పుడు కారుచిచ్చులు అంటుకోవచ్చు. కానీ అడవి ఎప్పుడూ అడవే. పూరీగారికి సినిమాను ప్రేమించడం మాత్రమే తెలుసు. ఇలాంటి సహాయ కార్యక్రమం చేయాలని ఐడియా ఇచ్చి నందుకు చార్మీగారికి ధన్యవాదాలు’’ అన్నారు నటుడు ఉత్తేజ్. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శక సంఘం సభ్యులు గంగాధర్, సుబ్బారెడ్డి, విషు రెడ్డి, అనిల్ పాల్గొన్నారు. -
పుట్టిన రోజున ‘పూరీ’ సాయం
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పుడు ఫుల్ జోష్లో ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్తో తిరిగి ఫాంలోకి వచ్చిన పూరి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్నాడు. ఇస్మార్ట్ సక్సెస్ను సెలబ్రేట్ చేస్తూ ఇప్పటికే కొత్త కారు కొన్న పూరి ఇప్పుడు తన పుట్టిన రోజును పురస్కరించుకొని తన ఆనందాన్ని మరింత మందికి పంచేందుకు రెడీ అవుతున్నారు. సినిమా బతకాలంటే దర్శకుడు బాగుండాలనే సిద్ధాంతాన్ని నమ్మిన పూరీ, గతంలో దర్శకత్వ శాఖలో పనిచేసి ప్రస్తుతం అవకాశాలు లేని వారికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తన వంతుగా 20 మంది ఈ ఏడాది ఆర్థిక సాయం చేస్తున్నట్టుగా ప్రకటించారు. అంతేకాదు పరిస్థితులు అనుకూలిస్తే ప్రతీ ఏడాది ఇలాగే సాయం చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు పూరి జగన్నాథ్, చార్మీ కౌర్లు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 28న పూరీ జన్మదిన వేడుకలను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నారు. -
మెగా హీరోతో ఇస్మార్ట్ హీరోయిన్
ఇస్మార్ట్ శంకర్ సినిమా చాలా మంది కెరీర్లకు మంచి బూస్ట్ ఇచ్చింది. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో రామ్తో పాటు డైరెక్టర్ పూరి జగన్నాథ్ కెరీర్కు కూడా ఈ సినిమా చాలా ప్లస్ అయ్యింది. అంతేకాదు హీరోయిన్ నభా నటేష్కు ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ కలిసొచ్చినట్టుగానే ఉంది. ఈ సినిమాతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న ఈ భామ, ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ను దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలో నటిస్తున్నసాయి ధరమ్ తేజ్ మరో సినిమాను లైన్లో పెట్టాడు. సుబ్బు అనే కొత్త దర్శకుడితో కలిసి సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నభా హీరోయిన్గా నటించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు అక్కినేని నట వారసుడు అఖిల్ నటిస్తున్న తాజా చిత్రంలోనూ హీరోయిన్గా నభా పేరునే పరిశీలిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ భామ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న డిస్కోరాజా సినిమాలో నటిస్తున్నారు. -
మరో మాస్ డైరెక్టర్తో రామ్!
ఇటీవల ఇస్మార్ట్ శంకర్తో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో రామ్ పోతినేని తన నెక్ట్స్ ప్రాజెక్ట్పై దృష్టి పెట్టాడు. గతంలో ఎక్కువగా రొమాంటిక్ సినిమాలు మాత్రమే చేసిన రామ్, ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తరువాత రూట్ మార్చాడు. మాస్ కథల కోసం ఎదురుచూస్తున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో మరో మాస్ కమర్షియల్ దర్శకుడితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. కొంత కాలంగా తన రేంజ్కు తగ్గ సక్సెస్లు సాధించటంతో ఫెయిల్ అవుతున్న సీనియర్ దర్శకుడు వీవీ వినాయక్, రామ్ హీరోగా ఓ యాక్షన్ డ్రామాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే రామ్కు కథ వినిపించి ఓకె చేయించుకున్న వినాయక్, ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ను సిద్ధం చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాలో లీడ్ రోల్లో నటిస్తున్న వినాయక్ ఆ సినిమాకన్నా ముందే రామ్ సినిమాను పట్టాలెక్కిస్తాడా? లేక ఆ సినిమా పూర్తయ్యాక మొదలుపెడతాడా? అన్న విషయం తెలియాల్సి ఉంది. -
ఇస్మార్ట్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ
‘ఇస్మార్ట్ శంకర్’తో తిరిగి ఫామ్ అందుకున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తదుపరి సినిమా హీరోకు క్రేజీ హీరోను ఎంచుకున్నాడు. టాలీవుడ్ సెన్సేషన్ అండ్ క్రేజీ హీరో విజయ దేవరకొండతో కలిసి పూరి ఓ సినిమాను పట్టాలెక్కించునున్నాడు. ఈ విషయాన్ని నటి, నిర్మాత చార్మీ కౌర్ అధికారికంగా ప్రకటించారు. డియర్ కామ్రేడ్ బాక్సాఫీస్ దగ్గర నిరుత్సాహపరిచినప్పటికీ.. నటన, లుక్స్ పరంగా విజయ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ ఇప్పటికే బ్లాక్ బస్టర్ సాధించి ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఇలాంటి తరుణంలో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందబోయే చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి, చార్మిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి బరిలో దించాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక డియర్ కామ్రేడ్తో నిరుత్సాహపరిచిన విజయ్, పూరి సినిమాతో ఆ లోటును భర్తీ చేయాలని ఆశిస్తున్నాడు. ఇక ఇస్మార్ట్ ఊపులోనే మరో హిట్ కొట్టాలని పూరి అండ్ టీమ్ తెగ ఆరాటపడుతోంది. -
షాకింగ్ లుక్లో రామ్!
చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో రామ్, ఇస్మార్ శంకర్తో సూపర్ హిట్ అందుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా 75 కోట్లకుపైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. ప్రస్తుతం ఇస్మార్ శంకర్ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న రామ్ డిఫరెంట్ లుక్లో షాక్ ఇచ్చాడు. సినిమా రిలీజ్ సమయంలో ఫారిన్లో ఉన్న రామ్, కాస్త ఆలస్యంగా ప్రమోషన్లో జాయిన్ అయ్యాడు. అన్ని ప్రమోషన్, సక్సెస్ కార్యక్రమాల్లో టోపి పెట్టుకొని కనిపించాడు. తాజాగా తన న్యూ లుక్ను సోషల్ మీడియాలో రివీల్ చేశాడు రామ్. గుండుతో ఉన్న రామ్ లుక్ చూసి అభిమానులకు షాక్ అవుతున్నారు. సాధారణంగా మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు ఇలాంటి ప్రయోగాలు చేయరు. మరి రామ్ ఎందుకు గుండు చేయించుకున్నట్టు.. ఏదైనా సినిమా కోసమా లేక.. సరదాగా ట్రై చేశాడా అన్న చర్చ జరుగుతోంది. -
పూరీతో రౌడీ!
ఇస్మార్ట్ శంకర్ సక్సెస్తో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ బౌన్స్ బ్యాక్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 75 కోట్లకు పైగా గ్రాస్ సాధించి ఇప్పటికీ మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. దీంతో మరోసారి పూరీ బిజీ అవుతున్నారు. ఇటీవల పూరీ దర్శకత్వంలో కన్నడ టాప్ హీరో యష్ హీరోగా సినిమా రూపొందుతున్న వార్తలు మీడియాలో హల్చల్ చేశాయి. తాజాగా మరో క్రేజీ స్టార్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, పూరితో సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. చాలా రోజులుగా వీరిద్దరి కాంబినేషన్లో సినిమాకు సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా పూరి, విజయ్కి పూర్తి స్క్రిప్ట్ వినిపించారని, విజయ్ కూడా త్వరలోనే సినిమాను పట్టాలెక్కించే ప్లాన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ వార్తలపై పూరి, విజయ్ల నుంచి అధికారిక ప్రకటనా మాత్రం రాలేదు. ప్రస్తుతం క్రాంతి మాధవ్ సినిమాతో పాటు, తమిళ దర్శకు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెరకెక్కుతున్న హీరో సినిమాల్లో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. -
మరో వివాదంలో ‘ఇస్మార్ట్ శంకర్’
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్. మంచి వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పటికే 75 కోట్లకుపైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. నటుడు, దర్శకుడు ఆకాష్ తన సినిమా కథను కాపీ కొట్టి ఈ సినిమా రూపొందిచారంటూ ఆరోపణలు చేయటంతో ఇస్మార్ట్ శంకర్పై వివాదాలు మొదలయ్యాయి. తాజాగా ఈ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. బెంగళూరులోని మల్టీప్లెక్స్లలో ఏర్పాటు చేసిన పోస్టర్లు వివాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. రామ్ సిగరెట్ తాగుతున్నట్టుగా ఉన్న స్టిల్స్పై హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి స్టిల్స్ను పబ్లిక్ ప్లేస్లో ప్రదర్శించటం చట్టరీత్యా నేరమని, దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా చిత్ర నిర్మాతలకు నోటీసులు పంపినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ స్పందించాల్సి ఉంది. రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందించారు. నటి చార్మీతో కలిసి పూరి జగన్నాథ్ స్వయంగా ఈ సినిమాను నిర్మించాడు. -
“ఇస్మార్ట్ శంకర్” బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ స్టిల్స్
-
రామ్ ఎనర్జీ సినిమాను నిలబెట్టింది
‘‘ఈ మధ్యకాలంలో నేను చేసిన రెండు మంచి పనులు.. రామ్ని కలవడం ఒకటి, ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చేయడం మరోటి. అందరి ఆదరణతో ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్బస్టర్ హిట్ అయింది’’ అని పూరి జగన్నాథ్ అన్నారు. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. నభా నటేశ్, నిధీ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. పూరి, చార్మి నిర్మించిన ఈ చిత్రం జూలై 18న రిలీజైంది. సక్సెస్ఫుల్ టాక్తో 75 కోట్ల గ్రాస్ను వసూళ్లు చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు పూరి మాట్లాడుతూ – ‘‘సినిమా చూసి నా ఫ్రెండ్స్ అందరూ అభినందిస్తున్నారు. రామ్ ఎనర్జీ ఈ సినిమాను నిలబెట్టింది. సినిమాలో రామ్ క్యారెక్టర్ గురించి అందరూ మాట్లాడుకోవడం ఆనందం అనిపించింది’’ అన్నారు. ‘‘సినిమా చూశాక ఎలా ఫీల్ అయ్యానో, ఆడియన్స్ రెస్పాన్స్ చూశాక అలాంటి ఫీలింగే కలిగింది. గతంలో నేను చేసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా, నా పాత్ర ఉన్నాయి. దానికి కారణం పూరీగారు. కొత్త క్యారెక్టరైజేషన్తో∙నన్ను కొత్తగా స్క్రీన్ మీద చూపించారు. నా మంచి కోరుకునే వాళ్లందరికీ ఈ సక్సెస్ను అంకితం ఇస్తున్నాను. మణిశర్మ సంగీతం, హీరోయిన్స్ గ్లామర్ ఈ సక్సెస్కు యాడ్ అయ్యాయి. సినిమాకు పని చేసిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు రామ్. ‘‘మా సినిమాను బ్లాక్బస్టర్ చేసిన అందరికీ థ్యాంక్స్. రామ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పూరీగారు రామ్ పాత్రను కొత్తగా రూపొందించారు. అదే సినిమా సక్సెస్కు ముఖ్య కారణం. రామ్ సొంత బ్యానర్ స్రవంతి మూవీస్, సెకండ బ్యానర్ పూరి కనెక్ట్స్’’ అన్నారు చార్మి. ‘‘నాకు చాలా ఇంపార్టెంట్ టైమ్లో వచ్చిన హిట్ ఇది. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన పూరీగారికి, సపోర్ట్ చేసిన చార్మీగారికి థ్యాంక్స్’’ అన్నారు నిధీ. -
రెండు మంచి పనులు చేశా: పూరి
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై నిర్మించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జూలై 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సక్సెస్ఫుల్గా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి రూ.75 కోట్ల గ్రాస్ను సాధించింది. ఈ సందర్భంగా శనివారం చిత్రయూనిట్ సక్సెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ... ‘నేను ఈ మధ్య కాలంలో చేసిన రెండు మంచి పనులు రామ్ను కలకడం, ఇస్మార్ట్ శంకర్ సినిమా తీయడం. అందరి ఆదరణతో ఈ సినిమా ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. సినిమా చూసి చాలా మంది నా మిత్రులు అప్రిసియేట్ చేసారు. రామ్ ఎనర్జీ ఈ సినిమాను నిలబెట్టింది. ఈ సినిమా సక్సెస్ టూర్ వెళ్ళినప్పుడు అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. రామ్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోడం ఆనందమేసింది’ అన్నారు. హీరో రామ్ మాట్లాడుతూ... ‘సినిమా చూశాక ఎలా ఫీల్ అయ్యానో ఆడియన్స్ రెస్పాన్స్ చూసాక అదే ఫీల్ అయ్యాను. నేను ఇదివరకు చేసిన పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో నా పాత్ర ఉంది, అందుకు కారణం పూరీ గారు. నాకు ఒక మంచి క్యారెక్టరైజేషన్ ఇచ్చి నన్ను డిఫరెంట్గా ప్రెజెంట్ చేసారు. ఈ సక్సెస్ను నా మంచి కోరుకునే వారందరికీ డెడికేట్ చేస్తున్నాను. మణిశర్మ గారి సంగీతం హీరోయిన్స్ గ్లామర్ సినిమా సక్సెస్కు యాడ్ అయ్యాయి. సినిమాలో నటించిన ఇతర నటీనటులకు టెక్నీషియన్స్కు థాంక్స్’ అన్నారు. చార్మి మాట్లాడుతూ...‘మా సినిమాను ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ చేసిన అందరికీ థాంక్స్. సక్సెస్ టూర్లో ఎక్కడికి వెళ్లినా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. రామ్ తన బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. అలాగే నిధి, నభా నటేశ్, ఇద్దరూ చాలా బాగా నటించారు. ఇంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. పూరి గారు రామ్ పాత్రను బాగా డిజైన్ చేశారు, అదే సినిమా సక్సెస్కు మెయిన్ రీజన్ అయ్యింది. రామ్కు స్రవంతి మూవీస్ ఫస్ట్ బ్యానర్ అయితే పూరి కనెక్స్ సెకండ్ హోమ్ బ్యానర్ లాంటిది. కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. త్వరలో మరో ఈవెంట్తో మిమ్మల్ని కలుస్తాను’ అన్నారు. హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ... ‘నాకు చాలా క్రూషియల్ టైమ్లో ఈ హిట్ వచ్చింది. ఇది కెరీర్కి ఎంతో హెల్ప్ అవుతుంది. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన పూరి గారికి, అలాగే నాకు ఎంతో సపోర్ట్ చేసిన ఛార్మి గారికి థాంక్స్. రామ్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. అలాగే నభా నటేశ్ బాగా నటించింది’ అన్నారు. -
ఏం కలెక్షన్లురా భయ్..!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ కలెక్షన్ల హోరు కొనసాగుతోంది. ఇప్పటికే దావత్ల మీద దావత్లు చేసుకుంటున్న సినిమా యూనిట్కు ఇది కిక్కిచ్చే వార్త. ఇస్మార్ట్ శంకర్ హిట్టవడంతో పట్టాలు తప్పిన పూరీ జగన్నాథ్, రామ్ల ట్రాక్ లైన్లోకి వచ్చినట్టైంది. విడుదలై రెండో వారంలో అడుగుపెట్టినా కలెక్షన్స్లో మాత్రం జోరు తగ్గడం లేదు. మాస్ ఎంటర్టైనర్ ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రపంచ వ్యాప్తంగా రూ.71 కోట్లు రాబట్టగా ఒక్క నైజాంలోనే రూ. 14 కోట్లకు పైగా రాబట్టింది. సీడెడ్లో రూ.5 కోట్లు, వైజాగ్లో రూ.4 కోట్లు వసూలు చేయగా మిగతా ప్రాంతాల్లోనూ కలెక్షన్లు స్థిరంగానే ఉన్నాయి. ఓవర్సీస్లోనూ ఇస్మార్ట్ సత్తా చాటుతున్నాడు. మాస్ ఎలిమెంట్స్తో దుమ్ము లేపుతున్న ఈ చిత్రం రూ.100 కోట్ల మైలు రాయిని చేరుకునేలా ఉంది. ఈ చిత్రంలో నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా.. మణిశర్మ సంగీతాన్ని అందించారు. -
అభిమాని ప్రేమకు పూరీ ఫిదా
చాలా కాలం తరువాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఫుల్ జోష్లో కనిపిస్తున్నాడు. రామ్ హీరోగా తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ ఘనవిజయం సాధించటంతో పూరీ టీం సంబరాల్లో మునిగిపోయింది. సినిమా ప్రమోషన్లో భాగంగా అభిమానులను స్వయంగా కలుస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు చిత్రయూనిట్. తాజాగా ప్రమోషన్లో భాగంగా హన్మకొండకు వెళ్లిన ఇస్మార్ట్ శంకర్ టీంకు ప్రభాకర్ అనే అభిమాని సర్ప్రైజ్ ఇచ్చాడు. ఏకంగా పూరీ ముఖాన్ని తన ఛాతీ మీద పచ్చబోట్టుగా వేయించుకున్నాడు. ప్రభాకర్, పూరీని కలిసి తన టాటూను చూపిస్తున్న వీడియోను నటి, నిర్మాత చార్మీ తన సోషల్ మీడియా పేజ్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న పూరీ త్వరలో కన్నడ నటుడు, కేజీఎఫ్ స్టార్ యష్ హీరోగా ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. Tattoo of @purijagan by a die hard fan Prabhakar.. thank u sooooo much 💖💖💖 u touched my heart ❣#ismartshankar ISMART BLOCKBUSTER 💪🏻💪🏻 pic.twitter.com/hHbMWF2vr2 — Charmme Kaur (@Charmmeofficial) July 31, 2019 -
క్రేజీ స్టార్తో పూరి నెక్ట్స్!
చాలా రోజులుగా సరైన హిట్ లేక ఇబ్బందుల్లో ఉన్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఇస్మార్ట్ శంకర్తో సాలిడ్ హిట్ కొట్టాడు. మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా వందకోట్ల మార్క్ దిశగా పరుగులు పెడుతోంది. ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న పూరి జగన్నాథ్ తన తదుపరి చిత్రాన్ని ఓ క్రేజీ స్టార్తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. కేజీఎఫ్ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ హీరో యష్తో పూరి తన నెక్ట్స్ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. కన్నడ హీరోలు పునీత్ రాజ్కుమార్, ఇషాన్ల తొలి చిత్రాలకు దర్శకత్వం వహించిన పూరి, సాండల్వుడ్కు సుపరిచితుడే. అందుకే యష్ హీరోగా తెలుగు, కన్నడ భాషల్లో బైలింగ్యువల్ సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట పూరి. మహేష్ బాబు హీరోగా తెరకెక్కించాలనుకున్న జనగణమన సినిమానే యష్ హీరోగా రూపొందించే ఆలోచనలో పూరి ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై పూరి టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. -
త్వరలోనే డబుల్ ఇస్మార్ట్ స్టార్ట్
‘‘హిట్ సాధించి మూడేళ్లయింది. నా లైఫ్లో ఎప్పుడూ హిట్ కోసం తపించని నేను హిట్ కొట్టాలని పరితపించడం ఇదే మొదటిసారి. ఫైనల్గా ‘ఇస్మార్ట్ శంకర్’తో విజయం వచ్చింది’’ అన్నారు పూరి జగన్నాథ్. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ చిత్రంలో నభా నటేష్, నిధీ అగర్వాల్ కథానాయికలుగా నటించారు. పూరి జగన్నాథ్, చార్మి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడులైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా విషయంలో నాపై అందరూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమా విజయం విషయంలో చాలా టెన్షన్ పడ్డాను. ఈ చిత్రం బ్లాక్బస్టర్ హిట్ సాధించింది. ఇటీవల మా టీమ్ చేసిన ఆంధ్రా టూర్కు అద్భుతమైన స్పందన లభించింది. ప్రతి ఒక్కరు ఇస్మార్ట్ –2 ఎప్పుడని అడుగుతున్నారు. వెంటనే స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసి త్వరలోనే ‘ఇస్మార్ట్–2’ తీయాలని ఉంది. ఆ సినిమా కోసం ‘డబుల్ ఇస్మార్ట్ 2’ టైటిల్ రిజిస్టర్ చేసి పెట్టాను. ఇలాంటి మాస్ ఫీల్ సినిమాలను భవిష్యత్లో మరిన్ని తీయాలనుకుంటున్నా. రేపటి నుంచి తెలంగాణ టూర్ చేపట్టబోతున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రం తొమ్మిది రోజుల్లో 63 కోట్ల రూపాయలను వసూలు చేసింది. మేము అనుకున్న కలెక్షన్స్ మైలురాయిని చేరుకుంటామనే నమ్మకం ఉంది. రామ్ అద్భుతంగా నటించారు’’ అన్నారు ఛార్మి. ‘‘పూరీసార్ ఓ డ్రగ్లాంటోడు. ఒక్కసారి ఆయనకు అడిక్ట్ అయితే వదిలిపెట్టలేం. సినిమా వంద కోట్లు దాటుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సత్యదేవ్. ‘‘నా కెరీర్లో మైలురాయి వంటి చిత్రమిది’’ అన్నారు నిధీ అగర్వాల్. -
దిమాక్ ఖరాబ్.. దిల్ ఖుష్!
సాక్షి, మద్దిలపాలెం(విశాఖ తూర్పు): ఫుల్ మాస్ ఎంటర్టైనర్.. కుర్రాళ్లు మళ్లీ పూర్వం రోజుల్లో మాదిరి థియేటర్లలో సందడి చేసే సరదా మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ అని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. ఆంధ్రాలో కలెక్షన్లు, ఆదరణ చూస్తుంటే దిమాక్ ఖరాబ్ అవుతోందని చమత్కరించారు, తెలంగాణ యాసతో, సా హసంతో తెరకెక్కించిన మాస్ మూవీకి ప్రేక్షక దేవుళ్లు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. చిత్ర విజయోత్సవంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఓ హోటల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎనర్జీటిక్ హీరో రామ్ను దృష్టిలోపెట్టుకుని పూరా మాస్ ఓరియంటెండ్ బ్యాక్డ్రాప్లో ఇస్మార్ట్ శంకర్ కథను తయారు చేసి, తెరకెక్కించానన్నారు. చిత్రం ఆద్యంతం ఫుల్ ఎనర్జిటిక్గా ఉండడంతో కుర్రాళ్లు కేక పుట్టిస్తున్నారని చెప్పారు. ‘ఈ మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద కుర్రాళ్లు చేస్తున్న సందడి చూస్తుంటే గత వైభవం కళ్లెదుట కదులుతోంది. అప్పట్లో అభిమాన హీరో చిత్రం రిలీజ్ ఫ్యాన్స్ చేసే సందడి మళ్లీ కనిపిస్తోంది.’ అని చెప్పారు. ‘పూర్తిగా తెలంగాణ బ్యాక్ డ్రాప్లో.. హీరో రామ్కు తెలంగాణ యాస పెట్టి తీసిన చిత్రానికి ఆంధ్రలో యమా క్రేజ్ వచ్చింది. తెలంగాణ యాసలో రామ్ పలికిన డైలాంగ్లకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.’ అని చెప్పారు. ఆస్ట్రేలియా చిత్రం ‘ది స్నేక్’ చూశాక, తనకు బ్రెయిన్ ట్రాన్స్ఫర్ ఐడియా వచ్చిందని, అదే ఊపుతో కథను సిద్ధం చేశానని పూరీ చెప్పారు. ఈ కథకు వేరెవరితో సం బం ధం లేదని స్ప ష్టం చేశారు. ‘మాస్ కథాం శానికి క్లాస్ టచ్ ఇచ్చి తీశాను. ఎ లా రిసీవ్ చేసుకుం టారోనన్న మి మాంస ఉండేది. అ యితే ఫస్ట్డే ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్తో మూవీ బ్లాక్బస్టర్ అయింది. ఇందుకు ప్రేక్షక దేవుళ్లకు రు ణపడి ఉంటా.’అన్నారు. కలెక్షన్ల హోరు ‘కథలో కొత్తదనం ఉందన్న నమ్మకంతో, యూత్కు బాగా కనెక్ట్ అవుతుందన్న విశ్వాసంతో హీరో రామ్ బాడీ స్టైల్కు తగ్గట్టుగా కథనాన్ని పూరీ జగన్నాథ్ నడిపించారు. ప్రేక్షకులు కలెక్షన్లతో హోరెత్తిస్తున్నారు.’ అన్నారు నిర్మాత, హీరోయిన్ ఛార్మి. విడుదలైన తొ మ్మిది రోజుల్లోనే రూ.63 కోట్లు రాబట్టుకుందన్నా రు. ‘చిత్రం విజయం గురించి చెప్పడానికి మాటలు రావడంలేదు. ఎమేజింగ్ హిట్. పూరీ ఫాన్గా, నిర్మాతగా నాకు ఇంత గొప్ప చిత్రం ఇచ్చినందుకు ఆయనను అభినందిస్తున్నాను.’ అని చెప్పారు. ఇక్కడ ఉండిపోవాలని ఉంది.. ‘వైజాగ్ లవ్లీ బ్యూటీఫుల్ స్మార్ట్సిటీ. ఈ సిటీలో పూరా మాస్ మూవీ ఇస్మార్ట్శంకర్కు మంచి హిట్ ఇ చ్చినందుకు థ్యాంక్స్. ఇక్కడ బీచ్ ను, గ్రీనరీని చూస్తుంటే ఇక్కడే ఉం డిపోవాలనిపిస్తుంది.’ అని హీరోయిన్ నిధి అగర్వాల్ అన్నా రు. తనకు గొప్ప హిట్ ఇచ్చి కెరీర్కు బాటలు వేశారన్నారు. చిలక.. చిలక సాంగ్ హోరు పూరీ దర్శకత్వంలో 27 చిత్రాలకు గీత రచయితగా పనిచేసినా ‘ఇస్మా ర్ట్ శంకర్’లో చిలక..చిలక సాంగ్కు వస్తున్న క్రేజ్ను ఇంతవరకు చూడలేదని గీత రచయిత భాస్కరభట్ల అన్నారు. చిత్రంలో అన్ని పాటలూ రాయడమే కాకుండా.. యూత్ కనెక్ట్ అయ్యే పదాలతో గీత రచన చేసినట్టు చెప్పారు. పాటలకు తగ్గట్టుగా మణిశర్మ బాణీలు అందించారని చెప్పా రు. సమావేశంలో సురేష్ మూ వీస్ ప్రతినిధి పాల్గొన్నారు. -
‘గిది సిన్మార భయ్.. సీన్ చేయకండి’
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కిన మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే 50 కోట్లకుపైగా గ్రాస్ సాధించి సత్తా చాటింది. అయితే సినిమాలో మాస్ ఎలిమెంట్స్ కాస్త శృతిమించటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శలపై హీరో రామ్ ఇస్మార్ట్ స్టైల్లో స్పందించారు. ‘హీరో హెల్మెట్ పెట్టుకోలేదు.. హీరో స్మోక్ చేస్తున్నాడు.. హీరో అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు.. ఎంత సేపు ఇవే గాని. అక్కడ హీరో అడ్డమొచ్చినవాళ్లని చంపేస్తున్నాడు అని ఒక్కళ్లు కూడా కంప్లయిన్ చేయటం లేదు. ప్రాణానికి విలువే లేదు. ఇది సిన్మార భయ్.. సీన్ చూడండి.. సీన్ చేయకండి’ అంటూ ట్వీట్ చేశారు. Hero helmet pettukoledhu.. Hero smoke chestunnadu.. Hero ammailaki respect ivvatledhu.. Entha sepu ivve gaani.. Akkada hero addamochinavaalani champestunaadu..ani okkallu kuda complain cheyadam ledhu.. No value for life! SAD! #iSmartShankar - “A” Badass fictional character. — Ustaad iSmart Shankar (@ramsayz) July 23, 2019 Gidhi Cinema ra bhai...Scene chudandi..Scene cheyakandi..#love -Ustaad #iSmartShankar — Ustaad iSmart Shankar (@ramsayz) July 23, 2019 -
ఇస్మార్ట్... కాన్సెప్ట్ నాదే!
‘‘ఒక వ్యక్తి మెదడును హీరోకి మార్చే కాన్సెప్ట్తో తెలుగు–తమిళ భాషల్లో లేడీ డైరెక్టర్ రాధ నాతో సినిమా తీశారు. ‘నాన్ యార్’ పేరుతో తమిళ చిత్రం విడుదల కాగా, ‘కొత్తగా ఉన్నాడు’ పేరుతో త్వరలో తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈలోపు ఇలాంటి మూలకథతో ‘ఇస్మార్ట్ శంకర్’ రిలీజ్ కావడం మాకు షాక్ తగిలినట్లయింది’’ అని ‘ఆనందం’ ఫేమ్ ఆకాష్ అన్నారు. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. సోమవారం పాత్రికేయులతో ఆకాష్ మాట్లాడుతూ – ‘‘పూరి జగన్నాథ్ను సంప్రదించడానికి ప్రయత్నిస్తే అందుబాటులోకి రాలేదు. అందుకే తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసి, ఇక్కడ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమస్య సామరస్యంగా పరిష్కారం కాకపోతే చట్టాన్ని ఆశ్రయించాలనుకుంటున్నాను’’ అన్నారు. -
సేఫ్ జోన్లోకి ‘ఇస్మార్ట్ శంకర్’
లాంగ్ గ్యాప్ తరువాత టాలీవుడ్ తెర మీద వచ్చిన పక్కా మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మూడు రోజుల్లోనే సేఫ్ జోన్లోకి ఎంటర్అయిపోయింది. తొలి మూడు రోజుల్లో ఈ సినిమా 36 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు. ఈ రోజు కూడా కలెక్షన్లు భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీంతో తొలి వారాంతానికే ఇస్మార్ట్ శంకర్ 50 కోట్ల మార్క్ను చేరుకునే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. చాలా కాలం తరువాత పూరి జగన్నాథ్ బిగ్ హిట్ సాధించటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో షియాజీ షిండే, ఆశిష్ విద్యార్థిలు కీలక పాత్రలో నటిస్తున్నారు. -
‘ఇస్మార్ట్ ’ పోలీస్!
సాక్షి, హైదరాబాద్: ఆయనది యాక్షన్.. వారిది ఇస్మార్ట్ రియాక్షన్! ఆయనది ట్వీట్.. వారిది ‘ట్రీట్’. ఆయన పోలీసులెక్కడున్నారంటే.. వారు చలానా రూపంలో ప్రత్యక్షమయ్యారు. ఆయనే సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆయన రూటే సెపరేటు.. రీల్లోనూ, రియల్గానూ ఆయనది వివాదా’స్పదం’. టీఎస్07 2552 బుల్లెట్ బైక్ను ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి డ్రైవ్ చేస్తుంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆగస్త్య, రాంగోపాల్ వర్మ వెనుక కూర్చొని ఉన్నారు. ఈ ఫొటోను వర్మ ట్వీట్ చేయడం వివాదాస్పదమైంది. తాము మూసాపేటలోని శ్రీరాములు థియేటర్లో ‘ఇస్మార్ట్ శంకర్’సినిమా చూసేందుకు హెల్మెట్ లేకుండా, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వెళుతున్నామంటూ ట్వీట్ చేసిన కొంతసేపటికి... ‘పోలీసులు ఎక్కడ ఉన్నారు... వాళ్లంతా థియేటర్లో సినిమాలు చూస్తున్నారని అనుకుంటున్నాను’అని మరో ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారింది. వర్మ ట్వీట్లను ఫాలో అయ్యే ఓ వ్యక్తి.. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించడమే కాకుండా పోలీసులకే సవాల్ విసిరేలా చేసిన వ్యాఖ్యలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఫేస్బుక్ ద్వారా పంపి ఫిర్యాదు చేశారు. వెంటనే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ‘మీరు పంపిన ఫొటో ఆధారంగా ఆ బైక్ నంబర్కు ఈ–చలానా విధిస్తున్నాం... మాతో చేతులు కలిపినందుకు ధన్యవాదాలు’అంటూ ఇస్మార్ట్గా ప్రతిస్పందించారు. ట్రిపుల్ రైడింగ్కు రూ.1200, హెల్మెట్ లేనందుకు రూ.135... మొ త్తంగా రూ.1335 జరిమానాను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విధించారు. అయితే, పోలీసులు జారీ చేసిన ఈ–చలానా బైక్ యజమాని బడ్డె దిలీప్కుమార్కు వెళ్లింది. -
రూల్స్ బ్రేక్ చేసిన వర్మ.. ఫైన్ వేసిన పోలీసులు!
నిత్యం వివాదాలతో సావాసం చేసే ఆర్జీవీ మరోసారి హాట్టాపిక్గా మారాడు. హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్లో వెళ్తూ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ వివాదం సృష్టించాడు. అసలేం ఏం జరిగిందంటే.. టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. రామ్ గోపాల్వర్మ శిష్యుడన్న సంగతి తెలిసిందే. చాల కాలానికి తన శిష్యుడు పూరి ‘ఇస్మార్ట్ శంకర్’తో హిట్ కొట్టాడు. ఈ చిత్రాన్ని చూసేందుకు వర్మ రూల్స్ను బ్రేక్ చేస్తూ తన శిష్యులతో కలిసి బైక్పై వెళ్లాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్జీవీ చేసిన ట్రిపుల్ రైడింగ్పై ట్రాఫిక్ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రిపుల్ రైడింగ్, నో హెల్మెట్ కారణంగా ఆర్జీవీకి ట్రాఫిక్ పోలీసులు రూ.1,335 ఫైన్ విధించారు. అసలు ఈ వివాదం మొదలైందీ వర్మ వల్లే. ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి, లక్ష్మీస్ ఎన్టీఆర్ డైరెక్టర్ అగస్త్య మంజు, తాను బైక్పై ట్రిపుల్ రైడింగ్లో హెల్మెట్ లేకుండా సినిమాను చూడటానికి వెళ్తున్నానని ఫోటోను షేర్ చేశాడు ఆర్జీవీ . దీంతో ఈ పిక్ వైరల్ కాసాగంది. ఇక ఈ ఫోటోను నెటిజన్లు కామెంట్లతో ఓ ఆట ఆడేసుకున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు వర్మ చాలెంజ్ విసిరాడని, మూడు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారని.. నో హెల్మెట్, త్రిబుల్ రైడిండ్, డ్రంక్ అండ్ డ్రైవ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ట్యాగ్ చేశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు చివరకు ఫైన్ విదించారు. -
ఇస్మార్ట్ సంబరాల్లో వర్మ
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్లో తెరకెక్కిన మాస్ మసాలా ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవటంతో చిత్రయూనిట్ సంబరాల్లో మునిగిపోయారు. తాజాగా ఇస్మార్ట్ శంకర్ టీంతో రామ్ గోపాల్ వర్మ కూడా జాయిన్ అయ్యారు. పూరి టీంతో కలిసి పార్టీలో పాల్గొన్న వర్మ షాంపైన్ బాటిల్ను పొంగిస్తూ కనిపించారు. తన శిష్యుడి సక్సెస్ను సెలబ్రేట్ చేస్తూ సందడి చేశారు. పూరి కూడా గురువును కౌగిలించుకొని కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీరాములు థియేటర్లో ఇస్మార్ట్ శంకర్ షోకు దర్శకులు అజయ్ భూపతి, అగస్త్య మంజులతో వెళ్లారు వర్మ. -
బైక్ మీద సినిమాకెళ్తున్నా : ఆర్జీవీ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమాల విషయంలోనే కాదు తన శిష్యులు తెరకెక్కించిన సినిమాలకు కూడా కావాల్సినంత పబ్లిసిటీ చేసి పెడుతున్నారు. తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మాస్ మసాలా ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మూవీపై వరుస ట్వీట్ చేస్తున్నాడు వర్మ. ఈరోజు వర్మ తన శిష్యులతో కూడా ఈ సినిమా చూడబోతున్నాడు. ‘ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేం అగస్త్య మంజులతో కలిసి మధ్యాహ్నం 2 గంటల ఆట చూడటానికి ముసాపేట శ్రీరాములు థియేటర్లో సినిమా చూడబోతున్నా. థియేటర్కు మాస్ గెటప్లో బైక్పై వెళ్లనున్నాం’ అంటూ ట్వీట్ చేశారు వర్మ. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇస్మార్ శంకర్ మంచి వసూళ్లను రాబడుతూ దూకుపోతోంది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్లు హీరో హీరోయిన్లుగా నటించారు. పీసీ కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా కు మణిశర్మ సంగీతమందించారు. బీ, సీ సెంటర్లలో దుమ్ము రేపుతున్న ఈ సినిమా తొలి రెండు రోజుల్లోనే రూ. 25 కోట్ల గ్రాస్ సాధించటం విశేషం. Me , Rx 100’s Ajay Bhupathi, and Lakshmi’s NTR’s Agasthya are together going today to watch #issmartshankar at 2 PM show in Sriramulu ,Moosapet ..We 3 are going to theatre in mass getups on a bike 💐💐💐💃💃💃 pic.twitter.com/papgKQlHgu — Ram Gopal Varma (@RGVzoomin) July 20, 2019 -
మాస్ పవర్ ఏంటో తెలిసింది
‘‘చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలనుకున్నాను. అలానే అయ్యాను. అదే చాలా పెద్ద సక్సెస్. ఇప్పుడు సినిమాలు హిట్ అవ్వడం పెద్ద బోనస్లా భావిస్తున్నాను. ‘సవ్యసాచి’ మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది. ‘మిస్టర్ మజ్ను’ రెస్పెక్ట్ని తెచ్చిపెట్టింది. ‘ఇస్మార్ట్ శంకర్’ ఫస్ట్ బ్లాక్బస్టర్ హిట్ని అందించింది’’ అని హీరోయిన్ నిధీ అగర్వాల్ అన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్, నిధీ అగర్వాల్, నభా నటేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి జగన్నాథ్, ఛార్మీ నిర్మించారు. గత గురువారం ఈ చిత్రం రిలీజ్ అయింది. ‘ఇస్మార్ట్ శంకర్’ నాకు తొలి మాస్ బ్లాక్బస్టర్ని అందించింది అంటూ పలు విశేషాలను పంచుకున్నారు నిధీ అగర్వాల్. ► సినిమా రిలీజ్ రోజున విజయవాడలో ఉన్నాను. ఉదయం ఎనిమిదిన్నరకు డైరెక్టర్ చందు మొండేటిగారు ‘ఫస్ట్ బ్లాక్బస్టర్కి కంగ్రాట్స్’ అంటూ మెసేజ్ పంపించారు. సినిమాకు రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఈ సక్సెస్ని మనసుకి తీసుకోవడానికి టైమ్ పట్టేలా ఉంది. ఈ సినిమాతో నాకు మాస్ పవర్ ఏంటో తెలిసింది. నేనింకా సినిమా చూడలేదు. చూద్దామంటే నాక్కూడా టికెట్స్ దొరకలేదు (నవ్వుతూ). ► సోషల్ మీడియా నాకు ఫస్ట్ నుంచి చాలా సపోర్టివ్గా ఉంటోంది. నాకెంతో ప్రేమను ఇస్తుంటారు. 60–70 పాజిటివ్ కామెంట్స్లో ఒకటీ అరా నెగటివ్ కామెంట్స్ వస్తుంటాయి. వాటిని నేను పెద్దగా పట్టించుకోను. కానీ మొన్న ఒక్కసారి మాత్రమే రియాక్ట్ అయ్యాను. (‘ఇస్మార్ట్ శంకర్’లో ఎక్స్పోజింగేనా? నటనకేమైనా స్కోప్ ఉందా? అంటూ సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలకు.. నటనతో పాటు చాలా చేశాను అని స్పందించారు నిధి). ► ‘మిస్టర్మజ్ను’ తర్వాత పూరీ సార్ని కలిశాను. ఇందులో నీది సైంటిస్ట్ పాత్ర. ఇది సూపర్హిట్ ఫిల్మ్ నిధీ. నువ్వు చేయాలి అన్నారు పూరీగారు. ఆయన సినిమాకు నో ఎలా చెబుతాను? పూరీ సార్ గురించి నేను చాలా విన్నాను. ఆయన సినిమాలు చూశాను. ఆయనకి ఉన్న క్రేజ్, ఫ్యాన్ బేస్ సూపర్. నేను పని చేయాలనుకున్న దర్శకుల్లో ఆయన కూడా ఒకరు. పెద్ద దర్శకుల సినిమాలతో మ్యాజిక్ జరుగుతుంది. పూరీగారి హీరోయిన్ అవడం లక్కీ అని ఫీలవుతున్నాను. ► సినిమా సక్సెస్, ఫెయిల్యూర్స్ మన చేతుల్లో ఉండవు. స్క్రిప్ట్ బావుంటుంది, ఈ ఐడియా వర్కవుట్ అవుతుందనే నమ్మకంతో సినిమాలు చేస్తాం. ఫ్రైడే టు ఫ్రైడే సక్సెస్ని నేను నమ్మను. సినిమా రిజల్ట్ను ఎప్పుడూ నేను హార్ట్కి తీసుకోను. యాక్టింగ్ ప్రాసెస్ను ఎంజాయ్ చేస్తాను. ► రామ్తో వర్క్ చేయడం మంచి ఎక్స్పీరియన్స్. తనో స్వీట్హార్ట్. ఛార్మీగారు నిర్మాతగా సూపర్. చేయాలనుకున్న పనిని కచ్చితంగా చేస్తారు. పూరీగారు సెట్లో అందరితో ఒకేలా ఉంటారు. ఆయన చాలా స్వచ్ఛమైన మనిషి. చాలా కైండ్. సెట్స్లో చాలా సరదాగా అనిపించేది. ► నా గురించి రామ్గోపాల్ వర్మగారు ట్వీట్ (సూర్యుడి కన్నా హాట్ అని నిధీని ఉద్దేశించి ట్వీట్) చేశారు. ఆయన తీసిన ‘రంగీలా’ సినిమాకు నేను పెద్ద ఫ్యాన్ని. ఆ సినిమాలో పాటలు ఇప్పటికీ వింటూనే ఉంటాను. నాకు కూడా ‘రంగీలా’ లాంటి సినిమా చేయాలనుంది. మంచి స్క్రిప్ట్, డైరెక్టర్ ఉంటే అలాంటి సినిమాలు చేసేయొచ్చు. ‘రంగీలా’ సినిమా గురించి పూరీగారితో ఓ రోజు సరదాగా షేర్ చేసుకున్నాను. తర్వాత వర్మగారు నా గురించి ట్వీట్ చేశారు. సో.. నేనేదంటే అది జరుగుతుంది (నవ్వుతూ). ► గ్లామర్ సీన్స్ ఎవరితో తీస్తున్నారు, ఏ దర్శకుడు తీస్తున్నారు అన్నది ముఖ్యం. స్క్రీన్ మీద ఎలా ఉంటుందన్నది ముఖ్యం. పూరీగారు నన్ను బాగా చూపించారు. నిన్న మా పేరెంట్స్ సినిమా చూసి బావున్నావు అన్నారు. ► ప్రస్తుతం ‘జయం’ రవితో ఓ తమిళ సినిమా చేస్తున్నా. తెలుగులో వేరే చిత్రాలు అంగీకరించలేదు. ఇప్పుడైతే నేను లవ్లో లేను. సింగిల్గా ఉన్నాను. ► ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో పేజీల పేజీల డైలాగ్స్ చెప్పాను. తెలుగు మీద మంచి అవగాహన వచ్చింది. ప్రస్తుతానికి డబ్బింగ్ చెప్పుకోలేదు. కానీ డబ్బింగ్ చెబితే మాత్రం ఓ లవ్స్టోరీ సినిమాకు కచ్చితంగా డబ్బింగ్ చెబుతాను. లవ్ స్టోరీల్లో డైలాగ్స్ చాలా ముఖ్యం కదా.. అందుకే. -
‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ రివ్యూ
టైటిల్ : ఇస్మార్ట్ శంకర్ జానర్ : మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తారాగణం : రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్, షియాజీ షిండే, ఆశిష్ విద్యార్థి సంగీతం : మణిశర్మ దర్శకత్వం : పూరి జగన్నాథ్ నిర్మాత : పూరి జగన్నాథ్, చార్మీ హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్.. ఇద్దరూ చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ఇస్మార్ శంకర్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా రామ్ను పూర్తిగా కొత్త అవతారంలో కొత్త క్యారెక్టర్లో చూపించాడు పూరి. ట్రైలర్లు, సాంగ్స్ సినిమాకు మాస్ ఇమేజ్ తీసుకువచ్చాయి. మరి ఆ అంచనాలను ఇస్మార్ట్ శంకర్ అందుకున్నాడా..? రామ్, పూరీలకు ఆశించిన సక్సెస్ దక్కిందా..? కథ : శంకర్ (రామ్ పోతినేని) ఓల్డ్ సిటీలో సెటిల్మెంట్స్ చేసే కుర్రాడు. ఓ డీల్ విషయంలో పరిచయం అయిన చాందిని (నభా నటేష్)తో ప్రేమలో పడతాడు. ఆ సమయంలోనే పొలిటీషియన్ కాశీ విశ్వనాథ్ని చంపిన కేసులో జైలుకు వెళతాడు. జైలు నుంచి తప్పించుకున్న శంకర్ మెదడులోకి మరో వ్యక్తి జ్ఞాపకాలను ట్రాన్స్ప్లాంట్ చేస్తారు సైంటిస్ట్ పింకీ (నిధి అగర్వాల్). అసలు శంకర్ మెదడులో మరో వ్యక్తి జ్ఞాపకాలను ఎందుకు ట్రాన్స్ప్లాంట్ చేశారు.? పొలిటీషియన్ కాశీ విశ్వనాథ్ని శంకరే చంపాడా? శంకర్కి సీబీఐ ఆఫీసర్ అరుణ్ (సత్యదేవ్)కి సంబంధం ఏంటి? నటీనటులు : సరికొత్త మేకోవర్లో డిఫరెంట్ యాటిట్యూడ్, డైలాగ్ డెలివరితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అక్కడక్కడా తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పేందుకు ఇబ్బంది పడినా ఓవరాల్గా శంకర్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. మాస్ యాక్షన్ సీన్స్లో రామ్ పర్ఫామెన్స్ సూపర్బ్ అనేలా ఉంది. హీరోయిన్లుగా నభా, నిధి అగర్వాల్ గ్లామర్ షోలో పోటి పడ్డారు. కథలోనూ ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు కావటంతో నటనతోనూ ఆకట్టుకున్నారు. మరో కీలక పాత్రలో నటించిన సత్యదేవ్ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా గుర్తుండిపోయే పాత్రలో అలరించాడు. షియాజీ షిండే, ఆశిష్ విద్యార్థి తమకు అలవాటైన పాత్రల్లో ఈజీగా నటించారు. విశ్లేషణ : వరుస ఫ్లాప్లతో ఇబ్బందుల్లో ఉన్న పూరి ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలన్న కసితో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేశాడు. గత చిత్రాల తరహాలో చూట్టేయకుండా కాస్త మనసుపెట్టి సినిమాను తెరకెక్కించినట్టుగానే అనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ప్రయోగాత్మక చిత్రాలు వస్తున్న తరుణంలో పక్కా కమర్షియల్ ఫార్ములా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పూరి. ఓ పాట, ఓ ఫైట్ అన్న ఫార్ములాకు తన మార్క్ టేకింగ్ను జోడించి సినిమాను తెరకెక్కించాడు. కథ కొత్తగా ఉన్నా కథనం విషయంలో మాత్రం తన రొటీన్ స్టైల్నే ఫాలో అయ్యాడు. పూరి తన మూస ఫార్ములా నుంచి ఇంకా బయటపడలేదనే చెప్పాలి. గత చిత్రాలతో పోలిస్తే మాత్రం ఈ సినిమా కాస్త ఎంగేజింగ్గానే తెరకెక్కించాడు. మాస్, యూత్ ఆడియన్స్ను అలరించే డైలాగ్స్తో ఆకట్టుకున్నాడు. మణిశర్మ మ్యూజిక్ సినిమాకు ప్రధానబలం. తన మ్యూజిక్తో ప్రతీ సీన్ను మరింతగా ఎలివేట్ చేశాడు మణి. కొన్ని సీన్స్లో నేపథ్య సంగీతం సన్నివేశాలను డామినేట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. పాటలు బాగున్నా.. కథలో కావాలని ఇరికించినట్టుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్రధాన బలం. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : రామ్ పోతినేని పర్ఫామెన్స్ మాస్ ఎలిమెంట్స్ మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మైనస్ పాయింట్స్ : రొటీన్ కమర్షియల్ ఫార్ములా స్క్రీన్ ప్లే -
‘పూరి ముఖంలో సక్సెస్ కనిపించింది’
ఈ గురువారం రిలీజ్ కు రెడీ అవుతున్న మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ హీరో రామ్ సరికొత్త అవతారంలో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్, సాంగ్స్కు మంచి రెస్పాన్స్ రావటంతో చిత్రయూనిట్ సక్సెస్పై కాన్ఫిడెంట్గా ఉన్నారు. పూరి గురువు, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా సినిమా సక్సెస్ అవుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. పూరి తాజా ఇంటర్వ్యూ షోటోను తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేసిన వర్మ ‘పూరి గారు ఇస్మార్ట్ శంకర్కు అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా అవుతున్నాయి. నేను ఇప్పటికే మీ ముఖంలో సక్సెస్ చూశాను’ అంటూ ట్వీట్ చేశారు. Sirrrr @purijagan going by the FANTASTIC ADVANCE BOOKING for #iSmartShankar , I can already see its SUPER SUCCESS radiating in ur face 😃💐💃 @ramsayz @AgerwalNidhhi @Charmmeofficial pic.twitter.com/CGcGuKu7ys — Ram Gopal Varma (@RGVzoomin) 16 July 2019 -
ఇస్మార్ట్ ఫిజిక్.. ఇదండీ టెక్నిక్
శైలజా శైలజా శైలజా శైలజా గుండెల్లొ కొట్టావే డోలుబాజా’ అంటూ తెలుగు కుర్రాళ్ల ప్రతినిధిగా తెరమీద సందడి చేసే లవర్బాయ్ ఇప్పుడు పదునైన మాస్ డైలాగుల్తో స్క్రీన్పై మెరిసిపోనున్నాడు. ఫైట్స్తో ఇరగదీయనున్నాడు. తల వెంట్రుకల దగ్గర్నుంచి కాలివేళ్ల దాకా టాప్ టు బాటమ్ ఫిజిక్ను కూడా మార్చేసుకున్నాడు. త్వరలో తెరపై తళుక్కుమననున్న తన డ్రీమ్ ఫిజిక్ కోసం ‘ఇస్మార్ట్ శంకర్’ చేసిన కృషి, పడిన శ్రమ ఎలాంటిది? టార్క్ ఫిట్నెస్ స్టూడియో ట్రైనర్ వెంకట్ మాడమాల మాటల్లో..! రామ్ గారికి గతంలో అడపాదడపా వర్కవుట్ గైడెన్స్ ఇచ్చిన అనుభవం నాకు ఉంది. అయితే ఈ సినిమా కోసం ఆయన పూర్తి ట్రాన్స్ఫార్మేషన్ కావాలి... అది కూడా చాలా తక్కువ టైమ్లో అన్నప్పుడు కొంచెం సర్ప్రైజ్ అనిపించింది. ఎందుకంటే ఆయన బేసిగ్గా జిమ్ లవర్ కాదు. హెవీ వెయిట్స్ చేయరు. అటువంటì ది ఫుల్ బాడీ ట్రాన్స్ఫార్మేషన్ అంటే చిన్న విషయం కాదు.. అయితే ఆయన పట్టుదలగా ఉన్నారు. సో స్టార్ట్ చేశాం. జిమ్ లవర్ కాదు. కాబట్టి క్రమ క్రమంగా మోటివేట్ చేసుకుంటూ పుష్ చేస్తూ ఆయన ట్రైనింగ్ సాగింది. ప్లాన్డ్.. ప్యాక్డ్... రామ్కి ప్రత్యేకంగా తన పర్సనల్ జిమ్లు రెండున్నాయి. అక్కడే వర్కవుట్ చేసేవాళ్లం. ఆయన శరీరపు తత్వం ఎక్టోమార్ఫ్ టైప్. తొలి నుంచి లీన్గానే ఉండేవారు. అయితే అబ్డామిన్ ప్రాంతంలో కొంచెం ఫ్యాట్ ఉండేది. అందుకని అబ్డామినల్ ఫ్యాట్ని తగ్గిస్తూ లీన్ మజిల్ మాస్ని పెంచుకుంటూ వెళ్లాలి.ఆయనకి సరైన ట్రైనింగ్ మొదలై ట్రాన్స్ఫార్మేషన్ పూర్తవడానికి పూర్తిగా నాలుగు నెలలు పట్టింది. రోజుకు 3 నుంచి 4 గంటల సమయం శిక్షణ ఇచ్చాం. షూటింగ్ టైమ్లో మాత్రం గంటా రెండు గంటలు... అలా చేశాం. అత్యధిక సమయం నేను ట్రైన్ చేశాను. చివర్లో వేరే ట్రైనర్ ఇచ్చారు. వర్కవుట్ 4 విన్ గతంలో కూడా రామ్తో వర్కవుట్ చేసినా... ఇంత సీరియస్నెస్ ఆయనలో ఎప్పుడూ చూడలేదు. తొలిరోజుల్లో హెవీ వెయిట్ చేసేవారు కాదు.కాని నెలలోనే బాగా మార్పు వచ్చింది. రోజూ పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. చాలా హార్డ్ వర్క్ చేశారు. ఉదయం 100 పుషప్స్, సాయంత్రం 100 పులప్స్ చొప్పున ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి చొప్పున రోజుకి 2 మజిల్ గ్రూప్స్కి వర్కవుట్ చేసేవారు. దీనికి ముందు కనీసం 100 కేలరీలు ఖర్చయ్యేలా ట్రెడ్మిల్ మీద పరుగులు... ఒక్కో మజిల్కి 6 వేరియేషన్స్ ఒక్కో వేరియేషన్ 10 నుంచి 15 చొప్పున నాలుగు నాలుగు సెట్స్... ఉదయం అబ్డామిన్ క్రంచెస్, సాయంత్రం అబ్డామిన్, సైడ్స్కి... ఇలా సాగింది ఆయన వర్కవుట్. డైట్... రైట్.. ఎంతో యంగ్ అండ్ ఎనర్జిటిక్గా ఉండే రామ్ ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అవడం కలిసొచ్చింది. ట్రాన్స్ఫార్మేషన్ టైమ్లో డైట్ చాలా సీరియస్గా ఫాలో అయ్యేవారు. చివర్లో బాగా కేలరీస్ తగ్గించి లో ఫ్యాట్ డైట్ మాత్రమే వినియోగించారు. తొలి నెల రోజులు చికెన్ తీసుకున్నారు. ఆ తర్వాత అంతా ఫిష్, ఎగ్స్ మాత్రమే. కార్బొహైడ్రేట్స్ కోసం బ్రౌన్రైస్, చిరుధాన్యాలు లేదా ఓట్స్... క్వినోవా రైస్ ఆహారంలో భాగం చేశారు. అలాగే ఆహారంలో పీచు పదార్థాల కోసం స్టీమ్డ్ వెజిటబుల్స్, ఆల్మండ్స్, వాల్ నట్స్ వినియోగించారు. వీటికి తోడుగా వే ప్రొటీన్, మల్టీ విటమిన్అదనం. ఈ ట్రాన్స్ఫార్మేషన్ కోసం మొత్తం 5 నుంచి 6 డైట్ ప్లాన్స్ మార్చడం జరిగింది. – ఎస్.ఎస్.బాబు -
వార్నింగ్ ఇచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్లో తెరకెక్కిన మాస్ మసాలా ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్. పూరి మార్క్ మాస్ యాక్షస్ ఎలిమెంట్స్తో తెరకెక్కిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈసినిమాకు సెన్సార్ బోర్డ్ ‘ఏ’ సర్టిఫికేట్ను జారీ చేసింది. గతంలో పూరి దర్శకత్వంలో రిలీజ్ అయిన దేశముదురు, పోకిరి, బిజినెస్మేన్ లాంటి సినిమాలు ఏ సర్టిఫికేట్తోనే సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ విషయంలోనూ అదే సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా రామ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. సినిమాల్లో ప్రారంభమయ్యే ముందు వేసే స్టాట్యూటరీ వార్నింగ్ తరహాలో ‘ధూమపానం, మద్యపానంతో పాతో ఇస్మార్ శంకర్లా నిజజీవితంలో వ్యవహరించటం ఆరోగ్యానికి హానికరం. ఇస్మార్ శంకర్ ఓ కల్పిత పాత్ర అనే తెలుసుకోగలిగినంత ఇస్మార్ట్గా వ్యవహరించండి ’ అంటూ ట్వీట్ చేశారు. రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తున్నారు. The Censor Board says it’s “A” kickass film! Statutory Warning: Cigarette Smoking, Consumption of Alcohol and Following #iSmartShankar in real life are injurious to health. Be ismart enough to realise that he’s “A” fictional character.. #love -R.A.P.O pic.twitter.com/yLIexKL4JV — Ustaad iSmart Shankar (@ramsayz) 16 July 2019 -
అదే నా ప్లస్ పాయింట్
‘‘నేను, రామ్ కలిసి ఓ సినిమా చేద్దామని చాలా రోజులుగా అనుకున్నా కుదరలేదు. అయితే మా కాంబినేషన్లో సినిమా అదిగో, ఇదిగో అంటూ మీడియాలో వార్తలొచ్చాయి. అప్పుడు మేమిద్దరం కలిసి ఎలాంటి సినిమా చేద్దాం అని చర్చించుకున్నాం’’ అని పూరి జగన్నాథ్ అన్నారు. రామ్ హీరోగా, నిధీ అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ పంచుకున్న విశేషాలు... ► ‘టెంపర్’ సినిమా తర్వాత నాకు సరైన హిట్ లేదు. దీంతో కొంచెం టెన్షన్గా ఉంది. ఇస్మార్ట్గా ఆలోచించి నా రెగ్యులర్ ఫార్మాట్కి భిన్నంగా కొత్తగా ఆలోచించి ‘ఇస్మార్ట్ శంకర్’ కథ రాశా. పైగా రామ్ కూడా గుడ్ బాయ్ కథలు చేసి బోర్ కొట్టేసింది.. బ్యాడ్ బాయ్గా చూపించమన్నాడు. అందుకే ఇదొక బ్యాడ్ బాయ్ కథ. ► సినిమా హిట్ అయితే వెధవ కూడా జీనియస్లా కనిపిస్తాడు.. అదే ఫ్లాప్ అయితే జీనియస్ కూడా వెధవలా కనిపిస్తాడు. ఈ సినిమాలో హీరోకి చిప్ పెట్టే ఐడియా హాలీవుడ్ సినిమా నుంచి స్ఫూర్తి పొందా. నా కథలన్నింటిలో ఏదో ఒక స్ఫూర్తి కనిపిస్తుంటుంది. ► ఈ కథ స్టార్ట్ చేశాక తెలంగాణ యాస పెట్టాలనిపించింది. పైగా రామ్ ఇప్పటివరకూ తెలంగాణ యాసలో మాట్లాడలేదు. తొలిసారి ఈ సినిమా మొత్తం అదే యాసలో మాట్లాడటాన్ని బాగా ఎంజాయ్ చేశాడు. తెలంగాణ భాష నాకు కొంచెం తెలుసు.. పూర్తిగా రాసేందుకు కో డైరెక్టర్ శ్రీ«దర్ సహాయం చేశాడు. పైగా నా భార్య తెలంగాణలోనే పుట్టింది. మా కొడుకు ఆకాశ్ తెలంగాణ యాస బాగా మాట్లాడతాడు. ► ఇండియాలో ఎక్కడైనా ప్రజల మధ్య షూటింగ్ చేయడం చాలా కష్టం. పైగా చార్మినార్ వంటి రద్దీ ప్రదేశంలో షూటింగ్ జరుగుతుంటే జనాలు మీదపడ్డారు. ఆ విషయం అటుంచితే, షూటింగ్ జరుగుతుంటే వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు.. అదే పెద్ద సమస్య. ► ‘ఇస్మార్ట్ శంకర్’ కథ మాకు తెలుసు.. డబ్బులివ్వకుంటే బయటపెట్టేస్తామని కొందరు బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాం. నిర్మాత అన్నాక ఇలాంటివన్నీ చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మా సినిమా టీజర్, ట్రైలర్స్కి మంచి స్పందన వస్తోంది.. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ట్రైలర్స్ చూశాక కొంతమంది మహిళలే ఫోన్ చేసి బాగుందన్నారు. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మగారికి థ్యాంక్స్. ► ‘ఇస్మార్ట్ శంకర్’లో తన మేకోవర్ క్రెడిట్ అంతా రామ్దే. తన పాత ఫొటో చూసి ఈ హెయిర్ స్టైల్ బాగుంది, దీన్ని కంటిన్యూ చేద్దామని మాత్రమే నేను చెప్పా. ఇందులో నభా నటేశ్ది చాలా హైపర్ పాత్ర. తనది కూడా తెలంగాణే. నిధీ అగర్వాల్ డాక్టర్గా చేశారు. రామ్లో బోలెడంత ఎనర్జీ ఉంది. తను చిరుతపులి అని సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాలో తన నటన చూసి కొత్తవారు నేర్చుకోవచ్చు. ► తెలంగాణ యాస ఆంధ్రవారికి అర్థం కాదని మనం అనుకుంటామంతే.. అందరికీ బాగా అర్థమవుతుంది. నా కాలేజీరోజుల్లో ఫ్రెండ్స్తో కలిసి తెలంగాణ ఫోక్ పాటలు పాడేవాణ్ణి.. గద్దర్గారి పాటలు వినేవాణ్ణి. సెట్లో షూటింగ్ అంతా ప్రశాంతంగా జరిగేలా వాతావరణం సృష్టిస్తా. ప్రత్యేకించి నటీనటులు ఎటువంటి టెన్షన్ పడకుండా ఉండేలా చూస్తా. అందుకే ప్రశాంతంగా వారి పాత్రల్లో లీనమై నటించగలుగుతారు. ► మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కినా కుటుంబ సభ్యులతో కలిసి చూసేలా ఉంటుంది. ఈ మధ్య పూర్తి సినిమా చూసిన రామ్ ఎగై్జట్ అయ్యి.. నన్ను హత్తుకుని మనశ్శాంతిగా విదేశాలకు వెళ్లిపోయాడు. ఈ చిత్రానికి సీక్వెల్ చేద్దామనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాం. ఈ సినిమాపై అంత నమ్మకం ఉంది మాకు. ► చార్మి.. మగాళ్ల కంటే బాగా కష్టపడి పనిచేస్తుంది. మాకు ఏ టెన్షన్ కూడా ఉండదు. నా దర్శకత్వంలో బయటి నిర్మాతలతో చేస్తున్నప్పుడు బడ్జెట్ కంట్రోల్లో ఉంటుంది. నేనే నిర్మాత అయినప్పుడు అస్సలు కంట్రోల్లో ఉండదు. నేనెప్పుడూ నిర్మాతలను ఇబ్బంది పెట్టను.. అదే నా ప్లస్ పాయింట్. షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల ఈ మధ్య సినిమాలు చూసింది తక్కువే. కానీ, ‘జెర్సీ, మజిలీ, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, బ్రోచేవారెవరురా, ఓ బేబీ’ వంటి వైవిధ్యమైన సినిమాలొచ్చాయి. ► మా అబ్బాయి ఆకాశ్ హీరోగా ఓ సినిమా నిర్మిస్తున్నా.. 50 శాతం షూటింగ్ పూర్తయింది. బాలకృష్ణగారితో సినిమా చేయడానికి కథ ఇంకా సిద్ధం కాలేదు. కథ రెడీ కాగానే వెళ్లి ఆయన్ని కలుస్తా. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాతి ప్రాజెక్టు గురించి ఇంకా ఏం అనుకోలేదు.. ఈ సినిమా విడుదల తర్వాత చెబుతా. -
అదే కాదు.. చాలా చేశాను : నిధి అగర్వాల్
నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయిన బ్యూటీ నిధి అగర్వాల్. తొలి సినిమాతోనే గ్లామర్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ భామ తరువాత మిస్టర్ మజ్ను సినిమాతో మరోసారి ఆకట్టుకున్నారు. తాజాగా ఇస్మార్ట్ శంకర్కు జోడిగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలోనూ అభిమానులతో ముచ్చటిస్తున్నారు. అయితే ట్విటర్ వేదికగా ఓ ఆకతాయి వేసిన ప్రశ్నకు దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చారు నిధి అగర్వాల్. ఈ సినిమాలో మీరు ఎక్స్పోజింగ్ కాకుండా ఇంకేమైనా చేశారు అంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్కు సమాధానంగా ‘చాలా చేశాను. ట్రైలర్ కాదు మూవీ చూడు’ అంటూ హుందాగా బదులిచ్చారు. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. నభా నటేష్ మరో హీరోయిన్గా నటించిన ఈ సినిమాను పూరితో కలిసి చార్మి నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నారు. Actually chaala chesanu, trailer kaadu movie chudu — Nidhhi Agerwal (@AgerwalNidhhi) 13 July 2019 -
రామ్ కెరీర్లోనే హైయ్యస్ట్
యంగ్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పూరి, రామ్లు కం బ్యాక్ అవుతారన్న టాక్ వినిపిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్కు మంచి స్పందనరావటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతోంది. ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా నైజాం హక్కులు రూ. 7 కోట్ల 20 లక్షలకు ఆంధ్రా హక్కులు రూ. 6 కోట్ల 50 లక్షలకు సీడెడ్ రూ. 3 కోట్ల 33 లక్షలకు అమ్ముడైనట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు. ఇతర రాష్ట్రాలలోనూ ఇస్మార్ట్ శంకర్కు మంచి బిజినెస్ జరుగుతోంది. ఈ సినిమా కర్ణాటక హక్కులు రూ. కోటి యాబై లక్షలకు అమ్ముడు కాగా మిగతా రాష్ట్రాలన్ని కలిపి రూ. 65 లక్షలు పలికాయి. ఇవి కాక డిజిటల్, శాటిలైట్ హక్కులు అన్ని కలిపి దాదాపు రూ. 17 కోట్ల వరకు పలికాయి. దీంతో ఇస్మార్ట్ శంకర్ రిలీజ్కు ముందే దాదాపు రూ 36 కోట్ల 18 లక్షల బిజినెస్ చేసినట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు. రామ్ సరసన నభా నటేష్, నిధి అగర్వాల్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నా వోడ్కా నేనే తెచ్చుకుంటా : వర్మ
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్. పూరి, చార్మిలు నిర్మిస్తున్న ఈ సినిమాలో నభా నటేష్, నిధి అగర్వాల్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచిన చిత్రయూనిట్ మరో ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ పై స్పందించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, పూరి ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్ చేశారు. ‘పూరి జగన్నాథ్ మార్క్ మాస్ మసాలా టేకింగ్, పంచ్ డైలాగ్స్తో ఇస్మార్ట్ శంకర్. రామ్ గతంలో చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. నిధి అగర్వాల్ సూర్యడి కంటే ఎక్కువ వేడి పుట్టిస్తోంది. చార్మి మేం తొలి రోజు తొలి ఆటకు సిద్ధమవుతున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. Ahhhhh will bring my own Vodka for the celebration🙏🙏🙏 PARTY TIME! https://t.co/DWfxLjsJVq — Ram Gopal Varma (@RGVzoomin) 12 July 2019 వర్మ ట్వీట్పై స్పందించిన పూరి కృతజ్ఞతలు తెలియజేశారు. చార్మి స్పందిస్తూ ఇస్మార్ట్ శంకర్ ఫుల్ మీల్స్ లాంటి సినిమా అంటూ కామెంట్ చేశారు. వర్మ సమాధానమిస్తూ ‘అయితే పార్టీకి నా వోడ్కా నేనే తెచ్చుకుంటా’ అంటూ రిప్లై ఇచ్చారు. దీనికి బదులుగా చార్మీ.. ‘వోడ్కాతో పాటు ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ కాపీ తీసుకొని మీ దగ్గరికి వస్తున్నాను. ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం’ అంటూ ట్వీట్ చేశారు. -
‘ఇస్మార్ట్ శంకర్’ ప్రెస్మీట్
-
రామ్లో ఎనర్జీ అన్లిమిటెడ్
‘‘పక్కా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. రామ్లోని ఎనర్జీ అన్లిమిటెడ్. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత. నాకు చేతనైనంత వాడాను. ఇంకా బోలెడు ఎనర్జీ ఉంది. తను ఓ గ్రేట్ యాక్టర్. ‘ఇస్మార్ట్ శంకర్’గా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతాడు’’ అన్నారు పూరి జగన్నాథ్. రామ్ హీరోగా, నిధీ అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘మణిశర్మగారు మా సినిమాకు పెద్ద పిల్లర్. అడగ్గానే ఐదు పాటలు నా మొహాన కొట్టారు (నవ్వుతూ). రీసెంట్ టైమ్లో మంచి ఆల్బమ్ అని అందరూ అభినందిస్తున్నారు. నేపథ్య సంగీతం కూడా కుమ్మేశారు’’ అన్నారు. రామ్ మాట్లాడుతూ– ‘‘ఇస్మార్ట్ శంకర్’ కోసం పని చేసిన ఈ ఆరు నెలలు నా లైఫ్లోనే బెస్ట్ టైమ్. ఈ సినిమాను రెండుగంటల పాటు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. సినిమాలో చాలా చేసినట్లు అనిపించింది కానీ.. సినిమా ఎలా పూర్తి చేశానో తెలియడం లేదు. ఆనీ మాస్టర్ కంపోజ్ చేసిన ‘ఉండిపో ఉండిపో..’ పాట ప్రేక్షకులను సీట్కు అలా కట్టేసి ఉంచుతుంది. మణిశర్మగారి పాటలన్నీ ఒక ఎత్తు అయితే.. రీరికార్డింగ్ మరో ఎత్తు. నాకు సినిమా ఎంత నచ్చిందో చెప్పాను. నేను ఫీల్ అయిన దాంట్లో ప్రేక్షకులు ఒక శాతం ఫీల్ అయినా కూడా నాకు అదే వంద శాతం సంతృప్తి ఇచ్చినట్టవుతుంది.. ఇందుకు పూరికి థ్యాంక్స్ ’’ అన్నారు. ‘‘సినిమా ఫస్ట్ కాపీ చూశాం. మా నమ్మకం మరింత పెరిగింది.. చూసేవాళ్లకు ఫుల్ మీల్స్లాంటి సినిమా ఇది. రామ్ నటన చూసిన నాకు కళ్లలో నీళ్లు తిరిగాయి. తను లేకుండా ‘ఇస్మార్ట్ శంకర్’ లేదు. పూరితో రామ్ మళ్లీ పనిచేయాలని అందరూ కోరుకునేలా సినిమా ఉంటుంది’’ అన్నారు ఛార్మికౌర్. ‘‘తక్కువ సమయంలోనే పూరిగారితో కలిసి పనిచేయడం ఆశీర్వాదంగా భావిస్తున్నాను’’ అన్నారు నిధీ అగర్వాల్. ‘‘పూరిగారితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు నభా నటేశ్. డ్యాన్స్ మాస్టర్ ఆనీ పాల్గొన్నారు. -
ఇస్మార్ట్ శంకర్ అందరినీ అలరిస్తాడు
-
దర్శకుడు పూరీ లాటరీ లాంటివారు...
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్రయూనిట్ విజయవాడలో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో హీరో రామ్తో పాటు హీరోయిన్లు నిధి అగర్వాల్, నభా నటేష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రామ్.. ‘విజయవాడ రావడం సంతోషంగా ఉంది. మా సినిమా ట్రైలర్, సాంగ్స్కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. రామ్, పూరీల సినిమాగా మీడియానే మంచి ప్రచారం ఇస్తోంది. జగడం తర్వాత నేను పూర్తి స్థాయి మాస్ క్యారెక్టర్ చేసిన సినిమా ఇదే. సినిమాలో క్యారెక్టర్ విధానం బట్టి భాష ఉంటుంది. సినిమాలకు భాష, ప్రాంతాలు ఉండవు. మంచి సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. దర్శకుడు పూరీ లాటరీ లాంటి వారు. కొడితే రికార్డులు బద్దలవ్వాల్సిందే. ఈ నెల 18వ తేదీన సినిమా విడుదల చేస్తున్నాం కథ కోసమే ఇద్దరు హీరోయిన్లతో నటించాను. ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంద’న్నారు. -
డబుల్ ఇస్మార్ట్ తీస్తాం
‘‘రామ్కి సినిమా తప్ప మరో ధ్యాస ఉండదు. ప్రతి షాట్ను వంద శాతం మనసు పెట్టి చేస్తాడు. ‘టెంపర్’ సినిమా తర్వాత నాకు మంచి హిట్ పడలేదు. విపరీతమైన ఆకలితో ఉన్నప్పుడు రామ్ దొరికాడు. తను రామ్ పోతినేని కాదు.. రామ్ చిరుతపులి. ప్రేక్షకుల ఆశీర్వాదంతో మా సినిమా పెద్ద హిట్ అయ్యి.. డబుల్ ఇస్మార్ట్ సినిమా తీయాలి ’’ అని డైరెక్టర్ పూరి జగన్నాథ్ అన్నారు. రామ్ పోతినేని హీరోగా, నిధీ అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా వరంగల్లో ‘ఇస్మార్ట్ బోనాలు’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో రామ్ మాట్లాడుతూ– ‘‘ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందో ఆలోచించుకుంటూ విదేశాలకు వెళ్లిపోయాను. డ్యాన్సులు, ఫైట్స్, లుక్స్ సహా అన్నీ ఉండి, సినిమా కొత్తగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారని తెలిసింది. ఆ సమయంలో పూరీగారిని కలిసినప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’ ఐడియా వచ్చింది. పూరీగారితో పని చేస్తున్నప్పుడు ఉన్న కిక్కే వేరు’’ అన్నారు. ‘‘ప్రేక్షకుల కోసం చేసిన కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ ఇది’’ అన్నారు ఛార్మి. ‘‘రామ్తో డ్యాన్స్ చేయడం చాలా కష్టం’’ అన్నారు నిధీ అగర్వాల్. ‘‘ఒక మంచి పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన పూరీగారికి థ్యాంక్స్’’ అని నభా నటేశ్ అన్నారు. -
‘ఇస్మార్ట్ శంకర్’ ప్రీ రిలీజ్ వేడుక
-
గుమ్మడికాయ కొట్టారు
ఇస్మార్ట్ శంకర్ తనకు అప్పగించిన పని పూర్తిచేసేశాడు. పనైపోయిందని గుమ్మడికాయ కూడా కొట్టేశాడు. మరి అతనికి అప్పజెప్పిన పనేంటి? అలాగే అతను చేసిన అల్లరేంటో స్క్రీన్ మీద తెలుస్తుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. డబుల్ ధిమాక్ హైదరాబాదీ అన్నది క్యాప్షన్. నభా నటేశ్, నిధీ అగర్వాల్ కథానాయికలు. పూరి జగన్నాథ్, చార్మీ నిర్మించారు. ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం పూర్తయింది. ఈ సందర్భంగా గుమ్మడికాయ కొట్టారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం జూలై 18న రిలీజ్కు రెడీ అయింది. -
‘సగం మెంటల్.. సగం భోజ్పురి విలన్’
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్. పూరి తో కలిసి చార్మి నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, నబా నటేష్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచిన చిత్రయూనిట్ తాజాగా ట్రైలర్ను రిలీజ్ చేశారు. పూరి మార్క్ మాస్తో పాటు రామ్ ఎనర్జితో ట్రైలర్ను కట్ చేశారు. ఈ ఇద్దరి కెరీర్కు ఈసినిమా కీలకం కావటంతో ఇస్మార్ట్ శంకర్పై మంచి అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా పూరి కూడా ఈ సారి మరింత జాగ్రత్తగా సినిమాను రూపొందించాడు. ట్రైలర్ మాస్ డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్తో పాటు రామ్ యాటిట్యూడ్ ఆకట్టుకునేలా ఉంది. మరి ఇస్మార్ట్ శంకర్.. రామ్, పూరిల కెరీర్ణు గాడిలో పెడుతుందేమో చూడాలి. -
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఇస్మార్ట్ శంకర్’
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకుడు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలై 18న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యంలో విడుదలైన నాలుగు పాటలకు, టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో రామ్ సరికొత్త లుక్లో కనపడబోతున్నారు. రామ్, పూరిల కెరీర్కు కీలకమైన సినిమా కావటంతో ఇస్మార్ట్ శంకర్పై భారీ అంచనాలు ఉన్నాయి. -
పోరీ... ఉండిపో
ఇస్మార్ట్ శంకర్ మస్తు మాసు. అట్లని హీరోయిన్లతో అన్నీ మాస్ పాటలే పాడుకుంటాడా ఏందీ? మెలోడీలు కూడా పాడుకుంటాడు. తన ప్రేయసిని ప్రేమగా ఉండిపోమంటాడు. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇ స్మార్ట్ శంకర్’. డబుల్ దిమాక్ హైదరాబాద్ అన్నది క్యాప్షన్. నిధీ అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లు. చార్మీ, పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ కంపోజ్ చేసిన ‘ఉండిపో ఉండిపో..’ అనే మెలోడీ సాంగ్ను శనివారం రిలీజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై 12న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట.. -
షాట్ల కాల్చినం తమ్మీ.. లైట్ తీస్కో!
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని బహిరంగ ప్రదేశంలో సిగరెట్ కాల్చినందుకు చార్మినార్ పోలీసులు రూ.200 ఫైన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే సంఘటనపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో హీరో రామ్ ఆ కామెంట్స్పై స్పందించాడు. ఇస్మార్ట్ శంకర్ స్టైల్లోనే రిప్లై ఇచ్చాడు. ‘నా టైమూ పబ్లిక్ టైమూ వేస్ట్ చేయడం ఇష్టం లేక రెస్పాండ్ గాలే.. షాట్ల కాల్చిన తమ్మీ.. బ్రేక్ల కాద్.. టైటిల్ సాంగ్ల చూస్తవ్గా స్టెప్పు. ఫిర్ బీ లాకీ ఇజ్జత్ ఇచ్చి ఫైన్ కట్టినం. గిప్పుడు నువ్వు కూడా నాలెక్క లైట్ తీస్కో పని చూస్కో’ అంటూ ట్వీట్ చేశాడు ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ ఉరఫ్ రామ్ పోతినేని. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమాను పూరి, చార్మీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Naa time-u.. Public time-u waste cheyadam ishtam leka respond gaale... “Shot la kalchina thammi..Break la kaad..Title song la chustaavga stepu😏..phir bhi law ki izzat ichi fine kattinam..🚭 Gippudu nuvvu kuda naa lekka..#LiteTheskoPaniChusko 😘” -Ustaad #iSmartShankar — RAm POthineni (@ramsayz) 25 June 2019 -
‘రాక్షసుడు’ని భయపెడుతున్నారు!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్లో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్. పూరి, రామ్ల కెరీర్కు కీలకం కావటంతో ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చిత్రయూనిట్. అందుకే సినిమాను వారం పాటు వాయిదా వేసి మరి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాను ముందుగా జూలై 12న రిలీజ్ చేయాలని భావించినా తాజాగా జూలై 18న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో అదే రోజు రిలీజ్ అవుతున్న రీమేక్ సినిమా రాక్షసుడుకి కష్టాలు తప్పేలా లేవు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రమేష్ వర్మ రూపొందిస్తున్న సినిమా రాక్షసుడు. తమిళ సూపర్ హిట్ రాక్షసన్కు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై పెద్దగా బజ్ క్రియేట్ అవ్వటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ సినిమా పోటి వస్తే రాక్షసుడుకు ఇబ్బందులు తప్పవంటున్నారు విశ్లేషకులు. రీమేక్ సినిమా కావటంతో పాటు చాలా సన్నివేశాలు ఒరిజినల్లోవే వాడటంతో రాక్షసుడుపై పెద్దగా అంచనాలు లేవు. దీనికి తోడు బెల్లంకొండ చివరి సినిమా ‘సీత’కు దారుణమైన రిజల్ట్ రావటం కూడా సినిమా మీద హైప్ రాకపోవటానికి కారణమన్న టాక్ వినిపిస్తోంది. అందుకే ఫస్ట్ నుంచి ఈ సినిమా సోలో రిలీజ్ ఉండేలా జాగ్రత్త పడ్డారు చిత్రయూనిట్, ఇప్పుడు సడన్గా ఇస్మార్ట్ శంకర్ పోటి రావటంలో రాక్షసుడు టీం ఆలోచనలో పడ్డారు. -
‘ఇస్మార్ట్ శంకర్’కు చార్మినార్ ఎస్సై ఫైన్
సాక్షి, హైదరాబాద్ : ‘ధూమపానం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం’ ఈ ప్రకటన ప్రతి సినిమా ప్రారంభ సమయంలో చూస్తూనే ఉంటాం. బహిరంగ ప్రదేశాలలో సిగరేట్ తాగితే జరిమాన విధిస్తారని అందరికి తెలుసు కానీ, చాలా మంది బహిరంగంగానే సిగరేట్లు తాగుతారు. దీనికి హీరో రామ్ కూడా అతీతుడిని కాదనిపించుకున్నాడు. బహిరంగంగా సిగరేట్ తాగుతూ.. రూ. 200 జరిమానా చెల్లించాడు. ఇస్మార్ట్ శంకర్ షూటింగ్లో భాగంగా చార్మినార్ వెళ్లిన రామ్.. షూటింగ్ తర్వాత బహిరంగ ప్రదేశంలో సిగరెట్ తాగాడు. ఇది గమనించిన చార్మినార్ ఎస్సై పండరీ రామ్కు రూ.200 జరిమానా విధించారు. -
ఆరు రోజులు ఆలస్యంగా...
డబుల్ ధిమాక్ ఇస్మార్ట్ శంకర్ ప్లాన్లో చాన్న మార్పు జరిగింది. అనుకున్నదానికన్నా ఆరు రోజులు ఆలస్యంగా రాబోతున్నాడు. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి జగన్నాథ్, చార్మి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా టాకీ పార్టు పూర్తయింది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతుంది. ఈ చిత్రాన్ని ముందుగా జూలై 12న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు జూలై 18న రిలీజ్ డేట్ను ఫైనలైజ్ చేశారు. ‘‘ఇటీవల విడుదల చేసిన టీజర్, సాంగ్స్కు మంచి స్పందన లభిస్తోంది. జూలై 12న క్రికెట్ ప్రపంచకప్లో కీలకమైన పోటీలు ఉన్నాయి. 14న ఫైనల్ మ్యాచ్. సినిమా కలెక్షన్స్పై ప్రభావం చూపకూడదని 18కి వాయిదా వేశాం’’ అని చిత్రబృందం పేర్కొంది. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుధాంశు తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ çస్వరకర్త. -
అందుకే.. ‘ఇస్మార్ట్’గా వాయిదా వేశారు
ఈ కాలంలో సినిమా తీయడం ఎంత కష్టమో.. దానికి సరైన పబ్లిసిటీ, ప్రమోషన్స్, రిలీజ్ డేట్స్ అన్నింటిని జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని సినిమాలు సరైన పబ్లిసిటీ లేక కనమరుగైతే.. మరికొన్ని సరైన సీజన్, టైమ్కు విడుదలకాక ఆశించిన మేర సక్సెస్ను సాధించలేకపోయాయి. అయితే ఇస్మార్ట్ శంకర్ చిత్రయూనిట్ మాత్రం ఇస్మార్ట్గా ఆలోచించింది. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదని.. ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఇది కరెక్ట్ సీజన్ కాదనుకొని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్, డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్, సాంగ్స్తో సినిమాపై హైప్ పెంచేసిన యూనిట్.. ఈ చిత్రాన్ని జూలై 12న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించింది. కానీ ప్రస్తుతం వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తున్న నేపథ్యంలో ఈచిత్రాన్ని వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఫైనల్ మ్యాచ్ 14న జరుగుతుండటంతో.. ఆ తరువాతే రిలీజ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో జూలై 18న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
మాల్దీవుల్లో రొమాన్స్
రామ్, ని«ధీ అగర్వాల్, నభా నటేశ్ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి జగన్నాథ్, చార్మి నిర్మిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం మాల్దీవుల్లో రామ్, నిధి అగర్వాల్పై ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. భాస్కరభట్ల ఈ పాటను రచించారు. మణిశర్మ స్వరకర్త. ‘‘రీసెంట్గా విడుదల చేసిన టీజర్కు, దిమాక్ ఖరాబ్ సాంగ్కు మంచి స్పందన లభిస్తోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 12న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాతలు తెలిపారు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుధాంశు పాండే తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు రాజ్ తోట కెమెరామెన్గా వ్యవహరిస్తున్నారు. -
పోలీసులను ఆశ్రయించిన చార్మి
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న సమయంలో చిత్ర యూనిట్కు భారీ షాక్ తగిలింది. ఈ సినిమా పూర్తి స్క్రిప్ట్ను మురళి కృష్ణ అనే వ్యక్తి బజ్ బాస్కెట్ (Buzz Basket) ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాడు. స్క్రిప్ట్ను ఇన్స్టాగ్రామ్ను తీసేసేందుకు ఇస్మార్ట్ శంకర్ చిత్రయూనిట్ నుంచి భారీగా డబ్బు డిమాండ్ చేశాడు. దీంతో నిర్మాణ సంస్థలు పూరి జగన్నాథ్ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ తరుపున నిర్మాత చార్మి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను పూరి జగన్నాథ్, చార్మిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ తాజాగా ఓ మాస్ సాంగ్ను రిలీజ్ చేశారు. -
ఇస్మార్ట్ శంకర్.. ‘దిమాక్ ఖరాబ్’
ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. డబుల్ దిమాక్ హైదరాబాదీ అనేది ట్యాగ్ లైన్. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధీ అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లు. ఈ సినిమాను జూలై 12న రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. దీంతో చిత్ర ప్రమోషన్లలో భాగంగా సినిమాలోని ఓ మాస్ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దిమాక్ ఖరాబ్ అంటూ సాగే పాటను ఈ రోజు సాయంత్రం చిత్రబృందం రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ యూత్తో పాటు మాస్ ఆడియన్స్కు తెగ కనెక్ట్ అయింది. మణిశర్మ సంగీతం .. కాసర్ల శ్యామ్ సాహిత్యం .. కీర్తన శర్మ - సాకేత్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. దీంతో పూరి జగన్నాథ్, హీరో రామ్ ఖాతాలో హిట్ పడటం ఖాయమనే అభిప్రాయంలో వారి అభిమానులు వున్నారు. -
టెరిఫిక్ శంకర్
ఇస్మార్ట్ శంకర్ తన టెంపర్, డబుల్ ధిమాక్ తెలివిని చూపియనీకి రెడీ అయుండు. ఈ డబుల్ ధిమాక్ హైదరాబాదీని కలవాలంటే జూలై 12 వరకూ వేచి ఉండండి అంటోంది ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రబృందం. రామ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ట్యాగ్లైన్ డబుల్ ధిమాక్ హైదరాబాదీ. పీసీ కనెక్ట్స్ బ్యానర్పై పూరీ జగన్నాథ్, చార్మి నిర్మిస్తున్నారు. నిధీ అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లు. ఈ సినిమాను జూలై 12న రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ‘‘ఇటీవల రిలీజ్ చేసిన టీజర్కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. రామ్ టెరిఫిక్గా ఉన్నాడని అభినందిస్తున్నారు. టాకీ పార్ట్ పూర్తయింది. 3 పాటలు మినహా షూటింగ్ పూర్తి చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా నడుస్తున్నాయి’’ అని చిత్రబృందం తెలిపింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట. -
రీమేక్తో హ్యాట్రిక్..!
ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటిస్తున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ తరువాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇస్టార్ శంకర్ తరువాత ఓ రీమేక్ సినిమా చేసేందుకు రామ్ ఓకె చెప్పాడట. తమిళ్లో ఘనవిజయం సాధించిన ‘థడం’ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అరుణ్ విజయ్ హీరోగా తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ రీమేక్ రైట్స్ ఇప్పటికే స్రవంతి మూవీస్ అధినేత స్రవంతి రవికిశోర్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాను గతంలో రామ్ హీరోగా నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ చిత్రాలకు దర్శకత్వం వహించిన కిశోర్ తిరుమల డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. -
మా సెట్లో ఆడా మగా తేడా లేదు
‘నీ తోడు కావాలి’ అంటూ ఏ తోడూ లేకుండా హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు. ఎవరి అండా లేకుండానే సక్సెస్ అయ్యారు. చార్మింగ్ బ్యూటీనే కాదు.. చాలా మంచి ఆర్టిస్ట్ అని కూడా అనిపించుకున్నారు. తెలుగు, తమిళ్, హిందీ.. ఇలా పలు భాషల్లో కథానాయికగా ఓ వెలుగు వెలిగిన చార్మి ఇప్పుడు తనలోని నటిని సెకండ్ సీట్లో కూర్చోబెట్టారు. నిర్మాతను ఫ్రంట్ సీట్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ‘ఇస్మార్ట్ శంకర్’, ‘రొమాంటిక్’ చిత్రాల నిర్మాణంతో బిజీగా ఉన్నారు. నేడు చార్మి బర్త్డే. ఈ సందర్భంగా ఆమెతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ... ► బర్త్డేకు స్పెషల్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ప్లాన్స్ ఏం లేవు. గోవాలో ‘ఇస్మార్ట్ శంకర్’ సాంగ్ షూట్ జరుగుతోంది. మొన్న రామ్ బర్త్డేకు రిలీజ్ చేసిన టీజర్కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే బర్త్డే సెలబ్రేషన్స్ అన్నట్టు. ► బర్త్డేకు కొత్త నిర్ణయాలేమైనా తీసుకుంటారా? అలాంటివి ఎప్పుడూ పెట్టుకోను. ప్రస్తుతం ఫోకస్ అంతా ‘ఇస్మార్ట్ శంకర్’ మీదే ఉంది. బోలెడు పనులున్నాయి. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలి, బిజినెస్ చూసుకోవాలి. మైండ్ మొత్తం సినిమా చుట్టూనే తిరుగుతోంది. ► ప్రొడ్యూసర్గా ఫుల్ బిజీగా ఉన్నట్టున్నారు. ఫీమేల్ ప్రొడ్యూసర్స్కు షూటింగ్ స్పాట్లో ఉండే చాలెంజెస్ ఏంటి? మా సెట్లో స్త్రీలు, పురుషులు అనే తేడాని ఎప్పుడూ ఫీల్ అవలేదు. మా పీసీ (పూరీ కన్సెక్ట్స్) ఆఫీస్లో కూడా ఆ వ్యత్యాసాలేమీ ఉండవు. నేను మ్యాన్లా ఆలోచిస్తానని, మ్యాన్లా ఉంటానని అలానే వర్క్ చేస్తానని పూరీగారు చెబుతుంటారు– ఇక్కడ మొత్తం ఫ్రెండ్లీ వాతావరణమే ఉంటుంది. నేను బాస్, నువ్వు ఎంప్లాయ్.. అలా ఉండదు. ఇక్కడ అందరూ పనికోసమే వస్తారు, పని మాత్రమే చేస్తారు. ఫోకస్ పనిమీద మాత్రమే ఉన్నప్పుడు ఎక్కువ తక్కువలు ఉండవు. ► హీరోయిన్గా ఉన్నప్పుడు మీకు అన్నీ టైమ్కు ఏర్పాటు చేస్తుంటారు. మీరు ప్రొడ్యూసర్ అయిన తర్వాత మీ హీరోహీరోయిన్లను ఎలా చూసుకుంటున్నారు? నేను మా హీరోహీరోయిన్లను చాలా గారం చేస్తుంటాను. నాకు గారం చేయడం అంటే భలే ఇష్టం. హీరోగారు వస్తున్నారు.. అంతా రెడీ పెట్టండి. హీరోయిన్కి వ్యాన్ రెడీ ఉందా? ఇలా అన్నీ చూసుకుంటాను. యూనిట్ వాళ్లకు ఫుడ్ సెర్వ్ చేస్తుంటాను. అందరూ సరదాగా రావాలి, కలసి నవ్వుకుంటూ పని చేయాలి. ఇదే మా పాలసీ. ► గారం చేస్తే షూటింగ్ లేట్ అయ్యే చాన్స్ కూడా ఉంటుంది కదా? అస్సలు ఉండదు. వాళ్లు మార్నింగ్ నిద్ర లేవగానే వర్క్కి రావాలంటే ఒక ఉత్సాహంతో ఉండాలి. మనం ఇక్కడ బాగా చూసుకుంటే వాళ్లూ అలానే పని చేస్తారు. అబ్బా.. ఇవాళ షూటింగ్కి రావాలా? అని బాధపడుకుంటూ రారు. ఆ ఎనర్జీతో వస్తే చాలు.. జరగాల్సిన పనులు టైమ్కు జరిగిపోతుంటాయి. మేం డిఫరెంట్ కండీషన్స్లో షూట్ చేయాల్సి ఉంటుంది. వారణాసిలో షూట్ చేసినప్పుడు 47 డిగ్రీల ఎండ. డైరెక్ట్ సన్లైట్ కింద పనిచేశాం. అందరికీ సన్ ఎలర్జీతో బ్లాక్ ప్యాచ్లు వచ్చేశాయి. కానీ ఎవ్వరూ కంప్లైంట్ చేయలేదు. ఇదో చాలెంజ్ అన్నట్లు తీసుకొని పని చేశాం. ► హీరోయిన్గా ఉన్నప్పుడు సెట్లో ఏదైనా మార్పు వస్తే బావుండు అనుకున్నది నిర్మాతగా మారిన తర్వాత తీసుకొచ్చింది ఏదైనా ఉందా? ఏదో మార్పు తీసుకు రావడానికో, మార్చడానికో మనం ఇక్కడం లేం. మా లక్ష్యం సినిమాలు చేయడమే. మంచి సినిమాలు చేయాలి, హిట్స్ కొట్టాలి. ఈ జర్నీ జరిగేటప్పుడు అందరూ హ్యాపీగా, ఇబ్బంది లేకుండా ఉండాలి. అంతే. ► నిర్మాతగా మారిన తర్వాత ఎలా ఉంది? అమ్మలా మారినట్టు ఉంది. సినిమా చేయడం బేబీ క్యారీ చేయడంలానే. ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటినుంచి డెలివరీ వరకూ జాగ్రత్తగా చూసుకోవాలి. నిర్మాత అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం అందులో భాగం అయ్యుంటాం. హీరోయిన్గా ఉన్నప్పుడు ప్రాజెక్ట్ మొత్తం సెట్ అయిన తర్వాత మధ్యలో ఎంటర్ అవుతాం. అప్పటికే టీమ్ అంతా ఫిక్స్ అయ్యుంటుంది. అలాగే రేపు రిలీజ్ ఉందంటే ఇవాళో నాలుగు, రేపో నాలుగు ఇంటర్వ్యూలు ఇస్తే చాలు. సినిమా ప్రమోషన్కు వారం రోజులు కేటాయిస్తే చాలు అని ఉంటుంది. హీరోయిన్గా ఉన్నప్పుడు 6–7 రిలీజ్లు ఉండేవి. ప్రతి సినిమా హిట్ అవ్వాలనుకుంటాం. ప్రతీ ప్రాజెక్ట్ మీద ప్రేమ ఉన్నా అది ఒక్కోదానికి షేర్ అవుతుంది. నిర్మాతగా ఉన్నప్పుడు మన ఎనర్జీ, రక్తం, చెమట అన్నీ ఇందులోనే పెడతాం. కొన్నిసార్లు టెన్షన్తో నిద్ర పట్టదు. రేపు ఏం చేయాలి? అనుకున్నవన్నీ సక్రమంగా జరుగుతాయా? వంటి ఆలోచనలతో సతమతమవుతుంటాం. టెన్షన్ అయితే కచ్చితంగా ఉంటుంది. ప్రతి నిమిషం ఉంటుంది. దానికి తోడు కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా మీద అయితే చాలా నమ్మకంగా ఉన్నాం. ► పూరీగారు ఓ సాలిడ్ హిట్ ఇవ్వాలని ఆయన ఫ్యాన్స్ అంతా చూస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ ఎలా ఉండబోతోంది? 100 పర్సంట్... రాసిపెట్టుకోండి. పూరీగారి దగ్గర నుంచి ఇన్నాళ్లూ ఏదైతే మిస్ అయ్యారో, ఏదైతే కోరుకుంటున్నారో ‘ఇస్మార్ట్ శంకర్’ దానికి మించి ఉండబోతోంది. కావాలంటే రాసిస్తాను. ► మళ్లీ మిమ్మల్ని స్క్రీన్ మీద ఎప్పుడు చూడొచ్చు? నెవ్వర్ సే నెవర్ అంటారు. నటిగా మళ్లీ స్క్రీన్ మీద కనిపించడానికి చాలా టైమ్ ఉంది. రాబోయే కొన్ని సంవత్సరాలు మొత్తం పూరీ కనెక్ట్స్లోఎలాంటి సినిమాలు చేయాలి? అనే దానిమీదే దృష్టంతా. కొత్త కొత్త స్క్రిప్ట్స్ రెడీ అవుతున్నాయి. అందుకే యాక్టింగ్ కొన్ని రోజులు సెకండ్ సీట్లోనే ఉండబోతోంది. ► హీరోయిన్గా ఉన్నప్పుడు ఎంజాయ్ చేశారా? నిర్మాతగా ఉండటాన్ని ఎంజాయ్ చేస్తున్నారా? నిర్మాతగా ఉండటం చాలా స్ట్రెస్ఫుల్. చాలా టఫ్. ఇందాక అన్నట్టు టెన్షన్, నిద్రలేని రాత్రులు. కానీ నిర్మాతగా ఉండటాన్నే ఎంజాయ్ చేస్తున్నాను. మనం ఏం చేసినా జీవితంలో సమస్యలు కామన్. వాటి పరిష్కారం మన చేతుల్లో ఉండటం కామన్. సమస్యలను ఎవరైనా పరిష్కరించుకోవాల్సిందే కదా. నేను అది బాగా చేసుకోగలను. -
‘ఇస్మార్ట్ శంకర్’ సెట్లో రామ్ పుట్టినరోజు
-
దిమాక్ ఉన్నోడు
గోవాలో అదిరిపోయే స్టెప్పులేస్తున్నారు హీరో రామ్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ‘డబుల్ దిమాక్ హైదరాబాదీ’ అనేది ట్యాగ్లైన్. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టాకీపార్ట్ పూర్తయింది. ప్రస్తుతం హీరో రామ్, నభా నటేశ్లపై గోవాలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. భాను మాస్టర్ కొరియోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ను బుధవారం విడుదల చేయనున్నారు. మరి... డబుల్ దిమాక్ హైదరాబాదీ పవర్ ఏంటో శాంపిల్గా చూడొచ్చన్నమాట. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సు«ధాంశు పాండే తదితరులు నటిస్తున్నారు. -
టాకీ పూర్తి చేసుకున్న ‘ఇస్మార్ట్ శంకర్’
ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. డబుల్ దిమాక్ హైదరాబాదీ అనేది ట్యాగ్ లైన్. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పూరి మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయ్యింది. మిగిలిన నాలుగు పాటలు చిత్రీకరణతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. హీరో రామ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే పుట్టిన రోజైన మే 15న ఇస్మార్ట్ శంకర్ టీజర్ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను సమ్మర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
ఇస్మార్ట్గా...
పేరు శంకర్.. ఇస్మార్ట్ శంకర్.. పక్కా హైదరాబాదీ. డబుల్ ధిమాక్ ఉన్నోడు. ఇప్పటి వరకూ ‘ఇస్మార్ట్ శంకర్’ గురించి మనకు ఈ డీటైల్స్ మాత్రమే తెలుసు. మే 15 నుంచి శంకర్ ఎలాంటోడో చిన్న శాంపిల్ చూపిస్తాం అంటున్నారు పూరి జగన్నాథ్ అండ్ టీమ్. రామ్, నభా నటేశ్, నిధీ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి కనెక్ట్స్ బ్యానర్పై చార్మీ, పూరి నిర్మిస్తున్నారు. ‘‘ఈ చిత్రం టాకీపార్ట్ పూర్తయింది. నాలుగు పాటలు మిగిలున్నాయి. ఈనెల 15 రామ్ బర్త్డే. ఆ రోజే చిత్ర టీజర్ను రిలీజ్ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. మిగిలిన నాలుగు పాటల్లో రెండు పాటల్ని హైదరాబాద్లో, ఒక పాటను గోవాలో, మరో పాటను యూరప్లో చిత్రీకరించబోతున్నారని తెలిసింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట. -
పాస్పోర్ట్ పోగొట్టుకున్న హీరోయిన్
నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన బ్యూటీ నిధి అగర్వాల్. తరువాత మిస్టర్ మజ్నులో మరో అక్కినేని హీరో అఖిల్తో జోడి కట్టినా నిధికి ఇంత వరకు సక్సెస్ మాత్రం దక్కలేదు. దీంతో ప్రస్తుతం సెట్స్మీద ఉన్న ఇస్మార్ట్ శంకర్ మీదే ఆశలు పెట్టుకున్నారు నిధి అగర్వాల్. ఇటీవల వారణాసి షెడ్యూల్ పూర్తి చేసుకున్నఇస్మార్ట్ శంకర్ చిత్రయూనిట్ త్వరలో పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే నిధి అగర్వాల్ తన పాస్పోర్ట్ను పోగొట్టుకోవటంతో ఫారిన్ షెడ్యూల్పై అనుమానాలు ఏర్పడ్డాయి. కానీ షెడ్యూల్ తన వల్ల ఆలస్యం కాకూడదన్న ఉద్దేశంతో నిధి ఎంతో కష్టపడి అధికారులను సంప్రదించి పాస్పోర్ట్ను తిరిగి పొందారు. దీంతో అనుకున్న సమయానికి ఇస్మార్ట్ శంకర్ ఫారిన్ షెడ్యుల్ను ప్రారంభించనున్నారట. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్లో నిదితో పాటు నభా నటేష్ మరో హీరోయిన్గా నటిస్తున్నారు. పూరితో కలిసి చార్మి నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. -
వారణాసి షెడ్యూల్ ‘ఇస్మార్ట్’గా కంప్లీట్
ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ కాంబినేషన్లో ఇస్మార్ట్ శంకర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూరి స్టైల్లో రూపొందనున్న ఈ మూవీ షూటింగ్ను చకచకా కానిచ్చేస్తున్నారు. వారణాసిలో భారీ యాక్షన్ సీన్స్ను షూట్ చేసిన యూనిట్.. ఆ షెడ్యూల్కు ప్యాకప్ చేప్పేసింది. ఇటీవలె వారణాసికి వెళ్లిన చిత్రబృందం.. అక్కడ భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపారు. నేటితో ఆ షెడ్యూల్కు గుడ్బై చెప్పినట్లు.. మరో షెడ్యూల్ను రెండు రోజుల్లో హైదరాబాద్లోనే స్టార్ట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. నిధి అగర్వాల్, నభా నటేష్లు హీరోయిన్స్గా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. -
పూరి వెనక్కి తగ్గాడా?
టైమ్ చెప్పి మరీ వచ్చే అతికొద్దిమంది దర్శకుల్లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒకరు. తక్కువ టైమ్లో సినిమాను పూర్తి చేసి హిట్ కొట్టగల ఈ దర్శకుడు ఇప్పుడు తన పంథాను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. స్టార్ హీరోతో డెబ్బై రోజుల్లో సినిమాను పూర్తి చేసి హిట్ కొట్టిన ట్రాక్ రికార్డు ఉన్న ఈ డైరెక్టర్.. ప్రస్తుతం చేస్తోన్న మూవీని స్లోగానే తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. రామ్తో ‘ఇస్మార్ట్ శంకర్’ను ప్రారంభించిన పూరి.. మే 31 ఈ చిత్రాన్ని విడుదల చేస్తానని ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు మళ్లీ ఆ ఊసెత్తలేదు. ఇప్పటికీ ఒక్క పోస్టర్, టీజర్ కూడా వదల్లేదు. ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది. చూస్తుంటే ఈ చిత్రం మేలో విడుదల కాదని తెలుస్తోంది. మేలో మహర్షి సందడి ఉంటుందని తెలిసే.. మెల్లగా తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువద్దామనే ఆలోచనలో పూరి ఉన్నట్లు ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. -
మండే ఎండలో ‘ఇస్మార్ట్’ షూటింగ్!
సరైన హిట్లేక, తిరిగి ఫామ్లోకి రాలేక సతమతమవుతున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్తో కలిసి ఇస్మార్ట్ శంకర్ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ను జరుపుకుంటున్న ఈ మూవీ ఇప్పటికే మేజర్ పార్ట్ పూర్తయిందని సమాచారం. తెలంగాణ యాసలో తెరపై హంగామా చేసేందుకు రామ్ రెడీ అయ్యాడు. ఈ సినిమా కోసం బాడీని కూడా బిల్డప్ చేసి.. సరికొత్త లుక్లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రయూనిట్ ప్రస్తుతం వారణాసిలో ఉంది. 46డిగ్రీల ఎండలో షూటింగ్ జరుగుతోందని చార్మీ ట్వీట్ చేశారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్పై ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్నారు. రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. While we shoot under scorching sun just 46 degrees 🔥 .. shooting craziness n madness goes on 😁 #ismartshankar in #varanasi @purijagan @puriconnects #PCfilm pic.twitter.com/a84MMSi9rw — Charmme Kaur (@Charmmeofficial) 2 May 2019 -
వారణాసిలో డిష్యూం డిష్యూం
ఇస్మార్ట్ శంకర్తో పెట్టుకుంటే చాలా స్మార్ట్గా రప్ఫాడిస్తాడు. ఇప్పుడు అదే పనిమీద వారణాసి వెళ్లాడు. అక్కడ విలన్లను ఉతుకుడే ఉతుకుడు. వీర లెవల్లో శంకర్ చేసిన ఈ ఫైట్స్ని ఈ నెలలోనే చూడొచ్చు. ఇస్మార్ట్ శంకర్గా టైటిల్ రోల్లో రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ‘డబుల్ దిమాక్’ అనేది ట్యాగ్లైన్. ఈ చిత్రానికి సంబంధించిన భారీ యాక్షన్ ఎపిసోడ్ను ఫైట్మాస్టర్ రియల్ సతీష్ ఆధ్వర్యంలో వారణాసిలో చిత్రీకరిస్తున్నారు. పూరి స్టయిల్లో సాగే ఈ ఫైట్ సీన్స్లో హీరో హీరోయిన్ రామ్, నిధి అగర్వాల్తో పాటు కీలక పాత్రధారులు ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే, దీపక్ శెట్టి, తులసి తదితరులు పాల్గొంటున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్పై ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్నారు. ఈ నెలలోనే సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. నభా నటేష్ ఓ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ. -
ఖరాబ్ చేస్తా
జస్ట్ వారం క్రితం మీ దిమాక్లు ఖరాబు చేస్తానన్నారు నిధీ అగర్వాల్. అన్నంత పనీ చేశారు. ఇప్పుడు నభా నటేశ్ కూడా ఇదే మాట అంటున్నారు. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’లో ఈ ఇద్దరూ కథానాయికలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం మణిశర్మ స్వరపరచిన పాటల్లో ‘దిమాక్ ఖరాబ్..’ అంటూ తెలంగాణ యాసలో సాగే పాట ఒకటి. హైదరాబాద్లో వేసిన భారీ సెట్లో రామ్, నిధి, నభా పాల్గొనగా ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. వారం క్రితం ఈ పాటలోని నిధీ అగర్వాల్ లుక్ని విడుదల చేశారు. శుక్రవారం నభా నటేశ్ ఫొటో రిలీజ్ చేశారు. ‘‘నిధీ అగర్వాల్ లుక్కి మంచి స్పందన వచ్చింది’’ అని చిత్రబృందం పేర్కొంది. నభా కూడా మార్కులు కొట్టేస్తారని, కుర్రకారు దిమాక్ ఖరాబ్ చేస్తారని చెప్పొచ్చు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
ఖరాబ్ ఖాయం
‘దిమాక్ ఖరాబ్..’ అంటూ నిధీ అగర్వాల్ అట్టహాసంగా డ్యాన్స్ చేస్తే అబ్బాయిల దిమాక్ ఖరాబ్ కావడం ఖాయం. ‘ఇస్మార్ట్ శంకర్’లోని ‘దిమాక్ ఖరాబ్..’ పాటలోనే నిధి ఇలా హాట్గా కనిపించబోతున్నారు. హైదరాబాద్లో వేసిన భారీ సెట్లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. రామ్, నిధీ అగర్వాల్, నభా నటేశ్ హీరో, హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరకర్త. ప్రస్తుతం చిత్రీకరిస్తున్న ‘దిమాక్ ఖరాబ్..’ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. తెలంగాణ యాసలో సాగే ఈ పాట చిత్రీకరణ సమయంలో దర్శకుడు సుకుమార్ లొకేషన్కి వెళ్లారు. సాంగ్ మేకింగ్, రామ్ లుక్ని సుక్కు అభినందించారు. మేలో ఈ చిత్రం రిలీజ్. -
‘ఇస్మార్ట్ శంకర్’లో గ్లామరస్ నిధి
ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. డబుల్ దిమాక్ ట్యాగ్ లైన్. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమాను సమ్మర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన భారీ సెట్లో ‘దిమాక్ ఖరాబ్...’ అనే పాటను చిత్రీకరిస్తున్నారు. వందమంది డ్యాన్సర్స్తో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో గ్రాండ్గా తెరకెక్కిస్తున్నారు. కాసర్లశ్యామ్ రాసిన ఈ పాట తెలంగాణ యాసలో సాగుతుంది. తాజాగా ఈ పాటకు సంబంధించిన ఆన్లోకేషన్ స్టిల్స్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. వైబ్రేంట్ కాస్ట్యూమ్స్ లో ఉన్న నిధి అగర్వాల్ లుక్కు మంచి రెస్పాన్స్ వస్తుంది. -
సుకుమార్ను రౌడీ అనేసింది!
వరుస ప్లాఫులతో సతమతమవుతున్న..డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్తో కలిసి ఇస్మార్ట్ శంకర్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఫుల్ స్వింగ్లో షూటింగ్ను పూర్తి చేస్తున్న పూరి.. ఈ మూవీ సక్సెస్పై నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. చిత్రయూనిట్ ప్రస్తుతం దిమాక్ ఖరాబ్ సాంగ్ను షూట్ చేస్తోంది. ఈ పాట చిత్రీకరణ సమయంలో.. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ లొకేషన్లో ప్రత్యక్షమయ్యారు. చిత్రయూనిట్తో సుక్కు సరదాగా ముచ్చటించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలను చార్మీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘రౌడీ గారు.. సుకుమార్.. లొకేషన్కు రావడంతో ఎంతో సరదాగా ఉంది. థ్యాంక్స్ ఫర్ ఆల్ కాంప్లీమెంట్స్’ అంటూ చార్మీ ట్వీట్ చేసింది. Was so much fun having rowdy garu @aryasukku on sets of #ismartshankar #dimaakkharab song location .. thanks for all the compliments 🤗🤗 @ramsayz @purijagan @puriconnects #PCfilm #happyugadi pic.twitter.com/S1f6BMhjZo — Charmme Kaur (@Charmmeofficial) April 6, 2019 -
దిమాక్ ఖరాబ్
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఇందులో నిధీ అగర్వాల్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. పూరిజగన్నాథ్, చార్మీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల గోవా షెడ్యూల్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రబృందం తాజాగా హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ను స్టార్ట్ చేసింది. ‘దిమాక్ ఖరాబ్...’ అనే సాంగ్ను చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం భారీ సెట్ వేశారు. మణిశర్మ స్వరకర్త. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను సాకేత్, కీర్తన పాడారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. తెలంగాణయాసలో ఉండే ఈ సాంగ్లో రామ్ వేసే డ్యాన్స్ మూమెంట్స్ మాస్ ఆడియన్స్ను ఉర్రూతలూగించేలా విధంగా ఉంటాయట. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను మేలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
దిమాక్ ఖరాబ్
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఇందులో నిధీ అగర్వాల్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. పూరిజగన్నాథ్, చార్మీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల గోవా షెడ్యూల్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రబృందం తాజాగా హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ను స్టార్ట్ చేసింది. ‘దిమాక్ ఖరాబ్...’ అనే సాంగ్ను చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం భారీ సెట్ వేశారు. మణిశర్మ స్వరకర్త. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను సాకేత్, కీర్తన పాడారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. తెలంగాణయాసలో ఉండే ఈ సాంగ్లో రామ్ వేసే డ్యాన్స్ మూమెంట్స్ మాస్ ఆడియన్స్ను ఉర్రూతలూగించేలా విధంగా ఉంటాయట. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను మేలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
పాటల చిత్రీకరణలో ‘ఇస్మార్ట్ శంకర్’
ఎనర్జిటక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఇటీవలే గోవాలో భారీ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది యూనిట్. బుధవారం నుండి హైదరాబాద్లో వేసిన సెట్లో పాటల చిత్రకరణ ప్రారంభించారు. ‘దిమాక్ ఖరాబ్..’ అంటూ తెలంగాణ యాసలో సాగే ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ పాటలో హీరో రామ్ మరోసారి అదిరిపోయే స్టెప్పులతో మెప్పించనున్నాడట. కాసర్లశ్యామ్ రాసిన ఈ పాటకు మణిశర్మ సంగీతమందించగా కీర్తన శర్మ, సాకేత్ ఆలపించారు. రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్పై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ నిర్మాతలుగా రూపొందిస్తున్న ఈ సినిమాను వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
చలో గోవా
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఇందులో నిధీ అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్, చార్మి కౌర్ నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైన ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. నెక్ట్స్ షెడ్యూల్ కోసం చిత్రబృందం గోవా వెళ్లనుంది. అక్కడ ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మేలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఇస్మార్ట్2
హీరోయిజాన్ని సరికొత్తగా తెరపై ఆవిష్కరించడంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్కు ప్రత్యేకమైన శైలి ఉంది. అందుకే హీరోలందరూ ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలనుకుంటుంటారు. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సీక్వెల్ రూపొందనుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం షూటింగ్ దశలో ఉండగానే పూరిజగన్నాథ్, ఛార్మి ‘డబుల్ ఇస్మార్ట్’ అనే టైటిల్ను రిజిష్టర్ చేయించారు. ప్రస్తుతం ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో టిపికల్ హైదరాబాదీ కుర్రాడిగా రామ్ కనిపించనున్నారు. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. -
ఇంకా రిలీజే కాలేదు.. అప్పుడే సీక్వెల్ ఆలోచనలు!
బ్యాడ్ టైమ్ రన్ అవుతోన్న సీనియర్ దర్శకులు చాలానే మంది ఉన్నా పూరి జగన్నాద్ మాత్రం ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. సినిమాల విషయంలో జోరు తగ్గకుండా ఒకదాని వెంట మరోటి పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఈ మూవీ సీక్వెల్ పార్ట్కు సంబంధించిన టైటిల్ను రిజిష్టర్ చేసినట్టు తెలుస్తోంది. ఇస్మార్ట్శంకర్పై విజయం సాధిస్తుందన్న నమ్మకంతోనే.. డబుల్ఇస్మార్ట్ అనే సీక్వెల్ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్.. పూరి జగన్నాధ్ టాకీస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. -
ఉప్మా కేక్ కట్ చేయాలంటోన్న హీరోయిన్!
ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే సినిమాల్లో జంటగా నటించారు రామ్, అనుపమా పరమేశ్వరన్. ఈ జోడికి ప్రేక్షకుల్లో మంచి మార్కులే పడ్డాయి. నేడు అనుపమా పుట్టినరోజు సందర్భంగా అభిమానులే కాదు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రామ్ సోషల్ మీడియాలో అనుపమాకి బర్త్డే విషెస్ చెబుతూ.. ‘హ్యాపి బర్త్డే స్వీట్ లిటిల్ సౌల్.. ఈ ఏడాదంతా నీకు బాగుండాలి.. ఉప్మా.. హగ్స్’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి అనుపమా సమాధానం ఇస్తూ.. ‘ఈ సారి నేను ఉప్మా కేక్ చేయాలేమో.. థాంక్యూ.. మిస్ యూ రామ్’ అని ట్వీట్ చేశారు. రామ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఇస్మార్ట్ శంకర్ చేస్తూ బిజీగా ఉన్నాడు. 🙈may be I should cut an UPMA cake this time 😂 Thanku .. miss u #RAPO https://t.co/4teejnjqlX — Anupama Parameswaran (@anupamahere) February 18, 2019 -
మరో సినిమాను లైన్లో పెట్టిన రామ్
టాలెంట్ ఉన్నా వరుస విజయాలు సాధించటంలో ఫెయిల్ అవుతున్న యంగ్ హీరో రామ్. ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటిస్తున్న రామ్, తదుపరి చిత్రాన్ని కూడా లైన్ పెట్టాడు. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన అయ్యారే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సాగర్ కె చంద్ర తరువాత నారా రోహిత్, శ్రీవిష్ణు కాంబినేషన్లో తెరకెక్కిన అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో తొలి విజయాన్ని అందుకున్నాడు. అప్పట్లో ఒకడుండేవాడు సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సాగర్ ప్రస్తుతం రామ్ కోసం ఓ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. ఇప్పటికే రామ్ కు లైన్ వినిపించిన సాగర్, ప్రస్తుతం పూర్తి కథను రెడీ చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అనుకున్న సమయానికి కథ రెడీ అయితే ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ చేయబోయే సినిమా ఇదే అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను రామ్ తన సొంత నిర్మాణ సంస్థ స్రవంతి మూవీ బ్యానర్లో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. -
‘రొమాంటిక్’గా ఆకాష్ పూరి!
ఆంధ్రాపోరీ, మెహబూబా అంటూ తన తనయుడిని హీరోగా లాంచ్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. అయితే ఈ సారి పూరి జగన్నాథ్ కథను అందించి తన శిష్యుడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. మరోసారి తన తనయుడిని హీరోగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ మూవీకి ‘రొమాంటిక్’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు పూరి జగన్నాథ్ అందించగా.. తన శిష్యుడు అనిల్ పాడురిని దర్శకుడిగా పరిచయం చేయబోతోన్నట్లు ప్రకటించాడు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ను ప్రారంభించినట్లు ప్రకటించారు. మరి ఈ సినిమా అయినా ఆకాష్కు కలిసి వస్తుందో లేదో చూడాలి. పూరి కనెక్ట్స్పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతం పూరి రామ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’తో బిజీగా ఉన్నాడు. #romantic @ActorAkashPuri @Charmmeofficial #AnilPaduri #shootbegins pic.twitter.com/hubvghGZc0 — PURIJAGAN (@purijagan) February 11, 2019 -
‘మ్యాటర్ తెలిస్తే ధిమాక్ ఖరాబ్’
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పూరి మార్క్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పూరి స్టైల్లోనే ‘ఇస్మార్ట్ శంకర్’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న హీరో రామ్, డైరెక్టర్ పూరికి ఓ కాస్ట్లీ గిఫ్ట్ను ఇచ్చాడు. ఈ విషయాన్ని పూరీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘మేరా ఇస్మార్ట్ శంకర్.. రామ్, నాకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ‘కోపి లువాక్’ కాఫీని గిఫ్ట్గా ఇచ్చాడు. ప్రస్తుతం నేను ఆ కాఫీ తాగుతున్నాను. ఈ కాఫీ గురించి గూగుల్ చేయండి. మీకు దిమ్మతిరిగే విషయాలు తెలుస్తాయి’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్పై స్పందించిన రామ్ ‘గూగుల్ చేయకండ్రి.. మ్యాటర్ తెలిస్తే ధిమాక్ ఖరాబ్ ఐతది’ అంటూ రిప్లై ఇచ్చాడు. Google cheyakandri...matter teliste dhimaak kharaab ayitaadi! 🤯👈 - IS 😜 https://t.co/jPBt2aBmMM — RAm POthineni (@ramsayz) 5 February 2019 -
ఇస్మార్ట్తో కిర్రాక్ పోరీ
టాలీవుడ్లో హీరోయిన్ నభా నటేష్ మంచి ఫామ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరపై కనిపించిన ఈ కన్నడ బ్యూటీకి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. రవితేజ హీరోగా నటించనున్న ‘డిస్కోరాజా’ సినిమాలో ఒక హీరోయిన్గా నభా నటేష్ పేరు వినిపించిన సంగతి తెలిసిందే. ఇది వార్తల్లో ఉండగానే.. నభా మరో అవకాశం కొట్టేశారు. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’లో ఓ నాయికగా నభాని తీసుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు చార్మీ, పూరి జగన్నాథ్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో ఆల్రెడీ ఒక హీరోయిన్గా నిధీ అగర్వాల్ ఎంపిక అయ్యారు. ‘‘కిర్రాక్ హైదరాబాద్ పోరీ నభా నటేష్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో హీరోయిన్గా నటించనున్నారు’’ అని చార్మీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ఫస్ట్ షెడ్యూల్ దాదాపు 40 రోజులు సాగుతుందని సమాచారం. ఈ చిత్రం మేలో విడుదల కానుంది. -
‘ఇస్మార్ట్ శంకర్’ కోసం మరో బ్యూటీ
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్. హీరోయిన్ చార్మీతో కలిసి పూరి జగన్నాథ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో నటించబోయే మరో హీరోయిన్ను ప్రకటించారు చిత్రయూనిట్. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన నభా నటేష్.. ఇస్మార్ట్ శంకర్లో మరో హీరోయిన్గా నటించనుందట. ఈ సినిమాలో నభా పక్కా హైదరాబాదీ అమ్మాయి పాత్రో కనిపించనుందట. తొలి సినిమాలో నేచురల్ యాక్టింగ్తో ఆకట్టుకున్న నభా ఈ సినిమాతో మరోసారి ఆకట్టుకుంటుందేమో చూడాలి.