అయ్యో అలాంటిదేమీ లేదు : కంగనా | Kangana Ranaut Clarifies Rumours | Sakshi
Sakshi News home page

అయ్యో అలాంటిదేమీ లేదు : కంగనా

Aug 30 2018 5:39 PM | Updated on Aug 30 2018 5:50 PM

Kangana Ranaut Clarifies Rumours - Sakshi

హీరోయిన్ కంగనా రనౌత్‌కి, క్రిష్‌కి మధ్య ..

ఝాన్సీ ల‌క్ష్మీ బాయి జీవిత కథ ఆధారంగా మ‌ణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ సినిమాని దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే అందులో హీరోయిన్ కంగనా రనౌత్‌కి, క్రిష్‌కి మధ్య విభేదాలంటూ గతకొన్ని రోజులుగా పుకార్లు వస్తున్నాయి. దీనికి తోడు చిత్రానికి సంబంధించిన‌ క్లాప్ బోర్డ్‌పై డైరెక్ట‌ర్ పేరుండాల్సిన దగ్గర కంగ‌నా ర‌నౌత్ పేరు ఉండ‌డంతో అభిమానుల్లో మరోసారి అనుమానం మొద‌లైంది. 

ఈ విష‌యంపై అభిమానులు ద‌ర్శ‌కుడితో పాటు కంగ‌నాని సోషల్‌మీడియా వేదిక‌గా ప్ర‌శ్నించారు. దీంతో కంగ‌నా వెంట‌నే స్పందించింది. క్రిష్ తాను ఒప్పుకున్న వేరే సినిమాతో బిజీగా ఉండ‌డం వల్లే మేము ప్యాచ్ వ‌ర్క్‌పూర్తి చేశాం. అంతే కాని పూర్తి ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌లేదు. సెట్లో ఉన్న క్లాప్ బోర్డ్ ఇంత గంద‌ర‌గోళం సృష్టించింది. ప్ర‌స్తుతం సినిమా వ‌ర్క్ అంతా స‌వ్యంగా జ‌రుగుతుంది. అనుకున్న స‌మ‌యానికే మూవీ రిలీజ్ అవుతుంది' అని కంగనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో బదులిచ్చారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. మ‌ణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ చిత్రం జ‌న‌వ‌రి 25, 2019న‌ విడుద‌ల కానుందని కంగనా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement