krish jagarlamudi
-
Year Ender 2024: ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సీనీ తారలు వీళ్లే
‘శ్రీరస్తూ శుభమస్తు... శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం... ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం’... ‘పెళ్ళి పుస్తకం’ చిత్రంలోని ఈ పాట తెలుగింటి పెళ్లి వేడుకల్లో వినబడుతుంటుంది. 2024లో పెళ్లితో ‘కల్యాణం... కమనీయం...’ అంటూ తమ జీవిత పుస్తకంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించిన స్టార్స్ చాలామందే ఉన్నారు. ఇక ఏయే తారలు ఏయే నెలలో, ఏ తేదీన పెళ్లి చేసుకున్నారనే విశేషాలు తెలుసుకుందాం.ఫిబ్రవరిలో... నార్త్, సౌత్లో హీరోయిన్గా ఓ మంచి స్థాయికి వెళ్లిన ఉత్తరాది భామ రకుల్ ప్రీత్ సింగ్ ఉత్తరాది ఇంటి కోడలు అయ్యారు. బాలీవుడ్ నటుడు–నిర్మాత జాకీ భగ్నానీతో 21న ఆమె ఏడడుగులు వేశారు. వీరిది ప్రేమ వివాహం. పెద్దల సమ్మతితో గోవాలో పెళ్లి చేసుకున్నారు. మార్చిలో... పంజాబీ భామ కృతీ కర్బందా, బాలీవుడ్ నటుడు పుల్కిత్ సామ్రాట్తో మార్చి 15న ఏడు అడుగులు వేశారు. వీరిది ప్రేమ వివాహం. గుర్గావ్లో వీరి వివాహం జరిగింది. ⇒ సౌత్, నార్త్లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోని 23న వివాహం చేసుకున్నారు. పదేళ్లు రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరూ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉదయ్పూర్లో పెళ్లి చేసుకున్నారు. జూన్లో... నటుడు అర్జున్ పెద్ద కుమార్తె, నటి ఐశ్వర్యా అర్జున్, తమిళ స్టార్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు, నటుడు ఉమాపతిల వివాహం చెన్నైలో జరిగింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఐశ్వర్య–ఉమాపతి పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ⇒ ప్రముఖ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా కుమార్తె, హీరోయిన్ సోనాక్షీ సిన్హా, బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్ ఏడడుగులు వేశారు. 23న వీరి వివాహం ఘనంగా జరిగింది. జూలైలో... వరలక్ష్మీ శరత్ కుమార్ తన ప్రేమికుడు, ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడైన నికోలయ్ సచ్దేవ్తో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో థాయ్ల్యాండ్లో 2న వీరి పెళ్లి జరిగింది. ఆగస్టులో... ‘రాజావారు రాణిగారు’ (2019) సినిమాతో తెలుగులో హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్. రీల్ లైఫ్లో ప్రేమికులుగా నటించిన ఈ ఇద్దరూ రియల్ లైఫ్లో భార్యాభర్తలయ్యారు. ఆ మూవీ సమయంలో వీరి మధ్య ఏర్పడిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో కర్నాటకలోని కూర్గ్లో 22న కిరణ్–రహస్య వివాహం చేసుకున్నారు. సెప్టెంబరులో... హీరోయిన్ మేఘా ఆకాశ్ తన ప్రియుడు సాయి విష్ణుని పెళ్లాడారు. వీరి వివాహం 15న చెన్నైలో ఘనంగా జరిగింది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన సాయి విష్ణుతో మేఘా ఆకాశ్ చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి పచ్చజెండా ఊపడంతో ఏడడుగులు వేశారు. ⇒ గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న హీరో సిద్ధార్థ్, హీరో యిన్ అదితీరావు హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తొలుత తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో మార్చి 27న, ఆ తర్వాత రాజస్థాన్లోని ఓ రిసార్ట్లో సెప్టెంబరు 16న డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. నవంబరులో... ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పెళ్లి పీటలెక్కారు. డాక్టర్ ప్రీతీ చల్లాతో 11న ఆయన ఏడడుగులు వేశారు. ‘వేదం, గమ్యం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి చిత్రాలతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు క్రిష్. ప్రీతీతో ఆయన వివాహం హైదరాబాద్లో అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. ⇒ తెలుగు చిత్ర పరిశ్రమలో గాయకులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న రమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి 15న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ⇒ నటుడిగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దక్షిణాదిలో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న సుబ్బరాజు పెళ్లి పీటలెక్కారు. స్రవంతితో ఆయన ఏడడుగులు వేశారు. 26న వీరి వివాహం జరిగింది. డిసెంబరులో.. హీరో అక్కినేని నాగచైతన్య– హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ 4న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక పెళ్లి పందరిలో వీరిద్దరూ ఏడడుగులు వేశారు. ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా చైతన్య–శోభితల పరిచయం ప్రేమగా మారి, ఆ తర్వాత పెళ్లి పీటల వరకూ వచ్చింది. పెద్దల అంగీకారంతో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ⇒ ‘కలర్ ఫొటో’ (2020) సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్, నటి చాందినీ రావుతో కలిసి ఏడడుగులు వేశారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో తిరుమలలో 7న వీరి వివాహం జరిగింది. ‘కలర్ ఫొటో’ చిత్రంలో చిన్న పాత్ర చేసిన చాందినీ రావుతో ఆయన పెళ్లి జరగడం విశేషం. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ⇒ ‘నువ్వేకావాలి, ప్రేమించు’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సాయికిరణ్. ఆ తర్వాత సీరియల్స్ వైపు వెళ్లిన ఆయన బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ నెల 9న ఆయన స్రవంతి అనే సీరియల్ ఆర్టిస్ట్ని వివాహం చేసుకున్నారు. ⇒ మహానటిగా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సొంతం చేసుకున్నారు కీర్తీ సురేష్ తన చిన్న నాటి స్నేహితుడు, వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్తో ఈ నెల 12న ఏడడుగులు వేశారు. వీరిద్దరి మధ్య 15 ఏళ్లుగా స్నేహం, ప్రేమ కొనసాగుతోంది. ఇరు కుటుంబ సభ్యులు ఓకే చెప్పడంతో గోవాలో వీరి వివాహం జరిగింది. ⇒ ‘మత్తు వదలరా, మత్తు వదలరా 2’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శ్రీసింహా (సంగీతదర్శకుడు కీరవాణి తనయుడు). ఆయన వివాహం నటుడు మురళీమోహన్ మనవరాలు మాగంటి రాగతో దుబాయ్లో 14న జరిగింది. ⇒ ఇలా 2024లో ఎక్కువమంది తారలు వివాహబంధంలోకి అడుగుపెట్టం విశేషం. -
అనుష్క 'ఘాటి' ఊచకోత.. రిలీజ్పై క్రిష్ ప్రకటన
టాలీవుడ్ క్వీన్ హీరోయిన్ అనుష్క శెట్టి, దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘ఘాటి’. ఇప్పటికే షూటింగ్ పనులు దాదాపు పూర్తి అయ్యాయి. అయితే, తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. వంశీకృష్ణా రెడ్డి, రాజీవ్ రెడ్డి నిర్మాతలుగా ఉన్నారు.'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' తర్వాత అనుష్క నటిస్తున్న ఈ 'ఘాటి' చిత్రానికి చింతకింది శ్రీనివాస్రావు, క్రిష్, బుర్రా సాయిమాధవ్ రచన చేశారు. నేరస్తురాలిగా మారిన ఓ బాధితురాలి కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రతీకారం ప్రధానంగా సాగుతుంది. ఏప్రిల్ 18న ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు ఒక వీడియో ద్వారా మేకర్స్ ప్రకటించారు. -
రెండో పెళ్లి చేసుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి.. అమ్మాయి ఎవరంటే? (ఫోటోలు)
-
రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ క్రిష్
తెలుగు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ప్రీతి చల్లా అనే డాక్టర్తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. ఈమెది హైదరాబాద్. గతంలోనే ఈమెకు వివాహం జరిగినప్పటికీ.. పలు కారణాల వల్ల భర్తతో విడాకులు తీసుకుంది. ఈమెకు 11 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడట. ఇద్దరి పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇప్పుడు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.2008లో వచ్చిన 'గమ్యం' సినిమాతో దర్శకుడిగా మారిన క్రిష్.. వేదం, కొండపొలం, గౌతమిపుత్ర శాతకర్ణి తదితర చిత్రాలు తీశాడు. 16 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ హిట్స్ అయితే కొట్టలేకపోయాడు. మధ్యలో రమ్య అనే డాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ బంధం ఎంతో కాలం నిలబడలేదు. విభేదాల కారణంగా వీళ్లిద్దరూ విడిపోయారు. రమ్య.. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని యూఎస్లో సెటిల్ అయిపోయింది.(ఇదీ చదవండి: కన్నడ బ్యాచ్ కన్నింగ్ గేమ్.. ఈ వారం నామినేషన్స్లో ఎవరెవరు?)చాన్నాళ్ల క్రితం క్రిష్ పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. హీరోయిన్ అనుష్కని పెళ్లి చేసుకుంటాడని అన్నారు. కానీ ఇప్పుడు ప్రీతి చల్లాని పెళ్లి చేసుకోవడంతో వాటికి ఎండ్ కార్డ్ పడింది. అలానే కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన క్రిష్కి పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.పవన్తో 'హరిహర వీరమల్లు' సినిమాని క్రిష్ డైరెక్ట్ చేయాలి. కానీ ప్రాజెక్ట్ లేట్ అవుతూ ఉండేసరికి తప్పుకొన్నాడు. ప్రస్తుతం అనుష్కతో 'ఘాటీ' చేస్తున్నాడు. త్వరలో ఈ మూవీ రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?) -
అనుష్క శెట్టి బర్త్ డే.. అరుంధతిని మరిపిస్తోన్న గ్లింప్స్!
టాలీవుడ్ స్వీటీ అనుష్క బాహుబలి తర్వాత పెద్దగా సినిమాలు చేయడం లేదు. గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ద్వారా ప్రేక్షరులను పలకరించింది. ఆ తర్వాత మళ్లీ ఏ ప్రాజెక్ట్లోనూ కనిపించలేదు. దీంతో అనుష్క ఫ్యాన్స్ సినిమాలకు గుడ్ బై చెప్పేయనుందా అన్న డైలామాలో పడ్డారు.అయితే ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్భంగా అనుష్క ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చారు. ఆమె నటిస్తోన్న తాజా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి ఘాటీ అనే టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ గ్లింప్స్ను విడుదల చేశారు మేకర్స్. దాదాపు 47 సెకన్ల పాటు ఉన్న గ్లింప్స్ అనుష్క ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చేతిలో కొడవలి పట్టుకున్న అనుష్క ఫుల్ మాస్ యాక్షన్తో అదరగొట్టేశారు. ఈ సినిమాను మహిళ ఓరియంటెడ్ కథగానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో అనుష్క పాత్ర చూస్తుంటే ఓ రేంజ్లో ఉండనుందని గ్లింప్ల్తోనే అర్థమవుతోంది. మరోసారి అరుంధతి రేంజ్ నటనను ఘాటీ గుర్తుకు తెచ్చేలా కనిపిస్తోంది. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. -
Krish Jagarlamudi : మళ్లీ పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్!
-
కొత్త సినిమాతో అనుష్క.. భయపెట్టేలా ఫస్ట్ లుక్
'బాహుబలి' తర్వాత అనుష్క సినిమాలు చేయడంలో పూర్తిగా నెమ్మదించింది. ఒకటి అరా మూవీస్ చేస్తూ వస్తోంది. గతేడాది సెప్టెంబరులో 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో హిట్ కొట్టింది. కానీ ఆ తర్వాత ఏమైపోయిందో, ఏం చేస్తుందో తెలియదు. ఇప్పుడు ఈమె పుట్టినరోజు సందర్భంగా కొత్త మూవీ డీటైల్స్ బయటకొచ్చాయి. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2' కోసం తమన్.. 'కాంతార' మ్యూజిక్ డైరెక్టర్ కూడా?)'హరిహర వీరమల్లు' లేట్ అవుతూ వచ్చేసరికి ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేసిన డైరెక్టర్ క్రిష్.. అనుష్కని లీడ్ రోల్గా పెట్టి సినిమా తీస్తున్నాడు. దీనికే ఇప్పుడు 'ఘాటీ' టైటిల్ నిర్ణయించారు. అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. బాధితురాలే క్రిమినల్ అయితే? అనే కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.తల, చేతికి రక్తంతో చుట్ట తాగుతూ.. భయపెట్టేలా అనుష్క ఫస్ట్ లుక్ ఉంది. సాయంత్రం 4:05 గంటలకు గ్లింప్స్ రిలీజ్ చేస్తారు. ఇది పాన్ ఇండియా మూవీనే. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో దీన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. బహుశా ఫిబ్రవరి లేదా మార్చిలో థియేట్రికల్ రిలీజ్ ఉండొచ్చేమో?(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు) -
డైరెక్టర్ క్రిష్ భారీ స్కెచ్..తప్పించుకునేందుకు ప్రయత్నాలు ?
-
డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ అరెస్ట్ ?
-
పాజిటివ్ వస్తే అరెస్ట్..
-
డ్రగ్స్ కేసులో అనూహ్య మలుపు.. విచారణకు వచ్చిన క్రిష్
డ్రగ్స్ కేసులో అనుమానితుడిగా ఉన్న సినీ డైరెక్టర్ క్రిష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పై హైకోర్టులో విచారణ జరగ్గా.. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. దీంతో అనూహ్యంగా క్రిష్ శుక్రవారం సైబరాబాద్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. వాస్తవానికి విచారణకు వస్తానని చెప్పి ఆయన ముందస్తు బెయిల్కు వెళ్లడంతో ఆయనపై అనుమానాలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో బెయిల్ పిటిషన్ వాయిదా పడటం.. ఆయన విచారణకు రావడం వంటి పరిణామాలు జరిగాయి. అత్యంత గోప్యంగా పోలీసుల ముందుకొచ్చిన క్రిష్ను పోలీసులు కొద్దిసేపు విచారించిన అనంతరం రక్త, మూత్ర నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. డ్రగ్స్ అంశాలపై క్రిష్ రియాక్ట్ అయ్యారు.. తాను ముంబయిలో ఉన్నానని, పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని తెలిపారు. ప్రధాన నిందితుడిగా ఉన్న గజ్జల వివేకానంద్, నిర్భయ్, కేదార్నాథ్ రక్త నమూనాలు పాజిటివ్గా రావడంతో ఈ కేసు కీలక పరిణామంగా మారింది. హోటల్పై పోలీసులు దాడి చేసిన సమయంలో డ్రగ్స్ దొరక్కపోవడంతో ప్రధాన నిందితుడి జ్యుడిషియల్ రిమాండుకు అనుమతి లభించలేదు. మరోవైపు ఈ కేసులో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న లిషి, సందీప్, శ్వేత, నీల్ ఇప్పటి వరకు పోలీసుల విచారణకు రాలేదు. వారు డ్రగ్స్ తీసుకోకుంటే భయం ఎందుకు అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆలస్యం చేసేకొద్దీ మూత్ర విశ్లేషణలో డ్రగ్స్ ఆనవాళ్లు తొలగిపోతాయనే కారణంతోనే వారు కాలయాపన చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో వారిని వీలైనంత త్వరగా గుర్తించాలని పోలీసులు భావిస్తున్నారు. నీల్ విదేశాలకు వెళ్లినట్లుగా అనుమానిస్తుండటంతో అతడిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విచారణకు రాని వారందరీ ఇళ్లకు 160 సీఆర్పీసీ నోటీసులు అంటించారు. -
డ్రగ్స్ కేసులో పోలీసులకు ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్ క్రిష్
-
ముందస్తు బెయిల్ కోసం క్రిష్ పిటిషన్ .. విదేశాలకు నిర్మాత కుమారుడు
డ్రగ్స్ కేసులో అనుమానితుడిగా ఉన్న సినీ డైరెక్టర్ క్రిష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ కేసులో అనుమానితులుగా ఉన్న రఘు చరణ్ అట్లూరి, సందీప్లు కూడా హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. మిగిలిన అనుమానితులు కూడా ముందస్తు బెయిల్ తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కొకైన్ తీసుకున్నారన్న కేసులో మంజీరా గ్రూపు డైరెక్టర్ వివేకానందతో పాటు నిర్భర్, కేదార్, డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అనుమానితులుగా ఉన్న డైరెక్టర్ క్రిష్తో పాటు చరణ్, సందీప్, లిషీ, శ్వేత, నీల్ ఇళ్లకు 160 సీఆర్పీసీ నోటీసులు అంటించారు. బెంగళూరులో ఉన్న రఘు చరణ్ అట్లూరి గురువారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో విచారణకు హజరయ్యారు. ఆయనను వైద్య పరీక్షలకు తరలించారు. కాగా, లిషీ సోదరి నటి కుషిత గచ్చిబౌలి స్టేషన్కు వచ్చి తన సోదరి లిషీ ఇంటికి రావడం లేదని పోలీసులకు తెలిపింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు హాజరు కావాలని, దీనిపై లిషీకి సమాచారం ఇవ్వాలని పోలీసులు కుషితకు చెప్పినట్టు సమాచారం. సందీప్, శ్వేతల ఫోన్లు స్విచ్చాఫ్ ఉన్నాయని, ఇప్పటి వరకు వారు అందుబాటులోకి రాలేదని పోలీసులు పేర్కొంటున్నారు. విదేశాలకు నీల్! ఇదిలా ఉండగా సైంధవ్ సినిమా నిర్మాత వెంకట్ బోయినపల్లి కుమారుడు నీల్ (ఏ9) విదేశాలకు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అమెరికా పౌరసత్వం ఉన్న ఆయనను కొకైన్ తీసుకున్నట్లు అనుమానితుల జాబితాలో చేర్చడంతో దేశం విడిచి పారిపోయినట్లు పోలీసులు చెపుతున్నారు. మరో డ్రగ్ పెడ్లర్ అరెస్ట్ రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్ పార్టీ కేసులో మరో పెడ్లర్, పాతబస్తీకి చెందిన మీర్జా వాహెద్ను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తరువాత వివేకానంద డ్రైవర్ గద్దల ప్రవీణ్ను కూడా అరెస్ట్ చేశారు. దీంతో డ్రగ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. -
Drugs Case: గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్
హైదరాబాద్: గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో శనివారం రాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. రాడిసన్ హోటల్లో 200 సీసీ కెమెరాలు ఉండగా కేవలం 16 కెమెరాలు మాత్రమే పని చేస్తున్నట్లు నిర్ధారించారు. డ్రగ్స్ పార్టీ నిర్వహణ కోసమే కెమెరాలు మాయం చేసినట్లు తెలిసింది. కాగా డ్రగ్స్ తీసుకున్న అనుమానితుల జాబితాలో డైరెక్టర్ క్రిష్ ఉన్న సంగతి తెలిసిందే! ఈయన డ్రగ్స్ పార్టీ జరిగిన గదిలో అరగంట పాటు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ పార్టీ కోసం డ్రగ్ సరఫరా చేసిన (పెడ్లర్) సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్రీని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
డ్రగ్ పార్టీలో డైరెక్టర్ క్రిష్
గచ్చిబౌలి: గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో శనివారం రాత్రి జరిగిన డ్రగ్ పార్టీలో ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్ పాల్గొన్నట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ తెలిపారు. అయితే కొకైన్ వాడారా? లేదా? అనేది తెలియాల్సి ఉందన్నారు. ఈ పార్టీ కోసం డ్రగ్ సరఫరా చేసిన (పెడ్లర్) సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్రీని అరెస్టు చేశామని చెప్పారు. రాడిసన్ హోటల్లో గజ్జల వివేకానంద్కు 10 సార్లు మాదకద్రవ్యాలు సప్లయ్ చేసినట్లుగా అబ్బాస్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడని వివరించారు. చాలాసార్లు డ్రగ్ పార్టీలు చేసుకున్నట్లు చెప్పాడని మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ డీసీపీ తెలిపారు. రెండురోజుల్లో క్రిష్ను విచారిస్తాం క్రిష్ రెండురోజుల్లో విచారణకు వస్తారని, ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని డీసీపీ చెప్పారు. వివేకానంద్ను కలిసేందుకు మాత్రమే వచ్చినట్లు క్రిష్ చెబుతున్నాడని, వైద్య పరీక్షలు చేస్తేనే స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. కేదార్, నిర్భయ్ అనే కామన్ ఫ్రెండ్స్ ద్వారా సినిమా వాళ్లు వివేకానంద్కు పరిచయం అయ్యి ఉండవచ్చని తెలిపారు. డ్రగ్కు బానిస కావడంతోనే తరచుగా పార్టీలు నిర్వహించి ఉండవచ్చని అన్నారు. డ్రగ్ హైదరాబాద్లోనే కొనుగోలు చేసినట్లు అబ్బాస్ చెబుతున్నాడని, అయితే ఎక్కడి నుంచి సరఫరా అయ్యిందో విచారణలో తేలుతుందని చెప్పారు. కొకైన్ సరఫరా చేసిన ప్రతిసారీ రెండు నుంచి నాలుగు గ్రాములు వివేకానంద్కు అందించాడన్నారు. వివేకానంద్ ఎంత మొత్తంలో డబ్బులు చెల్లించాడో త్వరలో చెబుతామని చెప్పారు. పరారీలో శ్వేత, సందీప్ కేసులో అనుమానితులుగా ఉన్న శ్వేత, సందీప్లు పరారీలో ఉండగా బెంగళూరులో ఉన్న చరణ్ అక్కడే విచారణకు వస్తున్నట్లు తెలిపారు. డ్రగ్ పార్టీ నిర్వహించిన వారితో పాటు హోటల్ నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని డీసీపీ స్పష్టం చేశారు. హోటల్లో కొన్ని సీసీ కెమెరాలు పని చేయడం లేదని, శనివారం రాత్రి 12.30 గంటలకు వెళ్లే సరికే అందరూ పార్టీ నుంచి వెళ్లిపోయారని వివరించారు. డ్రగ్ పార్టీలకు రెగ్యులర్గా ఎవరు వస్తున్నారు, డ్రగ్ సప్లయ్ చైన్ తదితర అంశాలపై విచారణ చేపడతామన్నారు. ఇప్పటికి పార్టీలో 10 మంది ఉన్నట్లు గుర్తించగా ముగ్గురికి డ్రగ్ పాజిటివ్గా వచ్చిందని, మిగిలిన వారిని కూడా విచారించి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. శ్వేత బెంగళూరు డ్రగ్ కేసులో కూడా నిందితురాలిగా ఉందంటూ మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, ఆ వివరాలు సేకరిస్తామని, గతంలో రాడిసన్ హోటల్ మేనేజర్ డ్రగ్తో పట్టుబడిన కేసు వివరాలు కూడా సేకరిస్తామని అన్నారు. సయ్యద్ అరెస్టుతో రాడిసన్ డ్రగ్ పార్టీ కేసులో ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేసినట్లయ్యింది. -
డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్.. కీలక వ్యాఖ్యలు చేసిన మాదాపుర్ డీసీపీ
రాడిసన్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరికి కొకైన్ విక్రయించిన అబ్బాస్ అలీని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు పోలీసులు నిర్వహించిన దాడుల్లో మంజీరా గ్రూప్ డైరెక్టర్ వివేకానంద్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వివేకానంద్ నిర్వహించిన పార్టీలో క్రిష్, కేదార్, నిర్భయ్, నీల్, లిషి, శ్వేత, సందీప్, రఘుచరణ్లు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో వివేకానంద్, కేదార్, నిర్భయ్లను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేయగా.. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే డీసీపీ డాక్టర్ వినీత్ స్పందించారు. అసలేం జరిగింది? ఏం జరుగుతుందనేది వివరించారు. (ఇదీ చదవండి: పరారీలో క్రిష్.. స్పందించిన టాలీవుడ్ డైరెక్టర్!) 'రాడిసన్ హోటల్లో కొకైన్ సేవించిన కేసులో డ్రగ్ సరఫరా చేసిన సయ్యద్ అబ్బాస్ని అరెస్ట్ చేశాం. ఇతడు ఇచ్చిన స్టేట్మెంట్లో ఇప్పటివరకు 10 సార్లు గజ్జెల వివేకానంద్కు డెలివరీ చేసినట్లు చెప్పాడు. ఇదే హోటల్లో గతంలో కూడా పార్టీ చేసుకున్నట్లు మాకు తెలిసింది. శ్వేత, సందీప్ పరారీలో ఉన్నారు. చరణ్.. బెంగళూరులో ఉన్నానని, వస్తున్నానని చెప్పాడు. డ్రగ్స్ తీసుకున్న అనుమానితుల జాబితాలో డైరెక్టర్ క్రిష్ ఉన్నారు. ఇతడు డ్రగ్ టెస్ట్కి వస్తున్నానని చెప్పాడు' 'హోటల్ నిర్వాహకులపై కూడా కేసులు పెడతాం. అబ్బాస్ పదిసార్లు డ్రగ్స్ తెచ్చాడు, ఇన్నిసార్లు ఎక్కడి నుండి తెస్తున్నాడో విచారిస్తున్నాం. సరఫరా చేసిన ప్రతిసారి 4 గ్రాముల కొకైన్ తెచ్చాడని తెలిసింది. అలానే డైరెక్టర్ క్రిష్ని విచారిస్తాం. డ్రగ్ పరీక్షలు కూడా చేస్తాం. రక్త, మూత్ర పరీక్షలు చేస్తే అసలు నిజమేంటనేది తెలుస్తుంది. దీంతో పాటు వివేకానంద్ డ్రగ్ పార్టీలు ఎందుకు చేస్తున్నాడో విచారిస్తాం' అని డీసీపీ వినీత్ చెప్పారు. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవి ఖరీదైన కొత్త వాచ్.. రేటు తెలిస్తే మైండ్ బ్లాకే) -
అనుష్క- క్రిష్.. ఓ ఒడిశా అమ్మాయి!
సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఈ రంగంలో రాణించాలంటే.. ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ప్రస్తుతం ఆ అదృష్టానికి అనుష్క, క్రిష్ దూరమయ్యారు. ఇద్దరు మంచి ప్రతిభావంతులే. కానీ కాలం కలిసిరాకపోవడంతో కెరీర్ పరంగా కొంతవరకూ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల అనుష్క నటించిన.. క్రిష్ దర్శకత్వం వహించిన చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. దీంతో ఈ ఇద్దరు టాలెంటెడ్ వ్యక్తులు కలిని ఓ సినిమా చేయబోతున్నారు.ఎలాంటి గాసిప్ లేకుండా వీరిద్దరి సినిమా పట్టాలెక్కడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అనుష్కని మెయిన్ లీడ్లో పెట్టి ఏకంగా ఓ పాన్ ఇండియా సినిమానే తెరకెక్కిస్తున్నాడట క్రిష్. పడిపోయిన అనుష్క గ్రాఫ్ని లేపడానికి యూవీ క్రియేషన్స్ ఈ బాధ్యతలను తీసుకున్నట్లు తెలుస్తోంది. లేడి ఓరియెంటెండ్ చిత్రాలు అనుష్కకి కొత్తేమి కాదు. అరుధంతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి లాంటి చిత్రాలెన్నో చేసింది. ఇవన్నీ కెరీర్ పరంగా అనుష్క స్థాయిని పెంచిన చిత్రాలే. అయితే చివరకు అలాంటి లేడి ఓరియెంటెండ్ చిత్రమే అనుష్క గ్రాఫ్ని పడిపోయేలా చేసింది. అదే జీరో సైజ్ మూవీ. ఈ మూవీ కోసం అధిక బరువు పెరిగింది ఈ యోగా టీచర్. ఆ తర్వాత బరువు తగ్గించుకోవడం కోసం నానాపాట్లు పడినా.. మళ్లీ మునుపటి అనుష్క మాత్రం తెరపై కనిపించలేదు. చాలా కాలం తర్వాత ఆ మధ్య మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమాతో తెరపై కాస్త అందంగా కనిపించింది. ఇక క్రిష్ సంగతి కూడా అంతే.. గమ్యం, వేదం, కంచె లాంటి సినిమాలతో టాలెంటెండ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2017లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణ వరకు క్రిష్కి మంచి గుర్తింపు ఉంది. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్స్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు క్రిష్ గ్రాఫ్ని కిందకు దించాయి. దీనికి తోడు మణికర్ణిక సినిమా విషయంలో కంగనా రనౌత్తో జరిగిన గొడవ క్రిష్కి మైనస్ అయింది. ఆ గొడవ వల్ల క్రిష్ బాలీవుడ్కి దూరమయ్యాయి. 2021లో కొండపొలం అనే సినిమా వచ్చేవరకు క్రిష్ పేరు ఎక్కడా వినిపించలేదు. అయితే కొండపొలం కూడా డిజాస్టర్ కావడంతో క్రిష్ ఢీలా పడ్డాడు. హరిహర వీరమల్లు చిత్రంతో గ్రాండ్ రీఎంట్రీ ఇద్దామనుకున్నాడు. కానీ ఆ చిత్రం మూడేళ్లుగా షూటింగ్ జరుపుకుంటునే ఉంది. ఇలా కెరీర్ పరంగా ఢీలా పడ్డ ఇద్దరు మోస్ట్ టాలెంటెడ్ వ్యక్తులు కలిసి ఓ పవర్ఫుల్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఒడిశాలో ఓ అమ్మాయి జీవితంలో చోటు చేసుకున్న యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు సమాచారం. తనకు జరిగిన ఓ అన్యాయంపై ఓ ఒడిశా అమ్మాయి ఎలా పోరాటం చేసిందనే నేపథ్యంలో ఈ కథ సాగుతుందట. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఒడిశాలో జరుగుతుంది. అక్కడ అనుష్కపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఒడిశాకి చెందిన అమ్మాయి కథే కాబట్టి అక్కడ షూటింగ్ చేస్తున్నారని అంటున్నారు. మహిళా లోకం మొత్తం ఆలోచింపజేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడట క్రిష్. మరి ఈ చిత్రంతో కెరీర్ పరంగా ఇద్దరు సక్సెస్ బాట పడతారో లేదో చూడాలి. -
కన్నతల్లి.. నేలతల్లి ఒకటే తనకీ.. రైతు పాట విన్నారా?
గేయరచయిత వేణు గుడిపెల్లి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘యువరైతు’. ఆర్పీఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాగుల ప్రసాదరావు నిర్మించాడు. ప్రభాకర్ దమ్ముగారి సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తన ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థలో మధుర ఆడియో ద్వారా విడుదల చేసారు. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ... రైతుకి కన్నతల్లి.. నేల తల్లి ఇద్దరూ ఒక్కటే అని... కష్టమైనా నష్టమైనా విడువడు ఎన్నటికి అని.. వ్యవసాయాన్ని, సాయాన్ని సరికొత్తగా అభివర్ణించారని మెచ్చుకున్నారు. అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చిన ప్రభాకర్ దమ్ముగారిని, సాహిత్యాన్ని అందించిన దర్శకుడు వేణు గుడిపెల్లి గారిని ప్రత్యేకంగా అభినందించారు. వ్యవసాయ పట్టభద్రుడి అందమైన హృద్యమైన ప్రేమ కథ ఇదని దర్శకుడు వేణు గుడిపెల్లి వివరించారు. భూమిని నమ్ముకున్న నాన్న చనిపోయాక.. అదే భూమిని నమ్మిన కొడుకు ఏం చేశాడు? అనేదే సినిమా కథ అని చెప్పారు. ప్రస్తుత సమాజంలో రైతు విలువని గుర్తు చేసే చిత్రమిదన్నారు. నిర్మాత రాగుల ప్రసాద్ రావు మాట్లాడుతూ... ఈ సినిమా ప్రతీ రైతుదే కాదు, అన్నం విలువ తెలిసిన ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్నారు. సంగీత దర్శకుడు ప్రభాకర్ దమ్ముగారి మాట్లాడుతూ... "ఇందులో ఉన్న భావోద్వేగాలు అద్భుతమని, ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్ళే సినిమా" అని తెలిపారు. చదవండి: ప్రశాంత్ను కారు దిగనివ్వని పోలీసులు.. రైతుబిడ్డను అన్నా.. ఇట్ల చేస్తే ఎలా? -
క్రైమ్ థ్రిల్లర్గా వస్తోన్న ద్రోహి.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!
సందీప్ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ద్రోహి’. ది క్రిమినల్ అన్నది ఉపశీర్షిక. గుడ్ ఫెల్లోస్ మీడియా ప్రొడక్షన్స్, సఫైరస్ మీడియా, వెడ్నెస్డే ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి విజయ్ పెందుర్తి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి, విజయ్ పెందుర్తి, రాజ శేఖర్ అర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ.. 'సినిమాకు సంబంధించిన లుక్, గ్లింప్స్ చూశా. చాలా బాగుంది. ఈ సినిమాకు చక్కని విజయాన్ని సాధించి సినిమాకు పని చేసిన నటీనటులు, సాంకేతికి నిపుణులు అందరూ మంచి పేరు రావాలి. ఈ సినిమా టీమ్ అందరికీ శుభాకాంక్షలు' అని అన్నారు. దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. 'చక్కని థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు చిత్రంలో ఉంటాయి. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాక ఈ నెలలో సినిమాను విడుదల చేస్తాం' అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో సందీప్ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ, డెబి, షకలక శంకర్, నిరోజ్, శివ, మహేష్ విట్ట, మెహ్బూబ్, చాందినీ గొల్లపూడి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ప్రభాస్-అనుష్క ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
ప్రభాస్- అనుష్క టాలీవుడ్ సినీ హిస్టరీలో వారిది హిట్ పెయిర్ అనే చెప్పవచ్చు. మిర్చి,బిల్లా,బాహుబలి సీరిస్లతో మెప్పించిన ఈ జోడి తెలుగు ప్రేక్షలపై చెరగని ముద్ర వేసింది. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా నుంచి హాలీవుడ్ రేంజ్కు చేరుకున్నాడు. అనుష్క మాత్రం జీరో సైజ్ సినిమా దెబ్బతో ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయి. తాజాగా అనుష్క.. నవీన్ పొలిశెట్టితో ఓ సినిమాలో నటిస్తుంది. త్వరలో ఆ సినిమా కూడా విడుదల కానుంది. ఈ సినిమాతో సినీ కెరీయర్కు ఫుల్స్టాప్ పెడుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే మరోక అదిరిపోయే వార్త ఒకటి ఇండస్ట్రీలో నడుస్తోంది. (ఇదీ చదవండి: ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’మూవీ రివ్యూ) ప్రభాస్- అనుష్క కాంబోలో ఒక సినిమా రాబోతున్నుట్లు చాలా రోజుల నుంచి జరుగుతున్న ప్రచారమే మళ్లీ జోరందుకుంది. కానీ ఈసారి కొంచెం బలంగానే ఈ టాపిక్ వైరల్ అవుతుంది. ఎందుకంటే అనుష్క సినిమాలకు గుడ్బై చెప్పాలనుకుందట. ఇదే విషయాన్ని తెలుసుకున్న డైరెక్టర్ మారుతి.. ప్రభాస్తో తను తెరకెక్కిస్తున్న సినిమాలో నటించాలని అనుష్కను కోరారట. అందులో ఆమెను హీరోయిన్గా కాకుండా సినిమాకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న పాత్ర కోసం మారుతి అడిగారట. అందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కానీ అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు. కల్కి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చే సినిమా మారుతీదే కావడం విశేషం. (ఇదీ చదవండి: ఇంట్లో వాళ్లను కాదని యంగ్ డైరెక్టర్తో డేర్ చేస్తున్న నిహారిక ) ఇదిలా ఉంటే.. అనుష్క- ప్రభాస్ కాంబోలో మరో పిరియాడికల్ సినిమా తీసేందుకు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఓ కథను రెడీ చేశారట. ఇదే స్టోరీని బాహుబలి నిర్మాతలైన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలకు కూడా ఆయన కథను వినిపించారట. వారికి స్టోరీ నచ్చడంతో ఈ ప్రాజెక్టు నిర్మించడానికి ముందుకొచ్చినట్టుగా బలమైన ప్రచారం జరుగుతుంది. అటు ప్రభాస్ నుంచి కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మళ్లీ ప్రభాస్- అనుష్క జంటను బిగ్ స్క్రీన్పై వారిద్దరి ఫ్యాన్స్ చూడవచ్చు. ఒక విధంగా ప్రభాస్,అనుష్క ఫ్యాన్స్కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. -
‘హరి హర వీరమల్లు’లో బాలీవుడ్ స్టార్.. స్పెషల్ వీడియో వైరల్
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పవన్ లుక్కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సెట్లో మరో స్టార్ హీరో అడుగుపెట్టాడు. ప్రముఖ హిందీ నటుడు బాబీ డియోల్ నేడు ఈ చారిత్రాత్మక చిత్ర బృందంలో అధికారికంగా చేరారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తున్న ఆయన.. చిత్రీకరణలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చారు. కీలకమైన ఈ షెడ్యూల్ కోసం ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి 17వ శతాబ్దానికి చెందిన భారీ దర్బార్ సెట్ ను రూపొందించారు. పవన్ కళ్యాణ్, బాబీ డియోల్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను ఈ దర్బార్ సెట్ లో చిత్రీకరించనున్నారు. బాబీ డియోల్ కి ఘన స్వాగతం పలుకుతూ హరి హర వీర మల్లు బృందం ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. అందులో ఆయన లుక్ ఆకట్టుకుంటోంది. -
ఫ్యాన్స్కు పండగే..'హరిహర వీరమల్లు' నుంచి పవర్ గ్లాన్స్ వచ్చేసింది..
పవర్స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా నటిస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ ఫిక్షన్ ఫిల్మ్గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. నేడు(శుక్రవారం)పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి పవర్ గ్లాన్స్ను శుక్రవారం ఉదయం విడుదల చేసింది. చదవండి: పవన్ కళ్యాణ్ బర్త్డే.. ఫ్యాన్స్కు అదిరిపోయే ట్రీట్ మెడల్ని వంచి కథల్ని మార్చి కొలిక్కితెచ్చే పెట్టుకొని తొడకొట్టాడో .. తెలుగోడు అనే పాటతో పవన్ ఫైట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక భీమ్లా నాయక్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్పై లెజండరీ ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుందిఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం,కననడం, మలయళం,హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. చదవండి: థియేటర్పై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రాళ్లదాడి.. అద్దాలు ధ్వంసం -
పవన్ కళ్యాణ్ బర్త్డే.. ఫ్యాన్స్కు అదిరిపోయే ట్రీట్
పవర్స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజాచిత్రం 'హరిహర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్పై లెజండరీ ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. రేపు(శుక్రవారం)పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ పోస్టర్ను రిలీజ్ చేసింది మూవీ టీం. 'స్వాగతిస్తుంది సమరపథం.. దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం' అనే క్యాప్షన్తో దర్శకుడు క్రిష్ ఈ పోస్టర్ను షేర్ చేశాడు. అంతేకాకుండా రేపు సాయంత్రం 5.45గంటలకు పవర్ గ్లాన్స్ పేరుతో ఓ పవర్ ఫుల్ వీడియో ను విడుదల చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది. -
వేశ్య పాత్రలో యాంకర్ అనసూయ..!
Anasuya As Prostitute In Kanyasulkam Web Series: బుల్లితెర బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అటు యాంకరింగ్తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో అలరిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటుంది. 'రంగస్థలం'లో 'రంగమ్మత్త'గా నటించి ప్రశంసలు దక్కించుకుంది. ఇటీవల ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్'లో దాక్షాయణిగా చేసి మరింత పేరు తెచ్చుకుంది. ఇప్పుడు చిరంజీవి 'గాడ్ ఫాదర్' చిత్రంలో మరో ప్రత్యేకమైన రోల్లో ఆకట్టుకునేందుకు రెడీగా ఉంది. తాజాగా మరో క్రేజీ పాత్రలో అనసూయ నటించనున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. గురజాడ అప్పారావు రచించిన క్లాసిక్ నాటకం కన్యాశుల్కం ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కథతో స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఒక వెబ్సిరీస్ను రూపొందించనున్నాడట. ఈ వెబ్ సిరీస్కు ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇస్తూ కథ-కథనం స్క్రిప్ట్ బాధ్యతలన్నీ క్రిష్ చూసుకోనున్నాడని తెలుస్తోంది. ఈ సిరీస్లో మధురవాణి అనే వేశ్య పాత్రలో అనసూయ నటించనున్నట్లు సమాచారం. ఈ రోల్లో నటించేందుకు అనసూయ సైతం ఓకే చెప్పిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కన్యాశుల్కం నాటకంలో మధురవాణి పాత్రకు ఎంత పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్లో అనసూయ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. చదవండి: బాధాకరమైన పెళ్లిళ్లకు మీరే కారణం.. సమంత కామెంట్స్ వైరల్ అందుకు నాకు అర్హత లేదు: మహేశ్ బాబు -
డైరెక్టర్ క్రిష్ వదిలిన 'టాక్సీ'.. ఆసక్తిగా ట్రైలర్
Director Krish Launched Taxi Movie Trailer: 'కర్త కర్మ క్రియ' సినిమాతో తెలుగు హీరోగా పరిచయం అయ్యాడు వసంత్ సమీర్ పిన్నమరాజు. వసంత్ హీరోగా హెచ్ అండ్ హెచ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై హరిత సజ్జా నిర్మిస్తున్న థ్రిల్లర్ చిత్రం 'టాక్సీ'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద డైరెక్షన్ విభాగంలో పనిచేసిన హరీశ్ సజ్జా ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అల్మాస్ మోటీవాల, సూర్య శ్రీనివాస్, సౌమ్యా మీనన్, ప్రవీణ్ యండమూరి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మార్క్ రాబిన్ సంగీతం అందించిన ఈ సినిమాకు బిక్కీ విజయ్ కుమార్ నిర్మాత. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ ప్రచార చిత్రాన్ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. 1 నిమిషం 59 సెకన్ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంత ఇంటెన్స్గా ఆకట్టుకుంది. కాలిఫోర్నియమ్ 252 అనే అరుదైన హ్యూమన్ మేడ్ మెటల్ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉన్నట్లు తెలుస్తోంది. డైలాగ్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. చదవండి: ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ? -
సాప్ట్వేర్ బ్లూస్ అంటే లక్షల్లో శాలరీలు, అమ్మాయిలు, పబ్బులు కాదు
శ్రీరాం, భావన, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కేయస్ రాజు, బస్వరాజ్ ముఖ్య తారలుగా ఉమా శంకర్ దర్శకత్వంలో సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘సాఫ్ట్వేర్ బ్లూస్’. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా రిలీజ్ ట్రైలర్ను ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. ‘‘సాప్ట్వేర్ బ్లూస్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు లక్షలలో శాలరీలు, అమ్మాయిలు... పబ్బులు కాదు ..’ అనే డైలాగ్తో ఉన్న ఈ ట్రైలర్ చాలా హిలేరియస్గా ఉంది. సాఫ్ట్వేర్ జాబ్లో జరిగే చిన్న చిన్న గమ్మత్తులు, వారి జీవితాల గురించి ఉమాశంకర్ తెరకెక్కించిన ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు క్రిష్. ‘‘సాఫ్ట్వేర్ బ్యాక్డ్రాప్లో అవుట్ అండ్ అవుట్ కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా మా సినిమా ఉంటుంది’’ అన్నారు సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ వీకే రాజు. చదవండి: తన సినిమాకు తనే పాట రాసిన డైరెక్టర్.. అదిరిపోయిందిగా! -
ముగ్గురు ఖైదీలు, మూడు దొంగతనాలు.. '9 అవర్స్' రివ్యూ
టైటిల్: 9 అవర్స్ (వెబ్ సిరీస్) నటీనటులు: తారక రత్న, మధుశాలిని, అజయ్, రవిప్రకాశ్, వినోద్ కుమార్, బెనర్జీ, సమీర్ తదితరులు మూల కథ: మల్లాది కృష్ణమూర్తి 'తొమ్మిది గంటలు' నవల సమర్పణ, స్క్రీన్ప్లే: క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం: నిరంజన్ కౌషిక్, జాకబ్ వర్గీస్ సంగీతం: శక్తికాంత్ కార్తీక్ సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి విడుదల తేది: జూన్ 2, 2022 (డిస్లీ ప్లస్ హాట్స్టార్) ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన 'తొమ్మిది గంటలు' నవల ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ '9 అవర్స్'. ఈ వెబ్ సిరీస్కు క్రిష్ స్క్రీన్ప్లే అందించగా, నిరంజన్ కౌషిక్, జాకబ్ వర్గీస్ దర్శకత్వం వహించారు. చాలా గ్యాప్ తర్వాత తారక రత్న ఈ వెబ్ సిరీస్తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చాడు. డిస్నీ ప్లస్ హాట్స్టార్ స్పెషల్స్గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ను క్రిష్ తండ్రి జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మించారు. హాట్స్టార్లో జూన్ 2 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ '9 అవర్స్' వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. కథ: ఈ వెబ్ సిరీస్ కథ 1985 కాలంలో జరుగుతుంది. ముగ్గురు చొప్పున తొమ్మిది మంది మూడు బ్యాంక్లను దొంగతనం చేసేందుకు వెళ్తారు. ఈ మూడు దొంగతనాలకు రాజమండ్రి సెంట్రల్ జైలులోని ముగ్గురు ఖైదీలు ఒక్కో బ్రాంచ్కు ప్రాతినిధ్యం వహిస్తారు. అయితే వాటిలో రెండు దొంగతనాలు విజయవంతగా పూర్తి చేస్తారు. కానీ కోఠి బ్రాంచ్లో రాబరీ జరుగుతున్నట్లు పోలీసులకు తెలియడంతో దొంగలు చిక్కుల్లో పడతారు. మరీ ఆ దొంగలు పోలీసుల నుంచి ఎలా బయటపడ్డారు ? బంధీలుగా ఉన్న బ్యాంక్ ఉద్యోగులు, కస్టమర్లు తప్పించుకోడానికి ఏం చేశారు ? ఈ దొంగతనాల వెనుక అసలు ఎవరున్నారు ? అనేది తెలియాలంటే కచ్చితంగా ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: 1985లో జరుగుతున్న దొంగతనం బ్యాక్డ్రాప్కు తగినట్లుగా సినిమాటోగ్రఫీ బాగుంది. ఒకేసారి మూడు చోట్ల మూడు దొంగతనాలు జరగడం అనే అంశం ఆసక్తిగా ఉంటుంది. జైలు నుంచి వెళ్లిన ఖైదీలు 9 గంటల్లో మూడు రాబరీలు చేసుకుని మళ్లీ జైలుకు రావాలి. అయితే ఈ 9 గంటలను 9 ఎపిసోడ్స్గా మలిచారు. ఒకేసారి మూడు రాబరీలు చేయాలన్న కాన్సెప్ట్ బాగున్నా సిరీస్ ప్రారంభం ఎపిసోడ్స్ కొంచెం బోరింగ్గా ఉంటాయి. బ్యాంకు ఉద్యోగులు, దొంగతనానికి వచ్చిన వారి జీవిత కథలు ఒక్కో ఎపిసోడ్లో చూపించారు. అవి అక్కడక్కడ సాగదీతగా అనిపిస్తాయి. భర్త చనిపోతే వితంతు పరిస్థితి ఎలా ఉంటుంది ? భార్యభర్తల బంధం తదితర అంశాలను ఆకట్టుకునేలా చూపించారు. అప్పడప్పుడు వచ్చే ట్విస్ట్లు చాలా ఆకట్టుకుంటాయి. బంధీలుగా ఉన్న ఉద్యోగులు బయటపడే మార్గాలు, పోలీసుల అంచనాలను పటాపంచలు చేసే దొంగల తెలివి చాలా బాగా చూపించారు. ఈ సీన్లు బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్గా సాగుతున్న కథనంలో అక్కడక్కడా వచ్చే కామెడీ సీన్లు కావాలని జొప్పించినట్లే ఉంటాయి. సిరీస్లో అనేక అంశాలను టచ్ చేశారు. అందుకే కథనం చాలా స్లోగా అనిపిస్తుంది. అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. టైటిల్ 9 అవర్స్ కాబట్టి ఎపిసోడ్లను కూడా 9గా చేశారు. అదే మైనస్ అయింది. అలా కాకుండా 5 ఎపిసోడ్స్లో సిరీస్ ముగిస్తే సూపర్ థ్రిల్లింగ్గా ఉండేది. ఎవరెలా చేశారంటే? చాలా కాలం తర్వాత తారక రత్నకు మంచి పాత్రే దొరికందని చెప్పవచ్చు. కానీ ఆ పాత్ర హైలెట్గా నిలిచే సన్నివేశాలు ఎక్కడా లేవు. జర్నలిస్ట్గా మధుశాలిని పాత్ర కూడా అంతంతమాత్రమే. కానీ రాబరీలో బంధీలుగా ఉన్న పాత్రధారులు ఆకట్టుకున్నారు. దొంగతనంలో కూడా తన కామవాంఛ తీర్చుకునే సహోద్యోగి పాత్రలో గిరిధర్ మెప్పించాడు. అజయ్, వినోద్ కుమార్, బెనర్జీ, ప్రీతి అస్రానీ, సమీర్, అంకిత్ కొయ్య, రవివర్మ, జ్వాల కోటి, రవిప్రకాష్ వారి నటనతో బాగానే ఆకట్టుకున్నారు. ఒక్కొక్క అంశాన్ని, జీవిత కథలను చెప్పే కథనం స్లోగా సాగిన మలుపులు, రాబరీ ప్లానింగ్ ఆశ్చర్యపరుస్తాయి. ఓపికతో చూస్తే మంచి డీసెంట్ వెబ్ సిరీస్ ఇది. అయితే ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నారు అనే తదితర విషయాలపై ముగింపు ఇవ్వలేదు. దీన్ని బట్టి చూస్తే ఈ సిరీస్కు సెకండ్ సీజన్ రానున్నట్లు తెలుస్తోంది. -
క్రిష్ చేతుల మీదుగా ‘రణస్థలి’ ఫస్ట్లుక్
మాటల రచయిత పరుశురాం శ్రీనావాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రణస్థలి. ఏజే ప్రొడక్షన్ పతాకంపై సురెడ్డి విష్ణు నిర్మిస్తున్నారు. ఇందులో ధర్మ, ప్రశాంత్, శివజామి, నాగేంద్ర, విజయ్ రాగం తదీతరులు నటిస్తున్నారు. యాక్షన్ సినిమా రూపొందిన ఈ మూవీ ఇటీవల షూటింగ్ను పూర్తి చేసుకుని ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఫస్ట్లుక్ను విడుదల చేశారు మేకర్స్. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి చేతుల మీదు రణస్థలి ఫస్ట్లుక్ను రిలీజ్ చేశారు. అనంతరం క్రిష్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా టీజర్ను చూశాను. అద్భుతంగా ఉంది. పరశురాం శ్రీనివాస్ యాక్షన్ సీన్స్ తెరకెక్కించిన విధానం చాలా బాగుతుంది. చిన్న సినిమాలో ఈ ఇలాంటి యాక్షన్ సీన్స్ చేయడమంటే మామూలు విషయం కాదు. ఇక డైలాగ్స్ అయితే కేజీయఫ్ సినిమాను గుర్తు చేస్తున్నాయి. ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా’ అని అన్నారు. అలాగే నిర్మాత సురెడ్డి విష్ణు మాట్లాడుతూ.. డిఫరెంట్ కాన్సెప్ట్లో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని, ఖచ్చితంగా రణస్థలి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి అందిస్తుందని ఆశిస్తున్నా అన్నారు. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదిరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక త్వరలోనే మూవీ ట్రైలర్, టీజర్ విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
'హరిహర వీరమల్లు' నుంచి కొత్త పోస్టర్ రిలీజ్
పవర్స్టార్ పవన్ కల్యాణ్ క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. నేడు(ఆదివారం) శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం నుంచి పోస్టర్ను రిలీజ్ చేశారు. అగ్రెసివ్ లుక్లో కనిపిస్తున్న పవన్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏఎమ్ రత్నం, దయాకర్ రావు నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్కు జోడిగా నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రిలు కథానాయికలుగా నటిస్తున్నారు. ఇక శ్రీరామ నవమి సందర్భంగా “హరి హర వీర మల్లు” సెట్స్ లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు చిత్రబృందం. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. Let’s celebrate the symbol of chivalry & virtue on this auspicious day of #SriRamaNavami by adherence to truth and Dharma 🏹 - Team #HariHaraVeeraMallu @PawanKalyan @DirKrish @AgerwalNidhhi @mmkeeravaani @AMRathnamOfl @ADayakarRao2 @gnanashekarvs @saimadhav_burra #ThotaTharani pic.twitter.com/8jV4BvzGJm — Mega Surya Production (@MegaSuryaProd) April 10, 2022 -
హరిహర వీరమల్లు పునఃప్రారంభం !.. స్క్రిప్ట్ పనులపై చర్చ
Pawan Kalyan Hari Hara Veera Mallu Restart With Action Sequence: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం 'హరిహర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ వజ్రాల దొంగ పాత్రలో కనిపించనున్నట్లు టాక్. 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ కరోనా వేవ్స్ కారణంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ను తిరిగి ప్రారంభించనున్నట్లు సమాచారం. 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని భారీ యాక్షన్ సీన్లతో పుఃనప్రారంభించనున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ సీక్వెన్స్కు సంబంధించిన స్క్రిప్ట్ పనులను పవన్ కల్యాణ్తో చర్చిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత ఏంఎం రత్నం నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఔరంగజేబు పాత్రలో అర్జున్ రాంపాల్, బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కనువిందు చేయనున్నట్లు సమాచారం. -
పవర్ స్టార్ సినిమా నుంచి జాక్వెలిన్ ఔట్.. హాట్ బ్యూటీకి ఛాన్స్ !
Director Krish Clarifies About Cast Change In Pawan Kalyan Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా 'హరి హర వీర మల్లు'. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ పాత్రకు మొదటగా శ్రీలంక ముద్దుగుమ్మ, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ను ఎంపిక చేశారు. ఇటీవల ఓ కేసులో జాక్వెలిన్కు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో జాక్వలెన్ సమస్యల్లో చిక్కుకుంది. దేశం విడిచి వెళ్లకుండా కూడా ఈడీ ఆదేశాలు ఇచ్చింది. అయితే అందుకే జాక్వెలిన్ను పవన్ సినిమా నుంచి తొలగించినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ పుకార్లపై దర్శకుడు క్రిష్ జాగర్లమూడి స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. 'డేట్స్ ఇష్యూ వల్లే జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మా సినిమా చేయలేకపోయింది. డేట్స్ అడ్జస్ట్ చేయడం ఆమెకు కష్టమైంది. అందుకే గతేడాదే ఆమె సినిమా నుంచి తప్పుకుంది. జాక్వెలిన్ స్థానంలో మేం నర్గిస్ ఫక్రిని ఎంపిక చేశాం. జాక్వెలిన్ ఇప్పుడు వార్తల్లో నిలిచేసరికి అనవసరంగా మా సినిమా ప్రస్తావన తీసుకొస్తున్నారు.' అని క్రిష్ తెలిపారు. పవన్ నటిస్తున్న హరి హర వీర మల్లు చిత్రంలో మొఘల్ సామ్రాజ్యానికి చెందిన రోషనార పాత్రలో నర్గిస్ ఫక్రి కనిపించనుంది. ఆమె లుక్ చాలా అందంగా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో 17వ శతాబ్దపు కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి విధితమే. ఇందులో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. ఏఎమ్ రత్నం సినిమాను నిర్మిస్తున్నారు. -
‘హరిహర వీరమల్లు’లో అకీరా?, తండ్రితో కలిసి పలు సీన్స్లో సందడి..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ సినిమాల్లోకి రాకముందే అతడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అకీరా బర్త్ డే రోజున మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ జరుపుతారనే సంగతి తెలిసిందే. అయితే అకీరా టాలీవుడ్ ఎంట్రీ కొంతకాలంగా ఆసక్తిగా మారింది. ఇప్పటికే మారాఠిలో ఓ చిత్రం చేసిన అకీరా వెంటనే తెలుగులో ఓ మూవీ చేయబోతున్నాడని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే అకీరా సినిమా, తెలుగు వెండితెర ఎంట్రీపై ఇప్పటికీ క్లారిటీ లేదు. చదవండి: విజయ్పై ఆనంద్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో మెగా అభిమానులంత పండగ చేసుకునే ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతోంది. అదేంటంటే అకీరా టాలీవుడ్ ఎంట్రీ ఖాయమైందని, తన తండ్రి పవన్ సినిమాతోనే తెలుగు తెరపై సందడి చేయబోతున్నాండంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాగా పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న హరిహర వీరమల్లు షూటింగ్తో బిజీగా ఉన్నాడు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై అగ్ర నిర్మాత ఏఎంరత్నం భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. చదవండి: కూకట్పల్లి కోర్టులో సమంతకు ఊరట ఈ సినిమాలో అకీరా ప్రధాన పాత్రలో కనిపించనున్నాడని టాక్. కాగా ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తైన ఈ సినిమా కొత్త షెడ్యూల్ త్వరలో ప్రారంభమం కాబోతోంది. అయితే, ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం అకీరా నందన్ను తీసుకుంటున్నట్టుగా సమాచారం. తండ్రి పవన్తో పాటు అకీరా కలిసి పలు సీన్లలో అలరించనున్నాడట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ మూవీలో నిధీ అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెస్ హీరోయిన్స్ కాగా.. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. -
‘కొండపొలం’ మూవీని మొదట సుకుమార్ తీయాలనుకున్నాడట!, కానీ..
డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘కొండ పొలం’. నిన్న(శుక్రవారం) విడుదలైన ఈ మూవీ మంచి టాక్ను తెచ్చుకుంది. ఇందులో వైష్ణవ్ తేజ్- రకుల్ ప్రీత్ సింగ్లు హీరోహీరోయిన్లు నటించారు. కొండపొలం అనే నవల ఆధారంగా ఈ సినిమాను క్రిష్ అడవి నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించిన కొండపొలం కథాకథనాలతో పాటు సంగీతం కూడా ప్రధానమైన బలంగా నిలిచింది. అయితే మొదట ఈ ‘కొండ పొలం’ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తీయాలని అనుకున్నట్లు వినికిడి. ఎందుకంటే ఖాళీ దొరికితే పుస్తకాలు చదివే సుక్కు అలా ఒకసారి కొండపొలం నవల చదివాడట. దీంతో ఈ కథ ఆధారంగా ప్రయోగాత్మక చిత్రం రూపొందించాలని అప్పుడే అనుకున్నాడని సమాచారం. అయితే అప్పటికే తాను ‘పుష్ప’ మూవీ స్క్రిప్ట్ను సిద్దం చేయడంతో దానిపైనే ఆసక్తి పెట్టాడట. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న పుష్పను రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఫుల్ బిజీ ఆయిన సుక్కు ఇక కొండపొలంను పక్కన పెట్టినట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. అంతేగాక ‘పుష్ప’ మూవీ కూడా ఆటవి నేపథ్యంలో ఉండటంతో రెండు సినిమాలు ఒకే నేపథ్యంలోనివి అవుతాయని భావించి కొండపొలం తీయాలనే నిర్ణయాన్ని విరమించుకున్నాడట సుకుమార్. ఇదిలా ఉంటే ఈ సినిమా తీయడానికి కారణం సుకుమార్, హరీశ్ శంకర్ అని ఓ ఇంటర్వ్యూలో క్రిష్ చెప్పిన సంగతి తెలిసిందే. సుకుమార్ ఓ సందర్భంగా కొండపొలం నవలను తన దృష్టికి తీసుకువచ్చినట్లు క్రిష్ తెలిపాడు. ఇది తెలిసి నెటిజన్లు క్రియోటివ్గా ఆలోచిస్తూ కథతో ప్రయోగాలు చేసే సుక్కు కొండపొలం తీసి ఉంటే ఎలా ఉండేదో అని, మిస్ అయ్యాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
‘కొండపొలం’ మూవీపై చిరంజీవి రివ్యూ
‘ఉప్పెన’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రెండో చిత్రం ‘కొండపొలం’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఒక్క రోజు ముందే అంటే గురువారం ఈ సినిమాను చూసిన మెగాస్టార్ చిరంజీవి, అందరికి కంటే ముందే రివ్యూ ఇచ్చేశారు. సినిమా వీక్షించిన తర్వాత చిరంజీవి మాట్లాడుతూ.. అందమైన ప్రేమ కథతో అద్భుతమైన సందేశం ఇచ్చారని ప్రశంసించారు. ‘సాధారణంగా క్రిష్ సినిమాలంటే డిఫరెంట్ జోనర్ మూవీస్ అని అనుకుంటాం. ఈ సినిమాకు చూసిన వారు థ్రిల్కు లోనవుతారనే మాట వాస్తవం. నేనైతే కొండపొలంకు సంబంధించిన పుస్తకం ఏదీ చదవలేదు. వైష్ణవ్ ఓరోజు నా దగ్గరకు వచ్చి ‘మామా.. క్రిష్గారి దర్శకత్వంలో ‘కొండపొలం’ అనే సినిమా చేస్తున్నాను’ అనగానే.. నేను ‘వెంటనే సినిమా చెయ్. ఎందుకంటే క్రిష్ డైరెక్షన్ అంటేనే వెరైటీ ఆఫ్ మూవీ చేసే అవకాశం దొరుకుతుంది. మంచి పెర్ఫామెన్స్కు స్కోప్ ఉంటుంది. సినిమాలో మంచి ఎమోషన్కు ఛాన్స్ ఉంటుంది అన్నాను. నేనెదైతే అన్నానో.. వైష్ణవ్ తేజ్ నటన కానీ, క్యారెక్టరైజేషన్ కానీ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. క్రిష్ సినిమాలను నేను ముందు నుంచి చూస్తూ వస్తున్నాను. ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం ఉండదు. ‘కొండపొలం’ విషయానికి వస్తే, గత చిత్రాల కంటే విభిన్నంగా ఉంది. చక్కటి రస్టిక్ లవ్స్టోరి. ఈ ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో చెప్పిన కథాంశం. మంచి మెసేజ్తో కూడిన లవ్స్టోరి. ఆర్టిస్టుల విషయానికి వస్తే వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ నటనను బాగా ఎంజాయ్ చేశాను. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆహ్వానించాలి, ఆదరించాలి. ‘కొండపొలం’ మూవీ తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. క్రిష్కు, నిర్మాతలకు, వైష్ణవ్, ఇతరులకు ఆల్ ది బెస్ట్’ అని చిరంజీవి అన్నారు. -
ప్రతి తెలుగువాడు గర్వపడే సినిమా ఇది: డైరెక్టర్ క్రిష్
‘‘కొండపొలం’ ఫైనల్ కాపీ చూసినప్పుడు ‘ఇదీ సినిమా అంటే’ అనిపించింది. ప్రతి తెలుగువాడు గర్వపడే సినిమా ఇది. ప్రేక్షకులు కూడా ఇదే మాట అంటారు’’ అని డైరెక్టర్ క్రిష్ అన్నారు. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్సింగ్ జంటగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. బిబో శ్రీనివాస్ సమర్పణలో వై. రాజీవ్రెడ్డి, జె. సాయిబాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో క్రిష్ మాట్లాడుతూ..‘‘కీరవాణిగారు మా సినిమాకి ఓ గైడ్లా పని చేశారు. ‘కొండపొలం’ హిట్ అనేది నాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు సినిమాకి చాలా అవసరం. ఇప్పుడున్న థియేటర్లకి, మా మనుగడకు అవసరం. చాలా గొప్ప సినిమా, చాలా జాగ్రత్తగా తీశానని బలంగా నమ్మాను.. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు’’ అన్నారు. వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ...‘‘నా మొదటి చాప్టర్ ‘ఉప్పెన’ అయితే రెండో చాప్టర్ ‘కొండపొలం’. ఈ చిత్రంతో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. క్రిష్, రాజీవ్, జ్ఞానశేఖర్గార్లకు మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఈ సినిమా షూటింగ్లో సాంకేతిక నిపుణులు, ప్రొడక్షన్ వాళ్లు చాలా కష్టపడ్డారు.. వారందరి కష్టమే ఈ ‘కొండపొలం’. జీవితంలో ఎన్నిసార్లు కింద పడ్డా లేవాలనే ఒక స్ఫూర్తిని మా సినిమా కలిగిస్తుంది. రవీంద్ర అనే ఓ మంచి పాత్రను నాకు ఇచ్చినందుకు క్రిష్గారికి థ్యాంక్స్’’ అన్నారు. రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘వరుణ్ తేజ్ రెండో సినిమా ‘కంచె’, వైష్ణవ్ తేజ్ రెండో చిత్రం ‘కొండపొలం’ మేమే నిర్మించాం. ‘కొండపొలం’తో వైష్ణవ్ స్టార్ అవుతాడు. రకుల్ ఎంతో అంకితభావంతో ఓబులమ్మ పాత్రకు న్యాయం చేసినందుకు థ్యాంక్స్. క్రిష్కి గ్రేట్ ఫిల్మ్ ఇది’’ అన్నారు. రచయిత సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘కొన్ని జీవితాలను చూసి నేను రాసిన పాత్రలకు క్రిష్గారు తెరపై జీవం పోసి, సినిమాగా తీశారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నాను’’ అన్నారు. ఈ వేడుకలో కెమెరామ్యాన్ జ్ఞానశేఖర్, దర్శకులు హరీష్ శంకర్, బుచ్చిబాబు, లక్ష్మీకాంత్ చెన్నా, పాటల రచయిత చంద్రబోస్, నటి హేమ, ‘మ్యాంగో మీడియా’ రామ్, నటులు సాయిచంద్, రవి, మహేశ్ విట్టా తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రేపు కర్నూల్లో ‘కొండపొలం’ ఆడియో ఫంక్షన్
మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘కొండపొలం’. ఇందులో రకుల్ హీరోయిన్గా నటిస్తోంది. ఎమ్ఎమ్ కిరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ రోజు విడుదలైన ఈ మూవీలో సెకండ్ సాంగ్కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ‘కొండపొలం’ ఆడియో రిలీజ్ ఈవెంట్ రేపు కర్నూల్లో జరగనుందని తాజాగా మేకర్స్ ప్రకటించారు. కర్నూల్లోని సంతోష్ నగర్ కాలనీలోని కన్వెన్షన్ హాల్లో సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. కాగా అక్టోబర్ 8న ఈ మూవీ థియేటర్లో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. #KondaPolam Audio Release Event on 2nd Oct 5PM onwards in KURNOOL 🔥 An @mmkeeravaani Musical🎶 Roaring in Theatres from Oct 8th 💥🐅#KondaPolamOct8 #PanjaVaisshnavTej @RakulPreet @Gnanashekarvs @YRajeevReddy1 #JSaiBabu @FirstFrame_ent @MangoMusicLabel pic.twitter.com/iHFF36AGwp — Krish Jagarlamudi (@DirKrish) October 1, 2021 -
కొండపొలం నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదల
Shwaasalo Lyrical Video From Kondapolam: వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘కొండపొలం’. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అక్టోబర్8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఓ..ఓ ఓబులమ్మా సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో పాటని విడుదల చేశారు. ‘శ్వాసలో.. హద్దుల్ని దాటాలన్న ఆశ. ఆశలో.. పొద్దుల్ని మరిచే హాయి మోశా’అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ను చిత్ర బృందం విడుదల చేసింది. కీరవాణి సంగీతం అందించినీ పాటను యామిని ఘంటసాల, పీవీఎస్ఎన్ రోహిత్ ఆలపించారు. ఈ పాటలో వైష్ణవ్, రకుల్ మధ్య కెమిస్ట్రీని ఆసక్తికరంగా చూపించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. -
వైష్ణవ్ తేజ్ ‘కొండ పొలం’ మూవీ స్టిల్స్
-
ఆకట్టుకుంటున్న ‘కొండపొలం’ ట్రైలర్, వైష్ణవ్ను ఆటపట్టిస్తున్న రకుల్..
Vaishnav Tej Kondapolam Trailer Out: మెగా హీరో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్లు జంటగా నటిస్తున్న చిత్రం ‘కొండపొలం’. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్లుక్, టీజర్, లిరికల్ సాంగ్కు విశేష స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ‘కొండపొలం’ ట్రైలర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది. Embark on the Astounding Journey of #KondaPolam - "An Epic Tale of Becoming" ▶️ https://t.co/qlLNaZIJ9C#KondaPolamTrailer Out Now!#KondaPolamOct8#PanjaVaisshnavTej @Rakulpreet @mmkeeravaani @YRajeevReddy1 #JSaiBabu @FirstFrame_ent @MangoMusicLabel — Krish Jagarlamudi (@DirKrish) September 27, 2021 ట్రైలర్ విషయానికొస్తే.. ట్రైలర్ విషయానికొస్తే.. వైష్ణవ్, రకుల్ల జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రవీంద్ర యాదవ్గా వైష్ణవ్ కనిపించాడు. అడవి నేపథ్యం నుంచి బాగా చదువుకున్న యువకుడు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో అతడు ఎదుర్కొ అవమానాలను ట్రైలర్లో చూపించారు. ఇక రకుల్, వైష్ణవ్ మధ్య సాగే సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ‘చదువుకున్న గొర్రె చదువురాని మరో గొర్రెతో మాట్లాడటం చూశావా?’ అంటూ రకుల్.. వైష్ణవ్ ఆటపట్టిస్తూ చెప్పిన డైలాగ్ బాగా ఆకట్టుకుంటోంది. ఇక గొర్రెల కోసం వైష్ణవ్ చేసే సాహస సన్నివేశాలు ఉత్కంఠ రేపుతున్నాయి. చదవండి: హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన అడివి శేష్ వర్షంలో సైక్లింగ్ చేసిన సమంత.. వీడియో వైరల్ -
‘కొండపొలం’ ఫస్ట్ సాంగ్.. ఆకట్టుకున్న వైష్ణవ్, రకుల్ లవ్ ట్రాక్
క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్-వైష్ణవ్తేజ్ల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘కొండపొలం’. ఈ సినిమాలో వైష్ణవ్కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్లుక్, టీజర్లకు విశేషణ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఫస్ట్సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ‘ఓ..ఓ ఓబులమ్మా.. బుట్ట చెండు ఆటలో నా పూల కొమ్మా’ అంటూ సాగే ఈ పాట సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గొర్రెల కాపరిగా వైష్ణవ్ తేజ్.. రకుల్ను ఊహించుకుంటూ ఈ పాట పాడుతుంటే.. లంగావోణిలో రోలు తప్పితూ ఈ పాటలో గొంతు కలిపింది రకుల్. ఈ సాంగ్లో వైష్ణవ్-రకుల్ మధ్య కెమిస్ట్రీ బాగా పడింది. చదవండి: హీరోయిన్ రకుల్ని ఇలా ఎప్పుడైనా చూశారా? వీరి లవ్ ట్రాగ్ పాటకు అట్రాక్షన్గా నిలిచిందని చెప్పుకొవచ్చు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను గాయకులు సత్య యామిణి, పీవీఎన్ఎస్ రోహిత్లు ఆలపించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రీ, చంద్రబోస్లు పాటకు సాహిత్యం అందించారు. కొండపొలం నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన విధానం ఆధారంగా క్రిష్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: రోడ్డుపై కనువిందు చేస్తున్న ఎన్టీఆర్ లంబోర్ఘిని, చరణ్ ఫెరారీ.. -
హీరోయిన్ రకుల్ని ఇలా ఎప్పుడైనా చూశారా?
Rakul Preet Singh As Obulamma : క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్-వైష్ణవ్తేజ్ల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా కొండపొలం. ఈ సినిమాలో వైష్ణవ్కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మోషన్ పోస్టర్తో పాటు రకుల్ లుక్ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.ఇందులో రకుల్ ఓబులమ్మ అనే గ్రామీణ యువతి పాత్రలో కనిపించనుంది. కొండపాలెం నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాగా అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన విధానం ఆధారంగా క్రిష్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సింగీతం అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) చదవండి : వైరల్ : చిరంజీవి ఇంట్లో గ్రాండ్గా రాఖీ సెలబ్రేషన్స్ వైష్ణవ్ తేజ్-క్రిష్ మూవీ టైటిల్ ఇదే, ఫస్ట్లుక్ విడుదల -
వైష్ణవ్ తేజ్-క్రిష్ మూవీ టైటిల్ ఇదే..
‘ఉప్పెన’ మూవీతో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రంతోనే బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న వైష్ణవ్ రెండవ చిత్రం ప్రముఖ దర్శకుడు జాగర్లమూడితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొండపాలెం నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ టైటిల్ను ‘కొండపొలం’గా ఖారారు చేసి ఈ మేరకు శుక్రవారం ఉదయం మోషన్ పోస్టర్, ఫస్ట్లుక్ను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. గడ్డం, మాస్లుక్లో పంజా వైష్ణవ్ ఎంట్రీ ఇచ్చాడు. చదవండి: Nani Tuck Jagadish: థియేటర్ల యాజమానుల అసంతృప్తి కాగా అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన విధానం ఆధారంగా క్రిష్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. వైష్ణవ్ తేజ్కు జంటగా రకుల్ ప్రీత్సింగ్ సందడి చేయనున్నారు. ఇందులో రకుల్ ఓబులమ్మ అనే గ్రామీణ యువతి పాత్రలో కనిపించనుంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సింగీతం అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: మళ్లీ వాయిదా పడిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ! -
క్రిష్ తన భార్యతో విడిపోవడానికి ఆ హీరోయినే కారణమట!
ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఆయన భార్య రమ్యతో విడిపోయి మూడేళ్లు అవుతోంది. ఈ క్రమంలో ఆయన విడాకులకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. కాగా రమ్య అనే డాక్టర్ను 2016 అగష్టు 7న వివాహం చేసుకున్న క్రిష్ ఆ తర్వాత రెండేళ్లకే ఆమెతో విడిపోయాడు. లేటు వయసులో వివాహం చేసుకున్న ఆయన అతి తక్కువ సమయంలో భార్యతో విడిపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. దీంతో అప్పట్లో ఈ వార్త చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే క్రిష్.. భార్య రమ్యతో విడిపోవడానికి ఓ హీరోయిన్ కారణమట. ఆయన డైరెక్షన్లో నటించిన ఓ హీరోయిన్తో క్రిష్ క్లోజ్గా ఉండేవాడట, అది నచ్చని భార్య రమ్య ఆయనను పలుమార్లు హెచ్చరించినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. దీంతో ఇద్దరూ కలిసి విడిపోవాలని నిర్ణయించుకుని 2018లో కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత వీరికి కోర్టు విడాకులు మంజూరు చేయడం, విడిపోవడం చకచక జరిగిపోయింది. అయితే క్రిష్తో చనువుగా ఉన్న ఆ హీరోయిన్ ఎవరూ, ఏ మూవీ డైరెక్షన్ సమయంలో ఇలా జరింగిందనేది ఇప్పటికి స్పష్టత లేదు. కాగా ప్రస్తుతం క్రిష్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్తో ‘హరిహర వీరమల్లు’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: పోరాటానికి ‘వీరమల్లు’ కసరత్తు, ఫొటోలు వైరల్ -
పోరాటానికి ‘వీరమల్లు’ కసరత్తు, ఫొటోలు వైరల్
న్యాయవాది పాత్రలో పవర్ స్టార్ పవన్కల్యాణ్ నటించిన సినిమా ‘వకీల్సాబ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం పవన్ సిద్ధమవుతున్నాడు. సినిమాలోని కీలక పోరాట సన్నివేశాల కోసం పవన్ కల్యాణ్ తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్గా మారాయి. శూలం, దండెంలతో పవన్ కసరత్తు చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. నల్లటి దుస్తులు వేసుకుని తెల్లవారుజామున 7 గంటలకు పవన్ కల్యాణ్ సాధన చేస్తున్నారు. చారిత్రక వీరుడు పాత్రలో పవన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా శ్రీలంక తార జాక్వలైన్ ఫెర్నాండైజ్ ప్రత్యేక పాత్రలో మెరవనుంది. పవన్ వజ్రాల దొంగగా తెరపై ఆలరించనున్నట్లు సమాచారం. పీరియాడికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నాడు. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయకర్ రావు నిర్మిస్తున్నారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
సర్ప్రైజ్: pspk27 టైటిల్, ఫస్ట్లుక్ వచ్చేసింది
ఇటీవల ‘వకీల్ సాబ్’ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే #PSPK27 అనే వర్కింగ్ టైటిల్తో షూటింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ మహా శివరాత్రికి టైటిల్తో పాటు ఫస్ట్లుక్ విడుదల చేస్తున్నట్లు నిన్న చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ఈ మూవీ టైటిల్ ఏమై ఉంటుందా అని అభిమానుల్లో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ముందుగా చెప్పినట్లుగానే దర్శకుడు మహా శివరాత్రికి టైటిల్, ఫస్ట్లుక్ను విడుదల చేసి ప్రేక్షకులు, అభిమానుల ఉత్కంఠకు తెరలెపాడు. ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్ను ఖరారు చేసి.. ది లెజెండరీ హీరోయిక్ జౌట్లా అనే ఉప శీర్షికతో పవన్ ఫస్ట్లుక్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. బంధిపోటు దుస్తుల్లో ఉన్న పవన్ కల్యాణ్ బిల్డింగ్పై నుంచి నౌకవైపు జంప్ చేస్తూ ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో పవన్ వజ్రాల దొంగగా తెరపై ఆలరించనున్నట్లు సమాచారం. పీరియాడికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నాడు. నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయకర్ రావు నిర్మిస్తున్నారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. చదవండి: శివరాత్రికి టైటిల్ #pspkrana షూటింగ్ సెట్.. ఫొటో లీక్ పవన్ కల్యాణ్ న్యూలుక్.. షాకవుతున్న ఫ్యాన్స్ -
అప్పుడే మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వైష్ణవ్ తేజ్
పంజా వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. తొలిసారిగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 12వ తేదీన విడుదలై బాక్సాఫిసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ మూవీ 100 కోట్ల రూపాయల బడ్జేట్లో చేరి రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమాతో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ సరికొత్త రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇంత వరకు ఏ డెబ్యూ హీరోకి రాని వసూళ్లను రాబట్టి అప్పటివరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేశాడు వైష్ణవ్. దీంతో వైష్ణవ్కు ప్రముఖ దర్శకనిర్మాతల నుంచి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే వైష్ణవ్ ‘ఉప్పెన’తో పాటు దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ షూటింగ్ ‘ఉప్పెన’ విడుదలకు ముందే కంప్లీట్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరపుకుంటోంది. అంతేగాక వైష్ణవ్ తన మూడవ సినిమాకు కూడా సంతకం చేశాడట. మనం ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నూతన దర్శకుడి డైరెక్షన్లో వైష్ణవ్ తదుపరి సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్పైకి వెళ్లనున్నట్లు సమచారం. ఇక వీటితో పాటు వైష్ణవ్ నిర్మాత బీవీ ఎస్ఎన్ ప్రసాద్ నిర్మిచే మరో మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీంతో తొలి సినిమాతోనే అంత్యంత క్రేజ్ను సంపాదించుకున్న వైష్ణవ్ వరుస సినిమాలతో టాలీవుడ్లో ఫుల్ బిజీ అయిపోయినట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ మూవీ దర్శకుడికి, హీరోయిన్ కృతి శేట్టికి కూడా పలు దర్శకనిర్మాతల నుంచి ఆఫర్లు, ఖరిదైన బహుమతులు అందుతున్న సంగతి తెలిసిందే. చదవండి: మూవీలో చరణ్ అన్న అలా చేయమని చెప్పాడు: వైష్ణవ్ రికార్డులు తిరగరాసిన ఉప్పెన -
శివరాత్రికి పవన్ ఫ్యాన్స్కు సర్ప్రైజ్
పవన్కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 11న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఇక పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ ఏప్రిల్ 9న రిలీజ్ కానుంది. మరోవైపు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ 27వ సినిమా చేస్తున్నాడు. దీనికి హరిహర వీరమల్లు అనే టైటిల్ పరిశీలనలో ఉంది. నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీరియాడికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నాడు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. చదవండి: #pspkrana షూటింగ్ సెట్.. ఫొటో లీక్ -
సంక్రాంతి 2022: స్టార్ హీరోల మధ్య పోటీ తప్పదా?
వచ్చే ఏడాది సంక్రాంతికి పోటీలో దిగేందుకు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు మన తెలుగు హీరోలు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్బాబు నటిస్తున్న 'సర్కారువారి పాట' సంక్రాంతికి రిలీజ్ అవనున్నట్లు చెప్పగా తాజాగా పవన్ కల్యాణ్ తన 27వ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం కూడా సంక్రాంతికి బరిలో దిగుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అంటే 2022లో మహేశ్, పవన్ మధ్య పోటీ గట్టిగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక సలార్ చిత్రంతో ప్రభాస్ సైతం సంక్రాంతి పందెంలో అడుగుపెడతాడని కొందరు భావించారు. కానీ ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ చిత్రయూనిట్ ఆదివారం సలార్ రిలీజ్ డేట్ను ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న సలార్ సినిమా థియేటర్లలోకి వస్తున్నట్లు కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ వెల్లడించారు. ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ఆయన రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్లో మరో సినిమా చేస్తున్నాడు. రాధేశ్యామ్ జూలై 30న, ఆదిపురుష్ వచ్చే ఏడాది ఆగస్టు11న రిలీజ్ అవుతుండగా సలార్ వచ్చే ఏడాది ఏప్రిల్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. సలార్లో శృతిహాసన్ తొలిసారి ప్రభాస్తో జోడీ కడుతోంది. ఇటీవల ‘సలార్’ మూవీ ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ గోదావరిఖని సింగరేణి కోల్మైన్స్లో జరుపుకోగా.. ప్రభాస్ బొగ్గు గనుల్లో బుల్లెట్ బైక్ నడుపుతూ కనిపించిన ఫొటోలు ఆ మధ్య నెట్టింట చక్కర్లు కొట్టాయి. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కేజీఎఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మహేశ్బాబు సినిమాల విషయానికొస్తే అతడు ప్రస్తుతం 'సర్కారువారి పాట' షూటింగ్లో బిజీగా ఉన్నాడు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో 'మహానటి' ఫేమ్ కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. దుబాయ్ షెడ్యూల్లో ఓ యాక్షన్ సన్నివేశం, ఓ పాట, కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. నెక్స్ట్ షెడ్యూల్ గోవాలో జరుగుతోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీమూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. దీని తర్వాత మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు'తో బ్లాక్బస్టర్ విజయాన్ని అందించిన అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇక పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ ఏప్రిల్ 9న రిలీజ్ కానుంది. మరోవైపు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ 27వ సినిమా చేస్తున్నాడు. దీనికి హరిహర వీరమల్లు అనే టైటిల్ పరిశీలనలో ఉంది. నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీరియాడికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నాడు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. చదవండి: కళ్లు చెదిరే పారితోషికం తీసుకుంటున్న ప్రభాస్ -
PSPK27 షూటింగ్ సెట్లో పవన్.. ఫొటోలు లీక్
డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఫిబ్రవరి 22న తిరిగి సెట్స్పైకి వచ్చిన ఈ సినిమా పీఎస్పీకే 27 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతోంది. ఈ మూవీ క్రిష్ 17వ శతాబ్దపు కాలం నాటి పిరియాడికల్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. దీని కోసం అప్పటి కాల పరిస్థితులకు సరిపోయేలా హైదరాబాద్లో సెట్స్ వేసి పవన్పై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ విషయం తెలిసి ఆయన అభిమానులంతా #pspk27 అనే హ్యాష్ ట్యాగ్ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆయన అభిమానులకు మరో సర్ప్రైజ్ అందింది. ఈ మూవీ షూటింగ్ సట్స్లోని పవన్ కల్యాణ్కు సంబంధించిన ఓ ఫొటో లీకైంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో పవన్ వారియర్ దుస్తుల్లో కొత్తగా దర్శనమిచ్చాడు. ఇక పవన్ను పోరాట యోధుడి దుస్తుల్లో చూసి అభిమానులంతా మురిసిపోతున్నారు. కాగా ఎమ్ఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈసినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి సింగీతం అందిస్తున్నారు. ఈ మూవీకి ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్ పరీశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లాక్డౌన్ ముందు గతేడాది మార్చిలో 15 రోజుల పాటు ఈ మూవీ షూటింగ్ను నిర్వహించారు. సెప్టెంబర్ 2న పవన్ బర్త్డే సందర్భంగా మూవీ పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్లు కథానాయికలు కాగా.. బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ మొఘల్ చక్రవర్తి జౌరంగజేబు పాత్రలో నటిస్తున్నాడు. అంతేగాక పవన్ ఈ సినిమాతో పాటు సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న మరో సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు. -
వైరల్: పహిల్వాన్లతో పవర్ స్టార్ కుస్తీ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అంటేనే ప్రేక్షకులకు పండుగ. ఆయన సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెగ సంబరపడిపోతుంటారు. ప్రస్తుతం అతడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ యువరాణిగా నటిస్తోంది. ఈ మధ్య 17వ శతాబ్దపు చార్మినార్ సెట్ వేయించిన క్రిష్ ఇప్పుడక్కడ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం రెండో షెడ్యూల్ కొనసాగుతుండగా మల్లయోధులతో వీరోచిత పోరాటానికి రెడీ అయ్యాడట పవన్. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫొటోలు ప్రత్యక్షమవగా క్షణాల్లో వైరల్గా మారాయి. ఈ ఫొటోలు చూస్తుంటే భారీ దేహాలు ఉన్న మల్లయోధులతో పవన్ హోరాహోరీగా తలపడేటట్లు కనిపిస్తోంది. ఈ పహిల్వాన్లతో పవన్ కలిసిన ఫొటో ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. వజ్రాల దొంగలా కనిపించనున్న పవన్ గెటప్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట క్రిష్. ఇక ఈ సినిమాకు 'హరిహర వీరమల్లు' అనే టైటిల్ను ప్రధానంగా పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్.. మొఘల్ చక్రవర్తి జౌరంగజేబు పాత్రలో నటిస్తుండగా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్ర చేస్తోంది. పవన్ కల్యాణ్ కెరీర్లో 27వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. చదవండి: పవన్ కల్యాణ్ నా గుండెల్లో ఉంటాడు: హీరో జనగణమన: మహేశ్ నుంచి పవన్కు! -
ట్రెండింగ్లో పవన్ కల్యాణ్.. భారీ యాక్షన్!
పవర్స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎమ్ఎమ్ రత్నం నిర్మిస్తోన్న ఈ సినిమా పీఎస్పీకే 27 వర్కింగ్ టైటిల్తో రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో ఈ రోజు(ఫిబ్రవరి 22) తిరిగి ప్రారంభమైంది. 17వ శతాబ్దపు కాలంనాటి పరిస్థితులకు సరిపోయేలా హైదరాబాద్లో భారీ సెట్ వేశారు. ఈ సెట్లో పవన్పై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు హరిహర వీరమల్లు అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. ఈ విషయం బయటకు రాగానే సోషల్ మీడియాలో #PSKP27 అనే హ్యష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కాగా లాక్డౌన్ ముందు గతేడాది మార్చిలో 15 రోజులపాటు షూటింగ్ నిర్వహించారు. సెప్టెంబర్ 2న పవన్ బర్త్డే సందర్భంగా సినిమా పోస్టర్ను కూడా విడుదల చేశారు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్.. మొఘల్ చక్రవర్తి జౌరంగజేబు పాత్రలో నటిస్తున్నాడు. నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ సినిమాతోపాటు సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా షూటింగ్లోనూ పాల్గొంటూ పవన్కల్యాణ్ బిజీగా ఉన్నాడు. చదవండి: రెండో పెళ్లిపై స్పందించిన సురేఖ వాణి అఖిల్ కొత్త కారు: షికారుకెళ్దామంటున్న సోహెల్ -
పవన్ సినిమాలో భారీ చార్మినార్ సెట్!
పవర్స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. భారీ ఎత్తున 17వ శతాబ్దపు చార్మినార్ సెట్ను రూపొందించే పనిలో దర్శకుడు క్రిష్ అండ్ టీమ్ బిజీగా ఉన్నారు. కథలో భాగంగా ఆనాటి చార్మినార్ పరిస్థితులను, దాని పరిసర ప్రాంతాలపై సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది. దీంతో చార్మినార్ సెట్ రూపకల్పన చేస్తోంది టీమ్. ఈ సెట్లో వచ్చే నెలలో పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేయనున్నారు. ఈ సెట్ నిర్మాణం సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్గా కానుందని తెలుస్తోంది. దీనిని సైరా నర్సింహరెడ్డి ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ ఈ సెట్కు పనిచేస్తున్నారు. ఈ సినిమాకు హరహర మహాదేవ, హరిహర వీరమల్లు, విరూపాక్ష అనే టైటిల్స్ తెరపైకి వచ్చాయి. కానీ టైటిల్ను ఇంకా ఫిక్స్ చేయలేదని, త్వరలో వెల్లడిస్తామని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కెరీర్లో 27వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. -
పవన్, క్రిష్ సినిమాకు మళ్లీ బ్రేక్..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. వకీల్సాబ్ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. అదే విధంగా దర్శకుడు క్రిష్, పవన్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా.. ఇప్పటికే పవన్ చిత్రీకరణలో జాయిన్ అయిపోయాడు. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ కొనసాగుతోంది. ఈ షెడ్యూల్ గురువారంతో పూర్తి కానుంది. ఈ షెడ్యూల్లో రెండు పాటలను కంప్లీట్ చేయనున్నాడు క్రిష్. ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్కు కొద్ది రోజులు బ్రేక్ పడనుంది. చదవండి: పవన్ సినిమాలో అనసూయకు 'స్పెషల్' ఛాన్స్.? ప్రస్తుత షెడ్యూల్ అయిపోయిన తర్వాత 20 రోజులపాటు షూటింగ్కు విరామం ఇవ్వనున్నాడు పవన్. ఆ తర్వాత ఫిబ్రవరి రెండో వారంలో తిరిగి చిత్రీకరణలో పాల్గొననున్నాడు. అయితే ఈ మధ్య సమయంలో ‘అయ్యపనుమ్ కోషియమ్’ షూటింగ్లోకి ఎంటర్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో హిట్టయిన ఈ చిత్రాన్ని పవన్ కల్యాణ్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించే ఈ చిత్రంలో మరో హీరోగా రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషిస్తున్నాడు. మలయాళంలో బిజూ మీనన్, పృథ్వీరాజ్లు హీరోలుగా నటించగా.. బిజూ మీనన్ పాత్రను పవన్ కల్యాణ్, రానా పృథ్వీరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. మరోవైపు ఈ రెండు చిత్రాల అనంతరం రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. అంతేగాక వైపు పవన్తో సినిమా కోసం హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి కథలతో సిద్ధంగా ఉన్నారు. చదవండి: పవన్కు త్రివిక్రమ్ మాట సాయం -
పవన్ సినిమాతో ఫుల్ బిజీ అయిపోయిన క్రిష్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీ షూటింగ్ గతేడాది డిసెంబర్లో పూర్తిచేసుకుంది. పవన్ తదుపరి 27వ సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ను ప్రారంభిస్తున్నట్లు మంగళవారం క్రిష్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే ఇప్పటికే సెట్స్పైకి రావాల్సిన ఈ సినిమా.. డైరెక్టర్ క్రిష్కు కరోనా సోకడంతో వాయిదా పడింది. ఇక ఆయన కరోనా నుంచి కోలుకోవడం, ‘వకీల్ సాబ్’ షూటింగ్ కూడా పూర్తి చేసుకోవడంతో సోమవారం షూటింగ్ను హైదరాబాద్లో ప్రారంభించారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ లోకేషన్కు సంబంధించిన ఫొటోలను దర్శకుడు తన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. (చదవండి: 'వకీల్ సాబ్' టీజర్ టైమ్ ఫిక్స్) ‘పీఎస్పీకే27’ అంటూ షూటింగ్ సెట్స్లో బిజీగా ఉన్న ఫొటోలను క్రిష్ షేర్ చేశారు. పిరియాడికల్ డ్రాప్లో రూపొందిస్తున్న ఈ సినిమా టైటిల్ను ‘విరుపాక్ష’ పేరుతో తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం వర్గాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై ఇంకా క్లారిటి రావాల్సి ఉంది. కాగా పవన్ ఈ సినిమాతో పాటు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు ఒకే సమయంలో షూటింగ్ను జరుపుకోనున్నాయంటూ టాలీవుడ్ వర్గాల నుంచి సమచారం. అయితే దీనిపై మాత్రం ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. పవన్ కల్యాణ్ అటూ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే ఇటూ సినిమాల రీ ఎంట్రీలో స్పీడ్ పెంచడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: పవన్ కల్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన దివి?) View this post on Instagram A post shared by Krish Jagarlamudi (@director_krish) -
దర్శకుడు క్రిష్కు కరోనా..
తెలుగు సినీ ఇండస్ట్రీని కరోనా వైరస్ వెంటాడుతోంది. ఇటీవల హీరో రామ్ చరణ్, వరుణ్ తేజ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ జాబితాలోకి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కూడా చేరిపోయాడు. తాజాగా డైరెక్టర్ క్రిష్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్లోకి వెళ్లాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. క్రిష్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ను జనవరి 4న తిరిగి ప్రారంభించేందుకు రెడీగా ఉన్నాడు. ఇందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. చదవండి: విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత ఈ క్రమంలో సోమవారం నుంచి షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రిష్ పరీక్షలు చేయించుకున్నాడు. అందులో ఆయనకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో వెంటనే క్రిష్ సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లడంతో షూటింగ్ వాయిదా పడింది. ఇటీవలే వకీల్ సాబ్ షూటింగ్ని పూర్తి చేసుకున్న పవన్ కల్యాణ్ త్వరలోనే క్రిష్ మూవీలో నటించేందుకు సిద్ధమయ్యాడు. అయితే క్రిష్కు కరోనా అని తేలడంతో అతను కోలుకున్న అనంతరం పవన్ ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నాడు. ఇదిలా ఉండగా పవన్, వకీల్ సాబ్ షూటింగ్లో ఉన్న సమయంలో క్రిష్.. వైష్ణవ్ తేజ్తో ఓ మూవీని తెరకెక్కించారు. 40 రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ని పూర్తి చేశాడు క్రిష్. చదవండి: అనుకోని అతిథి.. షాక్ అయిన సూపర్ స్టార్ -
మెగా హీరో సినిమా.. కీలక పాత్రలో రానా?
సాక్షి, హైదరాబాద్: ‘భల్లాలదేవ’ రానా దగ్గుబాటి ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్స్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘అరణ్య’ ఈ సంక్రాంతికి విడుదలకానుంది. మరో క్రేజీ ప్రాజెక్ట్లో కీలక పాత్రలో రానా కనిపించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో రాబోతున్న మెగా థ్రిల్లర్ సినిమాలో అతిథి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా దర్శకుడు క్రిష్ ‘పంజా’ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో వైష్ణవ్కు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. (చదవండి: రానా సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చేశాడుగా !) ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం క్రిష్ రానాను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. క్రిష్తో తనకున్న అనుబంధం నేపథ్యంలో రానా వెంటనే ఒకే చెప్పినట్లు సమాచారం. ఇక అంతా ఒకే అయితే భల్లాలదేవ.. మెగా హీరో వైష్ణవ్ సినిమాలో పవర్ ఫుల్ గెస్ట్ పాత్రతో ప్రేక్షకులను అలరించనున్నాడు. అడవి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రకుల్ గిరిజన యువతిగా నటిస్తోంది. ప్రస్తుతం ‘పంజా’ హైదరాబాద్లోని వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జరుగుతోంది. రానా ‘విరాటపర్వం’, ‘1945’ సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్నాడు. యాక్షన్ ఎంటటైనర్తో రూపొందిన ‘అరణ్య’ 2021 సంక్రాంతికి విడుదల కానుండగా.. ‘1945’ విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు రానా. (చదవండి: ఏం జరిగినా పని ఎప్పటికీ ఆగదు: రకుల్) -
ఏం జరిగినా పని ఎప్పటికీ ఆగదు: రకుల్
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ స్టార్ రకుల్ ప్రీత్ సింగ్ నెల రోజుల విరామం అనంతరం తిరిగి షూటింగ్లో పాల్గొన్నారు. సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్లో ఆమె సోమవారం పాల్గొన్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ వివారాబాద్ అడవుల్లో జరుపుతున్నారు. ప్రస్తుతం కొన్ని రెయిన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా సుశాంత్ ఆత్మహత్యతో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో నార్కోటిక్ అధికారులు సెప్టెంబర్ 25న రకుల్ను విచారించిన విషయం తెలిసిందే. సుశాంత్ కేసులో రియాను అరెస్టు చేసిన ఎన్సీబీ ఆమె స్టేట్మెంట్ల ఆధారంగా రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనె, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్లను కూడా విచారించింది. రకుల్ను అధికారులు ప్రశ్నించిన అనంతరం ఆమె మళ్లీ ఇప్పటి వరకు షూటింగ్ పాల్గొనలేదు. చదవండి: డ్రగ్స్ కేసులో బాలీవుడ్ భామలకు క్లీన్ చిట్? తాజాగా మళ్లీ షూటింగ్ ప్రారంభించినట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. వర్షం పడుతున్న సమయంలో సెట్లో క్రిష్, వైష్ణవ్ తేజ్ గొడుగు పట్టుకొని ఉన్న రెండు వీడియోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పంచుకున్నారు.‘ వర్షంలో షూటింగ్ అంటే కెమెరాలను, మనల్ని మనం రక్షించుకోవాలి. కేవలం కోవిడ్ మాత్రమే కాదు హైదరాబాద్ వర్షాలను ఎదర్కొని రెయిన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నాం. ఏం జరిగినా పని(షూటింగ్) మాత్రం ఆపలేం.’ అని పేర్కొన్నారు. అలాగే రకుల్ నితిన్ హీరోగా నటిస్తున్న చెక్ సినిమాలోనూ రకుల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆమెతోపాటు ప్రియా ప్రకాశ్ వారియర్ హిరోయిన్గా కనిపించనున్నారు. చదవండి: చివరి షెడ్యూల్లో చెక్ -
శ్రియ ‘గమనం’ ఎటువైపు..?
శ్రియా సరన్.. పరిచయం అక్కర్లేని పేరు. ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికే పదిహేనేళ్లు పూర్తయ్యాయి. కానీ చెక్కుచెదరని అందంతో కొత్త హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు. అందం, అభినయంతో ఆకట్టుకోగల శ్రియ దక్షిణాదితో పాటు బాలీవుడ్లో కూడా పలు చిత్రాల్లో నటించారు. పెళ్లి తర్వాత సినిమాలకి కాస్తా బ్రేక్ ఇచ్చిన శ్రియ మళ్ళీ కెమరా ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆమె ‘గమనం’ అనే మల్టీలాంగ్వేజ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం శ్రియ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. దర్శకుడు క్రిష్ గమనం ఫస్ట్లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇందులో శ్రియ చీర కట్టుకొని, మెడలో మంగళసూత్రం వేసుకొని ఓ సాధారణ భారతీయ గృహిణిలాగా కనిపిస్తున్నారు. దీన్ని చూస్తుంటే శ్రియ ఓ విభిన్నమైన పాత్రను పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది. (చదవండి: 'శ్రియా.. ప్లీజ్ అతన్ని ఇబ్బంది పెట్టకు') సుజనా రావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండగా.. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. రమేష్ కరుటూరి, వెంకీ పుషడపు, జ్ఞానశేఖర్ వి.ఎస్. నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరి నాటికి సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. శ్రియతో పాటుగా ఈ చిత్రంలో శివ కందుకూరి, నిత్యా మీనన్, ప్రియాంక జవాల్కర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం శ్రియ రాజమౌళి దర్శకత్వంలో తెలుగులో భారీ బడ్జెట్తో, పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో విలన్గా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్కు జోడీగా చిత్రబృందం శ్రియను ఎంచుకున్నారు. View this post on Instagram Immense pleasure to release d first look of @shriya_saran1109 on her Birthday from Multi-Language movie #GAMANAM !! All the Very Best to debutant Director #SujanaRao & Music Maestro #Ilaiyaraaja sir, DOP our Fav #GnanaShekar Writer #SaiMadhav and Producers #RameshKarutoori garu #Venky Garu & Whole team... #HappyBirthdayShriyasaran #गमन @shriya_saran1109 😊 #TeamKrish ❤️ A post shared by Krish Jagarlamudi (@director_krish) on Sep 10, 2020 at 9:14pm PDT -
‘పవన్తో పనిచేయడం ఆనందంగా ఉంది’
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించబోయే 27 వ సినిమాకు క్రిష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల పవన్ బర్త్డే(సెప్టెంబర్ 2) సందర్భంగా దర్శకుడు క్రిష్ ట్విట్టర్ వేదికగా పవన్ 27వ సినిమా ప్రి లుక్ పోస్టర్ను విడుదల చేశారు. అప్పట్లో జరిగిన పదిహేను రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుందంటూ.. పవన్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా.. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. రామ్ లక్ష్మణ్ ఫైట్లు కంపోజ్ చేస్తున్నారు. (పవన్ 27: అభిమానులకు మరో ట్రీట్) ఇక హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ డైరెక్టర్ బెన్లాక్ ఈ సినిమాకు (వీఎఫ్ఎక్స్)విజువల్ ఎఫెక్ట్స్ అందించనున్నారు. ఈ మేరకు ఆయన గత వారమే ట్విటర్లో స్పందించారు. ‘పవన్ కల్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. క్రిష్, పవన్ కల్యాణ్తో పనిచేయడం ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నారు. ఇక హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ దర్శకుడు ఈ సినిమాకు ఎంటర్ అవ్వడంతో మూవీపై అంచనాలు కూడా అదే రేంజ్లో పెరిగిపోయాయి. కాగా బెన్లాక్ తెలుగులో పనిచేయడం ఇదే తొలిసారి. దీనిపై నెటిజన్లు భారీగా స్పందిస్తూ.. బెన్లాక్కు ఆల్ దబెస్ట్ చెబుతున్నారు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించాలని కోరుతున్నారు. (ఈ హీరోల పారితోషికం ఎంతో తెలుసా?) Happy Birthday to @PawanKalyan. It was a pleasure working with you and @DirKrish on the epic #PSPK27 🙏 pic.twitter.com/o0lRFcYbBE — Ben Lock (@benlock) September 2, 2020 -
పవన్ 27: ప్రీలుక్ పోస్టర్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్డే సందర్భంగా అభిమానులకు మరో సర్ప్రైజ్ వచ్చేసింది. ఇప్పటికే ఆయన నటిస్తున్న 'వకీల్ సాబ్' చిత్రం నుంచి మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. తాజాగా పవన్ 27వ సినిమా అధికారిక ప్రకటన వెలువడింది. పవన్ కల్యాణ్- క్రిష్ జాగర్లపూడి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం నుంచి ప్రీ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో పవన్ చేతికి బంగారు రంగులో ఉన్న కడియంతో పాటు రెండు వేళ్లకు ఉంగరాలు కూడా ఉన్నాయి. అలాగే నడుముకు ఎర్ర కండువా కట్టుకున్నారు. దానికి గరుత్మంతుడి బొమ్మకూడా ఉంది. ఈ వేషధారణ చూస్తుంటే ఇదేదో రాబిన్హుడ్ పాత్రలా అనిపిస్తోంది. (ఆ వార్త నా మనసును కలిచివేసింది: పవన్) ఈ చిత్రం గురించి క్రిష్ మాట్లాడుతూ.. "ఈ సినిమా పదిహేను రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది. చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది. ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం.. ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తూ హ్యాపీ బర్త్డే పవన్ కల్యాణ్" అని ట్వీట్ చేశారు. కాగా ఈ సినిమా షూటింగ్ ఇదివరకే ప్రారంభమైంది. కానీ లాక్డౌన్ కారణంగా చిత్రీకరణ తాత్కాలికంగా వాయిదా పడింది. సినిమా కథ విషయానికొస్తే మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా రూపుదిద్దుకోనుందని భోగట్టా. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. రామ్ లక్ష్మణ్ ఫైట్లు కంపోజ్ చేస్తున్నారు. (పవన్ చిత్రంలో రామ్చరణ్?) -
పవన్ చిత్రంలో మెగాపవర్ స్టార్?
పవర్స్టార్ పవన్ కల్యాణ్-క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ పీరియాడికల్ మూవీ గురించి నిత్యం ఏదో ఒక వార్త టాలీవుడ్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మెగా ఫ్యాన్స్ ఆనందంలో తేలియాడుతున్నారు. అంతేకాకుండా ఆ వార్త నిజం కావాలని కోరుకుంటున్నారు. ఇంతకీ ఆ వార్త ఏంటిందంటే.. పవన్-క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మెగా పవర్స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నారట. (పవన్ ‘వకీల్ సాబ్’: మరో లీక్) అయితే అది ఫుల్ లెంగ్త్ రోల్ కాదంట కేవలం అతిథి పాత్రలో చెర్రీ మెరవనున్నాడట. అంతేకాకుండా కనిపించేది కొద్దిసేపే అయినా చాలా పవర్ ఫుల్గా ఉండనుందట చరణ్ పాత్ర. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈ వార్త నిజమైతే మెగా అభిమానులకు శుభవార్తే. ఇప్పటికే రామ్చరణ్ తన తండ్రి చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ‘ఆచార్య’ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. (జానీ మాస్టర్కు స్పెషల్ బర్త్ డే విషెస్) ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ తెలుగు రీమేక్ ‘వకీల్ సాబ్’ చిత్రంలో పవన్ నటిస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మేజర్ షూటింగ్ దాదాపు పూర్తయింది. అయితే లాక్డౌన్ కారణంగా చిత్ర షూటింగ్ నిరవధిక వాయిదాపడింది. ఇక క్రిష్ సినిమా విషయానికి వస్తే హైదరాబాద్లో ఓ భారీ సెట్ వేసినట్లు సమాచారం. అయితే పవన్ లేకుండానే తొలి షెడ్యూల్ షూటింగ్కు క్రిష్ ఫ్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం మొగలాయిల కాలం నాటి ఓ ఆసక్తికర కథాంశంతో రూపొందబోతుందని, ఇందులో పవన్ రాబిన్హుడ్ తరహాలో పవర్ఫుల్ దొంగలా దర్శనమివ్వబోతున్నారని లీకువీరులు పేర్కొన్న విషయం తెలిసిందే. (చెర్రీ ఆసక్తికర ట్వీట్.. వైరల్) -
త్రివిక్రమ్తో మరో సినిమా.. పవన్ ఆసక్తి?
పవర్స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో నాలుగో సినిమా రాబోతుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన మూడు చిత్రాల్లో రెండు సూపర్డూపర్ హిట్ కాగా మరొకటి బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ సర్కిళ్లలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. త్రివిక్రమ్తో మరో సినిమా చేయాలని పవన్ ఆమితాసక్తిని కనబరుస్తున్నారట. కాగా ఈ మధ్య పవన్కు త్రివిక్రమ్ ఓ కథ వినిపించడం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయట. అంతేకాకుండా వీలైనంత త్వరగా పూర్తి స్క్రిప్ట్ను సిద్దం చేసి తక్కువ సమయంలోనే ఈ చిత్రాన్ని తీసేలా ప్లాన్ చేయాలని త్రివిక్రమ్కు పవన్ సూచించారని సమాచారం. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' చేస్తున్న పవన్, ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ చిత్రం చేయనున్నారు. హరీష్ శంకర్తో ఓ సినిమాకు కూడా పవన్ కమిట్ అయ్యారు. అయితే లాక్డౌన్ కారణంగా క్రిష్ సినిమాకు సంబంధించి భారీ సెట్ల నిర్మాణాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయట. దీంతో ప్రభుత్వాలు షూటింగ్లకు అనుమతి ఇచ్చినా ఈ సినిమా సెట్స్పైకి వెళ్లడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం. క్రిష్ సినిమా షూటింగ్ ప్రారంభంకావడానికి ముందు వచ్చే ఈ చిన్న గ్యాప్లో త్రివిక్రమ్తో సినిమా చేయాలని పవన్ భావిస్తున్నాడట. (మరో రికార్డు క్రియేట్ చేసిన ‘అఆ’) మరోవైపు ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ వెయిట్ చేస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ పూర్తయితే గానీ ఎన్టీఆర్-త్రివిక్రమ్ల సినిమా పట్టాలెక్కే అవకాశం లేదు. ఈ క్రమంలో నాని, వెంకటేష్లతో మల్టీస్టారర్ చిత్రానికి ప్లాన్ చేసినప్పటికీ అది ఇప్పట్లో వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. దీంతో త్వరలోనే పవన్-త్రివిక్రమ్ కాంబోలో సినిమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే. (హరీశ్ మరో చిత్రం.. పవన్ ఫ్యాన్స్కు డౌట్) -
పవర్ స్టార్ సరసన అనుష్క?
చిన్న గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పవర్స్టార్ పవన్ కల్యాణ్ జోరు పెంచారు. వేణు శ్రీరామ్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న ‘వకీల్ సాబ్’ విడుదలకు సిద్దంగా ఉంది. అయితే కరోనా లాక్డౌన్తో థియేటర్లకు తాళం పడటంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వకీల్ సాబ్ విడుదలవడంతో పాటు క్రిష్ సినిమా పట్టాలెక్కేది. కానీ కరోనాతో అన్నీ తలకిందులయ్యాయి. అయితే ఈ లాక్డౌన్ సమయాన్ని ప్రీ ప్రొడక్షన్ పనులకోసం సద్వినియోగం చేసుకుంటున్నారు దర్శకులు. ఈ క్రమంలో పవన్-క్రిష్ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాబిన్ హుడ్ కాన్సెప్ట్తో హిస్టారికల్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ బందిపోటు పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా టైటిల్ ‘విరూపాక్ష’గా ఫిక్సయిందని టాలీవుడ్ టాక్. అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్ల విషయంలో స్పష్టతరావడం లేదు. తొలుత ఈ చిత్రంలో జాక్వలిన్ ఫెర్నాండెజ్ అని అనుకున్నారు. కానీ తాజాగా ఈ చిత్రంలో స్వీటీ అనుష్క పవన్ సరసన నటించనుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ఇద్దరి హీరోయిన్లకు అవకాశం ఉండటంతో జాక్వలిన్, అనుష్కల వైపు క్రిష్ మొగ్గు చూపుతున్నట్లు ఫిలింనగర్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు. దీంతో ఈ సినిమా అప్డేట్ కోసం పవర్స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు చదవండి: ‘విజయ్ ఆగ్రహం.. మద్దతిచ్చిన టాలీవుడ్’ ‘డియర్ విజయ్.. నేనర్థం చేసుకోగలను’ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_191237004.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పవన్ మరో మూవీ ప్రారంభం
పవర్స్టార్ పవన్ కల్యాణ్ కొత్త చిత్రం బుధవారం ప్రారంభమైంది. క్రిష్ దర్వకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తొలి షూటింగ్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభించారు. ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. పవన్ కెరీర్లో ఇది 27వ చిత్రం. ఈ మూవీ మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. క్రిష్ దర్శకత్వం వహించిన చివరి రెండు సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఈ సినిమాతో ఎలాగైనా మళ్లీ ఫామ్లోకి రావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా షూటింగ్ పరిసరాల్లోకి మీడియాను అనుమతించలేదు. (పవన్ కల్యాణ్ హీరోయిన్ ఫిక్స్!) ఇప్పటికే పవన్ వేణు శ్రీరామ్ దర్వకత్వంలో ‘పింక్’ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే పింక్ రీమేక్ షూటింగ్ తరువాత పవన్ ఈ సినిమా చిత్రీకరణలో రెగ్యులర్గా పాల్గొంటాడని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా ఈ ప్రాజెక్టును ఈ రోజే పట్టాలెక్కించారు. దీంతో పవర్స్టార్ అభిమానులకు డబుల్ ధమాకా లభించడంతో పండగ చేసుకుంటున్నారు. (డబుల్ ధమాకా) -
‘మహానాయకుడు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి, నటించిన చిత్రం ‘యన్టిఆర్ కథానాయకుడు’.. సంక్రాంతి బరిలోకి దిగి ఆశించిన విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. తీవ్ర నష్టాల్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునేందుకు ‘యన్టిఆర్ మహానాయకుడు’ ని సిద్దం చేస్తున్నాడు బాలకృష్ణ. మొదటి భాగం చేదు అనుభవాన్ని మిగల్చగా.. రెండో భాగంపై చిత్రయూనిట్ శ్రద్ద పెట్టినట్టు సమాచారం. ఫిబ్రవరి మొదటి వారంలోనే ‘మహానాయకుడు’ని విడుదల చేయాల్సి ఉండగా.. కొన్ని సన్నివేశాలను రీషూట్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. ఫిబ్రవరి 22న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ చిత్రమైనా విజయం సాధిస్తుందో లేదో చూడాలి. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా.. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. -
అఖిల్-క్రిష్ కాంబోలో మూవీ!
చేసిన మూడు సినిమాలు సరైన ఫలితాలు ఇవ్వకపోవడంతో డైలామాలో పడ్డాడు అక్కినేని యువ హీరో అఖిల్. ‘మిస్టర్ మజ్ను’తో ఎలాగైనా హిట్కొట్టాలని ప్రయత్నించగా.. ఆశించిన విజయాన్ని మాత్రం ఇవ్వలేకపోయింది. ఇక అఖిల్ నాల్గో సినిమాపై ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. అఖిల్ నాల్లో సినిమా శ్రీనువైట్లతో ఉంటుందని రూమర్స్ వినిపించగా.. మళ్లీ మలుపు దర్శకుడు సత్య పేరు తెరపైకి వచ్చింది. అయితే తాజాగా వినిపిస్తున్న పేరు క్రిష్. అవును.. నాగ్కు ఈ మధ్యేకథ వినిపించాడని.. అది నచ్చడంతో అఖిల్తో సినిమా దాదాపుగా ఫిక్స్ చేసినట్టే అనే టాక్ వినిపిస్తోంది. అసలే క్రిష్ మణికర్ణిక వివాదం, మహానాయకుడు మూవీతో సతమతమవుతుంటే.. మరి ఈ విషయంపై ఎప్పుడు స్పందిస్తాడో చూడాలి. అఖిల్ తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించేవరకు వేచి చూడాల్సిందే. -
ఈ సీన్ ‘మణికర్ణిక’లో ఉంటే.. అదిరిపోయేది!
మణికర్ణిక విడుదలై ఒకవైపు పాజిటివ్ టాక్ను సంపాదించి.. కలెక్షన్లలో పుంజుకుంటుంటే.. మరోవైపు వివాదాలు కూడా వస్తున్నాయి. సినిమాలో మణికర్ణిక పాత్రలో నటించిన కంగనాకు ప్రశంసలు వస్తున్నాయి కానీ డైరెక్షన్ క్రెడిట్ పూర్తిగా తన అకౌంట్లో వేసుకోవడం మాత్రం దర్శకుడు క్రిష్కు మింగుడు పడటం లేదు. ఈ వివాదంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మణికర్ణిక విడుదలైన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో క్రిష్ మాట్లాడుతూ.. తాను తీసిన సినిమా బంగారంలా ఉంటే ప్రస్తుతం చూస్తున్న సినిమా వెండిలా ఉందని.. కంగనా, సోనూసూద్ నటించిన పాత్రను తగ్గించాలని పట్టుబట్టిందన్నారు. కానీ తాను వినిపించుకోలేదని, కథలో తనకు ఇష్టవచ్చిన మార్పులు చేసిందని కంగనాపై ఆరోపణలు చేశారు. తాను ఈ సినిమా కోసం ఎంతో పరిశోధించానని, చరిత్రను వక్రీకరించడం తనకు ఇష్టం లేదన్నారు. అయితే క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాక.. తన పాత్రను తగ్గిస్తామని చెప్పేసరికి సోనూసూద్ కూడా ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. అయితే ఈ వివాదం ఇలా కొనసాగుతుంటే.. సోనూసూద్పై షూట్ చేసిన ఓ సన్నివేశం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సినిమా ఎండింగ్ వరకు ఆయన పాత్ర ఉంటుందని, సోనూసూద్పై తీసిన సన్నివేశాలు ఎంతో బాగుంటాయని క్రిష్ చెప్పడం.. ఒళ్లు గగుర్పొడిచే ఈ సీన్ లీక్ అవ్వడం చూస్తే.. కంగనా కావాలనే సోనూసూద్ పాత్రను తగ్గించినట్లుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సోనూసూద్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాక.. మహ్మద్ జీషన్ తో రీ షూట్ చేసింది. ఆ పాత్రను పూర్తిగా మార్చేయడంతో పెద్దగా ప్రాముఖ్యత లేకుండాపోయింది. -
‘మణికర్ణిక’ వివాదంపై స్పందించిన క్రిష్
‘మణికర్ణిక’ సినిమా నుంచి తప్పుకోవడంపై దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఎట్టకేలకు స్పందించారు. హీరోయిన్ కంగనా రనౌత్ కారణంగానే ఈ ప్రాజెక్టు నుంచి బయటకు రావాల్సి వచ్చిందని వెల్లడించారు. తన పట్ల చాలా దురుసుగా ప్రవర్తించిందని చెప్పారు. ఆమె ప్రవర్తన ఎప్పుడూ ఇలాగే ఉంటుందని ‘సౌత్ బాయ్’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. (బడ్జెట్ 125 కోట్లు.. ఫస్ట్ కలెక్షన్..?) ‘మణికర్ణికలో నేను తెరకెక్కించిన సన్నివేశాలు నిర్మాతకు నచ్చలేదని, భోజ్పురి సినిమాలా ఉందని కంగనా నాకు ఫోన్ చేసి చెప్పింది. నేనేమీ మాట్లడకుండా నవ్వాను. నా సినిమాలు ఎలా ఉంటాయో ప్రేక్షకులకు ఇంతకుముందే తెలుసు. నేను ఎంత చెప్పినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. నాతో ఫోన్లో చాలా దురుసుగా మాట్లాడింద’ని క్రిష్ తెలిపారు. దాదాపు సినిమా అంతా తానే తెరకెక్కించానని చెప్పారు. దర్శకత్వంలో తన కంటే కంగనా పేరు ప్రముఖంగా వేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఒకరు చేసిన పనిని తనదిగా చెప్పుకుంటున్న ఆమెకు అసలు నిద్ర ఎలా పడుతుందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తాను తీసిన సన్నివేశాలనే మళ్లీ చిత్రీకరించి ఆమె పేరు వేసుకుందని తెలిపారు. ‘ఫస్టాఫ్లో 20-25 శాతం, సెకండాఫ్లో 10-15 శాతం వరకు కంగనా తెరకెక్కించారు. ఆమె ఎంట్రీ సీన్, పాట నేను చిత్రీకరించలేదు. సెకండాఫ్లో నేను తీసిన చాలా సన్నివేశాలను మళ్లీ రీషూట్ చేశారు. అతుల్ కులకర్ణి, ప్రజాక్తమాలి పాత్రలను కూడా కుదిరించారు. సోనూ సూద్ పాత్రను మార్చమనడంతో కంగనాతో అభిప్రాయభేదాలు తలెత్తాయి. ఇంటర్వెల్కు ముందు సోనూ పాత్ర చనిపోవాలని ఆమె పట్టుబట్టింది. దానికి నేను ఒప్పుకోకపోవడంతో వాగ్వాదం జరిగింది. సహ-నిర్మాత కమల్ జైన్ కూడా ఆమె వైపు నిలిచాడు. తర్వాత నేను నిర్మాణ సంస్థ జీ-స్టూడియోస్తో మాట్లాడటం మానేశాను. ఒకసారి కంగనా నాకు ఫోన్ చేసింది. తనను డైరెక్షన్ చేయమని నిర్మాతలు కోరుతున్నారని చెప్పింది. తర్వాత కమల్ జైన్ ఫోన్ చేసి ముంబైకి రమ్మన్నారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ కంగనా ఉంది. సినిమాలో చిన్నచిన్న మార్పులు చేయాలని, అవన్నీ తాను చూసుకుంటానని చెప్పడంతో నేను హైదరాబాద్కు తిరిగి వచ్చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత సోనూ సూద్ నాకు ఫోన్ చేశాడు. ఇంటర్నెల్లోనే నీ పాత్ర ముగించమన్నారు. అలాయితే నేను తప్పుకుంటానని నిర్మాతతో చెప్పాను. కంగనా డైరెక్షన్ చేస్తుందని కమల్ జైన్ నుంచి సమాధానం వచ్చిందని సోనూతో చెప్పాను. నేను కొనసాగకపోతే తాను కూడా తప్పుకుంటానని నాతో చెప్పాడు. కంగనా దర్శకత్వంలో నటించడానికి ఇష్టంలేక అతడు సినిమా నుంచి బయటకెళ్లిపోయాడని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదు. 100 నిమిషాలు ఉండాల్సిన అతడి పాత్రను 60 నిమిషాలకు కుదించారు. అతడి పాత్రను మార్చకుండా ఉండివుంటే అనుకున్న బడ్జెట్లో సినిమా పూర్తయ్యేది. సినిమాలో నా పేరు ఎక్కడో మూలన పడేశారు. నాకు ఇవ్వాల్సిన పారితోషికంలో 30 మాత్రమే ఇచ్చారు. ఏదోక రోజు మిగతా బాలెన్స్ వస్తుంద’ని క్రిష్ వివరించారు. అయితే 30 శాతం మాత్రమే క్రిష్ తీశారని, మిగతా సినిమా అంతానే తెరకెక్కించానని ‘ముంబై మిర్రర్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ చెప్పుకోవడం విశేషం. మునిగిపోతున్న నావను కాపాడటానికి తాను ప్రయత్నించానని ఆమె చేసిన వ్యాఖ్యలపై క్రిష్ స్పందిస్తూ.. ‘ఓరి దేవుడా’ అంటూ తలపట్టుకున్నారు. -
‘మణికర్ణిక’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది!
ఎన్నో వివాదాలు, మరెన్నో వాయిదాలు మొత్తానికి విడుదలకు సిద్దంగా ఉంది మణికర్ణిక. బ్రిటీష్ వారితో యుద్దం చేయడానికి ఝాన్సీ లక్ష్మీబాయి ఎంత కష్టపడిందో.. ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి కంగనా రనౌత్ కూడా అంతే కష్టపడ్డారు. మణికర్ణిక తెలుగు ట్రైలర్ను ఇటీవలె విడుదల చేసింది చిత్రబృందం. పూర్తి ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ ట్రైలర్లో దేశభక్తిని రేకెత్తించేలా ప్రతీ సన్నివేశాన్ని చిత్రీకరించారు. మనం పోరాడుదాం..మన భావితరాలు స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటాయి.. మీ పోరాటం రేపటి గురించి నేటి కోసం కాదు వంటి సంభాషణలు కూడా అంతే పదునుతో ఉన్నాయి. ఇక ఈ ట్రైలర్లో కంగనా విజృంభించారు. పోరాట సన్నివేశాల్లో కూడా కంగనా తన దూకుడును ప్రదర్శించారు. ఈ చిత్రానికి క్రిష్, కంగనా రనౌత్లు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘మణికర్ణిక’ ట్రైలర్ విడుదల
-
‘ఎన్టీఆర్’ మహానాయకుడు వాయిదా పడింది!
నందమూరి బాలకృష్ణ నిర్మిస్తూ, నటిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’. స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత గాథను వెండితెరపై రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సినీ జీవితాన్ని ‘కథానాయకుడు’గానూ, రాజకీయ జీవితాన్ని ‘మహానాయకుడు’గానూ విడుదల చేయనున్నారు. అయితే గతంలో ఈ రెండు పార్ట్లకు సంబంధించిన రిలీజ్ డేట్స్ (జనవరి 9, 24)ను ప్రకటించింది చిత్రబృందం. అయితే తాజాగా ఈ సినిమాను కొన్న బయ్యర్లు చేసిన విజ్ఞప్తిని చిత్రయూనిట్ పరిగణలోకి తీసుకుందని సమాచారం. ఈ రెండు పార్ట్లకు రెండు వారాలే గ్యాప్ ఉంటే నష్టపోయే అవకాశం ఉందని బయ్యర్లు ఆందోళన చేశారని, వారి విజ్ఞప్తి మేరకు రెండో పార్ట్ ‘మహానాయకుడు’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారని సమాచారం. ఇంతకు ముందే ‘మహానాయకుడు’ విడుదల వాయిదా కానుందని ప్రచారం సాగినా.. వాటిపై మేకర్స్ రియాక్ట్ కాలేదు. మరి ఇప్పుడైనా చిత్రయూనిట్ వీటిపైన స్పందించి అధికారికంగా ప్రకటిస్తుందో లేదో చూడాలి. -
అంచనాలను పెంచేస్తున్న అంతరిక్షం టీజర్
మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘అంతరిక్షం 9000 కెఎమ్పిహెచ్’ మూవీ టీజర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పటికే పలు చిత్రాలలో విలక్షణ నటనతో ఆకట్టుకున్న వరుణ్, ఈ ట్రైలర్తో మరింత ఆకర్షిస్తున్నారు. హై టెక్నికల్ వాల్యూస్, హాలీవుడ్ నిపుణుల సారధ్యంలో యాక్షన్ సీన్స్, విజువల్ ఎఫెక్ట్స్ మేళవింపుతో వస్తున్న ఈ సినిమా వరుణ్ కరియర్లో మరో కీలక చిత్రంగా మారనుంది. వరుణ్ తేజ్, అదితిరావు హైదరి, లావణ్య త్రిపాఠి కలిసి నటిస్తున్న చిత్రం షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ చేసుకుంది. మొదటి సినిమా ‘ఘాజి’(ఫస్ట్ సబ్మెరైన్ ఫిలిం) తో నేషనల్ అవార్డు గెలుచుకున్న సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందించగా, డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్, సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి.. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రూపుదిద్దుకుంది. తెలుగులో పూర్తిస్థాయి ‘అంతరిక్షం’ నేపథ్యంలో వస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట చిత్ర నిర్మాతలు. &rel=0 -
‘అతనికవేం గుర్తుకు లేవు’
మణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ సినిమాకు ఆది నుంచి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో విడుదల కావాల్సిన చిత్రం కాస్తా ఆలస్యమవుతూ వచ్చే ఏడాది జనవరికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. కొన్ని సన్నివేశాలని రీ షూట్ చేయాల్సి రావడం వల్ల ఆలస్యమవుతోంది. అయితే ప్రస్తుతం దర్శకుడు క్రిష్ ‘ఎన్టీఆర్’ సినిమాతో బిజీగా ఉండడంతో.. కంగనా అండ్ బ్యాచ్ రీ షూట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఒక కొత్త వార్త వినిపిస్తోంది. అది ఏంటంటే ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న సోను సూద్, కంగనా గొడవపడ్డారని.. దాంతో అతను ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు నిజమేనంటూ.. సోను సూద్ తప్పుకోవాడానికి గల కారణాన్ని బయటపెట్టారు కంగనా రనౌత్. దీని గురించి ఆమె ‘ప్రస్తుతం సోను సూద్ ‘మణికర్ణిక’ చిత్రంలో నటించడం లేదు. అతనిప్పుడు ‘సింబా’ సినిమాతో బిజీగా ఉన్నారు. మేము ఈ పాచ్ వర్క్ గురించి అతనికి చెప్పా, మాతో సహకరించమని కోరాం. కానీ అతను నన్ను కలవడానికి నిరాకరించాడు. నేను తనని నా స్నేహితునిగానే భావించాను. అతను నిర్మాతగా వ్యవహరించిన ఒక సినిమా పాటలను నేనే లాంచ్ చేశాను. కానీ అతనికి అవేం గుర్తుకు లేవు’ అంటూ విమర్శించారు. అంతేకాక తాను మహిళ అయినందున, తన డైరెక్షన్లో పనిచేయడానికి ఇష్టంలేకే సోను సూద్ షూటింగ్కి హాజరవ్వకుండా తనను ఇబ్బంది పెడుతున్నారని కంగనా రనౌత్ తెలిపారు. అంతేకాక తన స్థానంలో మరొకరిని తీసుకొండని సలహ ఇచ్చాడన్నారు. దాంతో ప్రస్తుతం సోను సూద్కి సంబంధించిన సన్నివేశాలన్నింటిని మరో నటుడితో రీ షూట్ చేయాల్సి వస్తుందని తెలిపారు. ఇందుకోసం జీషన్ అయ్యూబ్ని సంప్రదించామని, అతను సెప్టెంబర్లో తమతో జాయిన్ అవుతాడని కంగనా తెలిపారు. కంగనా వ్యాఖ్యలపై సోను సూద్ ప్రతినిధి స్పందించారు. ‘సోను సూద్ ఎంత ప్రొఫెషనల్గా ఉంటారో ఆయనతో పనిచేసిన వారందరికి తెలుసు. ఆయన మణికర్ణిక చిత్రం కోసం ముందు ఒప్పుకున్న ప్రకారం షూటింగ్కి హాజరయ్యారు. కానీ ఇప్పుడు రీ షూట్కి కూడా రావాలని కోరారు. అయితే ప్రస్తుతం సోను సూద్ వేరే చిత్రంతో బిజీగా ఉన్నారు. అందువల్ల మణికర్ణిక కోసం డేట్స్ కేటాయించలేకపోతున్నారు. అందువల్లే మణికర్ణిక నుంచి తప్పుకున్నారు తప్ప మరో కారణం ఏం లేదు’ అంటూ తెలిపారు. అంతేకాక ‘మణికర్ణిక చిత్ర బృందానికి సోను సూద్ ఆల్ ది బెస్ట్ కూడా తెలిపారు’ అని వివరించారు. -
అయ్యో అలాంటిదేమీ లేదు : కంగనా
ఝాన్సీ లక్ష్మీ బాయి జీవిత కథ ఆధారంగా మణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ సినిమాని దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే అందులో హీరోయిన్ కంగనా రనౌత్కి, క్రిష్కి మధ్య విభేదాలంటూ గతకొన్ని రోజులుగా పుకార్లు వస్తున్నాయి. దీనికి తోడు చిత్రానికి సంబంధించిన క్లాప్ బోర్డ్పై డైరెక్టర్ పేరుండాల్సిన దగ్గర కంగనా రనౌత్ పేరు ఉండడంతో అభిమానుల్లో మరోసారి అనుమానం మొదలైంది. ఈ విషయంపై అభిమానులు దర్శకుడితో పాటు కంగనాని సోషల్మీడియా వేదికగా ప్రశ్నించారు. దీంతో కంగనా వెంటనే స్పందించింది. క్రిష్ తాను ఒప్పుకున్న వేరే సినిమాతో బిజీగా ఉండడం వల్లే మేము ప్యాచ్ వర్క్పూర్తి చేశాం. అంతే కాని పూర్తి దర్శకత్వ బాధ్యతలు స్వీకరించలేదు. సెట్లో ఉన్న క్లాప్ బోర్డ్ ఇంత గందరగోళం సృష్టించింది. ప్రస్తుతం సినిమా వర్క్ అంతా సవ్యంగా జరుగుతుంది. అనుకున్న సమయానికే మూవీ రిలీజ్ అవుతుంది' అని కంగనా తన ఇన్స్టాగ్రామ్లో బదులిచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. మణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ చిత్రం జనవరి 25, 2019న విడుదల కానుందని కంగనా పేర్కొన్నారు. Krish Jagarlamudi is the director of #Manikarnika and will remain so. #KanganaRanaut has stepped in to shoot just the patchwork on his behalf while he fulfills his commitments in another movie, to make sure that #Manikarnika releases on 25th Jan 2019. The clapboard is merely to avoid on set confusion A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on Aug 29, 2018 at 1:01pm PDT -
‘కేరాఫ్ కంచరపాలెం’పై స్టార్ డైరెక్టర్స్ కామెంట్స్!
ఒక సినిమా హిట్ కావాలంటే స్టార్స్ ఉంటే సరిపోతుందని అనుకునే కాలం పోయింది. ఎంత పెద్ద స్టార్ అయినా సరే.. సినిమాలో కంటెంట్ ఉండాలని సినీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఎటువంటి అంచనాలు, స్టార్ కాస్టింగ్ లేకుండా వచ్చిన చిన్న సినిమాలెన్నో పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రాబోతోన్న మరో సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’. రానా నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోన్న ఈ సినిమాపై అంచనాలు పెరుతున్నాయి. ఈ మూవీ ప్రివ్యూ చూసిన సుకుమార్, క్రిష్లు సినిమాను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రతీ పాత్ర వెంటాడుతుందని, సినిమా ప్రారంభమైన ఐదు నిమిషాలకే కంచరపాలెం గ్రామంలోకి వెళ్లేలా చేస్తుందని, నవ్వుతాం, ఏడుస్తాం, బాధపడతాం ప్రతీ క్యారెక్టర్తో కనెక్ట్ అవుతామంటూ చెప్పుకొచ్చారు. పరుచూరి ప్రవీణ నిర్మించిన ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్తో కలిసి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి వెంకట్ మహా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 7న విడుదల కానుంది. -
‘కేరాఫ్ కంచరపాలెం’పై స్టార్ డైరెక్టర్స్ కామెంట్స్!
-
‘మనదేశం’తోనే చరిత్రకు శ్రీకారం..!
నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ను గురువారం నుంచి ప్రారంభించినట్లు దర్శకుడు క్రిష్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. ఎన్టీఆర్ మొదటి సినిమా ‘మనదేశం’ లోని పోలీస్ గెటప్లో ఉన్న బాలకృష్ణ ఫొటోను పోస్ట్ చేసిన క్రిష్.. ‘నాడు, నేడు ‘మనదేశం’ తోనే చరిత్రకు శ్రీకారం’ అంటూ... ఎన్టీఆర్ రాసి పెట్టిన లెటర్ను జత చేశారు. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరో కీలక పాత్ర నాదెండ్ల భాస్కరరావు పాత్రలో శరత్ కేడ్కర్ను ఫైనల్ చేసినట్లు సమాచారం. First day, First shot #NTR pic.twitter.com/WmnkAalyxG — Krish Jagarlamudi (@DirKrish) July 5, 2018 -
బాలయ్యకు బర్త్డే విషెస్ చెప్పిన క్రిష్
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్కు మధ్య మంచి స్నేహ బంధం నెలకొన్న విషయం తెలిసిందే. బాలకృష్ణ తన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను అతి తక్కువ రోజుల్లో ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్ క్రిష్. తన పనితనంపై ఉన్న నమ్మకంతో బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ సినిమా బాధ్యతను అప్పగించారు. రేపు (జూన్10) బాలకృష్ణ పుట్టినరోజు కానుకగా ‘ఎన్టీఆర్’ పోస్టర్ను రిలీజ్ చేశారు. క్రిష్ బాలకృష్ణకు వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘తన నూరవ చిత్రంలో అమ్మ పేరుని ధరించి కూస్తంత మాతృఋణం తీర్చుకున్న "బసవ రామ తారక పుత్రుడు",ఇప్పుడు నాన్న పాత్రనే పోషిస్తూ కాస్తంత పితృఋణాన్ని కూడా తీర్చుకుంటున్న "తారక రామ పుత్రుడు",శతాధిక చిత్ర "నటసింహం", నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. తన నూరవ చిత్రంలో అమ్మ పేరుని ధరించి కూస్తంత మాతృఋణం తీర్చుకున్న "బసవ రామ తారక పుత్రుడు", ఇప్పుడు నాన్న పాత్రనే పోషిస్తూ కాస్తంత పితృఋణాన్ని కూడా తీర్చుకుంటున్న "తారక రామ పుత్రుడు", శతాధిక చిత్ర "నటసింహం", నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.#HappyBirthdayNBK | #NTR | pic.twitter.com/oLbk9FLQWr — Krish Jagarlamudi (@DirKrish) June 9, 2018 -
‘ఎన్టీఆర్’లో కొత్తవారి కోసం వేట
నందమూరి తారకరామారావు పేరు తెలియని తెలుగు వారుండరు. సినీ, రాజకీయ జీవితంలో తనదైన ముద్ర వేశారు స్వర్గీయ నందమూరి తారక రామారావు. తెలుగు వారికి రాముడైనా, కృష్ణుడైనా ఎన్టీఆరే. ఎన్టీఆర్ చేయని ప్రాత లేదు. వెండితెరపై ఎన్టీఆర్ జీవిత చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించబోతోన్నారు. బాలకృష్ణ ఈ బయోపిక్ను ‘ఎన్టీఆర్’ పేరుతో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నోరూమర్స్ తర్వాత ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. క్రిష్ ఈ ప్రాజెక్ట్లోకి వచ్చాక కథలో, కథనంలో చాలా మార్పులు, చేర్పులు జరుగుతున్నాయట. ఈ సినిమాలో చాలా పాత్రలు ఉండబోతోన్నాయి. అందుకోసం కొత్తవారిని తీసుకోవాలని భావిస్తున్నారట చిత్రయూనిట్. ఆసక్తి కలిగిన వారందరకీ ఆహ్వానం పలుకుతూ ఓ ప్రకటను విడుదల చేసింది చిత్రయూనిట్. వయసుతో నిమిత్తం లేకుండా...వారు నటిస్తూ తీసిన ఓ 30 సెకన్ల వీడియోను ప్రకటనలో ఇచ్చిన మెయిల్ అడ్రస్కు పంపాలని కోరారు. A casting call to be part of #NTRBioPic. A film by @DirKrish featuring Natasimha #NandamuriBalakrishna in the title role | @NBKFilms_ @vishinduri @VaaraahiCC | @mmkeeravaani #NBK103 | #NBKsNTRBiopic | pic.twitter.com/6bgdE0d25L — BARaju (@baraju_SuperHit) June 5, 2018 -
టాలీవుడ్ అగ్ర దర్శకులంతా ఒకేచోట...
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అంతా ఒకే ఫ్రేమ్లో సందడి చేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఇంట్లో సోమవారం రాత్రి పార్టీని నిర్వహించగా, అగ్ర దర్శకులంతా హాజరయ్యారు. రాజమౌళి, సుకుమార్, క్రిష్, కొరటాల శివ, హరీశ్ శంకర్లతోపాటు అనిల్ రావిపూడి, నాగ్ అశ్విన్, సందీప్ వంగవీటి, వంశీ పైడిపల్లి ఇలా అంతా ఒక్కచోట చేరారు. వీరంతా కలిసి ఓ ఫోటో దిగగా, ‘అద్భుతమైన వ్యక్తులతో మరిచిపోలేని సాయంత్రం గడిపాను’ అంటూ వంశీ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే రాజమౌళి ప్రస్తుతం చెర్రీ-తారక్ల మల్టీస్టారర్ కోసం కథ సిద్ధం చేస్తుండగా, సుకుమార్ మహేష్ కోసం స్క్రిప్ట్ను సిద్ధం చేసే పనిలో పడ్డాడు. క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్, వంశీ పైడిపల్లి మహేష్ బాబు 25వ చిత్రం పనుల్లో బిజీగా ఉన్నాడు. అనిల్ ఎఫ్ 2 రెగ్యులర్ షూటింగ్కు సిద్ధం అయ్యాడు. కొరటాల, సందీప్, నాగ్ అశ్విన్, హరీష్ శంకర్లు తమ తర్వాతి ప్రాజెక్టుల కోసం స్క్రిప్ట్లు సిద్ధం చేసుకుంటున్నారు. A memorable evening with these Amazing people at home... Thank You @ssrajamouli Sir, @aryasukku, @sivakoratala , @harish2you, @DirKrish, @AnilRavipudi , #SandeepReddyVanga, #NagAshwin for making this evening happen.. :) pic.twitter.com/9qxHoCA2xo — Vamshi Paidipally (@directorvamshi) 4 June 2018 'FUN'tastic..😀😀....it's great evening...thanks for hosting this amazing meet ..Vamshi Anna.... https://t.co/h6OBG80qhY — Anil Ravipudi (@AnilRavipudi) 4 June 2018