![విజయం కోసం జపం!.](/sites/default/files/styles/webp/public/article_images/2017/09/2/41394393766_625x300.jpg.webp?itok=5sOuzo7W)
విజయం కోసం జపం!.
Published Mon, Mar 10 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 AM
![విజయం కోసం జపం!.](/sites/default/files/styles/webp/public/article_images/2017/09/2/41394393766_625x300.jpg.webp?itok=5sOuzo7W)
నిర్మాతగా ఎమ్మెస్ రాజుది ఓ చరిత్ర. సుమంత్ ఆర్ట్స్పై శత్రువు, ఒక్కడు, మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లు తీశారాయన. అయితే దర్శకునిగా మాత్రం ఎమ్మెస్ రాజు విజయాన్ని అందుకోలేకపోయారు!. ఎలాగైనా విజయం సాధించాలనే కసితో ఆయన ‘జపం’ చేస్తున్నారు. ‘జపం’ అంటే ఇంకేదో అనుకునేరు. ఆయన దర్శకునిగా సెలైంట్గా ఓ సినిమా మొదలైంది. ఆ సినిమా టైటిల్ ‘జపం’. విజయ్ కార్తీక్ అనే కొత్తబ్బాయిని హీరోగా పరిచయం చేస్తున్నారు. ‘ఇష్క్’ చిత్రానికి పనిచేసిన సామల రమేష్ దీనికి స్క్రీన్ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంతో చిత్రీకరణ జరుగుతోంది. మే నెలలో ఈ సినిమాను విడుదల చేసే ఉద్దేశంలో ఉన్నారు ఎమ్మెస్ రాజు.
Advertisement
Related news by tags
-
పేద విద్యార్థి కలలకు ఊపిరి పోసిన సితార
పేదలకు చేతనైనంత సాయం చేయడంలో ఘట్టమనేని సితార ఎప్పుడూ ముందు ఉంటుంది. తండ్రి మహేశ్ బాబు అడుగుజాడల్లో సితార కూడా పేదలకు అనేకసార్లు సాయం చేస్తూ తన మంచి మనసు చాటుకుంది. సితా వయసులో చిన్నదే అయినా.. తన మనసు మాత్రం చాలా విశాలమైనది అంటూ నెటిజన్లు కూడా ఎప్పుడూ పొగడ్తలు కురిపిస్తున్నారు. తాజాగా సితార తన పుట్టినరోజు సందర్భంగా మెడిసిన్ చదవాలనుకున్న పేద విద్యార్థికి సాయం చేసి అండగా నిలిచింది.ఈ విషయాన్ని నమ్రత శిరోద్కర్ తన ఇన్స్టా ద్వారా ఇలా పంచుకున్నారు. 'దినసరి కూలీ తన కూతురు నవ్యను చదివించేందుకు శక్తివంచన లేకుండా శ్రమించాడు. ఆమె కూడా NEET పరీక్షలో పోటీ పడి మంచి మార్కులు సాధించింది. ఆమె డాక్టర్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి.. తన కలలను సాధించే మార్గంలో కష్టపడి చదివి విజయం సాధించింది. అయితే, ఆమె కుటుంబం ఆర్థిక పరిస్థితి అడ్డుగా నిలిచింది. దీంతో మహేష్ బాబు ఫౌండేషన్, సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ ద్వారా నవ్యశ్రీకి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. మెడికల్ విద్యాభ్యాసం పూర్తి అయ్యే వరకు కాలేజీ, హాస్టల్ ఫీజులన్నీ ఇక నుంచి సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ అందిస్తోంది. మా లిటిల్ ప్రిన్సెస్ (సితార) తన పుట్టినరోజును కూడా నవ్యతో జరుపుకుంది. ఈ క్రమంలో ఆమెను అభినందించడంతో పాటు కాబోయే డాక్టర్కు ల్యాప్టాప్, స్టెతస్కోప్ను బహుమతిగా ఇచ్చింది.' అని నమ్రత తెలిపింది.2024లో జరిగిన నీట్ పరిక్షలో నవ్య 605 మార్కులు సాధించింది. సాధారణ కళాశాలలో చదవి తన ప్రతిభతో టాప్ స్కోర్ సాధించి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్ సాధించింది. కానీ, పుస్తకాలు, హాస్టల్ ఫీజు, కనీస కాలేజీ ఫీజులు కూడా చెల్లిచలేని స్థితిలో నవ్య కుటుంబం ఉంది. దీంతో మహేష్ బాబు ఫౌండేషన్, సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ను నవ్య సంప్రదించింది. ఆమె కలలకు మహేష్ బాబు ఫౌండేషన్ ఊపిరి పోసింది. రూ. 1,25,000 చెక్కుతో పాటు తన మెడిసిన్ విద్య పూర్తి అయ్యే వరకు తమ సంస్థ నుంచే డబ్బు అందుతుందని ఘట్టమనేని కుటుంబం భరోసా కల్పించింది. సితార పుట్టినరోజును ఆమెతో జరుపుకోవడం మహేశ్ అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. View this post on Instagram A post shared by Mahesh Babu Foundation (@mbfoundationorg) -
ధనుష్ కామెంట్స్.. జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్కు తెలుగులో కూడా భారీగానే అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో ఆయన కూడా టాలీవుడ్ హీరోలతో పాటు ఇక్కడి ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు. తెలుగులో ఒక స్టార్ హీరోతో కలిసి పనిచేయాలనే కోరిక తనలో ఉందని తాజాగా ధనుష్ చెప్పాడు. సార్ సినిమాతో తెలుగులో మరింత ఇమేజ్ పెంచుకున్న ధనుష్ తాజాగా రాయన్తో థియేటర్లలో సందడి చేయనున్నాడు. ఇందులో ఆయన హీరోగా నటిస్తూనే స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కళానిధి మారన్ నిర్మించారు. సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, అపర్ణ బాలమురళి, ప్రకాశ్రాజ్,నిత్యా మీనన్,ఎస్ జే సూర్య,సెల్వరాఘవన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. జులై 26న రాయన్ విడుదల కానుంది.‘రాయన్’ విడుదల సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను మేకర్స్ నిర్వహించారు. ఈ వేడుకలో టాలీవుడ్ హీరోల గురించి ఎదురైన ప్రశ్నలపై ధనుష్ స్పందించారు. ఒకవేళ మల్టీస్టారర్ మూవీ ఛాన్స్ వస్తే రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, ఎన్టీఆర్.. వీరిలో ఎవరితో కలిసి నటిస్తారు..? అనే ప్రశ్న ఎదురైంది. దీంతో ఆయన వెంటనే జూ.ఎన్టీఆర్ అని బదులిచ్చారు. దీంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎవరైనా తమ హీరోతో కలిసి నటించాలని కోరుకుంటారని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.‘రాయన్’ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో జులై 26న విడుదల కానుంది. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా రిలీజ్ అవుతోంది. ధనుశ్ కెరీర్లో 50వ చిత్రంగా ఇది తెరకెక్కడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. -
విజయ్ పాదయాత్ర?
తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు (2026) తమిళగ వెట్రికళగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ సిద్ధం అవుతున్నాడు. ఈ క్రమంలో తన పార్టీ రూపు రేఖలపై ఆయన దృష్టి పెట్టారు. 2026 ఎన్నికల్లో అఖండ విజయమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఈ పోరులో ఒంటరిగా పోటీ చేసి 5వ కూటమిగా నిలుస్తారా..? పొత్తుకు వెళ్తారా..? అనేది తేలాల్సి ఉంది. పాదయాత్రతో తన ఎన్నికల ప్రస్థానం ప్రారంభించాలని విజయ్ ఉన్నారని తెలుస్తోంది.పార్టీకి అనుబంధంగా 30 విభాగాలను ఏర్పాటు చేయడమే కాకుండా 2 లక్షల మందికి పదవులను కట్టబెట్టేందుకు కార్యచరణలో ఉన్నారు. ఇప్పటికే తమ పార్టీకి జెండాతో పాటు ఎన్నికల గుర్తును కేటాయించేందుకు ఎన్నికల సంఘాన్ని విజయ్ ఆశ్రయించారు. ఈసీ నుంచి క్లియరెన్స్ కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. వారి నుంచి ప్రకటన రాగానే భారీ సభను ఏర్పాటు చేసి పార్టీ జెండాను ఆవిష్కరించేలా ప్రణాళికలు చేస్తున్నారు. అదే సభలో పార్టీ ఉద్దేశాలు, సిద్దాంతాలు ప్రకటించాలని విజయ్లో వ్యూహం ఉందట.పార్టీ కార్యాచరణ ప్రకటించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని విజయ్ ప్రణాళికలు చేస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో చెబుతున్న ప్రకారం.. సెప్టెంబరు- నవంబరు నెలల్లో ఆయన ప్రజల్లోకి అడుగుపెడతారని తెలుస్తోంది. తిరుచ్చి వేదికగా రాజకీయంగా తొలి అడుగు వేయాలని విజయ్ ఉన్నారట. ఈమేరకు పార్టీ నుంచి సంకేతాలు వెలువడ్డాయి. గత కొద్దిరోజులుగా విజయ్ మాటతీరు చూస్తుంటే డీఎంకే, బీజేపీలకు వ్యతిరేకిగా ఉన్నారనే భావన కనిపిస్తోందని అక్కడి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అన్నాడీఎంకేతో ఆయన కలిసి పోటీ చేయవచ్చనే టాక్ కూడా వినిపిస్తుంది. అయితే, విజయ్నే సీఎం అభ్యర్థిగా ఉండే ఛాన్స్ ఉందని సమాచారం. -
పెళ్లి పేరుతో ఘరానా మోసం
గాందీనగర్(విజయవాడ సెంట్రల్): పెళ్లి పేరుతో ఒంటరి, విడాకులు తీసుకున్న మహిళలను మోసం చేస్తున్న కేటుగాడిని విజయవాడ గవర్నర్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడి మోసాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన తుమ్మా మోహన్రెడ్డి వ్యసనాలకు బానిసై భార్య, పిల్లలను వదిలేశాడు. ఉన్న డబ్బులన్నీ షేర్ మార్కెట్లో పోగొట్టుకున్నాడు. అనంతరం సులభంగా డబ్బులు సంపాదించేందుకు ‘పెళ్లి కొడుకు’ అవతారం ఎత్తాడు. తెలుగు మ్యాట్రిమోని, షాదీ డాట్ కామ్ తదితర వెబ్సైట్లలో రకర కాల పేర్లతో రిజిస్టర్ చేసుకున్నాడు. ఒంటరి మహిళలను పరిచయం చేసుకునేవాడు. మాయమాటలతో నమ్మించి.. డబ్బు, బంగారం తీసుకొని పారిపోయేవాడు. ఈ క్రమంలో తెలుగు మ్యాట్రిమోని ద్వారా విజయవాడకు చెందిన ఓ మహిళను పరిచయం చేసుకున్నాడు. తన పేరు ‘కార్తీక్రెడ్డి.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని.. విల్లాలు ఉన్నాయి’ అంటూ మాయమాటలు చెప్పాడు. పెళ్లి చేసుకుందామని ఒప్పించాడు. ఫొటోషూట్ కోసం నగలతో రావాలని సూచించాడు. ఆ ఫొటోలను తన తల్లిదండ్రులకు చూపించి పెళ్లికి ఒప్పిస్తానని ఆమెను నమ్మించాడు. దీంతో ఆమె ఈ ఏడాది ఏప్రిల్ 14న విజయవాడలోని ఓ హోటల్కు వెళ్లింది. ఫొటోషూట్ కోసం సిద్ధమై రావాలని ఆమెను వాష్రూమ్కు పంపించాడు. ఆమె తెచ్చిన 16 తులాల బంగారం, సెల్ఫోన్తో హోటల్ నుంచి ఉడాయించాడు. దీనిపై బాధితురాలు గవర్నర్పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారించగా.. అతని మోసాలన్నీ బయటపడ్డాయి. మోహన్రెడ్డి మోసాలివే.. » 2021 సెపె్టంబర్లో తెలంగాణలోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఓ మహిళ కారును తీసుకెళ్లిపోయి అమ్మేశాడు. » 2023 నవంబర్లో గుంటూరుకు చెందిన మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. రూ.7 లక్షలు తీసుకుని పారిపోయాడు. » 2023 నవంబర్లో తెలంగాణలో ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 25 తులాల బంగారం అపహరించాడు. » 2023 జనవరిలో తెలంగాణలోని మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో భర్తతో విడిపోయి ఒంటరిగా ఉన్న డాక్టర్ను పరిచయం చేసుకుని.. ఆమె క్రెడిట్ కార్డు ద్వారా రూ.లక్షలు వాడుకుని పారిపోయాడు. -
రాకీ ప్రపంచంలోకి...
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. కాగా శ్రద్ధా శ్రీనాథ్ని స్వాగతిస్తూ, ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్.‘‘మెకానిక్ రాకీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నా’’ అని ఈ సందర్భంగా శ్రద్ధా శ్రీనాథ్ పేర్కొన్నారు. ‘‘ముక్కోణపు ప్రేమకథగా రూపొందుతోన్న చిత్రం ‘మెకానిక్ రాకీ’. మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న సినిమాని విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: మనోజ్ కాటసాని.
Related News by category
-
‘మిస్ యూనివర్స్ స్టేట్’ గ్రాండ్ ఫినాలే 2024
సాక్షి, హైదరాబా: నగరం పై కురుస్తున్న తొలకరి చిరుజల్లులు ఓ వైపు... నగరం వేదికగా నిర్వహించిన మిస్ యూనివర్స్ స్టేట్ గ్రాండ్ ఫినాలే ర్యాంప్ పై నడుస్తున్న టాప్ మోడల్స్ సోయగాలు మరో వైపు. వెరసి ఆదివారం నగరం అందాల సోయగాలతో పులకించిపోయింది. శ్రీనగర్ కాలనీలోని విన్ఫ్లోరాలో జరిగిన మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక స్టేట్ మొదటి ఎడిషన్ గ్రాండ్ ఫినాలేలో 3 రాష్ట్రాలకు చెందిన అందాల ముద్దుగుమ్మలు క్యాట్వాక్తో అలరించి విజేతలుగా నిలిచారు. ఇందులో భాగంగా మిస్ యూనివర్స్ తెలంగాణగా నిహారిక సూద్, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ చందన జయరామ్, మిస్ యూనివర్స్ కర్ణాటకగా అవనీ కాకేకోచి టైటిల్ క్రౌన్ గెలుచుకున్నారు. ర్యాంప్ పై వాక్ చేసిన అందాల తారలను బ్యూటీ, ఫ్యాషన్ పరిశ్రమకు చెందిన ప్రముఖులు విజేతలుగా ఎంపిక చేశారు. ఈ ఫ్యాషన్ జ్యూరీలో మిస్ యూనివర్స్ స్టేట్ డైరెక్టర్ ప్రాచీ నాగ్పాల్, మిస్టర్ గ్లోబల్ 2023 జాసన్ డైలాన్, సెలబ్రిటీ డెంటిస్ట్ డాక్టర్ నిదా ఖతీబ్, ఫ్యాషన్ డిజైనర్ అంజలి ఝా, ఫౌండర్ చుర్రోల్టో నీహర్ బిసాబతేని పాల్గొన్నారు. మిస్ యూనివర్స్ స్టేట్ పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల నుంచి 96 మంది పాల్గొనగా..వీరిలో ఒక్కో రాష్ట్రం నుంచి 7 మంది చొప్పున 21 మందిని ఫైనలిస్టులుగా ఎంపికచేశారు. 21 మందిలో ఒక్కో రాష్ట్రం నుంచి మిస్ యూనివర్స్ స్టేట్ విన్నర్తో పాటు, ఇద్దరు రన్నరప్లను ఈ గ్రాండ్ ఫినాలే విజేతలుగా ప్రకటించింది. బెస్ట్ స్మైల్, బెస్ట్ అటైర్ టైటిల్స్ ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఈ ఫినాలేలో యువతులు, కార్పొరేట్ ఉద్యోగులు, ఫ్యాషన్ మోడల్స్ సందడి చేశారు. -
పిడుగొస్తే.. ఏం చేయాలి?
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక మేరకు 2022లో ప్రకృతి విపత్తుల కారణంగా మన దేశంలో 8,060 మరణాలు సంభవిస్తే.. అందులో 2,887 మరణాలకు పిడుగుపాటే కారణం.ప్రతి సెకనుకు భూమిపై 50 నుంచి 100 పిడుగులు పడతాయట.‘వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియవ’న్నది సామెత. కానీ దేశంలో ఏటా వేలాది మందిని బలిగొంటున్న పిడుగు పాటును మాత్రం ముందే గుర్తించేందుకు చాన్స్ ఉంటుంది. ఆకాశం మేఘావృతమై జల్లులు మొదలైతే.. ఉరుములు, మెరుపులు వస్తుంటే.. చాలా మంది ఏ చెట్టు కిందకో పరుగెడుతుంటారు.అంతేకాదు కారులో ఉంటే పిడుగు పడొచ్చనే భయంతో కిందకు దిగి కాస్త దూరంగా నిలబడుతూ ఉంటారు. కానీ ఇలా చేయకూడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చిన్నచిన్న జాగ్రత్తలతో పిడుగు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో రైతులు, చిన్నారులు సహా పదుల సంఖ్యలో పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవీ..పిడుగుపాటు బారిన పడకుండా..‘దామిని’ ఉంటే తప్పించుకోవచ్చు! పిడుగులకు సంబంధించి ముందుగానే హెచ్చరించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘దామిని’అనే యాప్ను అందుబాటులోకి తీసుకొచి్చంది. మీరు ఉన్న ఏ ప్రాంతంలోనైనా తర్వాతి 15 నిమిషాల్లో పిడుగులు పడే అవకాశం ఉంటే ఈ యాప్ హెచ్చరిస్తుంది. పుణేకు చెందిన ఐఐటీఎం సంస్థ దీన్ని రూపొందించింది.జీపీఎస్ లొకేషన్ ఆధారంగా.. మీరున్న చోటేకాదు చుట్టుపక్కల ఎక్కడెక్కడ పిడుగులు పడే అవకాశముందో చెప్తుంది. అంతేకాదు.. గత 15 నిమిషాల్లో ఎక్కడైనా పిడుగుపడితే ఆ సమాచారం కూడా దీనిలో లభిస్తుంది. పిడుగుల విషయంలో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని కూడా చెప్తుంది. పిడుగుపాటును ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసే పరిజ్ఞానం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ దగ్గర కూడా ఉంది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
రేవంత్ అంకుల్.. మా ప్రాణాలకు రక్షణ ఏదీ?
కుత్బుల్లాపూర్: వీధి కుక్కల బెడదపై ఆదివారం కొంపల్లి ఎన్సీఎల్ కాలనీకి చెందిన చిన్నారులు వినూత్న తరహాలో నిరసన తెలిపారు. ‘రేవంత్ అంకుల్..మా ప్రాణాలకు రక్షణ ఏదీ?’ అంటూ ఆదివారం ప్లకార్డులు చేతబూని పెద్ద సంఖ్యలో చిన్నారులు పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్కు వద్దకు చేరుకున్నారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఎన్సీఎస్ నార్త్ కాలనీలో వీధి కుక్కల దాడుల్లో గత ఆరు నెలల వ్యవధిలో సుమారు 70 మంది చిన్నారులు గాయపడ్డారు. ఈ విషయమై పలుమార్లు కొంపల్లి మున్సిపల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేసినా సరిగ్గా స్పందించలేదు. దీంతో అధికారుల తీరును నిరసిస్తూ కాలనీకి చెందిన చిన్నారులు ప్లకార్డులతో నిరసన చెప్పారు. కొంపల్లి మున్సిపల్ కమిషనర్ హరికృష్ణపై సీఐ విజయవర్దన్కు ఫిర్యాదు చేశారు. చిన్నారుల ఫిర్యాదు మేరకు జీడీ నమోదు చేశామని, డీసీపీ దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు చేపడతామన్నారు. -
వీధి కుక్కల బెడదపై నేడు సీఎం సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు కాటు వేయడంపై హైకోర్టు సుమోటోగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, జీహెచ్ఎంసీకి పలు సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో కుక్కల సమస్యపై హైకోర్టు సూచనల మేరకు సోమవారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.వివిధ జంతు పరిరక్షణ సంఘాలతో సమావేశమై, వీధి కుక్కల బెడద తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని యానిమల్ బర్త్ కంట్రోల్ ఇంప్లిమెంటేషన్, మానిటరింగ్ కమిటీని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కె.సతీశ్కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ లగాన్ మోహన్రెడ్డి, యానిమల్ వెల్ఫేర్ సంస్థల తరఫున అమల అక్కినేని, వాసంతి వడి, న్యాయవాదులు శ్రేయ పరోపకారి, వేణు మాధవ్, ఐపీఎం రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ సంపత్, ఆరోగ్య శాఖ అధికారులు హాజరు కానున్నారని జీహెచ్ఎంసీ కమిషనర్ పేర్కొన్నారు. -
డబ్ల్యూహెచ్వో చెప్పినా.. పెడచెవిన..
‘ఈ సీజన్లో తెలంగాణకు డెంగీ ప్రమాదం పొంచి ఉంది. డెంగీ ప్రమాదం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉండగా, డెంగీలోని నాలుగు ప్రధాన వేరియంట్లన్నీ ఇక్కడే కనిపిస్తున్నాయి. డీఈఎన్వీ1, డీఈఎన్వీ2, డీఈఎన్వీ3, డీఈఎన్వీ4 ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు రెండు మూడు వేరియంట్లు కూడా ఒకేసారి రోగులపై దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది.’ – రాష్ట్రానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికసాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలకు తగ్గట్టే రాష్ట్రంపై డెంగీ పంజా విసురుతోంది. గతేడాదితో పోలిస్తే ఇప్పుడు పెద్దఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని..ఆస్పత్రుల్లో అవసరమైన కిట్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. కానీ ప్రజారోగ్య సంచాలకుల విభాగం మాత్రం క్షేత్రస్థాయిలో సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందన్న విమర్శలు ఉన్నాయి. గతేడాది మొదటి ఆరు నెలలతో పోలిస్తే..ఈ ఏడాది ఆరు నెలల్లో డెంగీ కేసులు అధికంగా నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ నివేదిక పేర్కొంది.లక్షలాది మందికి జ్వరాలు.. ఆస్పత్రులు కిటకిటరాష్ట్రంలో లక్షలాది మందికి జ్వరాలు సోకాయని వైద్యారోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు తాజాగా ఒక నివేదికను ప్రభుత్వానికి పంపించింది. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది జ్వరాలతో బాధపడుతున్నారని ఒక వైద్యాధికారి వెల్లడించారు.దీంతో రాష్ట్రంలో జ్వరాలతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. మరోవైపు చికున్గున్యా కేసులు భారీగా నమోదయ్యాయి. చాలామంది రోగులు జ్వరంతో బాధపడుతూ ఒళ్లు నొప్పులు కూడా ఉంటున్నట్టు చెబుతున్నారు. కాగా, ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్లు పెరి గారు. హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రిలో సాధారణ రోజుల్లో 40 మంది వచ్చేవారు..కానీ ఇప్పుడు ఆ సంఖ్య వందకు పెరిగిందని డాక్టర్లు చెబుతున్నారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు వెయ్యిచొప్పున ఓపీ ఉంటోంది.రక్తస్రావం జరిగితే ప్రమాదకరండెంగీని ముందుగా గుర్తించితే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా చికిత్స పొందవచ్చు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. ముక్కు నుంచి కానీ, మలం ద్వారా గానీ, బ్రష్ చేసేప్పుడు పళ్ల మధ్య నుంచి రక్తస్రావం అవుతుంది. ఇలా అధికంగా రక్తస్రావం అయితేనే ప్రమాదకరం. మహిళలకు పీరియడ్స్ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే అదనంగా అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని వారు గుర్తించాలి. అలాంటి సమయాల్లో ప్లేట్లెట్ల సంఖ్య 50 వేలున్నా సరే తప్పనిసరిగా ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. రక్తస్రావం కానప్పుడు 20 వేల వరకు ప్లేట్లెట్లు పడిపోయినా ప్రమాదం కాదు. అప్పుడు ప్రత్యేకంగా ప్లేట్లెట్లు ఎక్కించి రోగిని సాధారణ స్థితికి తీసుకురావొచ్చు.– డాక్టర్ కె.కృష్ణప్రభాకర్, హైదరాబాద్