'ఖాకీ' కథపై మనసుపడ్డ చెర్రీ | Surender Reddy to direct 'Thani Oruvan' Telugu remake | Sakshi
Sakshi News home page

'ఖాకీ' కథపై మనసుపడ్డ చెర్రీ

Published Mon, Oct 5 2015 12:36 PM | Last Updated on Sun, Sep 3 2017 10:29 AM

'ఖాకీ' కథపై మనసుపడ్డ చెర్రీ

'ఖాకీ' కథపై మనసుపడ్డ చెర్రీ

టాలీవుడ్ మెగా వారసుడు, యంగ్ హీరో రామ్చరణ్ మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీకి రెడీ అవుతున్నాడు. తుఫాన్ చిత్రంలో పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన

చెన్నై: టాలీవుడ్ మెగా వారసుడు, యంగ్ హీరో రామ్చరణ్  మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీకి  రెడీ అవుతున్నాడు.  తుఫాన్ చిత్రంలో పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన  ఈ  యంగ్ హీరో మరోసారి 'ఖాకీ' కథపై మనసుపడ్డాడట.  ఇంకా పేరు ఖరారు  చేయని 'తాని ఒరువన్' రీమేక్ మూవీలో చెర్రీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా లీడ్ రోల్ నటించనున్నాడట. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని దర్శకుడు సురేందర్  రెడ్డి తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు. ' బ్రూస్ లీ' చిత్రాన్ని నిర్మిస్తున్న డీవీవీ దానయ్య నిర్మాణ సారధ్యంలోనే  ఈ సినిమా కూడా తెరకెక్కనుంది. నిర్మాత దానయ్య ఈ విషయాన్ని 'ఐఎఎన్ఎస్'కు వివరించారు.   మిగతా నటీనటులను ఇంకా పరిశీలిస్తున్నామని  ఆయన  తెలిపారు.


కాగ ఓ సిన్సియర్ పోలీసు అధికారి,  అవినీతి, అక్రమాలకు పాల్పడే బడా పారిశ్రామికవేత్త మధ్య నడిచే కథాంశంతో తమిళంలో విడుదలైన మూవీ 'తాని ఒరువన్`.  తమిళంలో  జయం రవి పోలీసు అధికారిగా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా  నిలిచింది. సుమారు 70 కోట్ల బిజినెస్ ను సాధించింది. నయన తార హీరోయిన్ నటించిన ఈ సినిమాలో  అరవింద్ స్వామి విలన్గా నటించారు. తెలుగులో ఈ పాత్ర కోసం ప్రముఖ నటుడు నాగార్జునను సంప్రదించినట్లు సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement