మెగా-నందమూరి మల్టీస్టారర్..? | Update on Mega -Nandamuri multistarrer | Sakshi
Sakshi News home page

మెగా-నందమూరి మల్టీస్టారర్..?

Published Mon, Aug 8 2016 5:40 PM | Last Updated on Wed, Aug 29 2018 2:33 PM

మెగా-నందమూరి మల్టీస్టారర్..? - Sakshi

మెగా-నందమూరి మల్టీస్టారర్..?

మెగా, నందమూరి హీరోల కాంబినేషన్లో త్వరలో ఓ మల్టీస్టారర్ తెరకెక్కనుంది. ఇటు మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి, అటు నందమూరి ఫ్యామిలీ నుంచి చాలామంది స్టార్లు ఉన్నప్పటికీ ఇప్పటివరకు వీరి కాంబినేషన్లో మల్టీస్టారర్ రాలేదు. తాజాగా నందమూరి కల్యాణ్ రామ్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్లు కలిసి ఓ సినిమాలో నటించనున్నారని టాక్. స్వయంగా కల్యాణ్ రామే.. ధరమ్ తేజ్ పేరుని సూచించారని తెలుస్తోంది. ధరమ్ తేజ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రాజెక్టు పట్టాలకెక్కే అవకాశాలున్నట్లు సమాచారం.

ఏ.ఎస్.రవికుమార్ చౌదరి ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ఇద్దరు వేరు వేరు సినిమాల షూటింగుల్లో బిజీగా ఉండటంతో ఆ ప్రాజెక్టులు పూర్తవ్వగానే ఈ మల్టీస్టారర్ను మొదలుపెట్టాలని చూస్తున్నారు. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.1981లో ఎన్టీఆర్, చిరంజీవిలు కలిసి నటించిన 'తిరుగులేని మనిషి' సినిమా తర్వాత.. ఇన్నాళ్లకు ఇరు కుటుంబాలకు చెందిన తారలు ఒకే సినిమాలో కనిపించడం ఇదే తొలిసారి అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement