బంగ్లాదేశ్ నుండి భారత్కు తరలిస్తున్న 40 కోట్ల విలువైన కొకైన్ను సరిహద్దులో బీఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
కోల్కతా: బంగ్లాదేశ్ నుండి భారత్కు తరలిస్తున్న 10 కిలోల కొకైన్ను సరిహద్దులో బీఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర పరగణాల జిల్లాలో భారత్- బంగ్లాదేశ్ సరిహద్దులో బంగ్లాదేశ్ నుండి వచ్చిన ఓ ట్రక్కులో పౌడర్ను గుర్తించిన బీఎస్ఎఫ్ అధికారులు దానిని స్వాధీనం చేసుకొని, టెస్టింగ్ కోసం నార్కోటిక్ లాబొరేటరీకి పంపించారు. నార్కోటిక్ ఫలితాలలో ఆ పౌడర్ నిషిద్ద కోకైన్గా తేలిందనీ, దాని విలువ సుమారు 40 కోట్ల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు.