
ఘోర రోడ్డు ప్రమాదం: 14 మంది మృతి
గుజరాత్ లోని రాజ్ కోట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుంది.
రాజ్కోట్(గుజరాత్): రాజ్ కోట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుంది. లారీ, వ్యాను ఢీ కొన్న సంఘటనలో 14 మంది మృతి చెందారు. ఈ సంఘటన రాజ్కోట్ సమీపంలోని బగోదరా హైవేపై జరిగింది. ఈ ఘటనలో మరి కొంతమంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.