సాక్షి, న్యూఢిల్లీ: క్షమాభిక్షపై జీవిత ఖైదీ ల విడుదల నిర్ణయాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణను సుప్రీం కోర్టు 4 వారాలు వాయిదావేసింది. న్యాయవాది చంద్రశేఖర్రెడ్డి దాఖలుచేసిన ఈ పిటిషన్ జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్, జస్టిస్ మదన్ బి.లోకూర్లతో కూడిన ధర్మాసనం ఎదుట మంగళవారం విచారణకు వచ్చింది. అమికస్ క్యూరీ ఉదయ్ లలిత్ కోర్టుకు రాకపోవడంతో విచారణను 4 వారాలు వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.