'సరి-బేసి'తో పొల్యూషన్ భారీగా దిగొచ్చింది! | Air pollution levels in Delhi drop by 300% on day 2, odd-even formula a major success, says Sisodia | Sakshi

'సరి-బేసి'తో పొల్యూషన్ భారీగా దిగొచ్చింది!

Published Sun, Jan 3 2016 3:39 PM | Last Updated on Sun, Sep 3 2017 3:01 PM

'సరి-బేసి'తో పొల్యూషన్ భారీగా దిగొచ్చింది!

'సరి-బేసి'తో పొల్యూషన్ భారీగా దిగొచ్చింది!

అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న 'సరి-బేసి' నెంబర్‌ ప్లేట్ విధానం విజయవంతమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న 'సరి-బేసి' నెంబర్‌ ప్లేట్ విధానం విజయవంతమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండోరోజు శనివారం ఈ విధానం అమలు వల్ల ఢిల్లీలో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. గత ఏడాది ఇదే రోజుతో పోల్చుకుంటే హస్తినలో వాయుకాలుష్యం దాదాపు 300శాతం తగ్గిందని తాజాగా తేలింది. 'సరి-బేసి' నెంబర్ ప్లేట్ ఆధారంగా వాహనాలను దినం తప్పించి దినం రోడ్లకు మీదకు అనుమతించాలని కేజ్రీవాల్ సర్కార్ ప్రతిపాదించిన ఈ పథకంపై మిశ్రమ స్పందన వ్యక్తమైన సంగతి తెలిసిందే. జనవరి 1 నుంచి ఈ విధానం ఢిల్లీలో అమల్లోకి వచ్చింది.

అయితే, సోమవారం నుంచి కార్యాలయాలు తిరిగి తెరుచుకోవడం.. ఉద్యోగులు పెద్దసంఖ్యలో వాహనాలతో రోడ్ల మీదకు రానుండటంతో సోమవారం నుంచి 'సరి-బేసి' విధానం మీద అసలు పరీక్ష మొదలవుతుందని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తున్నది. ఈ విధానం అమల్లో భాగంగా సైకిల్‌ మీద తన కార్యాలయానికి వెళ్లి అందరి దృష్టి ఆకర్షించిన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ 'సరి-బేసి' విధానం అమలు విజయవంతంగా కొనసాగుతున్నదని, ఈ విధానం అమలు వల్ల శనివారం ఒక్కరోజు 300శాతం వాయు కాలుష్యం తగ్గిందని తెలిపారు. 15 రోజులు ఈ విధానాన్ని విజయవంతంగా అమలుచేస్తే.. నగరంలో కాలుష్యంపై ప్రజలకు చైతన్యం పెరిగి.. ప్రత్యామ్నాయా రవాణా సదుపాయాన్ని కూడా వారు వినియోగించుకునే అవకాశముందని ఆయన చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement