
'క్షమాపణల కోసం అడుక్కుంటున్నారు'
ఢిల్లీ: బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాడి కొనసాగుతోంది. అరుణ్ జైట్లీ విషయంలో తనను క్షమాపణలు చెప్పాలని బీజేపీ దాదాపు అడుక్కుంటోందని, అయితే తాను మాత్రం క్షమాపణలు చెప్పబోనని స్పష్టం చేశారు. జైట్లీ పరువునష్టం కేసులో విచారణ సందర్భంగా నిజాలు బయటకు వస్తాయన్నారు.
ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ ఎవరికీ క్లీన్చిట్ ఇవ్వలేదని తెలిపారు. విచారణ కమిటీ ఇచ్చిన నివేదికలో ఎవరి పేరూ ప్రస్తావించలేదు కానీ పలు అవినీతి కార్యకలాపాలు జరిగినట్లు పేర్కొందని కేజ్రీవాల్ గుర్తుచేశారు. అయితే ఆ అవినీతికి బాధ్యులను గుర్తిచేందుకు విచారణ కమిషన్ వేయాల్సిందిగా కమిటీ సూచించినట్లు తెలిపారు. ఇప్పుడు బాధ్యులను గుర్తించేందుకు విచారణ కమిషన్ వేస్తున్నట్లు కేజ్రీవాల్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఢిల్లీ విజిలెన్స్ విభాగం ముఖ్యకార్యదర్శి చేతన్ సంఘీ నాయకత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీ డీడీసీఏ వ్యవహారాలపై విచారణ జరిపి 237 పేజీల నివేదికను రూపొందించింది. ఇందులో జైట్లీపై వచ్చిన ఆరోపణలను ఎక్కడా నిర్ధారించలేదు. దీంతో బీజేపీ నేతలు అరుణ్ జైట్లీకి కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
BJP almost begging me for an apology. Sorry. I won't oblige them. Let Jaitley ji be cross-examined in defamation cases. Let truth prevail
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 28, 2015
No clean chit ever given by any Del govt probe. That report confirmed several instances of wrongdoings but did not fix responsibility(1/2)
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 28, 2015
It didn't mention ANYONE's name n recommended Enquiry Commission to fix responsibility, which we have done now(2/2)
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 28, 2015