బస్సు ప్రమాదంలో 18 మంది మృతి | Bus Turns Turtle In Gujarats Banaskantha | Sakshi
Sakshi News home page

బస్సు ప్రమాదంలో 18 మంది మృతి

Published Mon, Sep 30 2019 6:28 PM | Last Updated on Mon, Sep 30 2019 8:23 PM

Bus Turns Turtle In Gujarats Banaskantha - Sakshi

గుజరాత్‌లోని బనస్కంత జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఐదుగురు మరణించారు.

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లో 40 మంది ప్రయాణికులతో వెళుతున్నఓ బస్‌ బనస్కాంత జిల్లా అంబాజీ పట్టణం వద్ద బోల్తా పడింది. త్రిశూలియా ఘాట్‌ వద్ద వేగంగా దూసుకుచ్చిన లగ్జరీ బస్సు బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణీకులుండగా 18 మంది మరణించారు. ఘటనపై సమాచారం అందగానే 108 బృందంతో పాటు పోలీసులు ఘటనాస్ధలానికి చేరుకున్నారు. బస్సులో చిక్కుకున్న వారిని స్ధానికుల సహకారంతో పోలీసులు వెలుపలికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో 5 గురు వ్యక్తులు మరణించారని అధికారులు వెల్లడించారు. కాగా బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement