
పార్లమెంటులో నగదు రహిత లావాదేవీలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో నగదు రహిత లావాదేవీలకు వీలుగా కార్డు ద్వారా చెల్లింపులు స్వీకరించేందుకు స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేశారు. ఆహార నిర్వహణ కమిటీ చైర్మన్గా ఉన్న టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత జితేందర్రెడ్డి అన్ని క్యాంటీన్లలో ఈ మిషన్ల ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. బుధవారం వీటిని లోక్సభ స్పీకర్ మహాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె పార్లమెంటు క్యాంటీన్లలో నగదు రహిత లావాదేవీలకు వీలు కల్పించిన జితేందర్ రెడ్డిని ప్రశంసించారు.